28, జనవరి 2016, గురువారం

Internet Telugu Magazine for the month of 2/2016-5

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  

(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (5) (date 1-2-2016 to 7-2-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................



: శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:

అనంతంలో  ఆణువణువూ  ఆవరించి
అరుణోదయంతో, జాబిల్లితో  సంచరించి
అందరి అంతరాత్మలను ఉత్తేజ పరిచి
అంతర్దానంగా అందరిని ఆదుకుంటున్నా 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:
  


మాయ మంత్ర, తంత్రాలు, మదిలోకి చేరకుండా  
మనసులోని ఆలోచనలు వక్రమార్గం పోకుండా 
మదిలో తలపులు మమేకంగ ఉండి అనేకం కాకుండా 
మాయాలోకంలో మనస్సు మారకుండా ఏకాగ్రతతో ఉంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:
   


పక్రియ ప్రకంపనలకు తట్టు కొనేవిధముగ 
ప్రకృతిని అనుసరించి బ్రతికే విధంగ 
కోప ప్రకోపాల మద్య నలిగి పోకుండగ
ప్రపంచాన్ని అర్ధం చేసుకొని బ్రతకాలంటున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


జ్ఞానము, అజ్ఞానము, ఇదేనని తెలియపరుస్తున్న 
శూణ్య అనంతాలను ఆవరించిన గాలి నందిస్తున్న
క్షణం క్షణం ప్రవర్తనను మార్చుకోక ఉంచుతున్న
నిరీక్షనను తొలగించి వీక్షన శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


లౌకిక వెలుగును  లౌక్యం గా తెలుపుతున్న 
లాలి, లోలక, లోకం తలపులను వివరిస్తున్న 
లయకార లాలనలో, లాస్యం అర్ధం తెలుపుతున్న 
లంగరులా, నిలిచి లాంతరులా, శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


సర్వజీవులు, ఆద్యాత్మిక విస్పులింగాలు గాను
గర్వాన్ని అనగ త్రొక్కే  దివ్య  ప్రభోదాలు గాను
నిర్విర్యులను ఉత్తేజులుగా మార్చుటకు  గాను
మాకు ప్రార్ధించు శక్తి, ఆరాధించే శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


విద్యను భోదించే విధంలో మంచి చెడు తెలుపుతు 
నిత్య సత్యాలు ఎప్పటికప్పుడు తెలియపరుస్తు 
ధర్మాన్ని రక్షించే తేజోవంతులను సృష్టిస్తు 
సర్వం తెలిపి,  నీధామాన్ని చేరే శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


మొహానికి, శోకానికి, లొంగి కష్టాలు అనుభవించమని 
ఆశా పాశాలకు చిక్కక అతీతులుగా ఉండాలని 
అర్ధాంగి, అర్ధం, అర్ధం  చేసుకొని జీవించాలని 
లోకంలో ఆద్యాత్మిక శక్తిని పెంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


కలల కళ్ళకు కమ్ముకున్న చికట్ల తొలగిస్తు 
వయసు ప్రేమలను, ఇక్కట్లను అనుభవించాలంటు  
గుణాలకు చిక్కి అను భందాలను పంచుకోవాలంటు 
అన్నీ సమస్యల తరుణోపాయము చెప్పుతున్న   
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


సర్వ సమగ్రం ఉదాత్తమైన విజ్ఞానాన్ని విస్తరిస్తు

విశ్వవ్యాపిత స్వీయ పరిసీలన జ్ఞానాన్ని పంచుతు

వేదాలు పురాణాలు ఇతిహాసల  ధర్మాల్ని తెలుపుతు 
చర్మచక్షువులైన ప్రతిఒక్కరికి దృడ శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


శ్రీలక్ష్మి శ్రీ శ్రీనివాసా  శ్రీ కర శుభకరంగా
శ్రీ సుబ్రభాత, ప్రార్ధనా, అర్చనల పరంగా
శ్రీ పాద పుష్పాల పూజల,సేవా పరంగా
          శ్రీ పరందామా, మా మనస్సుతో ప్రార్ధించు తున్నాము           
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:
--((*))--

ప్రస్థానం (సంతృప్తి)

చక్కగా నేర్చిన విద్య
చుక్కలెన్నో అంతమందికి చేయాలి భోధ
మక్కువతో చేయు పని
ఎక్కువ పరిపూర్ణత చెంది కలుగు సంతృప్తి

భేద దృష్టి వదలి సమ
బాధ దృష్టితో దరిచేరి సంతృప్తి పరచు
ఖేదము వదలి నిజం గ్రహించి
ముదముతో చెలిమికి సుఖం పంచుటే తృప్తి


కొందరి మనసు నిండా ఉన్న కాలుష్యాన్ని 
మరికొందరి దురాశా తలుపుల్ని 
ఇంకొందరి స్వార్ధపు ఆలోచల్ని 
తరిమే మనిషి నిజమైన దేవుడు
--((*))--

ప్రస్థానం (ప్రయాణం)

ఆట పాటల జీవితం
బాల్య దశ  ప్రయాణం
విద్యా, ప్రేమల జీవితం
యవ్వన దశ ప్రయాణం

గాను గెద్దుల జీవితం
ఉద్యోగ ప్రయత్న ప్రయాణం
శ్రమతో కూడిన జీవితం
ఫలితాల కోసం ప్రయాణం

ప్రేమ ఫలిత జీవితం
సుఖ శాంతుల ప్రయాణం  
సంసారం సుఖ జీవితం
అడుగులో అడుగు ప్రయాణం

అరమరికలు లేని జీవితం
అలుపెరగని ప్రయాణం
ఆటు పోట్ల  జీవితం
ఆనందం లేని ప్రయాణం

అవస్థలు లేని జీవితం
అనురాగపు ప్రయాణం
అందరూ కొరిఉకొనె జీవితం
మనసు ప్రశాంత ప్రయాణం

పిల్లల ఉండే జీవితం
మౌన సలహాతో ప్రయాణం
ఉప్పు కారం లేని జీవితం
యోగుల జీవితం

ఒంటరి బ్రతుకు జీవితం
ఎండమావుల ప్రయాణం
పండుటాకుల జీవితం
దేవదేవుని కోసం ప్రయాణం

అనారోగ్యంగా ఉన్న జీతం
గమ్యం లేని ప్రయాణం
ఆశ, నిరాశలతో ఉన్న జీవితం
తుఫాన్ లో పడవ ప్రయాణం

శాంతి, సుఖ నిద్ర జీవితం
ప్రశాంతత లో ఉన్న ప్రయాణం
గాఢ నిద్ర జీవితం
శివసానిత్యానికి ప్రయాణం

--((*))--

ప్రస్థానం -(రాజీ )

హృదయ వేదన గమనించ లేరు
స్పర్శ మధురనుభూతి తెలుపలేరు
కళ్ళవెంట వచ్చే కన్నీరు ఆపలేరు
వయసుని బట్టి బుద్ధిని మార్చుకోలేరు

జాబిల్లిలోని మచ్చను మార్చ లేరు
నింగిలో తారాలు రాకుండా ఆపలేరు
మేఘాల కదలికలు గుర్తించ లేరు
ఏ పుట్టలో ఏ పాముందో చెప్పలేరు
 
నేల నుండి నింగిని వెతుకుట మానరు
చావుని బ్రతికించే పయత్నం మానరు
భూమిలోని ఖనిజాలను తీయక మానరు
 కాంక్షరగిలి స్త్రీని చేరినవారు నిలువలేరు

ఎడారి తుఫాన్ ఆపలేరు
ఏరువాక పొంగును ఆపలేరు
పున్నమి వెన్నెలను ఆపలేరు
అమావాస్య చీకటిని మార్చలేరు

కళ్ళకు రక్ష కను రెప్పలు
పళ్లకు రక్ష పెదాలు
కాళ్ళకు రక్ష పాదాలు
వళ్ళుకు రక్ష సిగ్గులు 

దేహ చికిచ్చ కు ఉంది మందు
మోహ చికిచ్చకు స్త్రీ యే మందు
స్నేహ చికిచ్చకు ప్రేమే మందు
స్వాహ చికిచ్చకు రాజీ మందు
 
 
Jatoli Temple, Solan, Himachal Pradesh, India


ప్రస్థానం - వసంతమా

 ఓహో ఓహో వసంతమా
ఆహా వనసౌరభాన్ని విస్తరింప చేసినావా
మహా ఋషులు మౌనమూ
మహిలో విస్తరించే మహోన్నత వసంతమా

నీ స్మృతి విహంగమై
మా మతి మధురాతి మదురమై
మా ప్రతి కదలిక స్వప్నమై
మా ఊహల పరవసానికి మార్గామైన వసంతమా
 
లేలేత చిగురుల మాధుర్యం
మనసు మమేకమైన వన వసంతమా
స్త్రీ పరవశించి తన్మయత్వంతో
పతి సానిద్యం చేరి శృంగార భావం పెంచే వసంతమా
ప్రస్థానం- (మలుపులు)

జీవితంలో ఉంటాయి మలుపులు
స్థిరంగా ఉండవు స్థితిగతులు
చేయి పట్టి పెంచిన అనురాగాలు
వయసు పెరిగిన కొద్ది తగ్గు మమకారాలు

తండ్రి కూతురు ప్రక్క ప్రక్క నడకలు
చూసి ఓర్వలేని కందిరీగల శబ్దాలు
తల్లి పిల్లలను పెంచిన, కొన్ని నయనాలు
ఆశలు చూపి, పిల్లలకు నేర్పే వక్రబుద్ధులు

నిక్కరు నుండి ప్యాంటుకు మారిణ యువకులు
కొత్త ఆలోచనలతో  పెరిగే విద్యా ప్రమాణాలు
గౌను నుండి చీర చేరిన యువతులు
కొత్త ఆలోచనలతో చేసే ప్రేమ కలాపాలు
--((*))--

 ప్రస్థానం - స్త్రీల హృదయం

స్త్రీలు  సుకుమార కుసుమాలు, ప్రతి పలకరింపు లోను పులకరింప చేసి  పరిమళాలను వెదజల్లే పారిజాతాలు, చెప్పలేనంత అనుభూతులను, ఆకర్షనలను, చీకటిని తరిమి వెన్నలను పంచి , మనస్సును ఉల్లాసపరిచే ప్రేమ సౌహార్దాల చిలకరింత లతో,  మృదు మధుర భాష్యాలతో, కిల కిల నవ్వించి, తళ తళ  మెరుపునుచూపి, మిస మిస లాడుతూ, గుస గుస లాడుతూ, భందాలను, అనుభందాలను అనేకం హృదయంలో దాచుకొని, ఓర్పుతో ఓదార్పు కల్పించి, మనస్సులోని వేడిని చల్ల పరిచి ప్రశాంతత కల్పించేది "స్త్రీ  హృదయం ".

స్త్రీ మాటలు ఇలా ఉంటా యి

ఆప్యాయతల తెనె లోలికే అప్తవాక్యం
           అనురాగాల ఆనందం పంచె వాక్యం             
ప్రేమ వరాలకు  పరవసం పొందే వాక్యం
పరిమళాల ఆకర్షణ తో చెప్పే వాక్యం

తలపుల చూపే పిలుపు
మంద హాస్య పలుకే వలపు
కను సైగతోనే  పలకరింపు
ఆలింగనంతో మై మరుపు

మనసుకు నచ్చిన మణి
ఎంత గానో చక్కని  పాణి 
ఎంత గానో  చల్లని  వాణి
మరువ లేకున్నా  రాణి

బతుకంతా పులకించి పోయే  రస రమ్య శ్రవంతి
వయసంతా సింగారంతో శ్రుంగారాల ముద్ద చామంతి
నిర్మలత్వం, జారుతనం, కలబోసిన కావ్య  కళావతి
సరళ సొగసులతో దివినుంచి భువికి వచ్చిన శాంతి


కనుల కన్నిటిలో కలువవు
కనుల వెలుగుల్లో మెరుపువు
రెప్పల పందిరిలో ప్రమిదవు
రెప్పల మాటున ఒదిగి ఉంటావు

అడుగులో అడుగేసి అనుకరిస్తావు
అడుగుల్లో చుట్టుకొనే గాలి ఔతావు
అడుగడుగునా  ప్రేమను పంచావు
తడబడ కుండా నాలో ఓదిగిపోయావు

కరముల కౌగిల్లో చిక్కావు
కరతాలముకే కరిగి పోయావు
మరువలేని భంధంగా మారావు
మరవకుండా నాలో ఒదిగి పోయావు


రాధా కృష్ణుల పలకరింపు తీరే వేరు 

యమునా తీరాన రాధ మదిలోని స్పందన
గోపాల కృష్ణుడు కొలువై పులకరించి పల్కెన
ప్రణయణీ హృదయమున పరవసించి ఉండెన
చల్లచల్ల గా రసగీతాలలో కరిగి ఉండే రాధా మోహన 

రాధిక మధుర గీతలను, మనసు పరవిసించే మమేకంతో, అమృతంపంచే అదారాలతో, ఆలపించి అనురాగాల పంచుట కొరకు, తలలో ఉన్న అపూవ్వులు పొట్టలు విచ్చి పరిమళాలు వెదజల్లుతూ తన్మయత్వంలో మునిగే  

ప్రతి రేయి కలలు కంటా
ప్రతి క్షణం నీ కోసం విరహవేదనతో
ప్రతి రాత్రి వెన్నెల వర్షం
ప్రతి నిదుర లేని రాత్రిలో తలుస్తున్నా

నాకళ్ళు కనే ప్రతి కల
నావాళ్ళు తలచే ప్రతి నిముషము
లోగిళ్ళు అంతా సంబరమ్
నావళ్ళు సిరి వెంట పోక ఉండే నీకోసం

నీకు సాటి ఎవరులేరు
నాకు నచ్చావు నన్ను వదలి పోలేవు
ఏకులా ఉండి మేకైనా ననకు
సుకుమారి నా మనసుకి నచ్చావు       

ప్రాంజలి ప్రభ -చిన్న కధ -(బాల్యంలో ప్రేమ )
ఇది ఒకనాటి సాయంకాల సమయం, చిరుజల్లు వానగా మారి, తుఫాన్ గా మారి, కుండపోత వర్షం ఏకధాటిగా కురుస్తున్నది, వీధులన్ని నిర్మానుషంగా ఉన్నాయి, కాలవులన్నీ నిండి పొంగు తున్నాయి, రోడ్లపై నీరు ప్రవహిస్తున్నది, లోతట్టుప్రాంతాలు మునిగి పోయినాయి, అక్కడక్కడ ఆగిన స్కూటర్లు, కార్లు ఉన్నాయి. ఉద్యోగం నిమిత్తం, వ్యాపార నిమిత్తం, స్కూళ్లు, కళాశాలకు వెళ్ళిన వారు వేగంగా తిరిగి వస్తున్నారు, వాల్లకోసం ఇల్లయందు  ఉన్నవారు ఎదురుచూస్తున్నరు. కొంచము వర్షము తగ్గినది.

మంగమ్మగారి మానవుడు, గారాల బాలుడు అగు “ అశోక్ “ భయంగా తడిసిన బట్టలతో ఇంటికి చేరిన వాడ్ని చూసి,  బామ్మ హృదయం భయంతో నిండి, మనస్సు, చివుక్కు మన్నది. ఎందుకురా బాబు ఇలా తడిసి వచ్చావు. మన ఇంటి ప్రక్కన ఉన్న గుడిసెలు మునిగినాయి, అక్కడ మునిగిన వారిని ఈది పడవలోకి చేర్చాను బామ్మ, వాల్ల బాధ చూస్తే నా కళ్ళు తిరిగినాయి, రెండు రోజులనుంచి తిండి లేక మిద్దెలపై ఉన్నారు, కొందరి కన్నా సహాయం చేద్దామని నాదగ్గరున్న పైకముతో రొట్టెలు కొని పంచాను బామ్మ, మరయు బాలుర మందరము కలసి వారి సహాయార్ధం పాత దుస్తులు సేకరించి వారికి పంచాము, నేను తిరిగి వస్తుంటే కరెంటు వైరుతేగి క్రిందపడి ఉన్నది, దాని త్రొక్క కుండా ఉండేందుకు అక్కడే ఉండి నా సేల్లునుండి  పోన్ చేసి వాళ్ళు వచ్చాక, నేను వచ్చాను అందుకే ఆలస్యమైనది.      రామునికి ఉడత సహాయము చేసినట్లు నేను చేసాను అంతే,   మానవసేవే మాధవ సేవ అని నీవే కదా చెప్పావు. నేను తడిస్తేనే తళ్ళ డిల్లి పోతున్నావు నీవు, వాళ్ళను  చూసి నేను సహాయము చేయుట తప్పు కాదుకదా బామ్మా.
గొప్ప వాళ్ళంటే డబ్బు సంపా దించటం కాదు కదా బామ్మ, తోటివారికి సహాయం చేయటం కదా బామ్మ. ఎంత ఎదిగి పోయావురా మనవడా అంటూ కళ్ళంబడి నీళ్లు కార్చింది బామ్మ.   అప్పుడే T .V లో వరదలో మునిగిన వారిని అశోక్ అనే విద్యార్ధి రక్షించినందుకు బాలురకు ఇచ్చే ప్రత్యేక అవార్డు ఇస్తున్నట్లు అప్పుడే తెలిపారు, బామ్మ కళ్ళంబడి నీల్లు కారుస్తూ రారా మనవాడా అని హత్తుకున్నది                        



                                         --((*))--


"ప్రేమను బ్రతికించండి పెద్దలారా"
 
కోర్టు ఆవరణ లోపల కూర్చున్నవారు మాట్లాడకుండా ఉన్నారు,  బయట ఉన్నవారు కోలాహలముగా మాట్లాడుతున్నారు. లాయర్లు హడావిడిగా లోపల కూర్చున్నారు, పొలీసులు నేరస్తులను కోర్టులో హాజరు పరుస్తున్నారు, వాది తరుఫున లాయర్ విశ్వనాద్, ప్రతివాది తరుఫున లాయర్ భారతి వాద ప్రతివాదనలు జరుపుటకు వేచి యున్నారు.

అప్పుడే రాజకీయ నాయకుడు దుర్యోధన రావు (శ్రేయోభిలాషి) ఒకరిని హత్య చేసినట్లు అభియోగం, వారు  నేరము చేసారా లేదా నిర్ధారణకు కోర్టులో హాజరు పరిచారు రక్షక భటులు. ఖచ్చితమైన సమయానికి జడ్జిగారు వచ్చిన తర్వాత కోర్టులో ఉన్న వారందరూ నుంచోవటం జరిగింది, జడ్జి గారు ఆసనమునందు కూర్చున్నాక. తరువాత అందరు కూర్చున్నారు.    కోర్టులో ఉండే గుమాస్తా ఆరోజు వివరించే కేసు వివరాలు తెలియ పరిచాడు.
దుర్యోధన రావు గారు,   దుర్యోధన రావు గారు  దుర్యోధన రావు గారు అని ఆఫీస్ గుమాస్తా పిలిచాడు.
 పొలీసులద్వారా తేబడిన ,   దుర్యోధన రావు గారు  కోర్టులో ఉన్న బోనులా ఉన్న బల్లపైకి వచ్చి నుంచోవటం జరిగింది.   అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.
లాయర్ భారతి భగవత్ గీత తీసుకోనివచ్చి, దానిపై దుర్యోధనరావు చేత చేతిని పెట్టించి,  భగవత్ గీత సాక్షి గా అంతా నిజమే చెపుతాను అబద్దము చెప్పను అని పలికించెను.
భారతి : మీకు, సుబ్బారావుగారికి లోగడ తగాదాలు జరిగినట్లుగా రోజువారి పత్రికలన్నీ తెలియపరిచాయి, అది నిజమే గదా. 
విశ్వనాధ్ : లాయర్ గారు అవసరం కాని ప్రశ్నలు వేస్తున్నారు, వెయ్యకూడదని ఆజ్ఞలు ఇవ్వగలరు.
భారతి : సుబ్బారావుగారి కుమారుడే చనిపోవటం జరిగింది, అందులో దుర్యోధనరావుగారి ఇంట్లోనే  జరిగింది.
జడ్జి : మీ అభ్యంతరం తొలగించటం జరిగింది
భారతి : ఆర్ధిక వ్యవహారాలలో మా యిద్దరిమద్య తగాదాలు వచ్చిన మాట వాస్తవము కదా,  రాజకీయములో  వ్యతరేకులు అవునా కాదా.
దుర్యోధన్ రావు: మాఐద్దరిమద్య తగాదాఉన్న మాట నిజము, రజకీయములో వ్యతరేకులము. 
భారతి : ఐతే మీరు పాత కక్షలు పెట్టుకొని వారి కొడుకుని హాత్యచేసారు, నిజమా కాదా చెప్పండి
దుర్యోధన్ రావు: హత్య మాయింట్లో జరుగటం మా దురదృష్టం, నేను హత్య చేసానని అభివాదము మాత్రమే, ఈ హత్యకు నాకు ఎటు వంటి సంభందము లేదు.
భారతి : నిజం చెప్పండి, మా దగ్గర ఆధారులున్నాయి మీరే హత్య చేసినట్లు
విశ్వనాద్ : మా క్లైన్టును ఆధారాలు లేకుండా వత్తిడి చేస్తున్నారు.
భారతి : అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇవిగో జడ్జి గారికి సమర్పిస్తున్నాను, (వేలిముద్రలు రిపోర్ట్ ఇచ్చిన సర్టిఫికేట్, హత్యకు ఉపయోగించిన పరికరము ) .
జడ్జి : మీరు చెప్పుకోవలసిన విషయమేమైనా ఉన్నదా
దుర్యోధన్ రావు: మేము హత్య చేయలేదు, అది మాత్రం నిజం, హత్య చేయుటకు కారకు లెవరో నిర్దారించి శిక్ష వేయగలరు.
భారతి : మీరు ఇచ్చిన డ్రింక్ త్రాగుట వల్ల చనిపోయినారాని మాదగ్గర ఉన్నా ఆధారాలు తెలుపుతున్నాయి. ఇంతకీ మీరు రఘురాం కు డ్రింక్ ఇచ్చారా లేదా
దుర్యోధన్ రావు: డ్రింక్ ఇంచ్చింది నేనే, నేను ఇచ్చిన తర్వాత గుండె నెప్పి వచ్చిందనగా మేమే హాస్పటల్లో చేర్పించాము, ఆ తర్వాత చనిపోయారు. నేను మాత్రము తప్పు చేయలేదు.
భారతి : నేరాన్ని వప్పుకున్నారు కనుక శిక్ష విధించగలరు.
విశ్వనాధ్ ; మా క్లైంటు ను ప్రశ్నిమ్చుటకు అనుమతి కోరుచున్నాను
జడ్జి : అనుమతి మంజూరుచేయుట మైనది. 
విశ్వనాధ్ : దుర్యోధన రావు గారు మీరు స్వయముగా డ్రింక్ త్రాగమని ఇచ్చారా అవి ఎక్కడనుండి తీసి ఇచ్చారు. 
దుర్యోధన రావు :  ఎప్పుడుకలిపి ప్రిజులో పెట్టుకుంటూ ఉంటాము, అది అంతా నా శ్రీమతి చేస్తుంది. లేదా వంట మనిషి చేస్తున్నది. 
విశ్వనాధ్ : :వాళ్ళు ఏమైనా విషం కల్పి ఉండవచ్చు కదా, మరి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి, వారిని కూడా కోర్టులో ప్రస్నిమ్చుటకు అనుమతి కోరుచున్నాను. 
 జడ్జి : అనుమతి మంజూరు చేయుట మైనది.
దుర్యోధన రావుగారి భార్య భాగ్యం : ముందుగా తయారు చేసినది ఇచ్చాము మరిమీరు త్రాగారా 
తర్వాత మేము త్రాగము మాకు ఏమికాలేదు, కేవలము రఘునాద్ త్రాగిన గ్లాసులో మాత్రమె పాయిజన్ కల్పినట్లు  గుర్తించారు. కదా, మీరు కల్పి ఉండొచ్చు కదా. 
మా యింటికి అనేకమంది వస్తున్నారు , మేము అందరికి అట్లాగే ఇస్తాము, ఎప్పుడు ఈ విధముగా జరగలేదు. 
మరి ఇప్పుడు జరిగింది కదా మీ సమాధానము
నేను చెప్పేది ఒక్కటే ఈ మరణానికి మాకు ఎట్టి సంబందము లేదు, పూర్తి వివరాలు పొలీసువారు సేకరించి మేము నిరపరాదులమని గుర్తించగలరు అని మేము జడ్జి గారిని కోరుచున్నాము. 
పనిమనిషి కూడా ఇదేవిధముగా చెప్పటము వలన చావుకు కారణము త్రాగుట వలన మాత్రమే  అని తెలుసున్నది. ఎందుకు ఇచ్చారో మాత్రం తెలియుట లేదు కనుక
విశ్వనాద్ : మా క్లైంట్ కు మీరు జామిన్ ఇచ్చి, పూర్తి వివారాలు సేకరించుటకు తగిన సమయము ఇవ్వవలెనని కోరుచున్నాను. మరియు పొలీస్ అధికారిని ప్రశ్నలు అడుగుటకు అనుమతి కోరుచున్నాను.

పోలీస్ అధికారి:మీరు ధుర్యోదన రావు గారిని అరెష్టు చేయుటకు కారణాలు చూపారా అని అడిగాడు విశ్వనాద్. 
సమాచారము అందగానే మేము హాస్పెటల్ కు పోయాము అక్కడ రఘురామ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.  నేను డ్రింకు త్రాగుటవల్ల నా ఆరోగ్యము చెడినది అని చెప్పి మరీ చనిపోయాడు కనుక  మేము అరెష్టు చేసి కోర్టులో ప్రేవేశ పెట్టితిమి, డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఇందు పొందుపరిచాము. 
విశ్వనాధ్ : జడ్జి గారు తమరు ఈకేసు నిమిత్తము  పూర్తి సమాచారము అందలేదు, కనుక పూర్తి సమాచారము  అంద  చేయ మని పోలిసువారిని కోరవలెనని విజ్ఞప్తి చేయుచున్నాను. ఈకేసు వాయిదా వేయవలెను కోరుచున్నాను 
జడ్జి : ఈకెసు పూర్తి వివరాలు పొలీసువారు పరిసీలించి తదుపరి వాయిదా వచ్చేనెల ఒకటవతారీఖునకు మార్చటమైనది. కోర్టు సమయమైనది అని జడ్జి గారు లేచారు , అందరూ లేచారు. 

పోలీస్ ఆఫీసర్ దుర్యోధన ఇంటికి చేరి అంట పరిసీలించుట మొదలు పెట్టారు, అక్కడ ఉన్న ప్రతి వస్తువును కదిలించి, ఏదైనా ఆధారము దొరుకుతుందేమోనని వెతికారు, గోడలన్నీ తెల్లగా రంగు వేసి ఉన్నాయి, ఇల్లు చాలా పరిశుబ్రముగా ఉన్నది, అక్కడ ఒక కుక్క కూడా ఉన్నది, అది పోలీసులను చూసి తోక ఆడిస్తూ వెనక వచ్చింది, అందరి సెల్లులు తీసుకున్నారు. డ్రాయర్ సొరుగులో కొన్ని పనికిరాని సెల్లులుకూడా చూసారు వారు, వాటినికూడా తీసుకొని వెళ్ళారు . 
పనికిరాని సెల్లులను తసి ఓపెన్ చేయగా, ఒక సెల్లులో రఘురాం చనిపోకముందు రండు రోజులు క్రింద, ఒక మెడికల్ షాపుకు ఫోన్ చేసినట్లు గమనించారు. వెంటనే మెడికల్ షాప్ గుర్తించి గట్టిగా అడుగగా, ఒక స్త్రీకి పాయాజన్ అమ్మినట్లు తెలిపారు వారు . ఆస్త్రీ  ఎవరో గుర్తుపడతార అని అడగగా, గుర్తు పట్టలేమని చెప్పారు. మరల వచ్చి దుర్యోదన్ రావు గారి ఇంట్లో కొత్తవారు ఎవరోచ్చారని విచారించగా దుర్యోదన్ రావు గారి కూతురు స్నేహితురాలు  వచ్చినట్లు గమనించారు. ఆమె అడ్రస్ తీసుకొని వివరాలు వేతకగా ఆమె చనిపోయిన రఘురామ్  కాలేజీలొ బీటెక్ చదువు తున్నట్లు గమనించారు, వెంటనే కాలేజికి వెళ్ళగా, ఆమె కలెజీకి రావటము లేదని గ్రహించారు. ఆమె బెంగళూర్ వెళ్లినట్లు గుర్తించారు. బెంగళూర్ వెల్లి  తెలుసుకొనగ తండ్రికి సిరియన్ గా ఉండుటవల్ల అక్కడే ఉన్నట్లుగా గమనించారు. 

పోలీస్ లు అడిగిన ప్రశ్నలకు ముక్తిసరిగా సమాధానము చెప్పగా ఎమీ ఫలితము లేదని గ్రహించి పోలీసులు వెనక్కి తిరిగి వచ్చారు. 
పోలీసులు చివరాగా చనిపోయిన రఘురాం ఇంటికి వెళ్లి సుబ్బారావు గారిని వివరాలు అడిగారు. రఘురాంకు పెళ్లి నిశ్చయమై, నిశ్చయ తాంబూలములు కూడా తీసుకునట్లు తెలిపారు. 
పోలీసుల అన్నివివరాలు గ్రహించి కోర్టులో వాయిదా సమయానికి వారు తెలుసుకున్న వివరాలు కోర్టులో హాజరు పరిచారు. 

కోర్టులో దుర్యోధన రావుగారు హత్య చేసినట్లు పెద్ద ప్రకటన పాపర్లో ప్రకటించారు, ఈ రోజే శిక్షి పడుతుందని వ్రాసి ఉన్నది. 
కోర్టులో జడ్జిగారు కూర్చొన్నారు. 
జడ్జిగారు తీర్పు చదువుతున్నారు. అందిన ఆధారాలు ప్రకారముగా నేరము చేసినవారు అంటున్నప్పుడు, అప్పుడే ఒక లెటర్ జడ్జి గారికి అందినది అది రాష్ట్ర గవర్నర్ నుండి వచ్చినది. 

ఈ హత్య కేసులో ముఖ్య సాక్షి ఈలెటర్ తెచ్చినవారు వారి అభిప్రాయలు తెలుసుకొని తీర్పు చెప్పగలరు అని వ్రాసిఉన్నది. 
ఈఉత్తరము తెచ్చినవారు ఎవరు అని తెలుసుకొని, సాక్షిగా పిలిచారు. 
అప్పుదే భారతి లాయర్ లేచి వచ్చిన వ్యక్తి మీకు తెలిసిన వివరాలు  చెప్పమని కోరారు. 
" నేను భగవత్ గీత మీద ప్రమాణము చేసి అంతా నిజమే చెపుతాను,. అబద్ధము చేప్పను". నాపేరు జానకి అందరూ జానీ అని పిలుస్తారు, ముఖ్యముగా నేను చెప్పునది, నేను రఘురాం ప్రేమించుకున్నాం, మేమిద్దరం రిజిష్టర్  మ్యారేజ్ చేసుకుందాంమనుకున్నాం దానికి కారాణం రఘురాం తండ్రిగారు మా పెళ్ళికి ఒప్పుకోలేదు, మా నాన్న కూడా ఒప్పుకోకుండా వారికి ఆస్తి బాగా ఉంది, మనం మద్యతరగతి వాళ్ళం మనకి వాళ్లకు తగదమ్మా అని హెచ్చరించారు, మా అమ్మగారు పోయినప్పటి నుండి మానాన్నగారు చాలా చితికి పోయారు, ఒకరోజు నేను మానాన్నను వెంట పెట్టుకొని సుబ్బారావుగారి ఇంటికి వెళ్ళగా, ఆయన మా అబ్బాయికి వేరే పెళ్లి  చేస్తున్నాము మీరు గొడవ పెట్టకండి అని గట్టిగా అని మమ్ము ఇంట్లోనుండి బయటకు పనివానితో నెట్టించాడు. దానితో మానాన్నగారు మనస్తా పానికి గురియ్యారు, ఆ పరిస్తితిలో ఏం చేయాలో తోచక రఘురాం కలిసాను, అప్పుడే నన్ను మర్చిపో, నీ దారినీవు చూసుకో అని గట్టిగా చెప్పాడు. వెంటనే నేను మానాన్నను ఇంటిదాకాదించి, (నా స్నేహితురాలు జయశ్రీ దుర్యోధన రావుగారి కూతురు) వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడూ వెల్తూ ఉంటాను.  ఆరోజు అనగా రఘురాం చనిపోయే ముందు రోజు, సుబ్బారావు గారి ఇంటి నుండి ఫోన్ చేసినా రఘురాం అన్న మాటలకు (నా వ్యక్తిత్వాన్నే అనుమానించాడు) మగవాళ్ళందరూ ఇలాంటి వారేనని  భరించలేక నేను ప్రాణాలు తీసుకోదలచి విషం తెచ్చి గ్లాసులో కలిపి త్రాగుదామని అనుకునప్పుడే మా నాన్నకు సీరియస్ గా ఉన్నది ఫోన్ వచ్చింది, ఆ గ్లాసును అక్కడ ఫ్రిజులో పెట్టి వెళ్ళాను, మరలా వచ్చి త్రాగుదామని. మానాన్న గారి పరిస్థితి బాగుగా లేనందువల్ల రాలేక పోయాను, ఆ గ్లాసునే తెలియక దుర్యోధన రావుగారు నేను ప్రేమించిన రఘురాంకు ఇవ్వటం జరిగింది, నేను చావాలనుకున్న ఆతను చనిపోయాడు

మనం దేవుడు ఆడిస్తున్నట్లు ఆడటమేతప్ప మనమందరం నిమిత్త మాత్రులం.                       
లాయర్ : విషం కలిపింది ఎవరో నిర్దారణ అయినది ఈ పాయింటు నొట్ చేసుకోండి, కాబట్టి దుర్యోధన రావుగారికి ఎటువంటి సంభందము లేదని నిర్ధారణ అయినది. 
జడ్జి : మీరు చావాలనుకోటానికి కారణం ప్రేమ అని అనుకోవచ్చా, మరిఎదైన కారణమా అన్న మాటలకు
జానకి నా ప్రేమ నలుగురు వేలెత్తి చూపకముందే నేను బ్రతక దలుచుకోలేదు అంటూ, ప్రేమను బ్రతికించండి పెద్దలారా అని ఒక్కసారి బోనులో వరిగి పోయింది, అందరూ నుంచొని చూస్తున్నారు జానకి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి.
ప్రేమ పక్షులు నేలకోరిగినాయి నేరస్తులు ఎవరు ?
 అతి ప్రేమ, ఆవేశం ప్రాణానికి చేటు – ఆలోచించి అందరూ సహకారం అందిస్తే చావు దగ్గర పడ్డ వాన్నికూడా బ్రతికించవచ్చు             
--((*))--
   

21, జనవరి 2016, గురువారం

Telugu Internet Magazine- forthe month of 1/2016-4

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (4) (date 22-1-2016 to 31-1-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, మరియు నా భావాలు  
...........................................................................................................



మెరుపుని చూడాలంటే నింగిలో ఒక్క క్షణం
పువ్వు పరిమళాలు పీల్చాలంటే ఒక్క క్షణం
కొవ్వును కరిగించాలంటే ఇప్పుడు ఒక్క క్షణం
అమ్మాయి ప్రేమ పొందాలంటే ఎంతో కష్ట తరం   
 

ప్రస్థానం –5
మనసుని దోచి, మురిపించే కృష్ణ
నీ కై తపిస్తూ వేచియున్నది ఈ రాధా
నీ ప్రేమను మరువలేకున్నాను కృష్ణ
విరహాగ్నిలో ఉంచి నవ్వుతవా కృష్ణ

నా హృదయ సామ్రాజ్యాని ఏలే కృష్ణ
సర్వం నీకు అర్పించాలని ఉండి కృష్ణ
నా తపనను అర్ధం చేసుకోవా కృష్ణ
నా తపస్సు ఫలంగా దక్కవు కృష్ణ
 

తమకంతో ఫలింప చేయవా కృష్ణ
జాగుచేయక రావా మోహణ కృష్ణ
ప్రతిరేయి నీకోసం వేచిఉన్నా కృష్ణ
నీ ఆరాధనే నాకు సర్వ రక్ష కృష్ణ
 


--((*))--



ప్రాంజలి ప్రభ - చిన్న కధ

-చెప్పటం తేలిక, ఆచరణే కష్టం,
 . 
ప్రతిఒక్కరు తమ తాహతుకు తగినవాటికి ఆశపడటం తప్పుకాదు. పంట వేసిన రైతు ఫలసాయం కోసం, పెళ్ళయిన పడుచు బిడ్డ కోసం,బాగా పరీక్షలు రాసిన విద్యార్ధి మంచి ఫలితం కోసం, పెళ్ళి చూపులలో చూసొచ్చిన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోవాలని పెళ్ళికొడుకు, ఆశపడటం తప్పుకాదు. 

అదేమిటి! అబ్బాయి కదా ఒప్పుకోవలసినది అనద్దు, ఆ రోజులు పోయాయి, ఇప్పటి రోజుల్లో అమ్మాయి ఇష్టపడితేనే పెళ్ళి, లేకపోతే హళ్ళికి హళ్ళి, సున్నాకి సున్నా, అదీ నేటి పరిస్థితి. మొన్ననొక పెళ్ళి సంబంధం చూశాము, అమ్మాయి ఒక పట్నంలో పని చేస్తూఉంది, అబ్బాయి మరొక పెద్ద పట్నం లో పని చేస్తున్నాడు, అన్నీ నచ్చేయి కాని అమ్మాయి అంత దూరం వెళ్ళి కాపరం చెయ్యను, అని కచ్చితంగా చెప్పేసింది, మరి ఇప్పుడు డిమాండు అమ్మాయిలదా? అబ్బాయిలదా?. పెళ్ళి కొడుకులు అమ్మాయిల ముందు" క్యూ "కడుతున్నారు. రేపో నేడో, అమ్మాయిలు కన్యాశుల్కం అడిగినా అశ్చర్య పోనక్కర లేదు. ఈ పోకడలు వెర్రి తలలేస్తున్నాయి. 
వరకట్న మెంత దురాచారమో కన్యాశుల్కం కూడా అంతే దురాచారం. 
దారి తప్పేం. 

ఆశ పడిన ఫలితం దక్కనపుడు నిరాశ పడటం సర్వ సహజం. దురాశ, పేరాశలకి ఫలితం ఎప్పుడూ నిరాశే. ఆ ఫలితంగా వచ్చే నిరాశకి మందు లేదు. నైజ గుణానికి లొట్టకంటికి మందులేదని నానుడి కదా. ఇల్లా పేరాశ, దురాశలకి పోతే మిగిలేదెప్పుడూ నిరాశే. సహజమైన, ధర్మమైన కోరిక నెరవేరనపుడు కూడా నిరాశ జనిస్తుంది, సహజం. నిరాశ నుంచి దుఃఖం పుడుతుంది, నిరాశను, దుఃఖాన్ని కూడా అనుభవించాల్సిందే. జీవితంలో అన్నీ అనుభవించాలి, తప్పదు. సంతోషం, విచారం, కోపం, ఆశ, నిరాశ ఇలా అన్నీ అనుభవించక తప్పదు. ఐతే నిరాశ లో పడి కొట్టుకుపో కూడదు. కష్టము, సుఖమూ, ఏదీ నిలిచి ఉండిపోదు. ఎప్పుడూ సుఖమే ఉండదు, నిరాశలో కూరుకుపోరాదు. 

ఒక్కొకప్పుడు అన్నీ సవ్యంగా ఉన్నా ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది. అదే విధి వైపరీత్యం అంటే. దానినేమీ చెయ్యలేము. అప్పుడను కోవలసినది,  ఈ వ్యతిరేక ఫలితం  కూడా మన మంచికోసమే జరిగి ఉండచ్చు, మనకి తెలియని ఆపద భగవంతుడు చేసిన ఏర్పాటిది అనుకుంటే మానవుడు ముందుకు సాగగలడు. లేకపోతే నిరాశ, దుఃఖాలలో కూరుకు పోయి, మరి తేరుకోలేడు. కష్టం కలిగినపుడు నిర్వేదం కలుగుతుంది, ఈ నిర్వేదం నుంచి జీవితానుభవం కలిగిన పెద్దలు ముందు బయట పడి, పిన్నలకు ధైర్యం చెప్పాలి.మార్గదర్శనం చేయాలి. 

లంకలో ఉండగా తనను వెతుకుతూ వచ్చిన హనుమతో సీతమ్మ ఇలా అంటుంది, 
 ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే, 
రజ్జ్యేవ పురుషం బద్ధా కృతాంతః పరికర్షతి……. రామాయణం. సుందరకాండ. ౩౭వ సర్గ…౩ 
అనగా సమృద్ధిగా ఐశ్వర్యము కలిగినపుడేగాని, దారుణమగు కష్టము కలిగిన సమయముననేగాని, పురుషుడెంత మాత్రము స్వతంత్రుడు కాడు. దైవము వానిని త్రాటితో కట్టినట్లు పట్టి ఈడ్చుకుపోవును. 

చెప్పటం తేలిక, ఆచరణే కష్టం, కష్టంలో ఉన్నపుడే, మనిషి గుణం తెలిసేది, ధైర్యం,నమ్మిక, ఆశ, కావాలి. చెప్పడం కాదు ఆచరించాలి,ఆచరించి చూపాలి, అప్పుడే పెద్దరికానికి విలువ, ఫలితం, కావలసినవారికి ధైర్యం చెప్పాలి, కష్టం గట్టెక్కాలి.

--((*))--
 
ప్రాంజలి ప్రభ - చిన్న కధ -నాయకుడిగా మారాలి ఎలా ?
నాన్న గారు నేను మన నగర, మన ప్రాంత, వార్డ్ కార్పోరేటర్ గా నన్ను అందరూ పోటి చేయమంటున్నారు. నేను ముందుగా నిన్ను అడిగి నీ అనుమతితో నేను పోటి చేయాలను కున్నాను. నీ పురోభివృద్ధికి నేను అడ్డు పడను, కాని నేను కొన్ని విషయాలు చెప్పగలను “చెప్పిన మాట చెప్పకుండా చెప్పాలి, ముసలి కన్నీరు కార్చాలి, ఏదడిగినా అన్ని నేను గెలిచిన తర్వాత చేస్తానని చెప్పాలి, మనకులాల వారితో పాటు, అన్నికులాల వారిని మంచిగా పలకరించి వారి సమస్యలకు న్యాయం చేయాలి, ఎట్టి పరిస్తితిలో న్యాయంగా సంపాదించిన డబ్బు ఖర్చు చేయాలి, అవసరమైతే ఇంట్లో ఉన్నవి అన్నీ తాకట్టు పెట్టి మరియు పుస్తెలు కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడ కుండా ఉండాలి, దేవుడ్ని నమ్మినా నమ్మక పోయినా ప్రజలకు నమ్మకముగా పలకరిస్తూ ఎ ఎండకు ఆగోడుగులా, ప్రతి మనిషికి వెంటాడే నిడలా, ఉండేవాడే నాయకుడు, అట్టివాడే పోటి చేయాలి.


నీకు నిద్ర ఉండదు, సమయానికి తిండి ఉండదు, అవసరమైనప్పుడు మందు త్రాగాలి, మాలు చెప్పి బ్రతకాలి, వాటాలు పంచుకోవటానికి అలవాటు పడాలి, నల్ల డబ్బు, నీవు ఆడగ కుండా, నీ వెంట పడుతుందని గమనించాలి. కనీసము అధికార పార్టిగాని, ప్రతిపక్ష పార్టి గాని తోడుగా ఉండాలి. ఎ పార్టిలేక పోయిన నీ తల్లి తండ్రుల ఆస్తి గాని, తాతల ఆస్తి గాని ఉండి తీరాలి, దానిని ఖర్చు చేసే దమ్ము ఉండాలి. 


అటువంటివి నీ దగ్గర లేవు, నీవు కష్టపడ్డ అందరికి తిండి పెట్టలేక పోతున్నావు. మరి నీవు అన్నిటిని భరించి నేను పోటి చేస్తాను అంటే నాకు ఏమి అభ్యంతరం లేదు. ఇంతకన్నా నేను చేపవలసినది ఎమీలేదు, మరిచాను ముఖ్యముగా నీ భార్య అనుమతి నీ పిల్లల,  అనుమతి తీసుకొని పోటి చేయి అన్నాడు తండ్రి.


నాన్న నీమాటలు నేను అన్ని విన్నా ఈ రోజు నుండి నేను మన తోటివారికి సహాయము చేస్తూ జీవిస్తాను,ఇప్పుడు మాత్రం నేను పోటి  చేయను, నేను ఎండా కాలములో చలివెంద్రాలు ఏర్పాటు చేస్తాను, స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంచుతాను,  మనకాలనీకి బస్సు సౌకర్యం కొరకు, మనవీధిలైట్లు ఏర్పాటుకు, మంచి నీరు లేని చోట త్నాక్ తెప్పించి నీరుఅందిస్తాను, ప్రతిఒక్కరితొ స్నెహ పూర్వకముగా పలకరిస్తూ వారి సమస్యలు పరిష్కారాని నా వంతు సహాయము చేస్తాను, భవిషత్తులో నాయకుడుగా ఎదగటానికి పునాది ఏర్పరుచ కుంటాను. నా కళ్ళు తెరిపించినందుకు నీకు పాదాభి వందనములు అంటూ నమస్కరించి, కొడుకు తను రోజు అమ్మే కూరకాయల  దుకాణములో కూర్చున్నాడు. వ్రేలాడుతున్న  త్రాసు వంక అదేపనిగా చూస్తున్నాడు. ధర్మాన్ని నిలబెట్టాలి అని ఆలోచిస్తున్నాడు                         --((*))--    
         
   నేటి కధ 
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

విద్యార్దులార మనోధైర్యముతో జీవించాలి



విద్యార్ధి దశ మానసిక వత్తిడులు లేని, విద్యాభి వృద్ధి కొరకు  నిరంతరం పట్టుదలతో, మనోధైర్యంతో దేశప్రగతి కోసం మన వంతు సహాయం చేయాలని, కుటుంబ వృద్ధి కొరకు చేయూత నివ్వాలని, నిజాయితీగ ఉద్యోగము సంపాదించాలని  మనస్సుతో ఉంటుంది.   కాని కొందరు విద్యార్ధి దశలో ఆశయాలతో, ఆశలతొ చదువుతారు, కాని వారిని గుర్తించటం జరుగక మనస్సు వత్తిడికి గురికావటం జరుగుతుంది. 

విద్యార్ధులను రాజకీయ నాయకులు ప్రలోభాలకు, తాత్కాలిక అవసరాలకు పావులుగా మారి విద్యను నాశనం చేసుకుంటున్నారు. కులాల ప్రాతిపతికగా, విద్యా ప్రాతిపదితగా, ధన ప్రాతిపదికగా సంఘాలు ఏర్పాటుకు కొందరు నాయకులు సహకరిస్తిన్నారు ఆ సంఘాలలో విధ్యార్ధులు చేరి అమూల్యమైన జీవితమును నాశనం చేసుకుంటున్నారు .




యూనివర్సిటీ లో కూడా కొందరి విద్యారుల కోర్కల కోసం నిరాహారదీక్షలు చేస్తున్నారు వాటిని  పరిష్కరించకుండా బహిష్కరించటం జరిగింది,  కొన్ని నిషేధాజ్ఞలు విధించటం జరిగింది . (స్నేహితులతో కలవకూడదు, హాస్టల్లో భోజనం చెయకూడదు, బయట తిరగకూడదు, ఇంకా మరికొన్ని విధించారు ఇవి ఎ చట్టంలో ఉన్నాయో ఎవరికీ తెలియదు ). ప్రభుత్వం వారు ఎటువంటి పరిష్కారం చేయకుండా ఉన్నారు, విద్యార్దులు నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించు కోలేదు, అటు వంటి పరిస్థితిలో ఒక విద్యార్ధి తనకు న్యాయం చేయమని స్థానిక మంత్రిగారికి ఉత్తరం వ్రాస్తే అది రాజకీయం చేసి యూనివర్సిటీ అధికారి వత్తిడికి కారణం గా మారినది, కోర్టుకు వెళ్లితే పరిష్కారము చేయక వాయిదామీద వాయిదా వెస్తూ కాలయాపనచేసారు. విద్యార్ధులు మనస్తాపం చెందారు, అందులో ఒక విద్యార్ధి మానసిక వత్తిడికి లోనై మరల (నా చావుకు ఎవ్వరు కారకులు కారు అని) ఒక ఉత్తరం వ్రాసి ఆత్మ హత్య చేసుకున్నాడు, దీనికి భాద్యులు ఎవ్వరు ?1 పరిష్కారము చూపని ప్రభుత్వమా,.2.  తీర్పు చెప్పని న్యాయస్థానమా, 3. యూనివర్సిటీ అధికారులా, 4.. లేక పెంచిన తల్లి తండ్రులా మరి ఎవరో మీరె చెప్పండి .


ఇప్పటికైన కళ్ళు తెరవండి విద్యర్దులారా, కొందరికి పావులుగా మారకండి, తల్లి తండ్రులు  చదివిస్తున్నారు వారి కల లను వమ్ము చేసి ఆత్మ హత్య చేసుకోకండి, ఎటువంటి కష్టము వచ్చిన దానికి పరిష్కారము ఉంటుంది, ఆవేసాని కి పోయి ప్రాణాలు తీసుకోకండి,   బ్రతి కుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు అనే సామెత ఉండనే ఉన్నది. విద్యార్దులారా నేను చెప్పేది ఒక్కటే  విద్యవల్ల దేశ పురోగతికి, కుటుంబాన్ని ఉన్నతిస్తితిలో ఉంచుటకు పనికొస్తుంది , క్షనికావేసానికి లోనయై మరణాలు తీసుకోకండి .  
--((*))--
  

"ఈ జీవన తరంగాలలో...!!"
తండ్రి "శ్రీ రామ్ " తో కొడుకు "బ్రహ్మానందం " ....
"నాన్నా !! స్కూల్ లో బోర్డు మీద రాస్తు చెపుతున్నవి వినబడుట లేదు....
సెల్ కొని ఇవ్వు నేను రికార్డు చేసుకొని వింటాను "
"శ్రీ రామ్"..
"ఆ మాత్రం దానికి సెల్లు  ఎన్దుకూ..టీచర్నే రికార్డు చేసి ఇమ్మంటా "
భార్య "దేవి "...
"ఏమండీ !! పిల్లలతో మాట్లాడాలి సెల్ కొని ఇవ్వండి  ,
"శ్రీ రామ్ "..
"ఆ మాత్రం దానికి సెల్ ఎందుకు 1రూ . పెట్టి పబ్లిక్ ఫోన్ మాట్లాడవచ్చు కదా ...
...సరేనా!!
అత్తగారు "సూర్యా కాంతం "
"అల్లుడూ...దూరానివి వినబడుట  లేదు ....కాస్త, ఒక వినే మిషన్  కొనిపెట్టు బాబూ...నీకు పుణ్యం వుంటుంది!!"
"శ్రీ రామ్ "
"హబ్బా!! అలాగేం!!.... అందరి  మాటలు వినేటట్లు  అమిషణ్ నీకు కొని తెస్తా, కాని ఒక షరతు మీరు మాటలు మాట్లాడ కూడదు వినవచ్చు
అట్లాగైతేనే - సరే అదే చెయ్ ఇప్పుడు మాత్రం ఎవరితో మాట్లాడుతున్నాను పోట్లాడుతున్నాను తప్పా    

కాలచక్రం 20 సం.లు గిర్రున తిరిగాయి!!!!
"ఒరేయ్ !! "బ్రహ్మా నందం "......
100 రూ.ల నోటుకి...500 రూ.ల నోటుకి బొత్తిగా తేడా కనిపించడం లేదు...ఈ మధ్య!!
ఓ సారి డాక్టర్ వద్దకు వెళ్లి కళ్ల జోడు తీసుకుందామా ??
కొడుకు ""బ్రహ్మా నందం  ".....
ఇప్పుడు నీకు కనిపించక పొతే వచ్చే నష్టం ఏమీ లేదు లే...
ఆ డబ్బు ఇలా ఇయ్యి...నేను లెక్కపెట్టి ఇస్తాను....
ఆ మాత్రం దానికి కళ్ల జొడెన్దుకూ!!"

--((*))--

TS Eamcet 2016 Web Options Dates Telangana|AP,TS/Telangana  Deecet Web Counselling,Web Options,SSC,Inter Exam Time Table 2016  




  

11, జనవరి 2016, సోమవారం

సంక్రాంతి స్పెషల్ for the month of january 2016-3


ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (3 ) (date 15-1-2016 to 2 1-1-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
H.No 6-18-13,.సుబాష్ నగర్, నిజామాబాదు, తెలంగాణ, ఇండియా   .........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు,
నా మైల్ కు  వచ్చే కధలు, మరియు నా భావాలు  
...........................................................................................................

సంక్రాంతి స్పెషల్
శివ శివ అనరా
శివ శివ శివ అనరా
శివమెత్తి ఆడరా, మధాన్ధులపై పరమ
శివ తలచి నడవరా
శివుడే శ్రావ లోక రక్షకుడని గ్రహించారా

హర హర హర అనరా
హరిహరాదులను ఆదుకొనుటే రక్షరా
వరి అన్నము మేలురా
సరియైన మార్గలో నడక సాగించురా

భవతీ బిక్షం దేహి అని
భవ్యమైన చరితను అర్ధించాలిరా
భవ భందాలు వదులురా
భవానీని ఆశ్రయించి ముక్తి పొందాలిరా

రుద్రావతారుడు అందరి
నిద్ర మత్తు వదిలించి ధైర్యవంతులుగా,
ప్రదాతగా ఉండి శక్తి పంచె 
విధాతే కలియుగాన అభయాంజనేయుడురా   
--((*))--


 చిన్న కద :నీ సంతోషమే అందరి సంతో షము
ఏమిటక్కా అంత దిగులుగా ఉన్నావు, " కూతురికి రంగ రంగ వైభవంగా పెళ్లి చేసాము " కాని కాపురము చేయించ లేక పోయినాము. ఇటు వైపు మీ బావగారు, అటు వైపు మా అమ్మాయి అత్తగారు పంతంతో ఉన్నారు. కారణం చిన్నది, తెగ తెమ్పుల దాకా లాగుతున్నారు. ఏంచేయాలో తోచుటలేదు.

అసలు ఎం జరిగిందో చెప్పు అక్క
పెళ్ళిలో చిన్న సంఘటన జరిగింది, పెళ్లి చివరిలో అందరూ భోజనం చేసేటప్పుడు అమ్మాయిని అత్తగారు, అన్ని తినాలి అని అందరి మందు గట్టిగా అరిచింది, అంతటితో ఊరుకోకుండా “చాతకాని దద్దమ్మ అని కొడుకుని తిట్టింది” మా అబ్బాయి తినమన్నా తినవేమి అన్నది, అత్తగారి మాటలుకు అప్పుడే ఎమీ తినకుండా లేచింది.
అప్పుడే అల్లుడు శిరీషను బ్రతిమాలాడాడు, మీ అమ్మ సారి చెప్పితే నేను వచ్చి ఏదైనా తింటాను అన్నం తప్పా.
మా అమ్మ సారి చెప్పనంటున్నది నేనేం చేసేది, ఇప్పటిదాక మీ అమ్మ చెప్పినట్లు ఆడావు, నేనోచ్చాక కూడా తలాడిస్తావెందుకు, ఎందుకె నీ కంత పొగరు అంటూ చేయి చేసుకున్నాడు కోపంతో భర్త, పెళ్లి నాటి రాత్రి.

జరిగిన సంఘటనకు మీ బావగారు రెచ్చి పోయి, నీపు తప్పు చేయలేదు, క్షమాపణ చెప్పేదాకా కాపురం చేయనని చెప్పి బ్యాగ్ సర్దుకొని బయలు దేరమ్మ అని ప్రోస్చహించాడు, నేనేమన్నా అడగాలన్న అడగ నీకుండా బయటకు వచ్చాసారు తండ్రి కూతురు.
ఇరువైపులా పంతాలు పెరిగాయి ఇక్కడ మీబావ గారు మల్లి పెళ్లి చేస్తున్నానన్నారు వారు పంపించిన విడాకుల నోటీసును చూసి ఏంచేయాలో చెప్పురా తమ్ముడు.
ఒక్కసారి శిరీష అభిప్రాయము కనుగొన్న తరువాత నేను సమాధానము చెపుతాను, నీవు ధైర్యముగా ఉండు. అంటూ శిరీషను కలిసాడు బావ ఆనంద్.
శిరీష నీవు లెక్చరర్ చేస్తున్నావు, తప్పు ఎవరిదో తెలుసుకోలేక పోయావా, తల్లిని ఎవరు ఎమన్నా సహజంగా కొడుకుకి కోపం వచ్చి కొట్టాడు, నీ భర్తను కలిసాను, అందరి ప్రోద్బలంతో నోటిసు పంపించాడుట, మీరు వస్తే అమ్మతో క్షమాపన చెప్పిస్తాడుట. “తెగేదాక తాడు లాగకూడదు – కొందరి బలహీనత మాటలు పట్టుకొని రెచ్చ కొట్టకూడదు".
ఇదిగో మీ వారి నుంచి ఫోన్ మాట్లాడు “ మా అమ్మ మన హనిమూన్ టిక్కెట్లు కొని మరి ఇచ్చి పొమ్మన్నది”
మన కలయిక కోసం క్షమాపణ చెపుతానన్నది, నా తొందరపాటే, నావేదన గురిచేసింది వస్తున్నావుగా “ వస్తాను
బావ “మరి నాన్న ఒప్పుకుంటాడ కాపురానికి పోవటానికి “ అందరిని నేను ఒప్పిస్తాను నీ సంతోషమే అందరి సంతో షము, ఆమాటలు అన్ని తల్లి విని అన్ని సర్దాను ఇక నీవు బయలు దేరుటే, వర్జం వస్తుంది బయలుదేరు.
పంతాలకు పోకుండా కాపురాలు నిలబెట్టండి - నూరేళ్ళ జీవితమ్ నాశనమ్ చేయకండి


కంద గుళిక (ప్రణయ భావం)

కడలి కెరటంలా నీకోసం
వడ్డు దాకా వచ్చి నీ స్మృతులు తలుస్తూ
ఉండ లేక వెనక్కు వెళ్ళి
కొండ దాటి నదిలా నన్ను కలుస్తావనుకున్నా     

ఆకాశంలో మేఘంలా
ప్రకాశిస్తున్న నాదగ్గరికి గాలిలా
పక్షి లా నన్ను కలుస్తూ
శకలాలు లాగ కరుగుతూ నీకోసం 

వసంతున్నై వస్తున్నా
పసందైన కోయిల పాట వినిపించవా
రసమాదుర్యం అందిమ్చవా
కసిగా ఉన్నది నాకు వస్తున్నా నీకోసం 

కొండ గాలి సోకింది
మండే గుండె చల్లబరుస్తావని వున్నా
గుండె చిక్క బట్టి కలా
కండ తినిపిస్తావని  ఉన్నా నీకోసం

ప్రణయ భావం పెరిగి
తృణ భావంలా విపత్తులో  నిల్చున్నా
రణము నీతో చేయను
వణికే చలిలో నైనా ఉంటాను నీకోసం 

సత్యం పలుకుతున్నా
ముత్యాల దండను పట్టుకొని ఉన్నా
సత్య వదూతగా ఉన్నా
సత్వరం నీ ప్రేమ కోసం వేచి ఉన్నా


కన్నులో కలిసే చూపు
నన్ను ఆ చూపు నీ సేవకా అన్నట్లు
చన్నుల పొంగు చూపి  
మన్ను తిన్న పాములా ఉండమన్నట్లు



యిన్ని నాళ్ళు నీకొరకై

మన్నీళ్లుగా వేచియున్న  పిపాసినినీ    
కన్నీరు నీకు తెప్పించక
పన్నీరు చల్లి చిరునవ్వు తెప్పిస్తా సుహాసిని

ముళ్ళు గుచ్చుకోకండా
వళ్ళు కదలకుండా, చిరునవ్వును తెప్పిస్తా
కళ్ళు చెదర కుండా
గుళ్ళు తిరిగి ప్రేమను పుట్టించి బ్రతికేస్తా

పలుకుల మాల కడ్తా
తలుపులు తెరిచి, నీకోసం వేచి ఉంటా
కులుకులతో, రంజిల్లే
వలపులు అందించి, ప్రేమను పంచేస్తా   
--((*))--


చిన్న కధ :కాకుల్లారా జాగర్త – మనుష్యులు తెలివి మీరారు
కాకుల్లారా దూర దూరంగా ఉన్నా రెందుకు, మొన్నటిదాకా కలసి ఉన్నాము కదా, మాలో కలతలు పెట్టి విడ దీసింది మరోకాకి, ఆశలు చూపి, అడియాసలు చేసింది. ఎప్పుడు పాత పాటేనా, కొత్త పాట పాడరాదా, మాకు కా కా అనటం తప్ప కొత్త పాటరాదు, సరేలే మన " ఏకాకి" వస్తున్నాడు అంతా, తన గొప్పేనని “ కా కా “ అంటున్నాడు, మాట్లాడకుండా ఉందాము. ఏమిటి అలా కూర్చున్నారు కలుసుకోండి, క కా అంటూ కలిసారు అందరు.

నేను ఏకాకిని కాదు, పలు కాకులకు నాయక కాకిని, నా దారికి అడ్డులేదు, నన్ను గుర్తించే కాకులు లేకున్నా, నా ప్రయత్నాలు నేను చెస్తూనే ఉన్నా, నాకు వద్దన్నా నడమంత్రపు ఆకలి ఆవహిస్తున్నది, పంచలేక, దాచుకోలేక, మనసు లేని వాడిలా, మమతలను పంచని వాడిలా, మౌన ముణిలా, తనకు పట్టిన కుందేలుకు మూడు కాల్లన్నట్లుగా, నన్ను పెంచిన, నన్ను నమ్మిన కాకులను ఆదుకొనే నాయక కాకిని నేను.

నాయక కాకిని ఒక కాకి ఇలా ప్రశ్నిమ్చిన్ది, పెద్ద పెద్ద భావణాలుకడ తారుటా మనం పైపైకి ఎగరాలేమో ?
దీనికా మీరు భయపడేది కొంత తిని కొంత కడతారు, ఆ కొంత పూర్తి చేసేటప్పటికల్ల పదవి పోయి మూల కూర్చోవటం కాని,గెలిచాక కొత్తపధకాలకు ఖర్చు చేసి ఈ భవణాలకు ఖర్చు తగ్గించవచ్చు, సగం పనులు ఎప్పుడు పూర్తయినవి కాబట్టి అవే మన ఇల్లు గా మారుతాయి.     

అవును నీ ప్రక్క కూర్చోనే కాకి కనబడుట లేదు, ఎక్కడున్నది. ఇతర దేశాల్లో సంచర్తిస్తున్నది, త్వరలో ఇక్కడకు వస్తుంది. మరో కాకి ఏదన్న ఫలితము ఉన్నదా అని అడిగింది. ఎందుకు లేదు అక్కడవిక్కడకు, ఇక్కడవి అక్కడకు మార్చు కొనుట నేర్పుతున్నది, పలువురిలో మన జాతి ప్రగతి తెలియ పరుస్తున్నది. ఇచ్చి పుచ్చుకోవటము తెలుసు కోవటమే ఇందులో పరమార్ధం.

మనం బ్రతకటానికి స్వచ్చత అని, చెత్త లేకుండా చేస్తున్నారు కదా, ఇది చిన్న దేశమా, పెద్ద దేశము మనం బ్రతకటానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఒక చోట చెట్లు నరికినా మరోచోట చెట్లు పెచుతున్నారు చల్లదనం కొరకు.

మన పని మనం చేసు కుంటూ పోదాము, ప్రతి పని చేద్దామని చెపుదాం, మనుష్యులకు నమ్మకం కలిగించి మనజాతిని బ్రతికిద్దాం, నేను చివరగా చెప్పేది ఇదే
కాకుల్లారా జాగర్త – మనుష్యులు తెలివి మీరారు


15 నుండి 8 వరకు మధ్య చుక్క ముగ్గు
              

అనుభందం 

దేవాలయములో ఉపన్యాసం వినటానికి రోజు పరందామయ్య్యగారు
భార్యతో వచ్చి వినేవారు అదేరోజు స్త్రీ పురుషులు గురించి చెపుతున్నారు

ఆదిపరాశక్తి దృష్టిలొ స్త్రీ పురుషులు సమానమే
స్త్రీ పురుషుల వివక్షత సృష్టించినది కలియుగమే
ఆశయాలకోసం ఇరువురు శ్రమపడటం సహజమే
ఆధిపత్యం కోసం ఇరువురి మద్యపోరాటం సహజమే

కృత్రిమ సృష్టి అనేది కుల మత, జాతి, మాత్రమే  
లైంగిక హింసలు స్త్రీ పురుషుల మద్య ఉండటమే
స్త్రీ పురుషుల హక్కుల కోసం నిరంతరం పోరాటమే
స్త్రీ పురుషులు ప్రేమను పంచుకుంటే జీవితం సుఖమే


మహావిష్ణు నాభినుండి బ్రహ్మ పుట్టడం పురాణం
నేను సగం, నీవు సగం, అనటం అర్ధనారీశ్వర తత్త్వం
దాపత్యం అంటేఇష్ట పూర్వకంగా స్త్రీ పురుషులు సంగమం 
పిల్లలు పుట్టడం, పెంచడం భార్య భర్తల కనీస  ధర్మం

భారతీయ ఓవ్నత్యాన్ని గుర్తిస్తూ కలసి మెలసి జీవించడమె
సమభావాన్ని గ్రహించి గొప్పలకు పోక సర్దుకొని జీవిమ్చడమె
సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఒకరి నొకరు సహకరించడమె
ప్రక్రుతి నను సరించి హెచ్చు తగ్గులు లేకుండా బ్రతకటమె

పురాణం ఒకవైపు స్నేహితులు మాటలు మరోవైపు

పంతులుగారు బాగున్నారా, నన్ను గుర్తు పట్టారా
మీతోబాటు చదువుకున్న ఐ.యమ్.పి.సత్యం ను
జ్ఞాపక శక్తి తగ్గింది గుంటూరులో సత్యానివి కదూ  
హమ్మయ్య ఇప్పుడు గుర్తు పట్టారు చాలా సంతోషం

నా భాదలు ఎవరికి చెప్పిన ఫలితము లేదు   
నేనున్న పరిస్తితి ఎవరికి చెప్పిన అర్ధం కాదు
ఓదార్చే స్నేహితులు నాకు గుర్తింపు  లేదు
అందరికి దూరంగా ఇక్కడ జీవితం గడుపుతున్న

ఎం చెప్పేది నేను చేసిన కమ్పెనీ దివాళా తీసింది
చాలా మందికి డబ్బు ఎగ్గొట్టి కమ్పెనీ బోర్డు తిప్పేసింది 
దాచుకున్న పైకము రాక చివరకు బాధ మిగిలింది
ఆప్పులు తీర్చుటకు ఉన్న కొంత అమ్మటం జరిగింది

ఏదో కొంత డబ్బుతో అద్దె కొంపలో ఉంటున్నా
కూరలు పెంచి బజారులో అమ్మి బ్రతుకుచున్నా
వృద్ధులకు మూగజీవులకు ఆశ్రమం కల్పిస్తున్నా
ప్రక్రుతి ప్రశాంత వాతావరణములో బ్రతుకుతున్న

నా విషయం అట్లా ఉంచు మీ  విషయం తెలియపరుచు
పిల్లలెందరు  వారి వివరాలు వివరముగా తెలియ పరుచు
నీ భార్య ఆరోగ్యం, నీపిల్లల విద్యాభివృద్ధి గురించి వివరించు 
కుటుంబ గౌరవ సంపాదన ఉన్నత స్తితి గురించి వివరించు

నాకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు  
వారు చదివిన చదువుకు వచ్చే  ఉద్యోగాలు
వారందరికి పెద్దలమై చేసాను వివాహ వేడుకలు
పిల్లలకు ఊడిగమ్ చెయ్యుటకు పనికొస్తారు పెద్దలు

ఏదయినా అడిగితె నాకు ఏమి చేసావు నాన్న
పైచదువు చదివిమ్చమంటే చదివిమ్చలేదు నాన్న 
ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాము కాబట్టి ఇల్లు జరుగును నాన్న
ఒకరివద్ద ఉండమంటే ఉండరెందుకు సలహాలు ఇవ్వాలని చూస్తారు

మనమిక్కడ కలవడం ఆదేవుడు కల్పించాడు
వొకరిభాదఒకరు చెప్పుకోవటానికి వీలు కల్పించాడు 
వయస్సుకు తగ్గ ముచ్చట్లుకు అవకాశ మిచ్చాడు
జీవిత మజలీలు ఇంకా ఎన్ని ఎదురుచూస్తూ బ్రతకాలి  

కృ ష్ణా ష్టకం చదువుతూ ఉపన్యాసం ముగించారు
 వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనం!
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం!!(1)

అతపీపుష్పసంకాశం, హారమాపురశోభితం!
రత్నకక్కణకేయూరం, కృష్ణం వందే జగద్గురం!!(2)

కుటిలాలకసమ్యుక్తం, పూర్ణ్చంద్రనిభాననం!
విలసత్ కుండలధరం, కృష్ణం వందే జగద్గురం!!(3)

మందారగంధసమ్యుక్తం, చారుహాసం చతుర్భుజం!
బర్హి పించానచూడాక్గం, కృష్ణం వందే జగద్గురం!!(4)

ఉత్పల్ల పద్మపత్రాక్షం, నీలజీమీతపన్నిభం!
యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురం!!(5)

రుక్మిణీ కేళిసమ్యుక్తం, పీతాంబరసుశోభితం!
అవాస్తతు తులసీగంధం, కృష్ణం  వందే జగద్గురం!!(6)

గోపీకానాం కుచద్వంద్వకుంకుమాంకితఫక్షసం!
శ్రీనికేతం మహేష్వాసం, కృష్ణం వందే జగద్గురం!!(7)

శ్రీ ఫత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం!
శంఖ చక్రధరం దేవం, కృష్ణం వందే జగద్గురం!!(8)

కృ ష్ణా షటక మిదం పుణ్యం ప్రాతరుత్ధాయ య: పఠేత్!
కోటీజన్మ కృతం పాపం, స్మరణేన వినశ్యతి!!.(9)
 


శ్రీ కృష్ణ భగావాన్ని ధ్యానం చేయందే మేము నిద్రపో0
గీతా సారాంశాన్ని అర్ధం చేసుకొని బ్రతుకు సాగిస్తాం   
మూగజీవులను, పెద్దలను గురువులను ఆరాధిస్తాం
మమ్మల్ని నడిపించేది ఆదెవదెవుడని మేము భావిస్తాం

మా ఇంటిదాకా పోదాం పదా ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి
నా భార్య పూజ పునస్కారాలమ్టూ పిల్లలకు సేవ చేస్తుంది
పిల్లలు పుట్టరని తెలుసుకొని భాద లేకుండా ప్రవర్తిస్తుంది
చిలుకలను, కుక్కలను, కుమ్దేల్లును పెమ్చుతుమ్టుమ్ది

ఇంట్లో అడుగుపెట్టగానే నమస్తే అంటుంది చిలుక
తోకాడిస్తూ మనష్యుల చుట్టూ తిరుగుతుంది శునకం
గంతులు వెస్తూ సందడి చేస్తుంది కుందేలు
కిలకిల శబ్దాలతో సందడి చేస్తాయి చెట్లపై పక్షులు

ఇంతకీ నీవిషయమ్ చెప్పు మద్యలో ఆప్పావు
ఇదిగో ఈ కాఫీ త్రాగుతూ చెప్పు నెవెక్కడ ఉంటావో చెప్పుము 
ఒక్కసారి మేమిద్దరం మీపిల్లలను వచ్చి చూస్తాము
చిరునామా తెలియపరిస్తే వీలు చూసుకొని వస్తాము  

పిల్లలు ఉన్న సుఖం అనేది లేకుండా నేను బ్రతుకుతున్నాను
నేను చేసిన పెద్ద పొరపాటు మొగపిల్లలని ఎక్కువచదివిమ్చాను  
తక్కువ చదువులతో కూతుర్లకు వివాహము చేసాను
ఈ వయసులో చేతిలో డబ్బుల్లేక భాద వ్యక్త పరుస్తున్నాను 


ఎందుకులే నీకు శ్రమ నేను మావిడ కలసి వస్తాం
మీరమ్తగా చూడాలని పిస్తే పిల్లలను కూడా తెస్తాం
మా ఫామ్లికి సంభందించిన ఫోటోలు కూడా తెస్తాం
కానీ మీరు రావద్దు, మరీ మరీ కోరుకొనే మీ నేస్తం 

చిన్న  పిల్లలంటే నాకెంతో ఇష్టం అని నీకు తెలుసు కదా
మనవళ్ళతో సరదాగా ఆదుకోవాలని మాకు ఉంది కదా
ఇక్కడ పిల్లలను చూసి సరదా మీరు  పడవచ్చు కదా
నీ పిల్లలపై స్వతంత్రం ఉంటుంది పరాయి పిల్లలపై ఉంటుందా

మా అడ్రస్సు మీకు చెప్పి మిమమల్ని భాధపెట్టలేము
సందుల్లో విశాలమైన మైదానములో  ఉన్న భవనము
దానిని పెద్దలకు బంగారు భవిషత్ చూపె వృద్ధా శ్రమము
దేవుని కృపవల్ల కొడుకులు కూతుర్లు ఉన్నా ఇక్కడే ఉన్నాము

కొన్నాళ్ళు నేను మాఆవిడ కొడుకులు ఇళ్ళల్లో ఉన్నాము
మరి కోన్నాళ్ళు కూతుర్ల వద్ద కాలం వెల్ల బుచ్చాము  
పనిచేసి నంతకాలం ఎవరూ వేలెత్తి చూపలేదు మమ్ము
వయస్సు పెరగడం వళ్ళ కొంత వచ్చింది అనారోగ్యము

మేము స్వేచ్చగా జీవిమ్చాలని తలంచి బయటకొచ్చాము
మాకున్న దానిలో మేము కొడుకులకు కూతుర్లకు పంచాము
ధనం ఉంటే వృద్ధాశ్రమములొ కట్టి దీవున్ని వెడుకుమ్టున్నాము
నా భాధలు నా కొడుకులకు కూతుర్లకు రాకూడదని అంటున్నా

నోరున్న జీవులైన నాకు ఆత్మీయులు కారు
ఎ విషయములో సహాయము చేయుటకు రారు  
మేము వద్దంటే మీరు చేరారు అమ్దరూ అన్నారు
వేలకు తిండి కంటి నిండా నిద్ర దొరుకుతుంది ఆశ్రమలొ

నేనొకటి నీకు చెప్పదలచు కున్నా
నేను అనాదనే నా అన్నవారు ఉన్నా
నా దగ్గరకు రావద్దని వేడు కుంటున్నా
ఒకరి భాధను పంచుకొనే శక్తి నాకు లేదన్న   

నోరులేని మూగజీవులె నీకు అనుభంధాలు
ప్రక్రుతి వచ్చే  చల్ల గాలులే మీ సోమ్తాలు
ఫలించు పుష్పాలు కాయగూరలు మీనెస్తాలు
సహాయ పడటమే మీకున్న ధైర్యాలు 


సత్యం చెప్పిన కధ విని కల్లవెమ్బడి నీఋ వచ్చింది ఆడంపతులకు
అన్నయ్యగారు మీ భార్యను తీసుకొని ఎప్పుడైనా రావచ్చు ఇది మీ
పుట్టిల్లు అనుకొండి మాకు ఎవరూ తోడూ లేరు మీరు ఎప్పుడైనా రావచ్చు  
ఆ శ్రీ కృష్ణ భగవానుణ్ణి ఆరాధిస్తూ మాధవసేవే మానవసేవే అని జీవిద్దామ్
                                                    


జ్ఞాన కంద గుళికలు

విజ్ఞానాన్ని దాచకుండా
విజ్ఞతను ప్రదర్శించి, వినయంతో
అజ్ఞానాన్ని తొలగిం
చే జ్ఞానాన్ని భోదిన్చుటే గురు ధర్మం

భయం చెందక ని
ర్భయం గా గురుసేవ చేసి, విద్యే అ
భయం గా మారాలంటే
స్వయంగా విద్య నేర్చుకోవడం శిష్య ధర్మం

మాత, పితలకు దూరంగా
శతృవులు దేశంలో చొరబడ కుండా
పతాకమును,ఆయుధమును
చేత పట్టి మాతృ దేశరక్షణే సైనిక ధర్మం

వృద్ధ తల్లి తండ్రులను
శ్రద్ధ గా ఆదరించటం, పోషించడం, అ
శ్రద్ధ చూపక మందు లిచ్చి
యుద్ధ ప్రాతిపతికగా రక్షించుటే పుత్ర ధర్మం

బిడ్డలకు మంచి చెప్పి
బిడ్డల విద్యాభివృద్దికి సహకరించి
అడ్డగోలుగా తిరుగ కుండా
బిడ్డలకు అండగా ఉండుటే తండ్రి ధర్మం

భర్త సంపాదన, ఖర్చుకు
కర్తగా ఉండి, సమర్దవంతంగా, సత్ ప్ర
వర్తనగా, పిల్లల కండగా
భర్తని గౌరవిస్తూ కష్టపడుటే ఇల్లాలి ధర్మం

సోమరి తనం లేకుండా
విమర్సించక ధర్మాన్ని తెలుసుకొని
మమకారం, మనోధైర్యం
సమపాల్లలో నడుచుటే పురుష ధర్మం

నమ్ముకున్న మితృనికి
కమ్ముకున్న చీకట్లును తొలగించి,
సొమ్ములతో, ఆదరించి,
వమ్ము కాకుండా నిలిపేదే మిత్ర ధర్మం

ధర్మ సాక్షిగా పెళ్ళాడి
కర్మల విధిగా, సంసారం నిర్వహించి,
మర్మము తెలిసిన భర్త
కూర్మం లా భార్యకు రక్షే వివాహ ధర్మం

--((*))--
సంక్రాంతి ముగ్గు



2 1 నుండి 1 వరకు  ప్రక్క చుక్క  ముగ్గు 


సంక్రాంతి పండుగ..!

సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో
దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతి
 

పండుగ పుష్య మాసంలో వస్తుంది.ఇది మూడు రోజుల పండుగ. మార్గశిర మాసం, పుష్య మాసాలు హేమంత ఋతువులో వస్తాయి. ఇది చలి కాలం. చలి
గజ గజా వణికిస్తూ వుంటుంది. మొదటి రోజు "భోగి" ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. "స్వర్గ వాకిళ్లు" అనే ముగ్గును వేస్తారు. ముగ్గుమధ్యలో
"గొబ్బెమ్మలు" పెడతారు. వీధులలో "భోగి మంటలు" వేస్తారు. 


కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేసి
"సంక్రాంతి లక్ష్మి" ని పూజిస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలను కలిపి కూరగా వండుతారు. దీన్ని
"కలగూర" అంటారు. "నువ్వు పులగం, పొంగలి", ప్రధాన వంటకాలు. సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు.
 

బొమ్మల కొలువును ఏర్పరచడం కూడ వుంటుంది. బొమ్మలకు హారతి యిచ్చి,
పేరంటం చేస్తారు. రెండవ రోజు "సంక్రాంతి" ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో
దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. 


ఈ రోజున
స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. బెల్లం, గుమ్మడి కాయలు "దానమి"స్తారు. పితృదేవతలకు "తర్పణాలు"
వదులుతారు. ఈ రోజున కూడ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. "రథం" ముగ్గు వేయటం సాంప్రదాయం. ఈరోజు కూడ "గొబ్బెమ్మలు"
పెడతారు. మూడవ రోజు "కనుమ పండగ" ఈ రోజును "పశువుల పండుగ" అని కూడ అంటారు.
 

వ్యవసాయదారులు పశువులను నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు. పసుపు కుంకుమలతో, పూలతో అలంకరిస్తారు. పశువులను పూజిస్తారు.
 

పశువుల కొట్టంలో "పొంగలి" వండి అందులో పసుపు, కుంకుమ కలిపి
పొలాలలో చల్లుతారు. చీడ-పీడలు సోకకుండా కాపాడమని
దేవతలను ప్రార్ధిస్తారు. గుమ్మడి కాయలు పగులకొట్టి పోలి (బలి) వేస్తారు.పూల దండలు గుచ్చి
పశువుల మెడలో వేస్తారు. దూడల మెడలకు,
కాళ్ళకు చిరుగంటలు కడతారు. ఎద్దు కొమ్ములకు వారి వారి అభిరుచిని బట్టి పసుపు, కుంకుమలు,
రంగులతో తీర్చి దిద్దుతారు. గంగిరెద్దులను అలంకరిస్తారు. 


కొన్నిప్రాంతాలలో పశువుల ఊరేగింపు,
కోడి పందెములు, గొర్రె పొట్టేళ్ళ పందెములు కనుమ నాటి
సాయంత్రము జరుపుతారు. "కనుమ" రోజు "మినుము" తినాలని "గారెలు" చేసుకొని తింటారు.
 

పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెళ్ళిన అల్లుళ్ళు కూడ
కనుమ రోజు తిరుగు ప్రయాణమవ్వరు!!!


 సంక్రాంతి గుళిక

వచ్చే వచ్చే సంక్రాంతి
తెచ్చే తెచ్చే జీవితలో నవకాంతి
ముచ్చట్లతో ప్రకృతి
స్వచ్చమైన క్రాంతితెచ్చే కన్నప్రీతి సంక్రాంతి

ధన్య రాశులింట తెచ్చి
కన్యలు, తరుణీలు వేసే ముగ్గులు
మన్య మంత సుబ్రపరిచి
జనుల కళ్ళు కొత్తజవము తొనికిసల సంక్రాంతి  

భోగి మంటల్లో పాతవి వేసి
భగ భగ మండే మంటల్లో నీరు కాచి
భోగం వచ్చిందని భావించి
కాగు నీరు తలారా పోసుకొని కొత్తబట్టలు సంక్రాంతి      

గంగి రెద్దుల ఆట, ఇంటి
ముంగిట్లో, గాలిపటాలు పిల్లల ఆట
రంగవల్లి మద్య గొబ్బిళ్ళు
రంగు బలుబుల వెలుగు తోరణాలు సంక్రాంతి

హరిదసు కీర్తనలు
సిరుల పంట ఇటికి తెచ్చి, ఆప్యాయతతో
గౌరవస్వాగతం పలికి
సర్వము కలసి పిండి వంటలు చేసే సంక్రాంతి

అల్లుళ్ళు కూతుర్లు చేరి
వళ్ళు వంచి తల్లి తండ్రులను కూర్చోబెట్టి    
పిల్లలకి భోగిపండ్లు పోసి 
బొమ్మల పరెంటాలాతో సాగే సంబర సంక్రాంతి 


21 నుండి 1 వరకు  ప్రక్క చుక్క ముగ్గు
చిన్న కధ:  ప్రతినిముషం

అబ్బా ఏమండి అప్పుడే నిద్ర లేపారు, ఇప్పుడు చలి ఎంత ఉన్నదో తెలుసా -1 డిగ్రీలు ఉండొచ్చు, అది సరే ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా 8 గంటలు దాటింది, ఎనీముషాన్నయిన సూర్యుడు  తొంగిసూస్తాడు లేవవే. అబ్బా ఉండండి నే చెప్పేది వినండి ఎప్పుడో సూర్యు డొస్తాడని, చల్ల దనాన్ని  అనుభవించ కుండా ఉండ లేమండి. ఏమిటే వయసులో ఉన్న కుర్ర కారులా మా ట్లాడుతావు, మన కెంత వయసైందని, మాట్లాడ కోవచ్చు లేండి. ఈ చలి ప్రేమ మనో పరిపాకం, సృష్టికి ఉపకారం, మెలిక గుణాల ఆనంద దాయకం, ఇంకా చెప్పాలంటే ప్రణయ చర్యలకు ఉషోదయం.

అవునే ప్రతి నిముషం నష్టపోకుండా,  బ్రతుకుని సార్ధకం చేసుకోవటంలో ఉన్నది సంతోషం, ప్రకృతికి పరవసించని వారు లేరు ఈ లోకమలో, సుఖ సంతోషాలను పంచుకొని ఒకరి కొకరు తోడుగా ఉండాలి, మన తోడూ నలుగురికి ఉపయోగ పడాలి, నిముష  నిముషానికి మన ఆలోచనలు మారకుండా స్థిర చిత్తముగా  ఉండుట  మంచిది కదే.

అవునండి ప్రతి నిముషము వ్యర్ధం చేయక సద్వినియోగం చేస్తూనే ఉన్నాను గదండి, మీరు చెప్పే మాటలను ఎప్పుడు ధిక్కరించ లేదు, ఎ నిముషము వ్యర్ధము చేయక ప్రతినిముషము మీ సేవకే నా జీవితము దారపోసాను కదండీ,నన్ను ప్రేమగా చూసుకుంటూ, నామాటలను గౌరవిస్తూ నాకు తోడుగా ఉండుట  మంచిదే కందండి.

ఈ కాలంలో, ఈ సమయంలో ఆశయాల కలలను పండించు కోవటమే కదా, నా కాలయాపనను వెలెత్తి చూపక ఉన్నదానిలో తృప్తిగా సంత్రుప్తి పరిచావు, నాకు కన్నీరు తెప్పించక, నీవు కన్నీరు కార్చక, నా మనసును నొప్పించక, ప్రతినిముషము వేచి ఉండి,అడుగక ముందే ఆశలు తీర్చావు.

 మీరు ప్రత్యేకముగా సర్టిఫికేట్ ఇవ్వ వద్దండి ఒకరికొకరు కలసి, మాట మాట కలసి ఉండుటమే నిజమైన దాంపత్య ధర్మం. మనం ఒంటరిగా ఉంటూ మూడు నెలల కొకసారి ఒక్కొక్క కూతురి వద్ద మూడు రోజులుండి, మనకు చేతనైన సహాయము చెస్తూ ఈ కాలాల్ని వర్ధం చేయక  దేశ సేవ చేస్తూ జీవించుదాం, నీమాటకు నేనెప్పుడు కాదనను. నేను ఒక్కటే అంటాను ప్రతినిముషం వ్యర్ధ పరచక జీవించా లంటాను                     --((*))--   

             
8 చుక్కలు 8 వరుసలు 8 వరకు

చిన్న కధ:  ఉండలేననుకున్న పెద్దమనిషి
మావయ్య గారు మీరు ఎక్కడకెల్లారు, అసలేభాషరాని ప్రాంతం ఇది, మేరేమన్నఇల్లు గుర్తు పట్టక వెతుకుతున్నారేమోనని అనుకున్నాము,  నేను మీ అబ్బాయి చాలా సేపు చూసి,చుట్టు ప్రక్కల వెతికాము, మీరు కనబడక, ఇప్పుడు మీ అబ్బాయి అర్జంటు పని ఉందని ఆఫీసుకు వెళ్ళాడు.
 

కాస్త మంచి నీరు ఇస్తావా, నీవు అడిగిన దానికి కాస్త స్థిమితముగా ఉండి తెలియపరుస్తాను.
కాస్తకూర్చోండి, ఇప్పుడే నీల్లు తెస్తాను. ఎందుకో ఎంత త్రాగిన దప్పిక తీరుట లేదు,అవునూ వాతావరణము మారింది, కృష్ణ నీరు త్రాగేవారు మీరు, ఇప్పుడు గంగ నీరు త్రాగుతున్నారు అంతే మావగారు,మీకోసంతెలుగు దిన, వార, పక్ష, మాస పత్రికలు తెప్పించాము, మరియు తెలుగు చానల్ వచ్చేవిధముగా టి. వి . ఏర్పాటు చేసాము, మీరు బయటకు వెళ్లి టెన్షన్ తెప్పించకండి, అసలే సమస్యలలో ఉన్నాము, మరొక సమస్య తేకండి, అన్నందుకు కోపం తెచ్చు కోకండి.(మనసులో అనుకున్నది – పిల్లలకుమాకు జ్వరాల వస్తున్నాయి – అవిఎంతకీ తగ్గుటలేదు – మిమ్మల్ని ఉండి పొమ్మనటానికి శక్తి చాలుట లేదు)
ఈ ప్రాంజలి ప్రభ కవిత చదివాక ఇంటికి వెళ్దామనుకుంటున్నాను, ఏది ఆ కవిత ఇదిగో చదువు  



ఇంటి వచ్చినవాన్ని పొమ్మనక అన్న పదాలు
ఇంటి పెద్ద చెప్పిన మాటలు :
తప్పు చేస్తున్నా వనుకోకమ్ము
మాపు నిలువుము, రేపు పొమ్ము
కాపు కాసి, కలత వదలి పొమ్ము
ముప్పు రాదు, జాగర్తగా పొమ్ము

వచ్చిన అతిధి మాటలు:
కళ్ళ బొల్లి మాటలు నమ్మి పొమ్మనకు
మాటల వళ్ళ కలతలోస్తాయని అనకు
ఎప్పుడూ రక్షగాఉన్న వాణ్ని, పొమ్మనకు
కారణము లేకుండా, వట్టిగా పొమ్మనకు

ఇంటి పెద్ద  మాటలు :
బరువు మీద బరువుగా, ఉండ కూడదని
నలుగురిలో పరుపు పోకుండా, ఉండాలని
ఏరి కోరి కష్టాలు తెచ్చుకోవటం, ఎందుకని
మనుష్యుల మద్య  స్పర్దలు,  రాకూడదని

వచ్చిన అతిది మాటలు:
నిజం తెలుసు కోక, పోమ్మంటున్నావు
స్నేహాన్ని వదిలే విధంగా, మాట్లాడవు
పోమ్మాన్నావు, తర్వాత బాధపడతావు
నిజం తెలుసుకున్నాక, నన్ను కలువలేవు     
 
పోమ్మన్నావు వెళ్ళొస్తా - రమ్మన్నా మల్లీ వస్తా
పరిస్థితి అర్ధం చేసుకున్నదుకు ధన్యవాదములు 

చదివాకమీరునాకు అతిధి కాదండి, స్వయాన మావగారు, నేనుపొమ్మన లేనండి, అంతా మీ ఇష్టం.
నేను మాఊరికి వెల్లుతున్నా, చెప్ప లేదనకు, అబ్బాయికి ఫోన్ చేసి ఇవ్వమ్మా, ఒక్కసారి మాట్లాడి వేల్తానమ్మా
"బాబు" నీవు వచ్చేటప్పుడు మన ఊరికి ట్రైన్లో టిక్కేట్లుకొని తీసుకురా, నీవు ఎన్ని మాటలన్నా, ఇక్కడ ఉండ దలుచు కోలేదు, కారణము ఎమీ లేదు, నీవు, కోడలు, పిల్లలు,  అందరూ చక్కగాచూసుకుంటున్నారు, పోదా మనుకున్నాఅంతే. సరేనాన్న, నేను వచ్చి నిన్ను రైలు ఎక్కించి పంపిస్తా, సరే నీకోసం వేచి ఉంటా ......
మనసుకు తృప్తి లేకపోతె – ఎన్నిఉన్నా అన్నీ అసంతృప్తిగా నే ఉంటాయి
అక్కరకువచ్చేచుట్టంగాఉండాలి ఎవరైనా – ఉండి పోదామనుకుంటే సబబేనా

--((*))--


నాన్నకు ప్రేమతో సినిమా స్టిల్స్ జూ. ఎన్ టి అర్
ఈక్దహ్ మీరు చూసి మీ అభిప్రాయాలు తెలుపగలరుమరియు ఆన్లైన్ గూగుల్ న్యూస్ చూడ గలరు 

NTR Jr on 'Nannaku Prematho' director Sukumar

"Sukumar is the kind of director you don't want to criticize even if his film fails, because there's so much genuine effort in his work. I've never seen a director with so much of dedication and commitment. He pushes you to give your best," NTR Jr
ఈ క్రింద  లింకు ను టిక్ చేయండి 
సాహితి కిరణాలు -3 (ఫ్రo  పేస్ బుక్ )
 



హాస్య గుళికలు
1.అసెంబ్లీ:
నాయకులందరూ అసెంబ్లీలో  సమావేశమై, డబ్బు వృధా కాకుండా
ఏంచేయాలో చర్చకు వచ్చింది.
అధ్యక్షా అసెంబ్లీ పని దినాలను తగ్గించితే మంచిది అన్నారు ఒకరు,
అధ్యక్షా ఐదు రోజులు అఫీసులు నడిపించుదాం అన్నారు మరొకరు,
అధ్యక్షా శని, దివారములు అన్ని షాపులు మరియు, బ్రాందిషాపులు
మూసివేయాలన్నారొకరు, మరి మన కమిషన్ ఎట్లా ...........

2.అనుమానిస్తున్నారు:
మనం గోడవపెట్టుకోకపోతే అందరూ  అనుమానిస్తున్నారు
మనం గొడవ పెట్టుకుందాం
భార్యా భర్తలు అనుకుంటారు ............


3.అనాధఆశ్రమం                                                                                                                        అత్తమామలను అనాధ ఆశ్రమంకు పంపకండి అన్నది భార్య.
నేనే వారికి సేవలు చేసి తరిస్తాను, ఈ "బుద్ధి  ఎక్కడి  నుంచి  వచ్చిందే నీకు." వారికి వచ్చే పించన్ మనకు కూడా  పనికొస్తుంది కదండి. ......... 

4. అమెరికా
మన ఇద్దరికీ వీసా వచ్చింది హాయిగా అమెరికాకు వెళ్లి
పెళ్లి చేసుకుందాము  అన్నాడు శిరీషతో శ్రీను,
మా ఆయన వప్పుకుంటే నాకు అభ్యమ్తరం లేదు ..........
--((*))--

సీతారామ కల్యాణం (వాల్మీకి విరచి రామాయణం) - తేలిక పదాలతో వ్రాసినది - Part-(1)
        (మల్లా ప్రగడ రామకృష్ణ అంత్య ప్రాస భావ సీతారామ కల్యాణం)
   
    1    దేవతలు ఋషులు రావణ చేష్టలకు అనుభవించారు నరకం
    విష్ణుమూర్తి వద్దకు వెళ్లి దేవతలు,ఋషులు కోరారు పరిష్కారం
    రావణునకు పుణ్యం తగ్గి పాపం పెరిగేదాక ఉండాలి సహనం
    అందరూ రామాయణం చదవడం మనశ్శామ్తికి శ్రేయస్కరం
   
    2    నారదుడు సంచారము చేస్తూ వాల్మీకిని కలిసాడు అరణ్యం
    వాల్మీకి నారదుడిని కోరే తెలపండి శ్రేష్టుడి కధా వివరం
    లోకంలో ధర్మజ్నుడు, క్రుతజ్ఞుడు గురించి తెలిపెద సత్యం
    నారద మహాముని వాల్మీకికి తెలిపే రామాయణ మహత్యం

    3    సరయూ నది సమీపమున ఉన్నది కోసలమను పెద్ద దేశం
    అందులో సమృద్ధి వనరులుగల అయోధ్యా పట్టణం
        మను మహారాజు దానిని స్వయముగా చేసే నిర్మాణం
    నారద మహాముని వివరించే అయోధ్యా పట్టన విషయం

    4    దశరధ మహారాజు అయోధ్యా నగరాధీశo
        సమస్త ఉపయోగకర వస్తువుల సంగ్రహం
        తేజోవంతమైన పాలన పురప్రముఖలకు ప్రియం
    దశరధ మహారాజు పరిపాలన ప్రజలు అంటారు అమోఘం
       
    5    నాస్తికుడనేవాడు కనిపించడు నగరమంతా భక్తి మయం
        కాముకులు, క్రూరులు, లేని ప్రాంతంగా ప్రజలు సుఖమయం
        దరిద్రుడు, విద్యలేనివాడు, కనిపించని పరిపాలనా మయం
        దశరధ మహారాజు పరిపాలన ప్రజలు అంటారు అమోఘం

    6    భ్రాహ్మాణులు పతిరోజు వేదాద్యయన పారాయణం
        క్షత్రియులు ధైర్యసాహసాలతో చేస్తారు వీరధర్మ0
        వైశ్శులు ధర్మమార్గమున చేస్తున్నారు ధనసంపాదనం
        శూద్రులు భ్రాహ్మాణ, వైశ్య, క్షేత్రియులకు సేవాతత్పరం
       
    7    అల్లుడుగా విచండ మహర్షి యొక్క కుమారం
        ఋష్య సృమ్గుడు వదిలెను బ్రహ్మ చర్యం
        స్త్రీలపై బ్రమలు పెట్టుకొని చేరే అయోద్యానగరం
        దశరధుడు కుమార్తె శాంతను ఇచ్చి చేసే వివాహం
       
    8    కామ, క్రోద, లోభ,మద,మాచ్చర్యములపై ఉండాలి నిగ్రహం
        ఆశ్రమధర్మమ్ భంగం కలుగనీయకుండ నెరవేర్చుకోవాలి అభీష్టం
        సత్కర్మల చేసినందు వల్ల అరిషడ్వర్గాలను జఇంచగలం
        సేవకులపై దురహంకారం చేసితే కలుగును అగౌరం
       
    9    రాజ్యంలో ప్రజలందరూ సుఖసామ్తుల మయం
        శివ భక్తులు వారి నిత్యపారాయణం పంత్యాక్షరి మంత్రం
        విష్ణు భక్తులు నిత్యపారాయణం నారాయణమంత్రం
        రాజవంశంలో అందరు పుత్రులు కొరకు చేస్తున్నారు యజ్ఞం
       
    10    పుత్రుల కొరకు దశరధ మహారాజు చేసే అశ్వమేధ యాగం
        సంవత్చర కాలంలో రాజ్యాలు తిరిగి వచ్చే యజ్ఞాశ్వ0
        సామంతరాజులు పండితులు చేరిరి యజ్ఞ శాలం
        దేవతలకు ఆవిర్భాహం కోసం చేసారు హోమగుండం
       
    11    దశరధ మహారాజు భార్యా (కౌసల్య) సమేతంగా చేసే యజ్ఞం
        జాగరణతో, నిష్టతో, మొదటిరోజు చేసే జంతు హోమం
        రెండవరోజు నుక్త్వమ, మూడవ రోజు ననిరాత్రి చేసే హోమం
        అశ్వమేధయాగమ్ ఋషులు పండితులు చేసే సమ్పూర్ణ0
       
    12    పుత్రులకొరకు దశరధుడు ప్రారంచిమ్చే పుత్రకామేష్టి యాగం
        యధర్వన మంత్రాలతో చేసే బ్రహ్మాండమైన హోమం
        దేవతలందరు వచ్చి గ్రహించారు హవిర్భాగం
        దేవతలు, ఋషులు, పుత్రసంతానం కలగాలని ఆశీర్వాద0
       
    13    రాక్షసులు చేసే ఘోరాలకు ప్రజలందరిలో కలిగే భయానకం
        దేవతలు, ఋషులు కోరే నారాయణుని పాహిమాం పాహిమాం
        శేష శయ్యపై చిరునవ్వుతో నారాయణుడు లక్ష్మీ సమేతం
        నారాయణ స్వరూపమ్ విశ్వమంతా ఆవిర్భావం
       
    14    సమస్త ప్రాణుల స్థితి జ్ఞాన వైరాగ్యమునకు హేతుం
        రూపద్వమ్దములు లేని సమస్తమునకు పరమేక0
        మీరమ్దరు ఆత్మజ్ఞాన హృదయంతో ప్రార్ధించుట భావ్యం
        సంయమనం పాటించండి నేను చేస్తాను రాక్ష సంహారం
       
    15    సమస్త సమస్య భందన ఛేదం
        హృదయాన మొహభందన నిరోధం
        సర్వ భంధ విముక్తితో కలిగే మోక్షం
        అదే లోకమంతా ఉన్న శివ నారాయణ తత్త్వం
       
    16    భావ అభావాలు లేని యోగామయం
        నిత్యమూ యోగులచే ధ్యానించే వందేరామం
        విశ్వమంతా వామ్చిచే భక్తితో ప్రార్ధణామయం
        శివ నారాయణలను ఆరాధించే అంతా భూలోకం
       
    17    హే భగవాన్, ఓ పరమాత్మా గుర్తిమ్చ వేమి మాకష్టం
        ఎమీఎరుగని స్త్రీలపై, అమాయకులపై రాక్షసుల అఘాఇత్య0
        రాక్షస చర్యలకు మేమందరం మూకమ్మడిగా ఆత్మత్యాగం
        ఈ ధరనిపై కష్టాలు మేము భరంచ లేమని ప్రజల ఆర్తనాదం
       
    18    పృధ్విపై పెరిగే వటవృక్షంలా నాటుకు పొఇనా రాక్షసుల క్రూరత్వ0
        దరహాసం అనేది ప్రజలు నోచుకోలేని భయానక జీవిత0
        రక్షసమాయతొ కామందులు, మూర్ఖులు విలయ తాండవం
        శ్రీమన్నారాయణుని ప్రార్ధిస్తూ మునులు దీక్షతొ చేస్తున్నారు యజ్ఞం
       
    19    శ్వేతాంబరదారి పాహిమాం పాహిమాం
        పీతామ్బరదారి రక్షమాం రక్షమాం
        దిగంబరదారి ప్రణామం ప్రణామం
        రాక్షసులచేతిలో చిక్కి అవుతున్న నిర్జీవ0
       
    20    ప్రార్ధనలతో చెప్పుకుంటున్నారు బ్రతకలేము ఈ దర్భార జీవితం
        పరమాత్మ వచ్చి రక్షిస్తాడని ప్రజలందరి ఆత్మా విశ్వాసం
        దేశం సర్వతోముఖముగా ఉండాలని ఋషులు చేస్తున్నారు హోమం
        మమ్ము సృష్టించిన పరమాత్మునిపై పెడుతున్నాము భారం
       
    21    సమస్త శాస్త్ర సమ్మిళితమైన వేదాంత మయం
        సకలప్రాణుల రక్షణకు విష్ణువు కోసల్యా గర్బం చేరే సంకల్పం
        సమస్త ప్రాణుల హ్రుదయానందం లో ఆనందమయం
        దేవతలు, ఋషులు, మునులు, అనుభవించారు ఆనందం
       
    22    యజ్ఞగుండం నుండి విశాల దేహుడు ఆవిర్భావం
        హస్తములందు తేజరిల్లు పూర్ణ కుంభ పాయసం
        భార్యలతో త్రాగిమ్చుము కలుగును పుత్ర సంతానం
        యజ్నపురుషుడు అందిచే దశరధునికి పూర్ణకుంభం
       
    23    పూర్ణకుంభం నుండి కౌసల్యకు పంచే పాయసం అర్ధ భాగం
        సుమిత్రకు ఒసమ్గె పాయసం అర్ధ భాగంలో అర్ధ భాగం
        మిగిలిన అర్ధభాగంలో కైకకు పంచే పాయసం అర్ధ భాగం
        మరల పంచే సుమిత్రకు మిగిలిన మొత్తం పాయసం
       
        24.దశరధుని వాంచా ఫలసిద్దికోరకు విష్ణువు ప్రవేసించే కౌసల్యా గర్భ0
        దేవతా స్త్రీల యందు దేవతల అంశలు ప్రవేసిమ్చుటకు సిద్దం
        కొందరు భల్లూకములుగా, మరికొందరు వానరులుగా జననం
        ఇంద్రుని అమ్శతొ వాలి, సూర్యుని అమ్శతొ సుగ్రీవుదు జననం

        25.కౌసల్యాదేవికి చైత్రశుద్ధ నవమి నాడు ఉండే పునర్వసు నక్షత్రం
        కర్కాటక లగ్నమునందు గ్రహములన్నియు ఉండే ఉచ్చస్తానం
        దివ్య మంగళ విగ్రహుడైన, సుందరుడైన కుమారుడు జననం
        కైకకు పుత్ర జననం మరియు సుమిత్రకు పుత్రులు జననం
       
        26.సర్వ దేవతలు కురిపించిరి పుష్ప వర్షం
        గందర్వులు చేసారు అద్భుత గానం
        అప్సరసలు చేస్సారు అద్భుత నృత్యం
        ఋషులు లేక్కకట్టారు కుమారుల జాతకం
       
        27.పుత్రులకు చేసే బ్రహ్మ ఋషులు నామకరణం
        కౌసల్యా సుతుడైన జేష్టునకు శ్రీ రామం
        కైకేయ గారాల సుతునకు భరతం
        సుమిత్రా పుత్రులకు లక్ష్మణం , శత్రుఘ్నం

       
        28.అంజనా గర్భమునందు వాయు తేజస్సుతో పుత్ర జననం
        వానర రాజు ముద్దుగా పిలుచుకొనేను ఆంజనేయం
        సూర్యుని పండు అని భావించి తినుటకు పయనించే గగనం
        ఇంద్రుని వజ్రాయుధం తగిలి భూమిపై పడే సజీవ శరీరం

        29.వాయుదేవుడు స్తంభిమ్చే పవనం
        ఋషులు దేవతలందరు ప్రత్యక్షం
        త్రిమూర్తులు బ్రతికించే వాయు నందనం
        అనేక వరాలతో ఇచ్చే అమ్దరూ ఆశీర్వాదం
       
        30.లోకరక్షకుడు శ్రీ మహా విష్ణువు స్రీ రాముడుగా అవతారం
        ధర్మభోధ శాస్త్రములలో రామాయణం కావ్యం అగ్రగణ్యం
        వేదములతొ సమానమైన రామాయణం ప్రజలకు మర్గదర్శ0
        నారదుని ఉపదేశానుసారం రామాయణం వాల్మీకి కృతం
       
        31.రాజకుమారులను అల్లారు ముద్దుగా పెంపకం
        శ్రీరాముడనగా ప్రతిఒక్కరికి అమిత ప్రేమ మయం
        అన్నదమ్ములు కలసి ఆడుకుంటే అందరికి ఆనందం
        దశరధ మహారాజుకు శ్రీ రాముడంటే ప్రాణానికి ప్రాణం

        32రాజకుమారులు ప్రతి దినం వేదముల యొక్క స్వాద్యనం
        తల్లి తండ్రులపై ప్రేమ, అందరి హృదయాలలో సుస్తిరస్థానం
        కుమారులు ప్రతిరోజూ విలువిద్య, సకల శాస్త్రముల అభ్యాసం
        పది సంవస్చరములలొ సకల విద్యలలో పొందే నైపుణ్యం
       
        33.అయోధ్యలో ప్రతిఒక్కరు పాటలుగా పాడుచున్నారు రామనామం
       
               ఉన్న నామములోకేల్ల ఉన్నత మైనది రామనామం
        వరుస ఎవ్వరు విన్న వాడి చెడని నామం రామనామం
        ఏజాతి వారికైనా ఎమ్గిలిలేని ఎదలో నిల్చిఉన్న నామం రామనామం
        కలియుగంలో కన్నవారికి కనువిందు చేసే కమనీయ నామం రామనామం
       
        వానకు తడవని, ఎండకు కరగని, చలికి చలించని నామం రామ నామం
        ఎపుట్ట చూసిన ఎగట్టు చూసిన చెదలు పట్టని నామం రామనామం
        ఇహము పరము సర్వ సుఖములు ఇచ్చు నామం రామనామం
        నమ్మినవారికి కొంగు బంగారమై ఉన్న నామం రామ నామం
       
        కోరినవారికి కోరికలు తీర్చి సంతోషము పంచే నామం రామనామం
        రామ భక్తులకు మోక్షము ప్రసాదించే జపనామం రామనామం
        గాలిలో తేలి గగనమునందు మారుమ్రోగే నామం రామనామం
        అక్షర జ్ఞానము లేని ఆది మానవులను ఆదుకొన్ననామం రామనామం
       
            చిందులు వేసే చిలకపలుకుల నామం రామనామం
        చింతలు తీర్చి చిరునవ్వులనవ్విమ్చే నామం రామనామం
        నిగ్రహశక్తి, ధైర్యమును ప్రజలకు కల్పించే నామం రామనామం
        రామభక్త హనుమంతుని నామం రామనామం
                                                      ఇంకా ఉన్నది వచ్చేవారం
--((*))--  .
వినరో భాగ్యము విష్ణు కధ !
.
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ
.
ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ
.
నాదించీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ
.
వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ
.
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ
.
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ
.
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లిగొలిపె నీ విష్ణుకథ
https://www.youtube.com/watch?v=3Rvx0sUKzvo
 సర్వేజనా సుఖినోభవంతు  -ఓం శాంతి:  శాంతి: శాంతి:











మీ అమూల్య సలహాలే మాకు అక్షర సత్యాలు అందరకి సంక్రాంతి శుభాకాంక్షలు

--(