29, జూన్ 2017, గురువారం

విశ్వంలో జీవితం -37

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

విశ్వంలో జీవితం -37

ఓమనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

డంబములు పలికే వాని
తప్పు తప్పుని వొప్పుకోని వాని
ఆడవాళ్లు చుట్టూ తిరిగే వాని
మాట నమ్ముట ఎప్పుడు హాని 

మంచి చెడులు తెలియని
మమత లనేవి ఎరుగని
మనసు మనసులో లేని
మానవుని కలియుట హాని

వావి వరుసలు ఎరుగని
సుఖమే శాశ్విత మని
దుర్మార్గమే గొప్ప యని
తలిచిన వాని కలియుట హాని

అతిగా ఏడిచే మొగ వానిని
అతిగా నవ్వే ఆడ దానిని
అటు ఇటు కాని స్త్రీని గాని
మాటలకు లొంగితే హాని
   
జాలి కరుణలు మాని
ఆలి నేలని వాని
జోలికెళితే హాని

ఓమనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో 

ఆశ పెరిగిన వాడు
అహము పెరిగిన వాడు
తనకు తానే కీడు

కీడును తలచేవాడు
పాపాలు చేయువాడు
పుణ్యమే చేయని వాడు
రోగంతో మరణం పొందేవాడు

మానవత్వాన్ని నమ్మనివాడు
మనిషి మనిషిగా గుర్తించని వాడు
గురువు, పెద్దలను గౌరవించని వాడు
పిచ్చి వాడితో సమాన మైన వాడు    

సంపాదన కోసం వెంపర్లాడే వాడు
ధనము ఖర్చు చేయక దాచేవాడు
నీరు, మట్టి విలువ తెలియనివాడు
పిచ్చివాడి చేతిలో రాయిలాంటి వాడు

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో 

ఓ మనిషీ తెలుసుకో 
తెలుసుకొని మసలుకో 

బాహ్యాన్ని ఆకర్షింన్చుతావెందుకు 
అంతర్గతంలో ఉన్నది గ్రహించవెందుకు   
వ్యామోహానికి వెంపర్లాడుట ఎందుకు
ధ్యాన నిమగ్నుడవై సాగు ముందుకు  

విద్య నాకే ఉన్నదని ఎగిరి పడబోకు 
అసత్యమైన విశ్వాసానికి లోను కాకు 
అసత్యం కోసం విద్య ధారపోసి బాధపడకు  
తప్పును గ్రహించి ధర్మమార్గంలో బ్రతుకు 

చిలక పలుకుల చిన్నదానికి చిక్కకు 
చిక్కినా నీవు బానిసై ఊడిగం చేయకు
ఇది వయసు ధర్మమని వాదించ బోకు
రోగాలు పెంచుకొని భాధ పడుట ఎందుకు 

ఓ మనిషీ తెలుసుకో 
తెలుసుకొని మసలుకో 

26, జూన్ 2017, సోమవారం

విశ్వములో జీవితం

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:  

జీవితగమ్యం
తెలుసుకో ఈ మెట్లు 
ఎక్కటానికి ప్రాయత్నం చేయు ఇట్లు 

ఓ మనిషీ తెలుసుకో
 మమ తెఱిగి మసలుకో

కొడుకు కొడుకు అని అంటావు
కోరుకున్న వన్నీ అందిస్తావు
తల కొరివి పెట్టేవాడ వను కుంటావు
పెళ్లి తర్వాత గుణం ఎలానో తెలపలేవు

కూతురు కూతురు అని అంటావు
చదువు చదువు అని చదివిస్తావు
పెళ్లి చేద్దామని తిరుగుతావు
వయసులోనే ప్రేమించాను అంటే చెప్పలేవు

స్నేహితులను ఆదుకుంటావు
స్నేహాన్ని పెంచుకొని బ్రతుకుతావు
స్నేహమే శాస్వితమని అనుకుంటావు
స్నేహితులు నీకష్టంలో కానరాక భాధపడతావు

సంపాదనలో మునిగి పోతావు
ఆరోగ్యాన్ని లెక్క చేయక తిరుగుతావు
భార్య పిల్లల కోరికలు తీరుస్తావు
సంపద పొతే భార్య పిల్లలకు చులకనై పోతావు

అన్నా తమ్ములను, అక్క చెల్లెలల్ను ఆదరిస్తావు
సంసారం లో ఉన్న చిక్కుల్ని ఎదుర్కొంటావు
పెద్దలను గౌరవించటాడనికి ప్రయత్నిస్తూనేఉంటావు
ఆస్తి పంపకంలో మనస్పర్ధలను ఎదుర్కొంటావు

పిల్లలపై ఆశ పెంచుకొని బ్రతుకుతావు
కష్టమంతా ధారపోసిన గుర్తించలేదని భాదపడతావు
నాకేం చేశావంటే చెప్పలేక మదన పడతావు
వృద్ధాప్యంలో స్వతంత్రంగా బ్రతకాలను కుంటావు

భార్య అనారోగ్యాన్ని భర్తగా భరిస్తావు
భార్యే సర్వమని చివరిదాకా ఆదుకుంటావు
అనారోగ్యాన్ని కూడా లెక్క చేయక సహకరిస్తావు
జీవితగమ్యంలో ఒకరికొకరు కలసే ప్రేమను పంచాలంటావు

ఓ మనిషీ తెలుసుకో
 మమ తెఱిగి మసలుకో
--((*))--

జీవితగమ్యం -2
తెలుసుకో ఈ మెట్లు 
ఎక్కటానికి ప్రాయత్నం చేయు ఇట్లు 

ఓ మనిషి తెలుసుకో
 తెలుసుకొని మేలుకో

ఆకలి పెంచుతుంది అహం
ఓర్పు కోరుతుంది సమం
వయసు కోరుతుంది కామం
మనసు కోరుతుంది సమం

అన్నం లేకపోతె ఉపవాసం
దొరికిన నీరే దేవుని తీర్ధం
భక్తితో గుడికి పొతే ప్రసాదం
రక్తితో గూటికి చేరితే విషాదం

ప్రేమకు అతిప్రమే ప్రమాదం
మనసుకు మాయే వసంతం
కాలం తీరుస్తుంది పరిష్కారం
విషమిస్తే కలుగును ప్రేమోదం

నమ్మకంలో ఉన్నది సుఖం
దాపరికంలో ఉన్నది దుఖం
సాధనలో ఉన్నది సంతోషం
ప్రేమ ఉంటె ఉండదు ప్రమాదం  

సఖ్యతలో పెరుగు అనురాగం
జీవితంలో జరుగు సమరం
ఇది సుఖదు:ఖాల వలయం
సాగించాలి నీవు సంసారం

ఓ మనిషి తెలుసుకో
 తెలుసుకొని మేలుకో

--((*))--

జీవితగమ్యం -3
తెలుసుకో ఈ మెట్లు 

ఎక్కటానికి ప్రాయత్నం చేయు ఇట్లు 


ఓ మనిషీ తెలుసుకో
 మమ తెఱిగి మసలుకో

కలలో కల్లోలం గమనించురా 
కల్లాకపటం ఎరుగక జీవించురా 
కళ్ళలో నీటిని గమనించాలిరా 
కనుచూపుతో కనికరం చూపురా 

కంచెను గమనించి నడవాలిరా 
కనకం కోసం ఎప్పుడు వేట వద్దురా 
కాంత కోసం కష్టాలు తెచ్చుకోకురా 
కందకంలో పడక జాగర్త పడాలిరా 

కోరిక కోపాన్ని పెంచునురా 
కోపం అదుపులో ఉంచాలిరా 
కోమలి ప్రేమను పంచురా 
కోరుకున్న సుఖం దొరుకునురా 

కృషిని నమ్ముకొని జీవించాలిరా 
కృపచూపి నీవు కీర్తిని పొందాలిరా
కృష్ణుని ఆరాధించి బతకాలిరా 
కృత కృత్యుడై ఎప్పుడూ మెలగాలిరా  

ఓ మనిషీ తెలుసుకో
 మమ తెఱిగి మసలుకో
--((*))--
ప్రాంజలి ప్రభ -జీవితగమ్యం -4
ఓ మనిషి తెలుసుకో 
 తెలుసుకొని మసలుకో 
తెలుసుకో ఈ మెట్లు 
ఎక్కటానికి ప్రాయత్నం చేయు ఇట్లు


మనసు ఎరుగవోయి 
మాధుర్యం పాందవోయి 
మృగంలా మార కోయి  
మాటను గమనించ వోయి 

అలుక మానవోయి
నటనను చూపకోయి
నాట్యము చూడవోయి
హాయి పొందు ఈ రేయి
      
మర్మం గ్రహించ ఓయి 
మగువ చూపు చూడవోయి
మందిరం బోసి పోయి
మది తలుపు తెరిచా రావోయి      

ఈసు కన్నుల దోయి
చూచు చెడుపుల వేయి
గుడ్డి ప్రేమే హాయి

ఓ మనిషి తెలుసుకో 
 తెలుసుకొని మసలుకో
--((*))--


ఆరుద్ర కూనలమ్మ పదాలు
+++ ×++ +++
పెద్ద జంతువు దంతి
వెడద దంతుల దొంతి
సమము ఒక్క వదంతి
ఓ కూనలమ్మ

గుడిని వీడెను శివుడు గోడ రాలును చవుడు
కానడే మానవుడు
ఓ కూనలమ్మ
లంచ మనియెడి పట్టి
మంచ మేమిటి గట్టి
ఇనుప మేకుల తొట్టి
ఓ కూనలమ్మ
తాను మెచ్చిన కొమ్మ
తళుకు బంగరు బొమ్మ
వలపు గుడ్డి కదమ్మ
ఓ కూనలమ్మ
సగము కమ్యూనిస్టు
సగము కేపిటలిస్టు
ఎందుకొచ్చిన రొష్టు
ఓ కూనలమ్మ
తాగుచుండే బుడ్డి
తరుగుచుండే కొద్ది
మెదడు మేయును గడ్డి
ఓ కూనలమ్మ
మనసు తెలుపని భాష
మంచి పెంచని భాష
ఉత్త సంద్రపు ఘోష
ఓ కూనలమ్మ
కొంతమందిది నవత
కొంతమందిది యువత
కృష్ణశాస్త్రిది కవిత
ఓ కూనలమ్మ
సన్యసించిన స్వామి
చాలినంత రికామి
చాన దొరికిన కామి
ఓ కూనలమ్మ
రెండు శ్రీల ధరించి
రెండు పెగ్సు బిగించి
వెలుగు శబ్ద విరించి
ఓ కూనలమ్మ
తములపాకుల నముల
దవడతో మాట్లాళు
తానె వచ్చును తమిళు
ఓ కూనలమ్మ
మిసిమి మెచ్చెడి తులువ
పసిడి కిచ్చును విలువ
నాకు చాలును చెలువ
ఓ కూనలమ్మ
అణువు గుండెను చీల్చి
అమిత శక్తిని పేల్చి
నరుడు తన్నున బాల్చి
ఓ కూనలమ్మ
కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె వుయ్యెల నూపు
ఓ కూనలమ్మ

కూనలమ్మ పదాలు / ఆరుద్ర రచనల నుండి గ్రహీతము
సేకరణ :-

విశ్వములో జీవితం

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

వ్యక్తి

ఒక నిరుద్యోగి నాకు ఉద్యోగము రావటము లేదు అని సందేహముతో బ్రతకుట వ్యర్ధము అని వంతెనపై నుంచి నీళ్ళలోకి దూకాడు, అపుడే అటువైపు పోతున్న వ్యక్తి అతని రక్షించాడు.
నన్ను ఎందుకు రక్షించారు అని అడిగాడు నిరుద్యోగి.

నేను చెప్పేది విన్నాక నిన్ను నేను మరల వంతెన పైకి తీసు కెళ్తాను అక్కడ నుండి దూకి నిక్షేపముగా చావవచ్చు.

చూడు బాబు నీవు అనామకులలో ఒకడివి అని ఊహించు కున్నావు ఎందుకనగా
"ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే పారిపోయేవారు అనామకులు గానే మిగిలిపోతారు"

" అంతా నాకు తెలుసు నాకు తెలియంది లేదు అనుకున్నావు, అనుకున్నది సాధించలేకపోయావు ఎందు కనగా 'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము.నీలో ఆవహించింది నేనే చదువుకున్నాను నాకు ఉద్యోగము రాలేదని దిగులు పడ్డావు, నీకన్నా చదువుకున్న వాడితో పోల్చకో లేక పోయావు. .
    
నేడు బాగుంటేనే రేపటి గురించి ఆలోచించగలవు, నీ ప్రయాణానికి మలుపులున్నా గమనించలేక పోయావు, మంచి మార్గం ఎదో తెలుసుకో లేక పోయావు, మొండిగా మారి పయనించలేక వెనుకడుగు వేశావు.      

నీవు చేసిన పనినీ ఎవరో తప్పు పట్టరాని చేతకాని వాడిగా ఊహించుకున్నావు,  నీవు చేసిన పని వేరొకరికి నచ్చలేదని విషయం నీవు తెలుసు కోలేక పోయావు, కన్నా తల్లి తండ్రులను గురువును చెప్పిన మాటలు గుర్తించలేక పోయావు.    

నీవు గెలిచే వాడవని ఊహించలేక పోయావు, "ఓడి పోయే వారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబై తొమ్మిది సార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి"...

జరిగి పోయిన వణ్ణి మనకు అనుభవాలు ."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ ఆనందించు....

చావాలను కుంటే నిరభ్య0తరంగా చావవచ్చు అన్నాడు వ్యక్తి.
నాతప్పు తెలుసుకున్నాను మీఋణం తీర్చు కోగలను, తల్లి తండ్రులను ఆదుకోగలను, స్వయంశక్తితో బ్రతికి బ్రతికించుకోగలను.      

24, జూన్ 2017, శనివారం

విశ్వములో జీవితం -34

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
6 Things You Need to Recover From Every Day
హాస్యం

*భర్త : ఏమిటోయ్ చాలా ఉషారుగా ఉన్నావు ఈరోజు
భార్య : నేను ఒకటి అడుగుతా చెప్పండి
భర్త: నీ వడిగిన దానికి నే నెప్పుడన్నా కాదన్ననా
భార్య: మీరు ఎదో ఆలోచిస్తున్నట్టున్నారు అది మాత్రం కాదు
భర్త : మరి ఏమిటే
భార్య: పగలు వెలుగు చూపే వారు ఎవరు?
భర్త : ఆ మాత్రం తెలియదా " సూర్య భగవానుడు "
భార్య: రాత్రి వెలుగు చూపే వారెవరు ?
భర్త :  చంద్రుడు లేక పోతె నీవే
భార్య: మీ ఆలోచనలు ఎప్పుడు ఇలా ఉంటాయి ఏమిటండి
భర్త: భార్య పక్కనుంటే చికట్లో వెలిగే కదే
భార్య : అదిసరే ఇంకోసారి ఆలోచించండి
భర్త : నువ్వే చెప్పు నేను ఆగలేకున్నా
భార్య: ఆత్మ విస్వాసం చీకట్లో దారిచూపించేది
భర్త: అవునా .....   ఆ .....  అవునూ ... అవునూ

ఇదండీ లోకం ( హాస్యం)

*భర్త : ఏమిటోయ్ చాలా ఉషారుగా ఉన్నావు ఈరోజు
భార్య : చేతులు చాపి చూపింది
భర్త: ఈ రోజుకు నాకు పని పెట్టావన్నమాటా
భార్య: తప్పదు కదండీ అంటూ, అయ్యే జారిపోతుందండి పైకి లాగండి
భర్త : ఎవ్వరూ లేరు నేనేకదా
భార్య: వేరే వారయితే కళ్ళు మూసుకుంటారు, మీరయితే లొట్టలేస్తూ పిలిచావా అని అడుగుతారు
భర్త : అది కాదే
భార్య : ఏది కాదు అన్నీ  సమకూరుస్తున్నా ఈమాత్రం చేయలేరా
భర్త : తప్పదంటూ సర్ది "ఎవరు పెట్టుకోమన్నారో ఈ గోరింటాకు "
భార్య: మీకు తెలియదా మంచి మొగుడొస్తాడని అంటారు
భర్త : అంటే నేను మంచి మొగుణ్ణి కాదా .........
భార్యా : నేను వేరే చెప్పాలా
భర్త : ఆ ........   ఆ  ........      

ప్రాంజలి ప్రభ : ఇదండీ లోకం ( హాస్యం)

*భర్త : ఏమిటోయ్ చాలా ఉషారుగా ఉన్నావు ఈరోజు
భార్య :  పనిచెయ్యాలి కొద్దిగా ఆలస్యమైందనుకో కేకలే
భర్త: ఎప్పుడు ఉండేది కదే ఇలా కూర్చొని ఉండి చూడు ఆ టీవీ చూడవే గుర్రాలు ఏవిధముగా పరిగెడుతున్నాయో
భార్య: కాసేపాగి నా కడుపులో ఎలుకలు పరిగెడుతుంటాయి, గోలచేస్తారు మీ విషయమ్ము నాకు తెలియదా
భర్త : ఈరోజు శెలవ్
భార్య: అయితే ఆ టివిలో వంటలొస్తాయి లొట్టలేసుకుంటూ చూడండి నేను వంటకు సెలవ్ పెడుతున్నా
భర్త : నే నేదో నవ్వులాటకు అన్నా అంతే
భార్య : ప్రక్కన కూర్చొని సెల్ తీసి హోటల్క్ ఫోన్ చేసి టిఫిన్ తెమ్మన్నది
భర్త : టిఫిన్ బిల్ చూసి ఆ. ఆ. ఇంత రేటా ....
భార్య: బిల్లు ఇచ్చి పంపండి, నేను ఆకలి చంపుకొని    ఉండలేను, నేను తింటున్నాను
భర్త : మరి నాకే బుద్ధి తక్కువై సెలవు అని చెప్పాను  .........
భార్య: బుద్ధి యెక్కువై చెప్పారు, ఒక్క రోజు అన్నా అరవ కుండా ఇద్దరం తిందామనవచ్చు కదా
భర్త : అంటే నేను రోజు నిన్ను అరుస్తున్నాన
భార్య : అదివేరేచెప్పాలా
భర్త :  ఆ ........   ఆ  ........    

23, జూన్ 2017, శుక్రవారం

విశ్వములో జీవితం,

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

హాస్యం 

మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక మెరుపుని చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు 
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా అబద్ధం చెప్పా మంటారా అని అడిగాడు 
మాష్టర్ : నిజమే చెప్పు 
విద్యార్థి : ఆ మెరుపుకు మేఘం కరిగి వర్షం పడుతుంది  
మాష్టర్ : అవును బాగా గుర్తించావు, దానిని బట్టి నీకేం తెలుస్తుంది?
విద్యార్థి : మెరుపును చూస్తే మనకళ్ళు పోతాయని తెలుస్తుంది  కదండీ 
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు 
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు  
మాష్టర్ : అడుగు చెప్తా 
విద్యార్థి : మెరుపు మెరిసే శబ్దమును, మానవ బాంబులతో పోలుస్తారు ఎందుకు,         
మాష్టర్ : నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు    
విద్యార్థి : " అందరూ ఒక్క క్షణమైనా ఉజ్వలంగా మెరుస్తూ  ఉండాలని " కదండీ గురువుగారు 
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....

మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక కొవ్వొత్తిని చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు 
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా అబద్ధం చెప్పా మంటారా అని అడిగాడు 
మాష్టర్ : నిజమే చెప్పు 
విద్యార్థి : ఆ కొవ్వొత్తి వెలుగును వెదజల్లు తున్నదని తెలుస్తున్నది  
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు 
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు  
మాష్టర్ : అడుగు చెప్తా 
విద్యార్థి : కొవ్వొత్తి కరగటం, స్త్రీలు సర్వస్వము అర్పిస్తారని చెపుతారు ఎందుకండీ 
మాష్టర్ : మనసులో వయసుకు మించినవి అడుగుతున్నాడు అనుకుంటూ  నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు  
విద్యార్థి :"చివరివరకు వెలుగు నందించని, స్త్రీలు చివరి వరకు సుఖం అందిస్తారని  " కదండీ గురువుగారు   
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....
          

మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక వృక్షాన్ని చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు 
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా అబద్ధం చెప్పా మంటారా అని అడిగాడు 
మాష్టర్ : నిజమే చెప్పు 
విద్యార్థి : ఆ వృక్షం " సర్వ ప్రాణులకు ఉపయోగ పడుతుంది   
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు 
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు  
మాష్టర్ : అడుగు చెప్తా 
విద్యార్థి : చల్ల గాలి వీస్తుంది అంటారు, గాలి కనబడదు ఎందుకండీ 
మాష్టర్ : మనసులో వయసుకు మించినవి అడుగుతున్నాడు అనుకుంటూ  నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు  
విద్యార్థి :" కష్టాల్లో ఇతరులకు సుఖం ఇవ్వమని, కష్టాలు సుఖాలు గాలిలాగా కనబడ కుండా పోతాయి   " కదండీ గురువుగారు   
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....

విశ్వములో జీవితం, -

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

హాస్యం

మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక చెట్టును చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా, అబద్ధం చెప్పా మంటారా, అని అడిగాడు
మాష్టర్ : నిజమే చెప్పు
విద్యార్థి : ఆచెట్టుకు ఆకులు రాలి పోతున్నాయి
మాష్టర్ : అవును బాగా గుర్తించావు, దానిని బట్టి నీకేం తెలుస్తుంది?
విద్యార్థి : వానలు పడ్డాక ఆకులు వస్తాయి కదండీ
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు
మాష్టర్ : అడుగు చెప్తా
విద్యార్థి : ఆకులు రాలినట్లు మీ జుట్టు రాలింది కదండి, వానలుబడితే బట్టతలపై జుట్టు మొలుస్తుందాండీ:
మాష్టర్ : నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు  
విద్యార్థి : "ఆకురాలుతూ చెపుతుంది మన జీవితం శాశ్వితం కాదని " కదండీ గురువుగారు
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....

మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక పువ్వు ను చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా అబద్ధం చెప్పా మంటారా అని అడిగాడు
మాష్టర్ : నిజమే చెప్పు
విద్యార్థి : ఆపువ్వు వికసించి పరిమళాలు వెదజల్లు తున్నదని తెలుస్తున్నది
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు
మాష్టర్ : అడుగు చెప్తా
విద్యార్థి : పువ్వు వికసించడం, స్త్రీలతో పోల్చుతారు ఎందుకండీ
మాష్టర్ : మనసులో వయసుకు మించినవి అడుగుతున్నాడు అనుకుంటూ  నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు
విద్యార్థి :"ప్రతిరోజూ గౌరవముగా వికసిస్తూ జీవించమని " కదండీ గురువుగారు
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....
   
మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక మేఘాన్ని చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా అబద్ధం చెప్పా మంటారా అని అడిగాడు
మాష్టర్ : నిజమే చెప్పు
విద్యార్థి : ఆ మేఘం నీరు కార్చటానికి రడీగా ఉన్నది
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు
మాష్టర్ : అడుగు చెప్తా
విద్యార్థి : మేఘం నీరుకార్చడం, పిల్లల ఏడుపుతో పోలుస్తారెందుకు
మాష్టర్ : మనసులో వయసుకు మించినవి అడుగుతున్నాడు అనుకుంటూ  నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు
విద్యార్థి :" చెడుని గ్రహిస్తూ మంచిని పంచమని " ఆకలేసి కన్నీరు కారిస్తే ఆకలి తీరు తుందని  " కదండీ గురువుగారు
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....

22, జూన్ 2017, గురువారం

విశ్వములో జీవితం -31

om sri raam - sri matrenama:

అహం  

అనేక మంది కళ్ళకు ఆకాశం ప్రకాశవంతంగా పింక్, ఎరుపు, నారింజ, నీలిమందు మరియు బూడిద రంగుగా కనబడటం జరుగుతున్నది. అలాగే మనచుట్టూ ఉండేవారు అనేక రకాల బుద్ధులు కలిగిన  మనుష్యులు ఉన్నారు,  వారు సంతోషంగా మరియు విచారంగా జ్ఞాపకాలు లాగా ఉంటే తూర్పు నుండి పడమటి వరకు సూర్యునిలో  రోజువారీ మార్గంలో ఎన్ని మార్పులు జరుగుతాయో అన్ని మార్పులు మనలో కూడా జరుగుతాయి. చీకటిలో సూర్యుడు దిగంతంలో పడుకుని ఉంటాడు, అలాగే మనలో అంతరాత్మ శాంతి కొరకు నిద్రకు ఉపక్రమించటం చాలా శ్రేయస్కరము.
  
ఒకప్పుడు అద్భుతమైన కాంతిని అణచి వేయబడిన జాడలు కనిపిస్తాయి అంత మాత్రాన స్వయం శక్తి ఎప్పటికి మారదు మబ్బులు తొలగిన యధా ప్రకారం వెలుగును చిమ్మును, అలాగే మనకి కొన్ని బాధలు వెంబడించిన అవి తొందరలో తొలగిపోతాయని గమనించాలి. నిద్రలో జ్ఞాపకాలు క్షిణించిన వెలుగులో అవి విజ్ఞావంతులుగా మారుస్తాయి. 

మనలో ఉన్న అహంకారముతో కూడిన భౌతిక భావన మాత్రమే మనల్ని చీకటిలో నెట్టి వేస్తుంది, మమకారము పెంచుకొని వెలుగు కోసం ప్రయత్నం చేయాలి. ఎవరికైన ఈ అహంకారముతో సంబంధమున్నచో అట్టి వ్యక్తి విముక్తిని గూర్చి మాట్లాడవలసిన పని లేదు. విముక్తి అనేది తిరుగులేనిది. 

అహంకారము యొక్క బంధనాల నుండి స్వేచ్ఛను పొందాలంటే వ్యక్తి తన యొక్క అసలు సత్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన ఎల్లపుడు ఆనంద స్థితిలో ఉండేది, స్వయంప్రకాశవంతమైన వెలుగును పొందాలి. ఎలానంటే రాహుగ్రహము నుండి విముక్తి పొందిన చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలాగా. 

బుద్ది వలన మాలిణ్యముతో కూడిన భౌతిక సంబంధములు ఎలా సృష్టించబడినవో, అవి శరీరానికి కళంకము తెచ్చి, నేను బలవంతుడును, నేను అమాయకుడను, నేను సంతోషముతో ఉన్నాను అనే భావనలు అహంతో చోటు చేసుకొనుట సహజము. 

ఓర్పుతో ఓపికతో స్థిమిమ్ముగా మనం చేసినది ఏమిటి అనుకరించినది ఏమిటి అని ఒక్క సారి ఆలోచించ కలిగే శక్తి మనకు పరమాత్మ ఇచ్చాడు. అహం అనే కాలసర్పం మనల్ని చుట్టి వేస్తుంది
దానిని ఎదుర్కొనుటకు అహం అనే సర్పాన్ని జ్ఞానమనే ఖడ్గముతో నాశనము చేయకల్గిన శక్తి మనలో ఉన్నది.      
 --((*))--

21, జూన్ 2017, బుధవారం

విశ్వములో జీవితం -30

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

గీతాజ్ఞానం 

స్పృహ అనేది మానవాభ్యుదయానికి అవసరమ్, సమయ సందర్భాలను గమనించి కాలమాన ప్రకారముగా కలియుగంలో జీవించాలంటే మొక్క ఎదిగినట్లుగా ఎదుగుతూ నలుగురికి సహాయపడే గుణముతో జీవించాలనే లక్షణం ప్రతి ఒక్కరిలో జీవం పోసుకోవాలి. తక్కువ మాట్లాడి ఎక్కువ విని ధర్మ మార్గాన నడుచు కోవటం వళ్ళనే అసలైన జీవితం కనబడుతుంది.

శ్రద్ధ అనేది పుట్టుకతోనే వస్తుంది, తల్లి తండ్రుల లక్షణాల బట్టి కొంత మారుతుంది. దానికి తోడు స్నేహభావం మనలో ఏర్పడి తెలుసు కోవలసిన కొన్ని విషయాలు తెలుసు కొనుటలో కూడా శ్రద్ధ  వహించ గలరు, ఇది ఒకరు నేర్పరు, స్వయంగా తెలుసుకొని అందులో ఉన్న మంచిని గ్రహించుటకు నిగ్రహ శక్తి ఉపయోగించి ముందుకు పొతే, జరగబోయే విషయాలు కూడా శ్రద్ద వళ్ల గ్రహించ గల శక్తి ఏర్పడుతుంది.  

అందుకే ఆనాడు రామచంద్రుడు భార్యాన్వేషణకు హనుమంతునిలో ఉన్న శ్రద్ధను గ్రహించి అంగులీకము ఇవ్వడమ్, తగు విధముగా హనుమంతుడు సహకరించటం మనం తెలుసుకోగలిగాము.

ఒక సర్కస్ కంపెనీ వాడు జంతువులను ఆడించాలంటే ఎంతో శ్రద్ద, ఓర్పు వహిస్తేనే అవి వినటం జరుగుతుంది, మత్సకారుడు సముద్రముమీద వేట సాగించాలంటే శ్రద్ధతో కెరటాల బట్టి పడవను నడుపుతూ వేట సాగించగలడు, ఇదేవిధముగా ఎంతో మంది శ్రద్ధగా చదివి దేశ సేవకోసం ప్రాణాలు అర్పించినవారు, సహకారం అందిస్తున్నవారు ఉన్నారు. నాలుగు దశలు మారిన తరవాతే సీతాకోక చిలుకగా మారుతుంది. అట్లే శ్రద్ధ వహించిన వానికి జ్ఞానాభివృద్ది కలుగుతుంది.     

శ్రద్దగా చదువుకున్న విద్యార్థికి విద్య వినయమును ఇచ్చును,ఆ వినయము వలన అతడు మంచి యోగ్యత అనగా అర్హత గలవాడు అగును, ఇట్టి పాత్రత వలన ధనము లభించును, ఆధనము వలన బుద్ధియును ఆవిద్యార్దికి కలుగును. దీనికి సరిఅయిన తెలుగు పద్యమిది 

విద్యయొసగును వినయంబు వినయమునను 
బడయ పాత్రత పాత్రతవలన ధనము
ధనము వలనను ధర్మంబు దానివలన 
ఐహికాముష్మికసుఖంబు లందు నరుడు

శ్రద్ధ కలవాడు, ముసలితనము లేనివానివలెను, చావులేని వానివలెను భావించి క్రమంగా విద్యా ధనములను ఉన్నట్లు మలచి వీలున్నంత తొందర్లో తన ధర్మకార్యములను అనగా తనకు శ్రేయస్సును కలిగించే మంచి పనులను పూర్తి చేసుకొనగలడు. శ్రద్ధకు మించిన మరో ఆభరణము లేదు, సమయాన్ని సద్విని యోగం చేసుకొనే శక్తి శ్రద్దకే ఉన్నది.   
            
     

विश्वमूलो जीवितं -29

ॐ श्री राम - श्री मात्रेनम:
 
గీత  జ్ఞానం

మానవులకు సహకరించేది ప్రకృతి, ప్రకృతి ననుకరించి సాగటమే మానవులయొక్క ముఖ్య లక్షణం ణమే.  మనం గమనించాల్సినది అంటి అంటకుండా బురదలో శాఖలు లేకుండా ఉండే కలువ పువ్వును ఆదర్శముగా తీసుకోవాలి ఎందుకనగా ఉషోదయము అయినవెంటనే వికసించే లక్షణం ఉన్నది కలువకు, అదే విధముగా ప్రతి ఒక్కరు ఉషోదయ వెలుగులో మనసును శుద్ధిచేసుకొని మనో నిగ్రహ శక్తితో చేయవలసిన కార్యకమాలు చేయుట ఎంతో మంచిది.

      మొక్కలు నీటి యందు తేలుట గమ్యం లేని ప్రయాణంలా సంచరించుట జరుగు తుంది అది చివరకు భూమి చేరగానే తన బలమంతా కేంద్రీకరించి బ్రతుకుటకు ప్రయత్నిస్తుంది, అదే విధముగా మనము కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటు, వాటి పరిష్కారం చేసుకుంటూ సాగిపోతూ చీకటిలో విశ్రాంతి తీసుకోవం వళ్ళ కొంత మన:శాంతి ఏర్పడుతుంది,సహాయ సహకారముతో కొంత ఉత్సాహము ఏర్పడుతుంది, మరునాడు ఉదయము కళ్ళ కొంత శక్తి తో ముందుకు సాగటం జరుగు తుంది.

శ్రీ కృష్ణ పరమాత్ముడు మనకు బోధ చేసాడు ఏమనగా ఎవరైనా ఈపరిస్థితిలో కూడా అధైర్య పడకూడదు, నిరుత్సాహపడకూడదు, ఇది చేయలేను అది చేయలేను అని మనసులో కూడా అనుకో కూడదు, నిత్యకృత్యాలు ధర్మం తప్పకుండ చేసినవారికి అంతా మంచే జరుగుతుందని భావించ వచ్చు,  కొన్ని పరిస్థితులలో తమ వారినే ప్రశ్నించ వలసిన పరిస్థితి వస్తే నిర భ్యంతరంగా ప్రశ్నించుటవల్ల కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి, మానతప్పు ఎదో ఎదుటివారి తప్పు ఎదో తెలుస్తుంది, ఏవిషయమైనా తెగేదాకా లాగకుండా జాగర్తపడుట మానవుల లక్షణం .
"కొండలపై నుండి ఉరవడిగా నీరు కారుతున్నది అన్నిటిలో ఒక చెట్టు క్రిందకు జారుతూ మరలా కొంత పట్టు దొరికిన వెంటనే వెనుకకు ఎగబాకి వెళ్ళుట గమనించగలరు అట్లాగే ఎవరైనా కొన్ని సంఘటనల ప్రభావము పనిచేసినప్పుడు కోపముతో వెళ్లిన తిరిగి వచ్చుట అనేదే అంత:కరణ శుద్ధికి మూలం మంచి చెడు గ్రహించి    బ్రతకటమే జీవితం 
అనేకమంది మనుషుల షేడ్స్ లో ఆకాశం ప్రకాశవంతంగా పింక్, ఎరుపు, నారింజ, నీలిమందు మరియు బూడిద రంగుగా చూడడం జరుగుతుంది. వారు సంతోషంగా మరియు విచారంగా జ్ఞాపకాలు లాగా ఉంటే తూర్పు నుండి పడమటి వరకు సూర్యునిలో  రోజువారీ మార్గంలో ఎన్ని మార్పులు జరుగుతాయో అన్ని మార్పులు మనలో౦ జరుగుతాయి. చీకటిలో సూర్యుడు దిగంతంలో పడుకుని ఉంటాడు, అలాగే మనలో అంతరాత్మ శాంతి కొరకు నిద్రకు ఉపక్రమించటం చాలా శ్రేయస్కరము.
 
ఒకప్పుడు అద్భుతమైన కాంతిని అణచివేయబడిన జాడలు కనిపిస్తాయి అంత మాత్రాన స్వయం శక్తి ఎప్పటికి మారదు మబ్బులు తొలగిన యధాప్రకారం వెలుగును చిమ్మును, అలాగే మనకి కొన్ని బాధలు వెంబడించిన అవి తొందరలో తొలగిపోతాయని గమనించాలి.     
నిద్రలో జ్ఞాపకాలు క్షిణించిన వెలుగులో అవి విజ్ఞావంతులుగా మారుస్తాయి

19, జూన్ 2017, సోమవారం

విశ్వములో జీవితం-28

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
గీతాజ్ఞానము

నాలుగు చక్రాలతో నడిచే రధము ఒక చక్రముతో నడవలేనట్లుగా అనేక చక్రాలతో నడిచే సంసారం  పురుషాకార శక్తి, దైవ శక్తి అనే "2 " కలసి నడిపితేనే సంసారము మనే నావ ఆటుపోటులను తట్టుకొని గమ్యాన్ని చేరుతుంది. ఓ మనిషి తెలుసుకో మాయా మోహము చేత చేయక యుందురు స్మరణము, నిజాన్ని తెలుసుకోలేరు కామము శాశ్వితము అని భావించెదరు మిడి మిడి జ్ఞానముతో విర్రవీగేదరు. సుఖము ఉన్నప్పుడు దైవము కనబడదు, కష్టము ఉన్నప్పుడు దైవాన్ని దూషించెదరు.

ఒక వేదాంతి ఈవిదముగా పాడుతున్నడు. 

 
కొందరు విధులను చేయుట చేత కాదని
నిధులను కాజేయుచూ అవినీతిగా మెలిగెన్
కృష్ణా

అధములను చూడగా వంత పలుకుతూ
మదిని వేధించు పలుకులు పలికెన్
కృష్ణా

విలువలు మారినప్పుడు వింతలూ చూపుచూ
మలుపులు పెరిగినప్పుడు కోపము పెరుగు చుండెన్
కృష్ణా
సూలములతో పొడిచినట్లు మాటలాడుచూ
మనసును విరుచుటకు ప్రయత్నం ఉండెన్
కృష్ణా

నెయ్యము చేసితి పలువిధములైన ప్రేమలతో
వియ్యము చేసితి నమనసునొప్పింపగా
కృష్ణా
కయ్యము వదలి నెయ్యముతో మెదిలితిని
చెయ్యను చేసిన తప్పులను, వేధింపులను
కృష్ణా

హాసముతో బ్రతికితిని నిత్య జీవితము నందూ
మోహముతో తెలియక మోసములు చేసితిని
కృష్ణా
వీసము విలువ లేని వాని మాటలను గొప్పగా నమ్ముచూ
రోషము తెచ్చుకోక నిజం తెలుసుకొని బ్రతుకుచుండెన్
కృష్ణా 

ఆ పరాత్పరుడు పరమాన్నము ప్రాణులకందరికి అందించును, బ్రతికి నంత కాలము సంతోషముతో, స్పర్శ జ్ఞానము తో, పంచ భూతాల సాక్షిగా  నడుచు కొన వలెను. రోగములు దరిదాపుల్లో రావు, రోచిష్ఠునిచే రోగ నిరోధక శక్తిని వేగము గా పొందవచ్చును.              
        


విశ్వములో జీవితం -29

ఓం శ్రీ రామ్   - శ్రీ మాత్రేనమ:

గీతా జ్ఞానము -4

సముద్ర కెరటాలు వలే పొంగుతూ ఉరుకుతుంది, ప్రజ్వలించే మహాజ్వాలలా ఎగసి పడుతుంది, మంచు ముద్దలా, వెన్న ముద్దలా స్పర్శకు కరిగి పోతుంది,  బాదం కొమ్మలా విరిగి పోతుంది,శిల్పానికి ఎన్ని గాయాలు తగిలిన నిండు రూపంలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందో ఎలాఉంటుందో ఎవ్వరు చెప్పలేకపోతున్నారు, అది మనలో ఉండి ఒక ఆట ఆడిస్తుంది అదే " మనసు ".

ఇనుము ఇరిగినా అతికించ వచ్చు మనసు విరిగితే అతుకుట కష్టం, ఇది విశృ0ఖలమైనది మదించిన ఏనుగులా ప్రవర్తిస్తుంది.  

ఓమనిషి తెలుసుకో! తెలుసుకొని మసలుకో!

చిందులు వేయకు చింత చేరినపుడు
చిరుగును పూరించుటకు చూడాలి ఎపుడు
చిన్న దాని చూపులకు చిక్కకు ఎపుడు
చిరుతలా దూకుతూ ధర్మాన్ని కాపాడు ఎపుడు     

వ్యసనాలకు బానిస కాకు ఎపుడు
వ్యధలు వచ్చును బ్రతుకు మారినపుడు
వ్యవహారము చక్క బెట్టుడు ఎపుడు
వ్యవసాయపై నమ్మకముంచాలెపుడు

రెక్కల్లా భావాలు చుడతాయి ఎపుడు
చుక్కల్ని పట్టాలని అశకు పోకు ఎపుడు
ప్రక్కన వారిని తక్కువచేయకు ఎపుడు
మక్కువ కొద్దితిని భాధ తెచ్చుకోకు ఎపుడు

వినయవిధేయత చూపాలి అందరిపై ఎపుడు
మనమున మర్మము గ్రహించాలి ఎపుడు
మనమున దేవుని కొల్చి శాంతిని పొందాలి ఎపుడు
వినమని చెప్పిన వినరు ఎందుకో ఎపుడు

ఈ విధముగా మనసు బుద్ధిననుసరించి జీవిస్తుంది. బుద్ధి వక్రబుద్ధిగా మారితే జీవితమే  దుర్భరం.

మనసులేని మమత ఎందుకు - మనుగడకు రాని మనసు ఎందుకు
మదితలపులు తెలుపని బ్రతుకు ఎందుకు - మతిలేని మనిషికి మనసు ఎందుకు

చెడ్డ మనసుకే ఆవేశం ఎక్కువ - మంచి మనసుకు మక్కువ ఎక్కువ
ఆదాయం లేని మనసుకు ఓర్పు ఎక్కువ - ఆదాయం ఉన్న మనససుకు ఆవేశం ఎక్కువ

మనసు విప్పి మాట్లాడి మర్మము తెలుసుకో - మగువ మనసును బట్టి మనసు మార్చుకో
ఓమనిషి తెలుసుకో - తెలుసుకొని మసలుకో                 

15, జూన్ 2017, గురువారం

విశ్వములో జీవితం - 27

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

గీతా జ్ణానము- 3 

గురువుగారు మనం  అనేక   పుణ్యకార్యక్రమాలు ప్రత్యక్షంగా, మరికొన్ని తెలిసో తెలియకో  పాప కార్యాలు (పరోక్షంగా చీకటిలో)  చేస్తూ ఉన్నాము ఎవ్వరు  గమనించరు  కదా

అదే తప్పు నాయనా
మన కంటి చూపులో మెరుపును వేరేవారు చెపితేగాని నీవు గమనించలేవు, కంటిలోని నలక తీయాలన్నా ఒక అద్ధముకాని, మరో మనిషి గాని కావాలి, చివరికి తడి గుడ్డకాని కావాలి.,
     నీ వైపు నీవు చూడలేవు , నీ వెనుక ఏమి జరుగుతుందో తెలుపలేవు, నీ నీడను నీవు తాకలేవు కానీ మనం చేసే అన్నీ పనులకు సాక్షాలు లేరనుకోకు "14 "  మంది ఉన్నారు వారెవరంటే విను

శ్లో: ఆదిత్య చంద్రౌ అనిలో నాలాశ్చ దౌయ్రుభూమి రాపో హృదయం యమశ్చ !
     ఆహాశ్చ రారిశ్చ ఉకే చ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం !!

ఆ సాక్షులు ఎవరనగా 1 .సూర్యుడు 2 . చంద్రుడు, 3 .వాయువు, 4 . అగ్ని, 5 . శ్శబ్దము, 6 . భూమి, 7. ఉదకము 8 . తన హృదయము 9. యమధర్మరాజు 10. రాత్రి. 11. పగలు 12. 13. రెండు సంధ్యాకాలములు 14. ధర్మదేవత.

వీరు మానవులయొక్క మానసిక ప్రవృత్తులన్నింటిని ప్రతి క్షణ మందును పూర్తిగా పరిశీలించి తమ పుస్తకములో వ్రాసు కొందురు. సత్యము ఇలా ఉండగా కొందరు ప్రభుద్దులు చీకటిలో ఎవ్వరు లేని సమయాన చేసిన పనులను గమనించ లేదను కుంటారు, దాని ఫలితము ఈజన్మలో కాకపోయినా   మరోజన్మలో నైనా తప్పక తగ్గ శిక్ష అనుభవంచ వలసి ఉంటుంది.

కనుక ప్రతిఒక్కరు  మీ పనులను త్రికరణ శుద్ధిగా చేసుకుంటే మీపేరు సులభంగానే మహాత్ముల వరుసలో ఉంటుంది.         
            
చూడు నాయనా అన్నీ విద్యలు అందరికి అబ్బవు, ఎదుకంటే ఎవరు చేసిన పాప పుణ్యాల ఫలితము వళ్ళ భూమి మీద పుడతారు. కులవృత్తి వదలకుండా ధర్మకార్యములు చేస్తూ జీవితం గడపాలి. 
నేను చెప్పే ఈ నాలుగు మాటలు గుర్తుపెట్టుకొని అనుసరించు.      

"ఎంత బరువైనను  మోయగల  వానికి  బరువనేది  ఉండదు,   శ్రద్దగా భూమి వ్యవసాయం చేసుకొనే వానికి దూర మనేది ఉండదు,  ఇట్లే మంచి విద్య గలవానికి విదేశ మనేది ఉండదు, ప్రియంగా మాటలాడు వానికి పరుడు అనే మాట ఉండదు".

మంచి పనిని గాని, చెడ్డ పనిని గాని,  చేసేవాడును, ఆ పనిని చేయిన్చేవాడును,  ఆపనిని చేయుటకై ప్రేరేపించే వాడును, ఆపనిని అంగీకరించు వాడును ఈ నలుగురు ఆపని వలన గలిగిన పుణ్య పాపములలో సమాన వాటా దారులగుదురు. కనుక మనం మనపూర్వీకులు తల్లితండ్రులు నేర్పిన విద్య ఆధారముగా బ్రతికి బ్రతికించుట అనే ఉద్దేశ్యంగా ఉండాలనేది నాకోరిక
ధర్మానికి ఖర్చుపెట్టా లంటూ
న్యాయాన్ని నిలబెట్టా లంటూ
సత్యాన్ని బతికించా లంటూ
తన చుట్టూ తిప్పు కుంటూ
లోకాలన్నీ తిరుగుతూ ఉంటూ
బ్రతికి బ్రతికించాలనేది పచ్చనోటు       
అలాగే గురువుగారు మీరు చెప్పినవి అనుకరిస్తాము అని లేచారు శిష్యులు.  
 

14, జూన్ 2017, బుధవారం

విశ్వంలో జీవితం -26


 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
గీతాజ్ఞానమ్ - 2
 
మనలో ఉన్న తెలివిని మనమే గుర్తించ నవసరము లేదు మనము చేసే పనిని దృడ సంకల్పంతో చేస్తే చాలు మనలో ఎటువంటి అవలక్షణాలు ఏర్పడవు, ఆలోచన అనేదే మనకు రాదు ఎందుకనగా మనము ఒక పద్ధతిన అలవాటు పడతాము, ఆపద్ధతిన పోవుటకు ప్రయత్నము చేస్తాము, దానిలో ఒక విధమైన అనుభవము వస్తుంది అలాగే భూమి మీద ప్రాతి ప్రాణికి ప్రతి వస్తువుకీ ఒక విలక్షణమైన స్వభావము ఉంటుంది .

ఉదాహరణకు సూర్యభగవానుడు వెళతప్పకుండా ప్రయాణము చేస్తూ సర్వజీవులకు వెలుగు వేడి నందిస్తూ చీకటిని ఆహ్వానించి తన పని ఈరోజుకు అయినది అని తెలియపరిచి విశ్రాంతి తీసుంటారని
తెలుస్తున్నది, గాలి కనబడకుండా వియటం జరుగుతుంది సర్వజీవివులను రక్షించుతుంది ఇది దాని స్వభావం, కాల్చడం అనేది నిప్పు స్వభావం అనగా ఒక విధమైన జ్వాల  ఏర్పడి కారు చిచ్చుగామారి అడవిని దహించివేస్తుంది, ఆజ్వాలను నీటిపాత్ర క్రింద ఉంచితే నీళ్లను వేడి పరుస్తుంది అనగా జ్వాలను ఉపయోగించుకొనే పద్ధతిని బట్టి ఉంటుంది. పారడ మనేది నీటి స్వభావం అనగా నీరు సముద్రములో కలవవలసినదే కనుక నీటి ఉపయోగాలను ఉపయోగించు కొనే తెలివి మానవులకు ఉన్నది ఆవిధముగా నడుచు కోవటం మంచిది.           

అదే విధంగా ప్రతిదాంట్లో తల దూర్చడం, ఒక విషయం మీద నుంచి మరో విషయానికి దూకడం, విచిత్రమైన కోరికలు కోరడం, వేలాది విషయాల గురించి ఆలోచించడం, ఎన్నెన్నో సమస్యల గురించి దుఃఖించడం, గాలిలో మేడలు కట్టడం, మనకు అప్పగించిన పని గురించి కాకుండా మిగిలిన ప్రతి ఒక్క పని గురించి పట్టించుకోవడం, చేసింది ఒకటి, చెప్పేది మారొకటి, చేయాలనుకున్నది వేరొకటి ఇవి కాక ఇంకా ఎన్నో మానవుల లక్షణాలు ఉన్నాయి   – ఇదీ మనస్సు స్వభావం.

ఇటువంటి మనస్సును నియంత్రించ గలిగితే, మనం ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధించ గలుగుతాం. మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాల పాత్ర ఇక్కడ వస్తుంది.

కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం – ఈ అయిదు మనసుకు వాహనాలు. జ్ఞానేంద్రియాలన్ని మనస్సును అన్ని వైపులా లాగుతూ ఉంటాయి. కాబట్టి, వివేకాన్ని ఉపయోగించడం ద్వార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచడాన్నే సంస్కృతంలో ‘దమం’ అంటారు. నిజానికి ,ఇంద్రియాల సహాయం లేకుండానే స్వతంత్రంగా కూడా ఇష్టమొచ్చిన చోటుకు మనస్సు పోగలదు. అలాంటి సందర్భాలలో బుద్దిని ఉపయోగించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఇలా తిన్నగా మనస్సును నిశ్చలంగా ఉంచే పద్ధతినే ‘శమం’ అంటారు.

ఏకాగ్రతతో కూడుకున్న మనస్సు నిజంగా ఓ సెర్చి దీపం లాంటిది. దూరంగా, చీకటి మూలల్లో పడి ఉన్న వస్తువులను కూడా మనకు కనిపించేలా చేస్తుంది.

ప్రాతి రోజు ప్రతి వ్యక్తి యోగాసనాలు వేయటం, ఇష్టదైవాణ్ని ప్రార్ధనలు చేయటం ధర్మం తప్పకుండా నిత్యకృత్యాలు చేయటం వళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది. 
మనిషికి మనషి తోడు ఉంటె మనలోని భావాలను తెలియ పరుచుకొని మనసును తేలిక పరుచు కొని ఏకాగ్రతకు ప్రయత్నం చేయాలి.   

మనం ప్రతి నిత్యం సాధన చేస్తూ మన మనస్సును ఆత్మ జ్యోతి మీద ద్రుష్టి నిలిపివుంటే, పరిసరాలనే కాకుండా చివరకు తన దేహాన్ని సైతం మర్చిపోయి పూర్తిగా మునిగిపోతే, అదే ఏకాగ్రతకు కచ్చితమైన సూచన!.

విశ్వములో జీవితం -25

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 
గీతా జ్ఞానం -1
మనిషి మనిషికి మధ్య తేడా ఉంటుంది, ఆ తేడా కేవలము రూపములో గాని, గుణములో గాని మాత్రమే కాదు అనేక పద్దతులలో ఉండటంవల్ల మనుషులమధ్య పోలిక గుర్తు పట్టలేము  ఒకే రూపంలో ఉండేవారు, చాలా తక్కువ కానీ భగవంతుఁడు మనుష్యులకు "26 " లక్షణాలు చూపించారు, వాటిని  బట్టి అనుకరించ మన్నారు.

1. ప్రతిఒక్కరు మొదట నిర్భయత్వం తో ఉండాలి అనగా " ఇష్టవస్తువు వియోగము, అనిష్టవస్తువు సంయోగం కలుగునని సంకట మనస్సు నందు సంభవించు పిరికితనముతో కూడిన వికారమునే "భయము"   ఆ భయము లేకుండా ప్రతిఒక్కరు బ్రతకాలి అలాగే ప్రతిష్ఠా భంగము, అవమానము, నింద, రోగము, రాజా దండనము, భూత ప్రేతములు, మరణము మొదలగు వానివలన కలుగు భయాందోళనలు ఏమాత్రము లేకుండటనే అభయం అందురు.సన్మార్గాచరణముతో భయము లేకుండా ప్రతిఒక్కరు జీవితం సాగించాలి

2. శుద్ధ సాత్విక వృత్తి అనగా "మన మనసును పాడు చేసే త్రిగుణాలలో సాత్వికగుణ పద్దతిలో నమ్ముకున్న వృత్తిని అనుకరించుట వలనే" మనసు ప్రశాంతముగా మారును.

3. సత్త్వసంశుద్ది అనగా:అంత:హకరణము నందు రాగ ద్వేషములు, హర్ష శోకములు, మమతా హంకారములు, మొహమత్సరములు, మొదలగు వికారములను నానా రకములైన కలుషిత పాపాత్మక భావములను ఏ మాత్రము లేకుండుటను అంత:కరణమూ పూర్తిగా నిర్మలమై పరిశుద్ధముగా ఉంచుటకు క్రమ పద్ధతిగా సమయాను కూలంగా నడుచు కొనవలెను. 
                     

13, జూన్ 2017, మంగళవారం

విశ్వం లో జీవితం -24

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: 
*" స్త్రీ "సకలానంద స్వవరూపిణి

నయన మనోహర అరవింద సుకుమారా అపరంజి  మణి !
మనసును దోచే, నవ నవోన్మష రక్తి యుక్తి ముక్తి స్వరూపిణి !
కోరికలు తీర్చి, మనస్సును పంచి, యశస్సును పెంచే, యసశ్విణి  !
మనోధైర్యం, దృఢసంకల్పం కల్పించి, తేజస్సును వృద్ధి పరిచే, తేజస్విణి  !

ధర్మశాస్త్రములుతెలిపి, సమస్యలను పరిష్కరించి ఆదుకొనే అంతర్వాణి! 
మంచి చెడు కొన్ని విషయాలు తెలిసుకోనుటకు, సహాయపడే అన్వేషిణి!
సమయానికి అంతరాత్మను ప్రభోదించి, మంచి సలహా లిచ్చే, ఆత్మజ్ఞాణి !
ఆస్తిని, అదాయమును, పెంచి ఆహారమును అందించే, అన్నప్రదాయిణి !

పరిమళాలు వెదజల్లి,  మనస్సును ఉల్లాసపరిచే, ఇష్ట ఘంధిణి !
రౌద్రరసమును చూపి, శత్రువుల గుండెలలో ఉండే, ఉగ్రరూపిణి !
మనో భిష్టమును నెరవేర్చి, ఉచ్చాహమును పెంచే, ఉజ్వల రాణి !
తెలివితో మంచి మాటలతో తెలియనివి తెలియ పరిచే  ఉపన్యాసిణి !

ఇంటిని, సభను, పిల్లలను,  హుందాగా తీర్చి దిద్దన, అస్థాణి !
కామాందులకు, దుర్మార్గులకు,  దుష్టులకు, చిక్కిన ఆహుతిణి !
అభిమానంతో మనసును ఉల్లాసపరిచి కోర్కెలు తీర్చిన, అభిలాషిణి !
పురాణములు, వేదములు అనర్గాలముగా వర్ణించి చెప్పే, అవృత్తిణి ! 

బలము, ధెర్యము, మనోనిగ్రహ శక్తి పెంచే తేజస్సుగల ఓజస్వి ణి !
ఉపవాసములు ఉండి ఉపాయములు తెలియపరిచే ఉప చారిణి !
భర్త దుర్వసనములులోనైతే వ్యసనములను మాన్పించే ఉపాధ్యాయిణి !
హృదయ బాధను భరించి మన్మధ లీలకు సహకారం కలిగించే విలాసిణి !

అనారోగ్య భర్తను ఆరోగ్య వంతునిగా  మార్చుటకు శ్రమించే ఔషదణి !
నవనీత హృదయ గల వేణి,  మంజుల మధుర వాణి !

12, జూన్ 2017, సోమవారం

విశ్వం లో జీవితం -23

ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ:


మమత 

రావు గారు మిమ్మల్ని చూస్తే నాకు ప్రేమ, కోపము, జాలి కనిపిస్తుంది, మానవత్వాన్ని బట్టి మమతను   స్నేహమును పంచుతున్నావు, అందరు సమాన మంటావు ఎందుకలా మారావు అని అడిగాడు.
కూర్చో " పతి గారు " కాలాన్ని బట్టి నేను నడుస్తున్నాను, అన్ని మతాలలో ఉన్నది ఒక్కటే తోటివారికి సహాయపడు, లేనివాడికి దానం చెయ్, మన: శాంతిగా బ్రతుకు అనేది కదా. 

అది నిజమేననుకో. ఈలా మారటానికి ఏదైనా కధ ఉన్నదా. అదేం అంత పెద్దది కాదు నా అనుభవంలో తారస బడిన కొన్ని సంఘటన చెపుతా విను.

నాకూతురి పెళ్లి నిమిత్తం దాచిన సొమ్మును పెళ్లికి ముందు రోజు బ్యాంకు నుండి తీసుకోని వస్తున్నాను, దారిలో ఒక్క సారిగా కుంభవృష్టి కురిసినట్లు వర్షం పడటం మొదలైనది, నాలో అప్పుడే భయము పెరిగినది, స్కూటర్ ఆగినది, ఇంటికి పోవాలంటి ఇంకా ఆరగంట పడుతుంది గత్యంతరం లోక ఒక ఇంటి తలుపును కొట్టా, 

లోపలనుండి ఒక వృద్ధురాలు టవల్ తో వచ్చి నా తలను తుడవబోయినది, నేను తుడుచు కుంటాను అని తీసుకోని తుడుచు కున్నాను, రొట్టె, వేడి ' టి ' ఇచ్చింది.  వర్షము తగ్గింది ఉంటావా వెళతావా బాబు అని అడిగింది, ఆమెతో పెళ్లి విషయం చెప్పాను, అంతే అప్పుడే నా దగ్గరకు వచ్చి నూతన వస్త్రములు,  కొంత డబ్బు నా చేతిలో పెట్టి ఇవి నీ కూతురికి నా కానుకగా ఇవ్వు బాబు అన్నది. అప్పడని పించింది దేవుడున్నాడు, ఆపదలో ఆదుకొనే వారిని పంపిస్తాడు అనుకుంటూ అక్కడ ఉన్న ఏసుప్రభుకు నమస్కరించి ఆ తల్లికి నమస్కరించి వెనుతిరిగాను. 

తరువాత నా కూతురి పెళ్లి ఘనంగా జరిగింది, కాపురానికి వెళ్ళింది. ఒక్కసారిగా వృద్ధురాలు గుర్తుకు వచ్చి అక్కడకు వెళ్లగా ఆప్పుడో చని పోయింది అని చెప్పారు. ఎవ్వరు పట్టించు కోవటం లేదు, ఎందు కనగా అని విచారించగా ఆమెకు ఇద్దరు పిల్లలు ' కొడుకు కూతురు ' ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదట అన్నారు. అప్పడే నేను ఆమెకు క్రైస్తవ పద్దతిలో ఆమె పుణ్యలోకాలకు పోవుటకు సహకరించాను. అప్పటి నుంచి నేను ఆ ప్రభువుని వేడు కుంటున్నాను, ఆమె చని పోయిన రోజు గుర్తు పెట్టుకొని సమాధి వద్దకు పోయి ప్రార్ధిస్తాను అన్నాడు. 

అవును రావు గారు ఆవృద్దురాలి తరఫున ఎవ్వరు రాలేదా అని అడిగాడు పతి. తర్వాత వారు వచ్చారు, వారు నాకు డబ్బు ఇవ్వ బోయారు, అవి తీసుకో లేదు నేనే వారికి ఆవృద్దురాలికి సంబంధించినవి వారికి ఇచ్చి నేనే వారికి కొంత ధనము ఇచ్చి పంపాను.                                      

 మానవులంతా సమాన మన్న భావన వెళ్ళు  విరియాలి, ఎవరిలోపాలను వారే గ్రహంచి వాటినుంచి బయట పడాలి. మహోన్నత లక్ష్యాలకు అనుగుణంగా మానవాళి వ్యవహరించాలి. అందరిలో అవగాహన, త్యాగనిరతి వికసింప చేయుటమే నా లక్ష్యం అన్నాడు రావుగారు.
అవును రావుగారు నేను కూడా మీతో ఏకీభావిస్తాను,  నీతోపాటు నేను కుడా సేవాదృక్పధముతో సహకరిస్తాను.          

విశ్వము లో జీవితం -22


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:


కోపం 

కోపం అనేది ఎప్పుడొస్తుందో ఎలా పోతుందో తెలుపుట కష్టము, కానీ ఒక్కసారి కోపంగా ప్రవర్తిస్తే కోపిష్టి గా  అందరు అనుకొనే పారిస్థితి కనబడుతుంది, అది భయము వలనో, తప్పు చేయటం వలనో, సరిదిద్దుకోక పోవటం వలనో చెప్పలేము, కోపం మాత్రం వస్తుంది .

దయచేసి కోపము తెచ్చుకొకండి, కోపం తెచ్చుకునే వారిముందు ఈ ఐదు విషయాలలో ప్రతిఒక్కరు జాగర్తగా మాట్లాడలరు 1 .  ఆర్థికపరమైన నష్టము గురించి విపులీ కరించి, వీరివల్ల జరిగింది, వారి వళ్ళ జరిగింది అని చెప్పవలదు. 2 .   మనస్సులోని పరితాపాన్ని  తొందరపడి చెప్పవలదు. త్రీ.  ఆవేశంతో  స్త్రీల  విషయంలో చెడు మాటలు చెప్పుట మంచిది కాదు, 4 .తనకు పరులవలన కలిగిన మోసాలు చెప్పవలదు 5 . అవమానకరమైన విషయాలను చెప్పవలదు, ఈ విషయాలు ఎవరైనా చెప్పిన కోపమున్నవారు ఇంకా కోపం పెరిగిపోతుంది, వారికీ వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం మారుతుంది అని గమనించగలరు.

దీనికి కారణం కోపమున్నవారు 1. మానవశ్రేయస్సునకై చెప్పబడిన రీతిగా ప్రవర్తనలు విడిచి వేయుట 2 .చెడు ప్రవర్తనలకు సంబంధించిన దోషములనే సేవించుట 3 .  తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనక వానినైన విచ్చల విడిగా విడిచివేయుట,  అటువంటి వారి మనస్సులో నిర్లక్ష భావము, అహం కారాము, అనుమానం, వచ్చి కోపం పెరిగి బలహిత పెరిగి అనారోగ్యులుగా మారుతారు.

కోపం ఎన్నో రోగాలకు మూలం. వివేకవంతులు కోపం తెచ్చి పెట్టుకుంటారు. మూర్ఖులు కోపముతోనే జీవితము గడుపుతారు. కోపాన్ని జాయించక పోయినా పర్వాలేదు కనీసం నిద్ర పోయే ముందు కోపంగా ఉండకండి. తనకోపము తనకు శత్రువు అన్నారు సుమతీ శతక కర్త.
కోపమున ఘనత చిన్నదై పోవును అన్నాడు యోగి వేమన . అపార్ధాలకు కోపం తెచ్చుకోవటం ఎందుకు నిగ్రహించు కోవటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిమ్చాలి. కోపంగా ప్రవర్తిస్తే బంధుత్వాలు చెడి పోయే పరిస్థితి వస్తుంది. సంసారంలో చిక్కులు వచ్చినటులే.

ఆయుధము కన్నా కోపము ప్రమాదమైనది. కోపిష్టికి ఆయుధం అందితే కష్టం కానీ కోపంతో పలికే మాటలు కొందరిని మానసిక వత్తిడికి దారితీస్తాయి, దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.

కొందరు కన్నుమిన్ను గానని నడి యవ్వనంలో ఉండుట, అప్పుడే ధన సంపద కల్గుట, అప్పుడే మంచి ఉద్యోగమూ వచ్చుట, అందమైన భార్య వచ్చుట, ఈ నాల్గింటితో అవివేకము పెరిగి తాను ఏమి మాట్లాడు తున్నాడో  అర్ధం చేసు కోవటం కష్టం, నడమంత్రపు సిరిలా కోపము వారివెంట ఉంటుంది జాగర్తగా ఉండలి.

కోపము వలన తపము చెరచును, ధర్మక్రియలకు భాదయగును, అణిమాది గుణములు పోవును, క్రోధము అంతరంగమున చేరి ఆరోగ్యమును పాడుచేయును, తోటివారిని బాధ కల్గించును. ఆచి తూచి మాటలతో కోపాన్ని తగ్గించాలి, మనిషిని బట్టి మనిషిగా ప్రవర్తించాలి                       
  

విశ్వం లో జీవితం -21


ఓం శ్రీ రాం - శ్రీ మత్రేనమ:
సహజత్వం

గంగా జలంలో చల్ల దనం ఉన్నా స్నానం చేస్తే ఆరోగ్యదాయకం, అందులో సూర్యొదయమ్ సమయాన స్నానం చేస్తే ఇంకా మంచిది, ఎందుకనగా సహాజ కిరణములు ఉత్తేజముగా జలముపై చేరి కిరణ మెరుపులు కానవస్తాయి. ప్రతిఒక్కరు సూర్యుని సహజత్వ వెలుగును ప్రార్ధించాలి.

ఒక దేవాలయంలో మల్లెతీగ పూలతో సువాసనలతో దేవునికే పరిమళాలు పన్చుతున్నది, దేవుడే ప్రత్యక్షమై నీవు చేసిన సేవకు వరము కోరుకో అనగా నాకు స్వేస్చ కావాలని కోరింది (పైకి ఎదగ కుండ ఉండి పోవాలని ఆలోచనతో ) తధాస్తు అని అంతర్ధానం ఆయనారు. ఎంత ప్రయత్నం చేసిన తన పెరుగు దల ఆపలేక పోయింది, పెరగటం అనేది ప్రకృతి సహజత్వం ఆపటం అసంభవం.

వయసులో వచ్చే మార్పులు ఎవ్వరు మార్చలేరు, సహజత్వాన్ని ఆహ్వానిమ్చవలసినదే, కాలమును బట్టి నడుచుకోవలసినదే, అట్లాగే శృంగార రహస్యాలు ప్రత్యేకముగా నేర్చుకో నక్కరలేదు, చదవ నక్కరలేదు, ప్రకృతి సహకరించటం సంభవం అని తెలుసుకోవాలి.

అట్లాగే బిడ్డ పుట్టగానే తల్లికి పాలుపడటం సహజత్వం, అందం పోతుందని పాలు ఇవ్వకుండా ఉంటె కష్టం తల్లి బిడ్డకు, బిడ్డకు పాలు ఇస్తేనే ఇద్దరికీ క్షేమం, సహజత్వాన్ని ఆపుట అనర్ధం.        

సహజత్వం వల్ల గాలి కానరాకుండా సకల ప్రాణులకు గాలి అందిస్తుంది, విద్యత్ కానరాకుండగా వెలుగు అందిస్తుంది, బిడ్డలలో తల్లి తండ్రుల గుణ లక్షణాలు కానరాకుండా వెంబడిస్తాయి.
ఎవరూ వద్దన్నా ప్రేమ మాత్రం సహజత్వంగా అందరిలో ఉంటుంది అది ఎవ్వరు ఆపలేరు. సహజత్వాన్ని మరచి మరోరకంగా అలోచిసే మేధస్సు నాశనమౌతుంది.

సహజంగా మనం బరువులను మోయం కాని అభిప్రాయాల భారం, ఆదర్శాల భారం, మతాల భారం, కులాల భారం, నాయకుల భారం, అనారోగ్యుల భారం మనతలపై ఉంటుంది. ఇది కూడా సహజాత్వమే.     మానవ జన్మకు ఇంకితజ్ఞాణము ఉన్నది కనుక మనం బరువు మోస్తున్నామని మరవాలి, కాలాన్ని బట్టి నడుస్తున్నామని, మనవేనుక ఒకరు నడిపిస్తున్నారని,  తేలిక భావం తో ఉండాలి, అప్పుడే ప్రతి ఒక్కరు సహజత్వంతో బ్రతక గలుగుతారు.                         

కోరిక గుర్రమనై నిగ్రహ శక్తితో సహజత్వాన్ని వదలకండి, నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అనేది సహజత్వం, సత్యం, ధర్మం, న్యాయానికి ఉన్న ఉన్న లక్షణాలాతో విశ్వములో జీవితం గడపాలి, సేర్వేజానా సుఖినోభవంతు.      

11, జూన్ 2017, ఆదివారం

విశ్వంలో జీవితం -20

ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమ:
తనువు పిలుపు

హద్దు మీరవా  , అలక తీర్చవా, అందాన్ని ఆస్వాదించవా, ఆశయాలు నెరవేర్చు కోవటానికి, ఆశలు  తీర్చకోటానికి రావా,  ఆరాటం తగ్గించుకొని అందు బాటులోఉన్న దాన్ని అందుకోవా, మనసు అందించి, మమతను పంచి మధురాతి మధురాన్ని అందుకోవా, మది తలుపు మర్దన చేయకు, వికసించిన పువ్వు పరిమాళాన్ని అందుకోవా, మౌనం వీడవా, మోజుతీర్చవా, మొఖమాటం పడక, మలుపు మార్గం చూపవా, ముత్యపు చిప్పలో ఉన్న ముత్యాన్ని, ప్రకృతి సౌరభంలో పరవసిస్తున్న దాన్ని, ముగ్గులోకి లాగుతున్నానని అంటావా, ప్రాకృతి ధర్మాన్ని అనుసరిస్తున్నానని అనుకోవా,   అధరామృతాన్ని అందించాలని ఆశగా ఉన్నాను అందుకోవా, ఆలసించినా ఆశాభంగం అనుకోవా, వయసులో ఉన్న ఉడుకు రక్తాన్ని చల్లపరిచి పోవా.

మగువ ముఖలితభావాన్ని అర్ధం చేసుకోవా, మండుటెండల్లో మంచుకన్నా చల్లదనాన్ని అందిస్తానని తెలుసుకోవా, అర్ధాన్ని అర్ధం చేసుకొని, అనురాగాన్ని అందుకోవా, ఆదమరచి నిద్రపోక అదును చూసి ఆడుకోవా, ఆలోచన మార్చుకొని మానుకు చుట్టిన మల్లెతీగలా చుట్టుకోవా, అన్యం  పుణ్యం ఎరుగని అమాయకురాలిని గమనించావా, అహం ప్రక్కిన పెట్టి ఆనందాన్ని ఆస్వాదించుటకు ముందుకు రావా, ఆశా నిరాశలమధ్య నలిగి పోతావా, ఆకలి చంపుకొని, ఆరోగ్యం పాడుచేసుకొని ఆలస్యం చేసినా అనుకున్నది పొందలేవని తెలుసుకోలేవా, అడుగు వేసి ఆణువణువూ తనువు తపనలను తగ్గించుకో లేవా, ఆవేశాలకు అడ్డు కట్ట వేసి, అరమరికలు లేని వెన్నవంటి హృదయాన్ని, తేనెవంటి మాటలతో, వెన్నెలలో విహరించటానికి సహకరించావా.

కౌగిలింత ఆత్మీయతకు నిదర్శనమని తెలుసుకో లేవా, ఓ ఆకాశమా మేఘపు జల్లులతో ఈ తనువు చల్లార్చవా, ఓ సముద్రమా నీ కెరటములలో నన్ను ముంచేయవా, ఓ పుడమి తల్లి నా వాంఛ తీరే  మార్గం చెప్పలేవా, ఓ కాలమా నా ప్రశ్నకు సమాధానము చెప్పలేవా, సుమపరిమళాలను అందించాలను కున్నా, నా మాటలలో తప్పులుండవచ్చు నా నడకలో మాత్రం తప్పులుండవు, నా పరుగులో ఆశలుండవచ్చు కానీ నా ధ్యేయం ఆనందం అందించాలని, హర్షం ప్రకటించాలని, నా ధ్యాస ఎప్పుడు నీ మీదనే అందుకే మనసు ఉండ పట్ట లేక వ్రాస్తున్నాను లేఖ. కొంచం ఘాటుగా, కొంచం ఇష్టంగా, కొంచం వ్యగ్యంగా, వ్రాసిన నా భావాలను అర్ధం చేసుకుంటావని నీ ప్రియాతి ప్రియమైన ప్రేయసి లేఖ.                             

9, జూన్ 2017, శుక్రవారం

విశ్వం లో జీవితం - 19


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ఒకప్పుడు  - ఇప్పుడు

ఒకప్పుడు చదవని వారిని  గుంజిళ్ళు  తీయించేవారు, గోడ కుర్చీలు వేయించేవారు,  పేను బెత్తాలతో ,వీపులు వాచేవి,   
గురువులతో ఇంకా కొట్టండి మా పిల్లలకు చదువు రావాలి అనేవారు తల్లి తండ్రులు.
ఇప్పుడు చదువును కొనుక్కొనే పద్దతి వచ్చింది, డబ్బు కడుతున్నాము కదా దెబ్బ పడకుండా చదువు రావాలి అనే తల్లి తండ్రులు ఉన్నారు, చదువు రాకపోయినా పర్వాలేదు ట్యూషన్ క్లాసుల్లో కూర్చోబెట్టండి అంటున్నారు. ఇప్పుడు గురువులు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది, ఎందు  కనగా దృశ్య, శ్రవణాల ద్వారా చూపించటం జరుగుతున్నది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు పంగనామా పెట్టె పరిస్థితి వచ్చింది. ఇటువంటి విద్యా భోధన అవసరమా ?

ఒకప్పుడు నిస్సహాయునకు సహాయము చేసేవారు, ఇప్పుడు ఎవరికన్నా సహాయము చేద్దామంటే అడిగేవారు కనిపించుటలేదు, అందరు మేధావులుగా మారుతున్నారు, సహాయం పొందినవారు మరచిపోతున్నారు, చేసినవారు అడగలేక నోరు మూసుకుంటున్నారు ఈ పరిస్థితి ఎందు కొచ్చిందంటే ధన ప్రభావము పెరుగుట వలన అనేది నిజమేనా ?     

ఒకప్పుడు తెలివికి బలానికి వచ్చేది గెలుపు, ఇప్పుడు ప్రక్కవాడిని మోసం చేసో, అధికారులు డబ్బు ఆశకు లొంగి పోయి, అనర్హతలను అందలం ఎక్కించే పరిస్థితి ఉన్నది ఎందుకో చెప్పగలరా ?

 ఒకప్పుడు పిల్లలకు చెప్పే పాఠం మనకన్నా పెద్దవారివద్ద నేర్చుకోండి అనే పాఠం అనేవారు, ఇప్పుడు పిల్లలకు చెప్పే పాఠం నీ పక్క పిల్లవాడు జాగర్త, ఆ పక్క వాడు బాగా తెలివి మీరాడు జాగ్రత్త అని చెప్పే గుణ పాఠం. పిల్లలు పాఠాలు వినక సెల్ ల్లో  ఆడినా, పిల్లలను  ఏమీ అన కూడని పరిస్థితి ఉపాద్యాలకు ఏర్పడినది. 

ఒకప్పుడు లేనివాడు ఉన్నవాడిని  దోచుకొనేవాడు, ఉన్నవాడిగా బ్రతకాలని కష్టపడేవాడు. ఇపుడు ఉన్నవాడు లేనివాడ్ని చులకన చేయటం, నేనే ఇంత వాడ్ని  అగుటకు ఎంతో కష్టపడ్డాను కడుఁ కధలుగా చెపుతాడు, వాడు ఎలా సంపాదించాడో అందరికీ  తెలుసు కానీ నోరువిప్పలేని పరిస్థితి  అది ఎందుకో మీరేచెప్పగలరా? 
,  
ఒకప్పుడు మనం అనే భావన ఏర్పడి ప్రేమ పరిగేది, ఇప్పుడు ప్రేమగా పిలిస్తే నాకేంటి లాభం, లాభం లేనిచోట ప్రేమ కురిపించటం వ్యర్థం, సమయం వ్యర్ధపరచడం అనవసరం. డబ్బు  ఉన్నచోట ఒకరకమైన ప్రేమ, డబ్బు లేని చోట మరో రకమైన ప్రేమ ఇదేమి లోకం ?  
    
 ఒకప్పుడు నులక మంచమే సుఖ నిద్రకు తార్కాణం ఎందుకంటే ఒకరిమీద ఒకరికి నమ్మకమైన ప్రేమ ఉండేది, ఇప్పుడు రకరకాల పరుపులు మీద శయనించిన నిద్రరాని పరిస్థితి ఎందుకంటే శారీరానికి కష్టం కలుగట లేదు, సాధ్యముకాని,  నమ్మకము లేని ఆలోచనలతో ఉండటం వల్లనే, కాలం మారుతున్న ఆశలు పెరుగుటవల్లా సంపాదన పెరుగుటవల్లా అప్పులు పెరుగుటవల్లా   జీవితం దుర్భరంగా మారుతున్నది. 

అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే బీదవాడు బీదవాడే, ధనవంతుడు ధనవంతుడే , ఎవరి స్నేహం వారిది, ఎవరి ప్రేమ వారిది తారతమ్యం మారేదెప్పుడు, వారు వీరయ్యేదెప్పుడు వీరు   వారయ్యేదెప్పుడు లోకంలో మార్పుకోసం వేచి ఉండేటంతప్ప ఏమీ చేయలేని మధ్యతరగతి మానవులం  ఒకప్పుడు ఇప్పుడు మారలేదు ఎందుకు ?