31, జనవరి 2018, బుధవారం

ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞాయోగము - అంతర్గత సూక్తులు-2



101.  పాచి నీళ్లల్లో పుట్టి నీళ్లనే ఆవరిస్తుంది, కంటి పొర కంటిలో  పుట్టి కాంతిని ఆవరిస్తుంది, అట్లాగే మాయ పరమాత్మను ఆవరించి ఉన్నది కనుక మాయ పారమాత్మ సంబంధమైనది.

102.  సత్వ రజో తమో గుణాలను మాయ కప్పి ఉంటుంది అది తొగించుకోవటానికి ప్రయత్నిమ్చాలి అనగా తాడును విప్పితే తాడు మాయ మైనట్లు మనలో మాయ కుడా మాయ మవుతుంది.

103.  నా పుస్తకము నా కుక్క మనం అన్నట్లే నా మాయ పరమాత్ముడు చెప్పకనే కల్పిస్తాడు.

104.  నన్ను ఎవరు ప్రార్దిస్తారో శరణు పొందుతారో, ఆశ్రయిస్తారో అట్టి  వారు మాయను దాటగలరు .

105. మొదటి సులభమైనది  భక్తి  మార్గం, రెండవది కష్ట మైనది జ్ఞానమార్గం లో అనుసరించిన మాయను తప్పించు కోగలరు.

106.  మనం కాలానికి లొంగి ఉండ వలసిందే ఆశలకు పోతే మాయ ప్రేగుతుందేతప్ప తగ్గదు, అందుకనే నిత్యము భగవంతుని ధ్యానిస్తూ ఉంటె మాయ ఏ పరిస్థితిలోను ఆవరించదు.

107. దుర్యోధనుడు దుష్టుడైన శకుని మాటలు విన్నాడు విదురుడి మాటలు వినలేదు, రావణుడు మారీచ మాటలు వినక సీతను అపహరించి మృత్యువును తెచ్చుకున్నాడు.  స్వార్ధబుద్ధి ఆవహిస్తే మంచి మాటలు  వినబడవు. 

108. నాకు అన్ని తెలుసు, నేను పట్టిన కుందేలుకు మూడే కళ్ళు వాదిస్తాడు, దుర్యోధనుడు కర్ణుని నమ్మి యుద్ధం చేసాడు, గెలవలేడని తెలిసి కూడా అతన్నే చివరిదాకా నమ్ముతాడు అదేమాయ . 

109. శాస్త్రాలు చదువుకున్న పండితుడు  ఆసవళ్ళ, మమకారమువల్ల  జ్ఞానం తెలియపరచ లేక పోతాడు.

110. ఒకడు మృగం లా ప్రవర్తిస్తాడు కారణం గతజన్మలో మృగజన్మ ఎత్తి అవాసనతో తృప్తి   చెందక మనిషి జన్మ ఎత్తిన మృగాలక్షణాలను వదలరు ఇదే మాయ.              


111. ఒకడు అదేపనిగా భార్యను కొడుతూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పిన వినడు ఇటువంటి వాడు దున్నపోతు స్వభావము కలవాడు. 

112.  ఒకడు  చేయ కూడని పనులు చేస్తూ ఉంటాడు ఇటు వంటి వాడు పంది స్వభావము కలవాడు.

113. ఒకడు ఇక్కడ మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, ఉన్నవి లేనివి, కలిపి చెప్పి పొట్టనింపు కొనేవాడు అట్టివాడు నక్క స్వభావము కలవాడు.

114. ఒకడు దుర్మార్గపు విషయాలనే నూరి పోస్తూ ఉంటాడు వీడు విషాన్ని క్రక్కే పాము స్వభావము కలవాడు. 

115. ఒకడు ఆస్తులు కాజేసి వినయంగా ఉంటూ జలగల్లా పీక్కు తినేవాడు. 

116. జంతువులు లాగా, మీది మీది కొస్తారు వీరే నరాధములు, వీరు దేవుణ్ణి మనసులో కూడా అనుకోరు, అంతా నా కష్టార్జితం అంటూ మాయతో జీవిస్తారు.            

117. కక్ష ,హింస, కౄరత్వం, ద్వేషించటం, ఏడిపించటం, హానికల్గించటం, ప్రాణాలు తీయటం ఇవి రాక్షస లక్షణాలు వీరిలో దయ ఉండదు ఇటువంటి వారు మాయలో ఉండి మాయలోనే మరణిస్తారు. 

118. కష్టాలలో దు:క్ఖాలలో ఆదుకొనేవారు ఆర్తులు వీరు భగవంతుని ధ్యానిస్తే శాంతిని పొందగలరు . 

119. శారీరకం రోగమయం - ప్రపంచం దు:ఖమయం అన్నారు.  అయినా భగవంతుని తలచిన వానికి కోరికలు నెరవేరుతాయి. సద్బుద్ధి ఏర్పడుతుంది. 
          
120. '6' సంవత్సరాల బాలుడు అగు ధృవుని తపస్సు మెచ్చి భగవంతుడు వరము కొరకొనమనగా కోరికలు లేని స్వభావము ప్రసాదించ మన్నాడు. సకామా బుద్ది నిష్కామ బుద్దిగా మారింది.  

121. భగవంతుని వైపు తిరిగి కోరుకోవటం అర్ధార్థి అంటారు, కుచేలుడు, ఇభీషణుడు, ధ్రువుడు, పాండురంగడు  మరియు  ద్రౌపతి. 

122. భగవంతుని సాన్నిధ్యం దొరికితే చాలు సకాములు    నిష్కాము లౌతారు. 

123. జిజ్ఞాస ఉండి తీరాలి అది(మనం ఎం చేస్తున్నాము ఎంచేయాలి అని ఆలోచించాలి) దేవుని మార్గం ఎన్నుకోవాలి అదే భక్తి ఎందరో ఓం శ్రీరాం జపంతో  తరిస్తున్నారు. 

124. నిరంతరం ఆత్మయందు మనస్సును నిల్పి ఆత్మతో రమిస్తూ పరవ సించే భక్తుడే జ్ఞాని.  

125. ఆర్తులు దుఃఖాలు కలిగినప్పుడు, అర్ధార్ధులు కోరికతో ఉన్నప్పుడు, జిజ్ఞాసులు సందేహాలు కలిగినప్పుడు, భగవంతుని స్మరిస్తారు కాని జ్ఞాని ఎల్లప్పుడూ భగవంతునితో కల్సి ఉంటాడు. 

126. సూర్యునికి వెలుగు ఎట్లు సహజమో, భూమికి భరించే శక్తి ఎట్లు సహజమో అట్లే జ్ఞాని భక్తి సహజము పరిపూర్ణ భక్తుడు. 

127. ఇంద్రియాలను వశం చేసుకొని బుద్ధిని నిల్పి భగవంతుని వైపు దృష్టిని ఉంచి జీవించాలి.  అతడే నిత్యయుక్తుడు.                  

128. జ్ఞాని అనే వాడు ఏక భుక్తుడు అనగా పరమాత్మను  తలుస్తూ లోకాన్ని ఉద్దరించుటకు ప్రయత్నం చేసేవాడు. 

129. చలి పోగొట్టే గుణం అగ్నిది అయితే దగ్గరగా కూర్చున్న వారికి అది సహకరించ గలదు అట్లే భగవంతుని మనసులో తలుస్తూ ఉంటె మనసుకి, బుద్ధికి  ధైర్యము కలుగు (హనుమంతుని ధ్యానించాలి ). 

130. అందరి ప్రేమ పొందటం మంచిది, భగవంతుని ప్రేమ పొందటం ఇంకా మంచిది. ప్రేమ పొందినప్పుడు మన:శాంతి కల్గుతుంది, భగవంతుని ప్రేమ పొందినప్పుడు మోక్షం కల్గుతుంది.     

131. పంచాదారం బొమ్మ నీటిలో ఉంచితే దాని రూపం కోల్పోతుంది, యోగిగా మారాలంటే ఎప్పుడు దైవకార్యాలు, దైవధ్యానం, దైవస్మరణ చేస్తూ, దైవానికి దగ్గరై దైవంతో
ఐక్యమై ఉండాలి.        

1౩2. జ్ఞానికి నాకు తేడా ఉండదు, జ్ఞాని సాక్షాత్ నేనే అంటున్నాడు, ఆలోచనలు అంతమై భావాతీత స్థితిలో నిలిచినవాడు తాను  ఆత్మనే అనే అనుభూతిలో  ఉండాలి.   

1౩౩. సామాన్యులు కన్నా సత్కర్మలు చేసేవారు అధికముగా ఉంటారు. ఒకరికొకరు తోడుగా ఉండి శక్తి వంచన లేకుండా సంసారిగా ఉండి కూడా ధ్యానిస్తారు.   

1౩4. అల్పమైన వస్తువులను కోరువారు కృపనులు, పిసినిగోట్లు భగవంతుని కోరువారు ఉదారులు, ఎవరైనా సరే మనస్సుతో భగవంతునికి నిజాయితిగా విన్నపము తెలుకుంటే రక్షిస్తాడు, సహకరిస్తాడు. 

1౩5. బాహ్య విషయాల పట్టించు కోకుండా నిరంతరమూ భగవంతుని ధ్యానంలో ఉన్నవాడు యుక్తాత్ముడు. 

1౩6. ద్వైతంలో భగవంతుడు దూరంగా ఉంటాడు, ... విశిష్టా  ద్వైతంలో భగవంతుడు దగ్గరగా ఉంటాడు .... అ  ద్వైతం లో తానే భగవంతుడై ఉంటాడు. 

1౩7. జ్ఞానులను, జీవన్ముక్తులను దైవంగా భావించి జనులు కొలుస్తారు. 

1౩8. ఏరుపొంగి వచ్చిందంటే ఎక్కడో వర్షం పడినట్లే, మంచి ఉద్యోగమూ వస్తే పట్టుదలతో చదివినట్లే, అనేక జన్మలు చేసుకున్న పుణ్యబలం, సాధన బలం, శ్రవణ బలం జ్ఞానిగా మారుతాడు. 

139. ఈ జన్మలో సత్కార్యాలు చేస్తూ, సద్గంద్రాలు చదువుతూ, సద్గురువులను సేవిస్తూ, జ్ఞాణ ప్రాప్తికి సాదనలు చేయాలి. 

14౦. భగవంతుడు అంటున్నాడు "జ్ఞాని అంటే నేనే, నాకు జ్ఞానికి భేదంలేదు, అతడున్నచోటు కాశి, ఆతడు మునిగింది గంగ, అతడు పలికింది వేదం, అతడితో సాంగత్యం భగవంతునితో సాంగత్యం, అతనికి నమస్కరిస్తే నాకు నమస్కరించినట్లే, భోజనాది సత్కార్యాలు అతనికి చేస్తే  నాకు చేసినట్లే" కాని కలియుగంలో అటువంటి వారు దొరుకుట కష్టం మాయా జ్ఞానంతో మభ్యపెట్టేవారు పుట్టుకొస్తున్నారు జాగర్త. 

141. వాసు దేవుడంటే అన్నిటి యందు తాను ఉండి అన్నింటిని తనలో నిక్షిప్తం చేసు కునేవాడు.   

142. చూడబడేది, చూచువాడు, చూడటం అంతా  వాసుదేవుడే, సర్వాతర్యామిని తెలుసుకోవటం ఎవరి 
తరమూ కాదు . 

143. ఒకడు మట్టి వినాయకుని చేసి కొలిచాడు, సంపద పెరిగింది, వెంటనే ఇంకా సంపద పెరగాలని బంగారంతో వినాయకుణ్ణి, ఎలుకను, పీఠాన్ని, చిత్రాన్ని చేయించి  పూజించాడు ఆస్తి పోయి నష్టాలు పాలయ్యాడు. 

144. గత్యంతరం లేక కంసాలి వద్దకు పోయి అమ్మగా అన్నింటికీ ఒకటే రేటు ఏమిటి వినాయకునికి ఎక్కువరేటు ఇవ్వాలికదా అనగా, ఎక్కవ తక్కువ చూడం బంగారాన్ని విలువకడతాం అంతే. భగవంతున్నీ నమ్మకంతో కొలవాలి విగ్రహాలను బట్టి కాదు.  

145. వెదురుకఱ్ఱను లావుని బట్టి వెలకడతారు, చెరకు గడను రసం బట్టి వెలగడతారు, బంగారాన్ని మచ్చును  బట్టి వెలగడతారు, జంతువులలో శరీరాన్ని బట్టి వెలగడతారు, మానవులలో జ్ఞానిని బట్టి వెలగడతారు. 

146. భగవంతుని దృష్టిలో అంరూ సమానులే, చేయు చేయుచున్న పనిని బట్టి, కార్యదక్షతబట్టి, న్యాయ ధర్మాలని అనుకరించి సంపద సుఖము అందిస్తాడు .

147. అనేక కోరికలవల్ల వారు సంపాదించిన జ్ఞానం హరించుకు పోవుటవల్ల, తమ ప్రకృతి ప్రేరణవల్ల, ఆయా నియమాలను అనుసరించి ఇతర దేవతలను ఆరాధిస్తారు. 

148. చీకటిలో ప్రయాణించేవారికి దీపపు స్థంభం ఎంత అవసరమో, అజ్ఞానముతో ఉన్నవారికి జ్ఞాన బోధ అంత   అవసరము.. 

149. విఘ్నాలు కలుగ కుండా విఘ్నేశ్వరుని, చదువు వచ్చుటకు సరస్వతీ దేవిని, సంపదను వృద్ధి వచ్చుటకు లక్ష్మీదేవిని, కష్టాలు తొలగించుటకు వేంకటేశ్వరుని, వివాహ విషయంలో గౌరీ దేవిని, భూత్ ప్రేత పిశాచాలనుండి, నరదిష్ఠి నుండి, భయం తొలగించి ధైర్యాన్ని ఇచ్చే ఆంజనేయస్వామిని , సకల ప్రేమలు పొందుటకు నన్నే నిత్యమూ ఆరాధించుట మంచిది. 

150. కోరికలు తీర్చుకొనుటకు కాలమును వ్యర్ధము చేయుట, కలియుగంలో పుట్టుకొచ్చే బాబాలను, మిడి జ్ఞానంతో బోధలు చేసే పండితులను పూజించుట ఎంతవరకు సమంజసం. ఓం శ్రీ రామ్ లేదా హరేరామ హరేకృష్ణ అని తలవండి మనస్సు ప్రశాంత పడుతుంది కార్య సాధన జరుగుతుంది. 

151.  కోరికలు ఎక్కువగా ఉంటే  ప్రమాదం, ఇంటిలో సామాను ఎక్కవ ఉంటే గాలి తక్కువ, అతిగా ఆలోచిస్తే మనసు కదలనీదు . 

152.చితి చనిపోయిన తర్వాత కాల్చేది, చింత బతికున్నప్పుడే కాల్చేది. 

15౩.  ఒకే దేవుణ్ణి కొలవాలి, ఏదన్న కోరుకున్న వెంటనే పని కాలేదని దేవుడ్ని మార్చ కూడదు, మనం చేస్తున్న కర్మ ననుసరించి జరుగుతుందని గమనించాలి. 

154. గుంటను ఒకేచోట పట్టుదలతో తవ్వాలి అప్పుడే నిరు పడతాయి, పది చోట్ల పదిగుంటలు త్రవ్విన  నీల్లు పడవు. 

155. పిల్ల ఏడ్చినప్పుడు తల్లి వచ్చినట్లు, భక్తుడు పట్టుదలతో పిలిస్తే బాంతుడే వస్తాడు. 

156. దేవుని పట్ల శ్రద్ద ఉంచి పూజిస్తే సిద్ధి కలుగుతుంది, భగవంతుని తలుస్తూ ఉంటె తప్పక సహాయపడతాడు. 

157. చలించని విశ్వాసంతో ఆరాధిస్తే తప్పక మోక్షము కలిగిస్తాడు పరమాత్ముడు. 

158. భగవంతుడు పుట్టుకలేనివాడు, నాశనము లేనివాడు శా స్వితుడు, అవ్యయుడు.                

159.  పోల్చదగినవాడు మరొకడు లేడు, అధికుడు లేడు కనుక సర్వోత్తముడు.  

160. పరమాత్మ స్వభావము తెల్సుకోలేనివారు అల్పులు, ఎక్కవమంది సామాన్య దృష్టి కలవారు. భగవంతుడు సర్వవ్యాపకుడు. 
          
161. ఏ ఏ భక్తులు ఏ ఏ రూపాన్ని ఆరాధించాలను కుంటారో ఆయా భక్తునికి అందులోనే  చలించని శ్రద్ధను నేను కల్పిస్తాను అని భగవంతుడే తెలియఁపరిచాడు . (7/21)

162. ఇప్పుడున్న జీవుల్లను, గతించిన జీవుల్లను, భవిషత్తులో పుట్టబోయే జీఉళ్లను నేను తెలుసుకో గలను, నన్ను మాత్రం మీరు తెలుసుకోలేరు.

163. భూత భవిషత్ వర్తమాన కాలములలో సమస్త ప్రాణులను సాక్షిగా కేవలము సాక్షిగా చూస్తూనే ఉన్నాడు.    

164. పుస్తకములో  విషయాన్ని మనం తెలుసుకోగలం కాని రచయతకాని, పుస్తకము కానీ తెలుసుకోలేదు. 

165. పరదా వేసుకున్న స్త్రీ అందరిని చూడగలదు, ఆమెను ఎవ్వరు చూడలేరు. ఇంద్రియాలను నడిపించేది దేవుడనే మనకు తెలుసు కానీ చూడలేము. 

166. ఎవ్వరూ చూడుటలేదని "పాపపు పనులు, అబద్హాలు ఆడటం, దొంగతనం చేయటం, వాగ్దానం చేసి మరవటం, అబాండాలు వేయటం" అనేవి చేయరాదు.       

167. మనం అజ్ఞానులం యోగమాయచేత మనం అనేక తప్పులు చేస్తున్నాము కనుక పశ్చాతాపముగా దేవుణ్ణి వేడుకుంటే క్షమించి  మనశాంతి కల్గిస్తారు. 

168. ఒకరిని చూడగానే ప్రేమ అనురాగం కలుగుతుంది, ఒకరిని చూడగానే భయం కలుగుతుంది. ఇది ఎదుటి వారి ప్రవరాతన బట్టి మారుతుంది. 

169. ఇచ్ఛా ద్వేషాలను తపింప చేయాలంటే జ్ఞానమందు ఆసక్తి కలగాలి. ఇవి పుట్టుకతో వస్తాయి వీటిని తొలగించాలంటే పుణ్య కార్యాలు చేయాలి. 
               
170. పుణ్యకార్యాలు, దైవకార్యాలు, దాన దానధర్మాలు, చేయుటవలన చేసి నన్ను చెదరని దీక్షతో కొలిస్తే చేసిన పాపములు తొలగి పోతాయి. (7/28) 

171. పాపి పాపిగా ఉండి భగవంతుని చేరలేడు, తన పాపకర్మలకుస్వస్తి చెపితేనే అతడు భగవంతున్ని చేరే మార్గం తెలుస్తుంది. 

172.    పుణ్యార్మలు చేయాలంటే కొంత శక్తి, కొంత ధనము ధారపోయాలి అదే ఆపదలో నిన్ను ఆదు కుంటుంది అని తెలుసుకోవాలి. 

173. ద్రౌపదికి కృష్ణుడు చీరలు అందించి మానం కాపాడాడు అంటే ఆమెచేసిన పుణ్యం ఈ రూపంలో సహకరించింది. 

174.  ద్రౌపది సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఒక సాధువు కౌపీనం అలలకు కొట్టుకుపోగా అప్పుడే ఆటూవచ్చిన  ద్రౌపది చీరకొంగు చింపి అందించింది. "ఆచిన్న వస్త్రము అక్షయమై ద్రౌపదిని రక్షించుగాక "దీవెన ఇచ్చే వెడలెను . 

175. పుణ్య మైన, పాపమైన కొంచెం చేసిన అనంత ఫలాన్ని ఇస్తుంది. 

176. ఎవరయితే జరామరణముల నుండి విడుదల పొందాలని నన్ను అశ్రయించి సాధన చేస్తారో ఆ బ్రహ్మను , యావత్తు ఆధ్యాత్మాన్ని, సమస్త కర్మలు తెలుసు కుంటారు. 

177. జరా అంటే వృద్దాప్యం ఇది అందరికి తప్పదు, మనల్ని గౌరవించినవారు ఎదురుతిరగవచ్చు, పెత్తనం చేయవచ్చు అవమాన పరచ వచ్చు అందుకనే వానప్రస్తం అంటూ భగవద్ ధ్యానంలో గడపమన్నాడు భగవంతుడు. 

178. జన్మదుఃఖం, జరాదుఖం, వ్యాధి దు:ఖం, మరణదుఃఖం తప్పించు కోవాల్సినదే, అందుకే చితి మంటలుకన్నా చింతల మంటలే భాధకరం. 

179. నన్ను ఆశ్రయించాలి, సాధన చేయాలి, ఆత్మ ధ్యానం చేయాలి, అలాచేసి చివరకు ఆత్మగా ఉండిపోవాలి. 

180. తీవ్రప్రయత్నం చేయాలి, తనను తాను  ఉద్దరించు కోవాలి, ప్రయాత్నం లేకపోతే ప్రగతి లేదని తెలుసు కోవాలి.


ఏడవ అధ్యాయము  జ్ఞానవిజ్ఞాయోగము - అంతర్గత సూక్తులు. రచయత : మల్లాప్రగడ రామకృష్ణ.com. 7/180

181. చీకటిలో కూడా చిన్న లాంతరు ఉంటే ఎంతదూరమైనా వెళ్ళవచ్చు, అలాగా జరా (ముసలివారు 
) నుడి విముక్తి కలగాలంటే భగవంతుని ఆరాధించాలి. 

182. శరీర మనోబుద్దులు తదాత్మ్యాన్ని విడిచిపెట్టి నప్పుడే అందరిలో ఉన్న అంతర్యామిని సాధకుడు కనుకొన గలుగుతాడు. 

183. భేదదృష్టిని తొలగించుకొని, అందరిలో ఉన్న  పరమాత్మను గ్రహించి సేవచేయాలి. 

184. సమస్త కర్మలు బ్రహ్మమే కనుక కర్మలు నశించినప్పుడే  బ్రహ్మస్వరూపు డవుతాడు. 

185. ఆది భూతం, ఆధిదైవం, అది యజ్ఞంతో కూడిన నన్ను ఎవరు తెలుసుకుంటారో వారి మనస్సు స్వాధీనంలో ఉండి ప్రయాణ కాలంలో కూడా నన్ను గుర్తించు కోగలుగు తారు. 

186. ఆది భూతం అంటే నశించిపోయే జడవర్గ రూపమైన తత్త్వం. అదే క్షేత్రం  

187.   ఆది దైవం అంటే జీవుడే అజ్ఞానం తొలగటంతో అంతమయ్యేది......    జీవుడే. 

188. ఆధియజ్ఞుడు అనే అందరిలో అంతర్యామిగా ఉన్న  పురుషుడే ...ఆత్మయే . 

189. ధనవంతుడు మంచానపడ్డాడు, అంతిమ ఘడియలలో ఎమన్నా చెపుతాడని చుట్టూ చేరారు, అమూ లనున్న చీపురు జాగర్త అనిచెప్పి మరణించాడు, మరుజన్మలో చీపురుగా పుట్టాడు.    
  
190. అంత్యకాలంలో కూడా భగవంతుని తలచినవారే పరమాత్మను తెలుసుకో గలుగుతారు..     

     
విజ్ఞానయోగో నామ సప్తమధ్యాయ: సమాప్తము.   

భగవద్గీత (అంతర్గత సూక్తులు మొత్తం చదవాలనుకున్నవారు గూగుల్ నందు ప్రాంజలి ప్రభ. కం (అంతర్జాల పత్రిక యందు ) ఉన్నది చదవగలరు ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ           

18, జనవరి 2018, గురువారం

ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞాయోగము - అంతర్గత సూక్తులు



Photo
ఓం శ్రీ రామ్ - ఓం  శ్రీ మాత్రేనమ: - ఓం శ్రీ పరమాత్మనే నమ:
ఏడవ అధ్యాయము  జ్ఞానవిజ్ఞాయోగము - అంతర్గత సూక్తులు
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

1. మనస్సే  పరిమితం. పరమాత్మ అపరిమితం , మనస్సు పరిమితాన్ని అధిగమించా లంటే బుద్ధికి ఆధీనం కావాలి.

2. దైవాంశపై ఏకాగ్రత పొంది, అభ్యాసం కొనసాగి తేనే ఆ మనసుకు వికాసం కలుగుతుంది.

3. వేదాంత శ్రవణం కాలక్షేపం కాదు, ఆచరించి ఆందు కోగలవారు మాత్రమే భగవంతుని భక్తికి ఆర్ద్రత కలిగి ఉంటారు.

4. మనస్సనేది ఒక టార్చిలైటు వంటిది, టార్చిలైటు చెట్టు మీదకు త్రిప్పితే చెట్టు కనబడు తుంది, వస్తువు మీద త్రిప్పితే వస్తువు కనబడుతుంది.

5. మనస్సును భోగాలవైపు త్రిప్పితే భోగ వస్తువలపై ఆసక్తి కలుగు తుంది, అట్లాగే మనస్సును  మోక్షం వైపు త్రిప్పితే  భగవంతుని మీద ఆసక్తి కలుగుతుంది.

6. మోక్షం పొందాలంటే ఆసక్తి ఉండాలి, తపన ఉండాలి, మనస్సును నాయందే లగ్నము చేసి ఉంచు అని భగవంతుడే తెలియపరిచాడు.

7. నీటినుండి బయటపడిన చేప మఱల నీటిని చేరేవరకు గిలగిలాడును. అట్లాగే భక్తుడు భగవద్వియోగమును, విస్మరణమును క్షణమైనను తట్టుకొనలేక విలవిలలాడును.

8. గజేంద్రుడు ఎలా భగవంతుని కోరాడో అదేవిధముగా సర్వ సమర్పణ చేసుకొని అంతా నీకే  అర్పిస్తాను , నేను నిమిత్తమాత్రుడను.నాకు నీవు తప్ప వేరొకరు లేరు నిన్నే ప్రార్ధిస్తున్నాను.

9. ఒక పనిమనిషి పగలనుండి రాత్రిదాకా పనిచేసినా భోజనము  అన్ని సదుపాయాలు చూపిన ఇది ఆశ్రయస్థానము మాత్రమే  భర్త పిల్లల క్షేమము ఆసక్తి స్థానము అని తెలుసుకోవాలి. 
     
10. మనుష్యులు పరమాత్మనే ఆశ్రయించామని, ప్రార్ధించు చున్నామని గట్టిగా చెప్పుతుంటారు, కానీ ఆసక్తి మాత్రం భార్య బిడ్డలకోసం ప్రేమను మాత్రం వదులుకోలేరు.    
                  
11. దేనిని తెలుసుకుంటే తిరిగి తెలుసుకొనేది మరొకటి ఉండదో అట్టి విజ్ఞానంతో జ్ఞానాన్ని మీకు చెపు తున్నాను.

12. శాస్త్రంలో జ్ఞానం అనంతం, మానవుని ఆయుర్దాయము స్వల్పము దానిని ఎవ్వరు మార్చలేరు. 

13 . పూర్తిజ్ఞానం నేర్చుకోవటం  అందరికీ కష్టం, ఎంతో పట్టుదలతో నిష్ఠతో భగవంతుడు తెలిపే బ్రహ్మజ్ఞానాన్ని అభ్యాసముతో నేర్చుకొని ఆచరించాలి. 

14 చెట్లయొక్క కాండాన్ని, ఆకులను కొమ్మలను తడపటంకష్టం ఒక్క వేరుదగ్గర తడిపితే చెట్టు ఎదగ కలదు. అట్లాగే అనేక శాస్త్రాలు చదివే బదులు ఒక్క బ్రహ్మజ్ఞానాన్ని చదివితే చాలును. 

15 . శివచరిత్రలో  గణాధ్యక్షుడు ఎన్నిక "వినాయకునకు, కుమారస్వామికి" ఇరువురిమధ్య జరిగింది ఒకరు చెప్పిన ప్రకారం తిరిగి వచ్చారు, మరొకరు బుద్ధితో తండ్రికి ప్రదక్షణ చేసి విజయం సాదించారు.  

16 .భగవానుడు తెలిపే జ్ఞానాన్ని అర్ధం చేసుకొని అను కరిస్తూ ఉంటె బ్రహ్మజ్ఞానమ్  తేలికగా అర్ధం చేసుకో గలుగుతారు. 

17. అనుభూతి లేని శాస్త్రం నేర్చుకుంటే పాయసం లో గరిటలా ఉండి పోవలసినదే.

18.ఒక తండ్రి కొడుకు ఎంత విద్యనేర్చు కున్నాడో తెలుసు కొనేందుకు ప్రశ్న వేసాడు అదే ఇది " దేనిని తెలుసుకుంటే సమస్తము తెలిసినట్లు అవుతుందో ఆవిద్య ను తెలుసు కున్నావా? . 

19 జవాబు తండ్రి చెప్పాడు ఏమిటంటే మట్టిని తెలుసు కుంటే తయారయ్యే వస్తువులన్నీ తెలుసు కున్నట్లే, అ ట్లాగా కారణాన్ని తెలుసు కుంటే కార్య రూపా వస్తు వలన్నిటిని తెలుసు కున్నట్లే. 

20.అట్లే భగవంతుడు బోధించిన భగవద్గీతను పూర్తిగా అర్ధం చేసు కుంటే బ్రహ్మజ్ఞానముతో కూడిన మోక్షం వస్తుందని భగవంతుడే తెలియపరిచాడు.   
  
భగవద్గీత అనర్గత సూక్తులు – 7 వ అధ్యయము

21. ఆత్మజ్ఞానం విలువైనదే కాని అంత సులువైనది కాదు, ఇది మానవ జన్మకు మాత్రమే అర్హత కలిగి ఉన్నది.

22. ఆత్మజ్ఞానం పొందుటకు మానవునకు పరమలక్ష్యమని, పట్టుదలతో పొందే విదానము తెలుసు కొని, ఆటంకముగా ఉన్న దోషాలను తొలగించుకొని, మార్గం చూపే సద్గురువును సమీపించి వారిద్వార పొందగలరు.

23. లోకంలో కోట్లమందిలో జ్ఞానం పొందేవారు అరుదు, పట్టుదలతో సాధన చేసేవారు అరుదు, సిద్ధిపొందేవారు ఇంకా అరుదు. పరమాత్మ యొక్క యదార్ధతాత్వాన్ని అర్ధం చేసుకున్నవారు ఇంకా ఇంకా అరుదు. తెలుసుకున్నవారు గురుస్థానములో ఉండి భోధ చేసేవారు ఇంకా ఇంకా ఇంకా అరుదు.    

24. చెట్టుకు అనేక పూలు పూస్తాయి, వాటిలో కొన్నే పిందలుగా మరుతాయి, ఎకోద్దిగానో పలాలుగా మారుతాయి. అల్లాగే జ్ఞానంపొందే వారు కొందరే, జనంసర్ధకం శేసుకోనేవారు మరికొందరు, మోక్షాన్ని పొందేవారు బహుఅరుదు.

25. ౮౩ లక్షల 99 వేల 999 గర్భాకోసాలలో తిరిగి మానవజన్మ ఎత్తుదురు. ఈ జన్మ రాహిత్యాన్ని అర్ధం చేసుకొని అభిమానాన్ని విడిచిపెట్టి, అవకాసాలను విడిచి పెట్టక, లౌకిక భోగాలను విడిచి మ్క్షసాధన చేయాలి.

26. సద్గురురువును ఆశ్రయించి శ్రవణ – మనన- నిధిద్యాసాల నాచరించి, నిత్య – నిరంతర - నిర్వికల్ప - సమాధి నిష్టయందు ఉండి వాసుదేవ పరబ్రహ్మాన్ని గ్రహించి ధ్యానించు.

27. భూమి, నీరు , అగ్ని , వాయువు, ఆకాశం, మఱియు మనస్సు, బుద్ధి, అహంకారం ఇలా ణ ప్రకృతి  ఎనిమిది విభాగాలుగా విభజించుట జరిగింది.

28.జడం (పుస్తకం ) దేనినీ తెలుసుకోలేదు, చైతన్యం (మనం ) అన్నీ తెలుసుకోగలము. జడాన్ని అపరా ప్రకృతి అందురు, చైతన్యాన్ని పరాప్రకృతి అందురు.

29. ఒక కాగితముపై గీసిన చిత్రము కొందరికి ప్రేమ, సంతోషం, పుజ్యభావము మరికొందరికి ద్వేషం, దుఖం, శత్రుత్వం, నిర్లప్తత ఏర్పడును దానికి కారణం గీసిన చిత్రంలో లేదు మన అభిలాశాపై మాత్రమే ఉన్నది అని గమనించాలి.

30. మనదృష్టి మాయకు లోబడి వేసిన చిత్రం పై ఉంటుంది కాని మాయాధిపతి అయిన పరమేస్వరునిపై మాత్రం గుర్తించలేరు.

31. బలం కనిపించదు కర్యరూపమ్ దాల్చినప్పుడు తెలుస్తుంది, అట్లాగే గాలి కనిపించదు అదికూడ చెట్ల కదలికవల్ల తెలుస్తుంది, మాయాశక్తి కనిపించదు అనుభవరూపమ్లొ తెలుసుకోగలుగుతారు.

32.విత్తనాలు భూమిలో నీటికి ఉబ్బటం మాయా, అవి మోక్కగా ఎదగటం అహంకారం,  కొమ్మలుగా ఏర్పడేది మనస్సు, ఆకులుగా, పువ్వులుగా, కాయలుగా మారటం బుద్ధి, పంచ భూతాల ద్వారా చెట్టు ఎదుగుతుంది.

33.  అపరాప్రకృతి జడమైనది అల్పమైనది, పరాప్రకృతి జీవరూపం చైతన్యంతో జగతంతా విస్తరించి ఉంది అదే మానవజన్మ ఇద భగవంతుని యొక్క స్వరూప పకృతి.

34. మనుష్యులలో ప్రాణం అనే పక్షి నవద్వారాలు తెరిచి ఉన్నా  బయటకు పోదు, కాని పోకుండా ఉందక్ మానదు అది ఎప్పుడో ఎవ్వరూ చెప్పలేరు. దీనినే మిధ్యా వాదం అంటారు కొందరు.

35. స్త్రీ పురుషుల కలయకే గర్భదారణ, అట్లాగే కరెంటు జడపదార్ధమైన బల్బులోకి వస్తేనే వెలుగుతుంది. రెండూ కలిస్తే నే కాంతిపుంజం

36. మట్టినుండి వచ్చిన కుండ మట్టి లో కలుస్తుంది, అట్లాగే పుట్టిన జీవులందరూ మట్టిలో కలవాల్సిందే. ప్రళయాన్ని సృష్టించేవాడు, పునరుత్పత్తికి సహకరించేవాడు భగవంతుడే.

37. ప్రకృతితో పురుషుడు కలిస్తే జగత్తు యొక్క సృష్టి, ప్రకృతి నుండి విముక్తుడైతే జగత్ యొక్క లయం.

38. నాకన్నా ఎక్కువైనదీ, వేరైనదీ కొంచం కూడా ఏదీలేదు అనే భావనతో ఉండుట పురుష లక్షణం. ప్రేమే నాసోనం అనుకోవటం స్త్రీ లక్ష్యం.   

39. బౌధిక ధనం సంపా యించటం కాదు, ఆద్యాత్మిక ధర్మం సంపా యించటం గొప్ప విశేషమని గ్రహించాలి.

40. ఎంతో కష్టం తో ధనం సంపాయించటం గొప్ప కాదు, పట్టుదలతో ఆద్యాత్మిక జ్ఞానం సంపాయాంచటం గొప్ప.

41.  మన ప్రవర్తనలు దృష్టిని బట్టి నడుస్థాయి, ఆ దృష్టే సుఖానికి, హాని, కలహానికి మూలకారణ మౌతాయి.

42. దృష్టి జ్ఞాన కరమైతే సృష్టి బ్రహ్మకార మౌతుంది, దృష్టి వక్ర బుద్ది తో చూస్తె సృష్టి ప్రళయాన్ని ప్రేమిస్తుంది.   అని వేదం చెపుతుంది.

43.  ఎవరైనా మాయకు లొంగే వారే ఎంగిలి ముద్దలకు ఎగబడేవారే, ప్రేమా,  స్నేహంతో ముద్దలకోసం పోట్లాడుతూ
 ముద్ద దొరికితే పరమానందం పొందేవారే అదే ఈ లోకం.

44. ప్రతి విషయంలో అందరిపై ఆధార పడకుండా స్వయం ప్రతిపత్తితో ఎవ్వరికి హానికలగకుండా శక్తిని వ్యక్తపరచ కుండా, చేసిన పనిని గొప్పగా తెలప కుండా సర్వం కృష్ణమయం అని భావించి చేయాలి.

45. దారమునందు మణులు గ్రుచ్చబడినట్లు మనుష్యులందు పరమాత్ముడు ఉంటాడని తెలుసు కోవాలి, జరిగే పని అంతా మన మంచికే అని గ్రహించాలి.

46. పూలదండలో పూలు కదిలించి చూస్తే దారం కనిపిస్తుంది, అలాగే నామ రూప గుణాలను తొలగించి చూస్తే అంతటా పరమాత్మే కనిపిస్తాడు.

47. అంతటా ఉన్న పరమాత్మను చూడాలంటే బాహ్యద్రుష్టిని విడనాడాలి సూక్ష్మ దృష్టి , అంతర్ దృష్టి , జ్ఞాన దృష్టి కావాలి.

48. కెమెరా తో చిత్రం ఫై పై రూపం అందంగా చూపెడుతుంది, ఎక్సరే తో చిత్రం రూపం లోపలున్న ఎముకలను చూపెడు తుంది కనుక దృశ్యం మీద వ్యామోహాన్ని విడిచి దృక్కుమీద ఆసక్తి కలగాలి.

49. తల్లి పిల్లలకు పాలిస్తూ, గురువు శిష్యులకు జ్ఞానభోద చేస్తూ, వైద్యుడు రోగులను ఆరోగ్యవంతులను చేస్తూ, వ్యాపారస్తుడు వ్యాపారమున ధర్మ మార్గమున నడిపిస్తూ, పాలకుడు ప్రజలకు అన్నీ సౌకర్యాలను అంద చేస్తూ,           
ప్రతి విషయములో భగవంతుని ప్రమేయమున్నదని గ్రహించాలి.

50. పులి వేషము వేస్తే వాడు నిజమైన పులికాదు, అందుకే ఎవేషము వేసినా నిజరూపమ్ భగవంతుడని గ్రహించాలి.

51.  నీరు త్రాగి దప్పిక తీర్చు కున్నావంటే దాహాన్ని తీర్చే శక్తినీ రుచినీ  మన నోటిలో లాలా జలం ఊరిస్తాడు అందుకే దేవుడు రసస్వరూపుడు.    

52.  ఒకతను గంగలో కాణి వేసాడు ప్రక్కనవున్నవాడు దూమపానమ్ చేస్తూ కాణిలు వృద్దా చేస్తావెందుకు అని అనగా
రూపాయాలు రూపాయలు నిప్పులుపాలు చేస్తున్నావు అది తప్పు కాదా, నీటి ఉపయోగం తెలుసుకున్నవారు అట్లా అనరు.

53. చీకటి దెయ్యం లాంటిది దాన్ని తరిమేందుకు సూర్యుని నుండి, అగ్నినుండి, చంద్రుని నుండి వచ్చేవెలుగు పంపేది భగవంతుడు అని గమనించాలి, మన మనస్సులో ఉన్న చీకటి తొలగించే వెలుగును నింపేది భగవంతుడని గమనించాలి.

54. అకార ఉకార మకార శబ్ధమే ఓంకారం, మనదేహం 6 చెక్రాలు 52 దళాలున్నాయి, ఈ దళాలను అందించే శక్తి అనాహతధ్వని అందురు. ఈ ధ్వని మనలో ఉంటుంది సక్రమముగా దైవధ్యానమునకు ఉపయోగిస్తే ఓంకారం వినబడుతుంది.

55.  ఆకాశం ఖాళి ప్రదేశం అనేక వస్తువులు తిరగటానికి వీలు వుంటుంది, ఒకదానికొకటి ‘ డి’ కొని శబ్దం చేస్తుంది. ఆకాశం శబ్ద లక్షణం కలిగి ఉన్నది. మనస్సును శబ్దం ఉపాసనా లయం, ప్రతి శబ్దంలో ఉన్నది పారమాత్మే అని గ్రహించాలి.

56. మనస్సు పాము లాంటిది, పాము వంకర టింకరగా పోవటం, కనిపించిన వానిపై విషము చిమ్మటం అట్లాగే మనస్సు వంకరటింకరగా మారి, కోపం, ద్వేషం ఏర్పడుతుంది, అది విషంగా మారకుండా జగర్త పడటమే జీవితంగా భావించాలి.

57.  నేను -నాది అనే అహంకారం లేకుండా ఇది భగవంతుని ప్రేరణ అని గమనించాలి. భగవంతుని ఇచ్ఛ పురుషార్ధం అని తెలుసుకోవాలి.

58. జంతువులలో ఇతర ప్రాణులలో లేనిది, మానవులలో ఉన్నది పౌరుషం అదే “శక్తి, పట్టుదల” సృష్టించేది, పౌరుషం కల్పించేది భగవంతుడే అని గమనించాలి.

59. భూమిలో సువాసన నేను, అగ్నిలో ప్రకాశాన్ని నేను, సమస్త భూతాలలోని ప్రాణాన్ని నేను, తపస్సు చేసేవారిలో తపస్సును నేను అని భగవంతుడు తెలియ పరిచాడు (భగవద్గీత – 9 )

6౦. భూమికి సువాసనా లక్ష్యం ఉన్నది, దానిని మనం ఎలా కనుక్కోగలమో అంటే, వేసవిలో భూమి వేడెక్కి ఉన్నప్పుడు వర్షం పడగానే ఒకవిధమైన వాసన సుఘంధ పరిమళంగా విస్తరించును.

61. మన శరీరంలో మూలాదార చక్రం వద్ద సువాసన ఉంటుంది, యోగి అయానవాడు మూలాధార చక్రం వద్ద ఎకాగ్రంతో ధ్యానిమ్చినప్పుడు యోగి శరీరం నుండి సుఘంధం వెల్వడును, అట్టివారినే భగవద్ స్వరూపంగా భావించాలి.

62. ఆద్యాత్మిక కార్యక్రమములో జ్యోతిని ప్రజ్వలింప చేస్తారు, ఎందు కనగా అందులో భగవంతుడు ఉంటాడని గ్రహించాలి, అది ఓక తేజస్సుగా విస్తరించ ఉంటుందని గ్రహించాలి.  

63. అగ్నిని చూసినప్పుడు వెంటనే వేడిని గ్రహించగలము, తాకితే కాలుతుందని తెలుసుకో గలుగు తాము అదియే పత్యక్ష దైవముగా గ్రహించాలి, అగ్నికి మనం భుజించే పదార్ధాలను అర్పించం శ్రేయస్కరం.

64. బయటనున్న గాలి నాసిక రంద్రములద్వారా లోపలకు చేరి ప్రాణాన్ని రక్షించుతుంది, దుర్వాసనను వెన్నె తిస్కరించుతుంది,

65. మనలో ఉన్న ప్రాణం పరమాత్మ ఆయనే పరమేశ్వరుడు.  ప్రాణ స్వరూపంలో ఉండి నడిపిస్తున్నాడని గ్రహించాలి.

66. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను ధర్మ బుద్ధితో గ్రహించి ఉండటం  తపస్సు.

67.  నీవు నిర్ణ యించు కున్న లక్ష్యం కోసం ఎంతటి త్యాగాని కైన వెనుదీయ కుండా పట్టుదలతో ఉండటం కూడా  తపస్సు.                                                   
68.   సహనం, త్యాగం, తపన, తో  నిరంతరం భగవంతుని కోసం తపించటం తపస్సు.

69. ప్రహ్లాదుడు, దృవుడు, మార్కండేయుడు వారి పుట్టుకలు వేరైనా వారి ధ్యేయం భగవంతుని సాక్షాత్కారం కోసం తపనతో తపస్సు చేసి మోక్షం సాధించకలిగారు.

70. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యచంద్రులు , సర్వభూతములు వారిలో ఉన్న ధర్మాన్ని, లక్షణాన్ని,
గ్రహించుటకు నిర్ణీత కాలములో  నిత్యతపస్సు చేయవలెను. సర్వరా పరమాత్మ దరనాన్ని సాధించాలి అదే తపస్సు.           
   
71. మొదట బీజం ఉద్బవించింది అదేపరమాత్ముని సృష్టి అందరం పరమాత్ముని బిడ్డలమే మోకాలు ఎక్కువా ఒకరు తక్కువ కాదు. 

72. ఇంద్రియాలను మనస్సును స్వాధీనంలో పెట్టుకొని వస్తువు యొక్క స్వరూపాన్ని తెలిపేది బుద్ది ఈ బుద్ది పరమామ స్వరూపమే. 

73. తేజస్సు కలవాని ఎదుటకువెళితే తెలియకుండా లొంగి పోతాం నమస్కరిస్తాం.  తేజస్సు భగవత్ శక్తే కనుక భగవానుని ఉపాసన చేయాలి. 

74. కామ రాగాలు లేని బలం సంపాదించాలి అది ధనబలం, పశుబలం,  విద్యాబలం, జనబలం, మాయాబలం, మనోబలం వీటిని సాధించాలంటే భగవంతుని ఉపాసన పొందాలి. 

75. కామం అంటే తనదగ్గరలేని దాన్ని కావాలనుకోవటం, రాగం అంటే అన్నదానిపై ఆపేక్ష మమకారం పెంచుకోవడం. 

76. శకుని బలంతో దుర్యోధనుడు ధర్మరాజు రాజ్యాన్ని కాజేసాడు ఇదే కామం,  కాని ధర్మరాజు జనబలాన్ని, సోదరబలాన్ని ఉపయోగించి రాజ్యం సంపాయి0చాడు. ఇదే ధర్మం               

77. పరభార్యకోసం రావణుడు మారీచుని సహాయంతో మాయాబలంతో సీతను అపహరించటం కామం. తనభార్యను తెచ్చుకొనుటకు పరులను సహాయము అడుగుట ధర్మం . 

78. భుక్తి కోసం ఉపయోగించే విద్యాబలం పరమాత్మ కాదు , ముక్తి కోసం ఉపయోగించే విద్యాబలం పరమాత్మ అని గ్రహించాలి . 

79. ధనాన్ని సత్కార్యాలు ఉపయోగిస్తే సార్ధకం, త్రాగి విచ్చలవిడిగా ఖర్చుపెడితే వ్యర్థం . 

80. ధనం దుష్టునివద్ద ఉంటె అహంకారం, శిష్టుని వద్ద ఉంటె సుఖం, శాంతి. 

81. బలం దుర్మార్గునివద్ద ఉంటె పరపీడనం, మంచివానివద్ద ఉంటె రక్షణ . 

82. విద్య దుర్మార్గుని వద్దఉంటే వివాదం, సజ్జనుని వద్ద ఉంటె జ్ఞానం . 

83. ధర్మ విరుద్ధమైన కోరిక అశుర లక్షణం, ధర్మ పరమైన కోరిక దేవీ లక్షణం. 

84. సాధకుని స్థాయిలో చెడ్డ కోరికలు వదలి మంచి కోరికలతో సాధన చేయాలి . 

85. సిద్ధుని స్థాయిలో అన్నీ కోరికలు వదలి పరమాత్మునిపై మనసు లగ్నం చేయాలి. 

86. ముల్లును ముల్లుతోనే తీయాలి అనే విధముగా చెడ్డవాణ్ణి మార్చుటకు మంచివాడు చెడ్డవానితో స్నేహం చేసి మనసు మార్చాలి.   

87. దేవర్షులు, దేవతలు, బ్రాహ్మణులు, గోవులు చక్కర, శమ దమాదులు ఇవి అన్ని సాత్విక భావాలు. 

88. గంధర్వులు, ఏనుగులు, క్షత్రియులు, మిరియాలు కామ లోభ హర్షదులు ఇవి అన్నియు రాజసిక భావాలు. 

89. రాక్షసులు, పిశాచాలు, కుక్కలు, క్షుద్ర జీవులు, ఉల్లి, శోకమోహాలు - ఇవి తామసిక భావాలు. 

ఏడవ అధ్యాయము  జ్ఞానవిజ్ఞాయోగము - అంతర్గత సూక్తులు. రచయత : మల్లాప్రగడ రామకృష్ణ.com. 7/100

90. మేఘములకు కారణము ఆకాశమే అయినను అవి 
స్థిరముగా ఉండవు. 

91. భగవంతుడు  త్రిగుణమయ భావము లన్నిటికి కారణము ఆధారములు అయనప్పటికీ ఆ గుణములు అతనిలో ఉండవు. 

92. నాయందు త్రిగుణాలుకాని, త్రిగుణాల యందు నేను కానీ ఉండను.

93. భగవంతుడు సర్వత్రా నిండి యున్నాడు కానీ ప్రజలు కనుగొనలేరు. ఇదే కలియుగ మాయ.                  
          
94. పాము తాడుగాను, తాడు పాముగాను కనబడుతుంది, పై మెరుగులుకు మనసు కరుగుతుంది, లోపల విషము బయటబడ్డాక భాధ మిగులుతుంది ఇదే బ్రాంతి . 

95. ఎడారిలో  పరిగెడితే నీరు కనిపించి మాయ  మౌతుంది అట్లాగే ప్రపంచంలో లేనిది ఉన్నట్లుగాను, ఉన్నది లేనట్లు గాను బ్రమింప చేస్తుంది.

96. తండ్రి పరమాత్మ తల్లి మాయ లేదా ప్రకృతి మాయకు పుట్టిన బిడ్డలం మనం త్రిగుణాలతో నిని ఉన్నవాళ్ళం, కొన్ని పరిస్థితులలో మంచివాడు చడ్డవా డుగా,  చెడ్డ వాడు మంచి వాడుగా మారుతాడు, ఇదే దేవుని మాయ. 

97. మాయ అనే ప్రవాహంలో కొట్టుకు పోతున్నాము  తత్వమనే పడవనెక్కితే భగవానుడు వడ్డును చేరుస్తాడు . 

98.  మాయా మోహము నుండి తప్పించుకోవాలంటే ఒక్క భగవంతుని ఆరాధిస్తూ మనస్సును శాంత  పరుచు కోవటమే.  

99. దివ్యమైన గుణమైన నా ఈ మాయ దాటశక్యము కానిది కానీ ఎవరు నన్నే సేవిస్తారో వారు మాత్రం ఈ మాయను దాటగలరు (గీత-7/14). 

100. మాయ 4 రకాలు 1. దైవ సంభందమైనది, 2. త్రిగుణాలతో కూడినది . 3. భగవంతుని అధీనంలో ఉన్నది 4. దాటుటకు కష్టమైనది. 

ఫేస్పే బుక్ రద్దు పరుచుటవల్ల రోజు పెట్టె 10 సూక్తులను అందించ లేక పోతున్నందుకు నన్ను క్షమిచగలరు.  
భగవద్గీత (అంతర్గత సూక్తులు మొత్తం చదవాలనుకున్నవారు గూగుల్ నందు ప్రాంజలి ప్రభ. కం (అంతర్జాల పత్రిక యందు ) ఉన్నది చదవగలరు ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ           
    

6, జనవరి 2018, శనివారం

భగవద్గీత - ఆరవ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము

Ajvf
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
భగవద్గీత - ఆరవ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము (6/50)
51. మనస్సును పరమాత్మ యందు స్థిరపరచి పరమాత్మ చింతన తప్ప, మరి ఏ ఇతర విషయ చింతనయు చేయరాదని తెల్ప బడెను.  (కనీసం అమృత ఘడియల్లో ప్రార్ధిస్తూ ఉండుట ప్రయత్నిమ్చ వలెను)

52. పూర్వ వాసనల ప్రభావము, ప్రక్కవారి ప్రొద్బలము బట్టి మనస్సును నిగ్రహించుకొని ప్రార్ధన చేయవలెను. 

53. మనస్సు అనునయ వినయరీతులద్వారాగాని, వేడుకొనినగాని, లోభ మోహాది ఆకర్షనల వల్లగాని, భయపెట్టిగాని ఎన్నివిధములుగా లోబరుచుటకు ప్రయత్నిమ్చినా సాధకుడు దానికి, లొంగక స్థిరముగా, దృఢముగా, నిగ్రహముగా, ఉండవలెను. 

54. పాపము చేయుటవల్ల, పుణ్యము చేయక పోవుటవల్ల తమో గుణము మనుష్యుని అధోగతి పాలు చేయును, అతని మాట క్రోధముగా మారును. 

55. ప్రాపంచిక విషయములందు ఆసక్తి, ఆకలి, అతినిద్రా, కామము, లోభము, సకామ కర్మలు వళ్ళ రజోగుణ లక్షణాలు ఏర్పడును. 

56. రజస్తమో గుణాలకు కతీతుడై శుద్ధసత్వమునందు స్థితుడైన సాధకుడు నిత్యము, విజ్ఞానంద ఘన పారమాత్మ, ధ్యానమునందు అభిన్నభావముతో స్థితుడై ఉన్నప్పుడు సాత్వికానందము పొందును. 

57. దేహమే నేను అనుకోను దేహాభిమానికి అవ్యక్త పరబ్రహ్మప్రాప్తి నిజముగా ఖఠినమగును. 

58. నిరతిశయ సుఖము "భూమా" అనబడును.  అనగా పరమాత్ముని కంటె వేరుగా దేనిని గుడా చూడక, వినక, తెలిసికొనక, ఉండు స్థితిని భూమా అందురు.              

59. సమస్త ఐస్వర్యములు, అధికారములు, స్త్రీ పుత్రాదులు, ఆరోగ్యభాగ్యములు వయసు మీరిన కొలది తరలి పోవును. 

60. పరమాత్ముని ధ్యానములో ఉన్నవారికి ఆనందము సుఖ శాంతి సౌభాగ్యములు వృద్ధిలోకి వచ్చి మన: శాంతి ఏర్పడును. వ్యవహార రీతిని మార్చుకుంటూ భగవంతుని ధ్యానములో నిమగ్నమవవలెను.       

61. జన్మకారకమైన కోరికలతో, కొత్తగా ఏర్పడిన బంధ కోరిక లతో మనుష్యులు భాధపడక తప్పదు . 



62. అజ్ఞానమైన మానవుడు అనిశ్చితంగా ఉన్న వస్తువులను నిశ్చితమైనవని, దు:ఖ మిశ్రీతమైన భోగాలను సుఖాలని భ్రమిస్తారు . 



63. మాయా వస్తువులపై వెంటాడితే శాంతిని కోల్పోపు తారు శ్రీ రాముడు బంగారు లేడి ఉండదని తెలిసి భార్య కోరిక తీర్చుటకు పోయి  భార్యనే దూరము చేసుకున్నాడు. 



64. ఋణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం, రోగశేషం, కోరిక శేషం ఉంచుకున్నయడల మనస్సు స్థిరంగా ఉండదు.           

65. పట్టుదలతో బుద్ది మనస్సును వశపరుచు కోవాలి ఇంద్రియాలు అనే కుర్రాలు పరుగెత్తించిన బుద్ధి సారధి వహించి మనస్సనే పగ్గాన్ని అదుపులో పెట్టుకుంటే అంతా సక్రమము. 

66.  బిడ్డను బుజ్జగించి దారిలోకి తెచ్చినట్లు మనస్సును దారిలోకి తెచ్చు కోవుటకు ప్రయత్నిమ్చాలి . 


67. హనుమంతుడు రాముని వద్ద దూతగా కనిపిస్తాడు, రావణాసురినివద్దకు శక్తివంతుడుగా కనిపిస్తాడు ఎందుకనగా మనస్సును నిగ్రహించుకొనే శక్తి ఉన్నవాడు కనుక. 

68. మనస్సు మాత్రం దేనిపై స్థిరముగా ఉండదు, చంచల మైనది. యోగ సిద్ధి ద్వారా, ఓంకార జపము ద్వారా నిగ్ర హించు కోవటానికి ప్రయత్నిమ్చవచ్చు. 



69. మనస్సును బుద్ధి వసంలోకి తెచ్చి తాదాత్మ్యం చెంది, మనస్సును సాక్షిగా గమనిస్తూ ఆత్మపైకి మళ్లించాలి. 



70.  శుద్ధంగా, శాంతంగా, నిర్మలంగా, ఉత్తమ సుఖాన్ని ధ్యాన యోగికి మనస్సు కల్పిస్తుంది.               


71. ఇనుముకు తుప్పు పడుతుంది, కాలిస్తే శుద్ధి అవుతుంది , అదేవిధముగా మనసుకు వాసనలు వెంబడిస్తాయి, భక్తి భావముతో శుద్దిచేసు కోవాలి.

72. మనస్సు ఆత్మ ధ్యానములో మునిగి, బ్రహ్మం, బ్రహ్మానందముగా మారి, ఈ ఆత్మ. సుఖం ఆద్యంతాలు లేనిదిగా మారును. 

73. ప్రతి ఒక్కడు జీవుడుగా భావించి బ్రమ పడుతున్నాడు, ముందు భ్రమలు తొలగించుకొవాలి.తానూ ఆత్మనే అని అనుభూతుల్లో ఉండి పోవాలి.

74. దేహదృష్టితో మనోదృష్టితో చూస్తే అన్నీ తేడాలు, కానీ ఆత్మ దృష్టితో చూస్తే ఎటువంటి తేడాలు కానరావు.

75. కుండలు కొనేవాడు కుండగట్టితనం చూస్తాడు, తేడాలు కనిపెడతాడు, కాని కుమ్మరి దృష్టిలో తేడాలు కనబడవు.

76. పరమాత్ముడు ప్రాణులలో ఆత్మను సృష్టించి సకలం సర్వమని ప్రేమానురాగాలు అందిస్తున్నాడు. అట్లే సకల ప్రాణికోటిని ఒక్కటిగా చూడమని భగవంతుడు తెలియపరిచాడు. 

77. సముద్రములో అలలు అన్నీ సముద్రమైనట్లుగా, నీటిలోని బుడగలు నీరు అయినట్లుగా సకల ప్రాణుల్లో ఉండేవాడు పరమాత్ముడే.

78. పరమాత్ముడు గుణ రహితుడు, రూపము లేనివాడు, సర్వ వ్యాపకుడు, ఎవ్వరు ప్రార్ధించిన ప్రత్యక్ష మయ్యే పరంధాముడు.

79. అహంకారమనే మాయతో జీవుడుగా సంసార చక్రములో జీవిసున్నాడు భగవంతుడు, 
తెలియని మానవుడు సర్వం తానేనని, నాకష్టార్జితమని,  భ్రమల్లో మునిగి పోతున్నాడు.

80. పాలలో వెన్నలాగా, నువ్వులలో నూనెలాగా, చెరకులో రసం లాగా, బెల్లంలో తీపిలగా, పూలదండలో దారంలాగా, కుండలలో మట్టిలాగా, ఆభరణంలో బంగారంలాగా, వస్త్రంలో దారం లాగా భగవంతుడు మనలో ఉన్నాడు. 


81. పది బక్కెట్ల నీటిలో సూర్యుడుగా నేనే ఉంటాను, వివిధరూపాల్లో దేవుడుగా నేనే ఉంటాను. మ  నుష్యుల ఆలోచనలు బట్టి వారికి సహాయకుడిగా ఉన్నాను. 


82. శ్రీకృష్ణుడు పరాక్రమ శాలి, అనేక రాక్షసులను సంహరించాడు, కానీ ఒక సారధిగా ధర్మాన్ని రక్షించుటకు కంకణం కట్టుకున్నాడు. 


83. అట్లే ప్రతి ఒక్కరు తనకు తెలుసుకున్నది తక్కువే, తెలుసుకోవలసినది ఇంకా ఉన్నదని భావించి అందరికి సహాయం అందించాలి.              

84.. జయం కలిగిన అపజయం కలిగిన చిరునవ్వే ఆయుధం గా ఉండేవాడు ఉత్తముడు. 

85. నీవుఎంతటి తెలివిగలవాడివైనప్పడికి ఉద్యగానికి , కట్టుబడి ఉండి తీరాలి. కృష్ణుడే సారధిగాఉండి న్యాయాన్ని నిలబెట్టాడు . 


86. సిగ్గుపడేవాడు, చింతించేవాడు, అసూయపరుడు, నుదురుబాదుకొనేవాడు, దుటివాడిని చూసి ఓర్వలేనివాడు , ఏపనిచేయలేని బద్ధకస్తుడు ఉన్నట్లయితే అధికారికి ముప్పు పొంచి ఉణ్ణట్లే. 


87. తన సహజ దివ్యాత్వాన్ని విడిచిపెట్టకుండా, ఆత్మానందములో రమిస్తూ ఎప్పటిపని అప్పులే చేయు వాడు ఉన్నట్లయితే అధికారికి బలం పెరిగినట్లే . 


88. ఇతరులకు సహాయపడుతూ సుఖము కలిగినప్పుడు ఆనందించేవాడు , దుఃఖం కలిగినపుడు దుఖించేవాడు నిజమైన యోగి . 



89. అన్నదమ్ములు చావుకొరు బావమరుదులు బ్రతుకు కోరు అనే సామెత ఎందుకనగా ప్రేమలేనిచోట ఎవ్వరూ ఉండలేరు, ప్రేమే అందరిని కలుపుతుంది అని భగవానుడు తెలియపరిచాడు.


90. మనస్సు చంచలత్వం, అస్థిరం కోటియా గంతులేస్తుంది ఆత్మధ్యానం నిలపాలంటే కష్ట తరమౌతుంది. ఎలాసాధించాలనే సమస్య మనసున చేరుతుంది. తప్పుకొనేదెట్లా. ఏర్పడుతుంది.   


91. మనస్సు స్థిరముగా ఉండక పోయినప్పటికీ ఒక విషయము మీదకాని, ఒక జయము మీదగాని, గట్ టినమ్మకము ముందు ఏర్పరుచు కుంటే ముందు ధైర్యము ఏర్పడును. 


92. వాస్తవాలను గ్రహించి దీక్షదక్షతలు కలిగి, గురువుగారిపై భక్తిభావం ఉంచి, శక్తి సామర్ధాలపై సంకల్పం ఉంచి "నీవు జయించా లంటే ముందు వంగు" అనే సామెతలాగా నిగ్రహించుకొని పట్టుదల పెన్చుకోవాలి. 


93. ఒకేవిషయాన్ని నిరంతరం మల్లీ మల్లీ మననం చేసు కుంటే అది గుర్తుకు వచ్చి వేరొక విషయాన్ని చొరబడ నీయదు మనస్సు . 

94. వైద్యుడు, లాయరు, ఉపాధ్యుడు,  కొన్ని సంవత్సరాలు తర్వాత  నిష్ణాతులుగా మారి మనస్సును నిలబెట్ట గలుగు తారు.  వృత్తి పై ఉన్న అభ్యాసము వళ్ళ ఏర్పడును. 

95. మనస్సును కోర్కల నుండి తప్పించి, (అంతా మిధ్య)  వైరాగ్యభావము కలిగి, భక్తి భావముగా మారితే మనస్సు దేవునిపై లగ్నమవుతుంది. 



96. జ్ఞాన సిద్ధికి పురుష ప్రయత్నం ముఖ్యం, నా ఖర్మ, నా ప్రారబ్ధం, నా గ్రహచారం అనుకుంటే ఏది సాధించ లేవు.  

            

97. ఉన్న విషయాన్నీ గ్రహించి, శక్తితో,  ఉపాయముతో సాధించుటకు ఎవరైనా సరే ప్రయత్నము చేస్తే ఫలితము ఖచ్చితముగా వచ్చును . 

98. ఎంతో శ్రమపడి, ఎన్నో శ్రమల కోర్చి, ఎన్నో త్యాగాలు చేసి, ధ్యానయోగాన్ని ధీర్ఘకాలాన్ని సాగించిన యోగ సిద్ధిని పొందలేరు.   ఎందుకు అనే ప్రశ్న ఉదయించవచ్చు . 

99.  యోగ మార్గంలో నిలువలేక పట్టుదల సడలి, మోహంలో పడిన సాధకుడు గాలికి చెదిరిన మేఘంలా మారుతాడు . 

100. సరి అయిన ఆహారము తీసు కోనివాడు ధ్యానానికి అనర్షుడు, ఎందుకనగా శక్తి ఉన్నప్పుడే ధ్యానం చేయాలి, శరీరము సహకరించక పోతే ధ్యానము చేయలేడు, నిగ్రహశక్తితో. సంపూర్ణ ఆరోగ్యముతో సాధనే  యోగి.  
  
101. భూతకాలము యొక్క ఫలమే వర్తమానము. వర్తమానము యొక్క ఫలమే భవిషత్తు. అంటే చిన్నప్పుడు ప్రేమను పంచితే ఆప్రేమ వృధాప్యం వరకు నీవెంటే వస్తుంది. 

102.  మంచి చేసిన వానికి చెడు జరుగదు, చెడు చేసిన వానికి మంచి జరుగదు గతంలో చేసిన పుణ్యం ఈజన్మలో అనుభవిస్తావు, ఈజన్మలో చేసిన పుణ్యం దహివ సాన్నిధ్యాన్ని పొందుతావు. 

103. తండ్రి ఎంతటి పాపాత్ముడైన, క్రూరుడైన తన బిడ్డకు మాత్రము చెడు  చెప్పడు. చేదు మార్గఫలితము అనుభవ పూర్వకంగా చెపుతున్నాను అని మరి చెపుతాడు. 

104. యోగాభ్యాసము మరుజన్మ అనుభవించ వలసినదే  వ్యామోహానికి చిక్కినవాడు, శరీరాన్ని అదుపులో పెట్టుకోని వాడు మరుజన్మ అనుభవించ వలసినదే. 

105.  జీవిత కాలంలో ఎన్నో పాపాలు చేసిన అంతిమ ఘడియలలో నన్ను తలిస్తే మోక్షము తప్పక కలుగు తుంది. 

106. యోగాభ్యాసము వల్ల పుణ్య లోకాలకు వెళ్లి స్వర్గ సుఖాలు అనుభవించి ఆ తర్వాత శ్రీమంతుడుని కుటుంబంలో జన్మిస్తావు, అప్పుడు నీ బుద్ధిని బట్టి  మరు జన్మ ఉన్నదో లేదో భగవంతుడు నిర్ణయించుతాడు. 

107. ధనం ఉన్నవారికి సాధారణముగా అహం తలకెక్కు తుంది, దానివల్ల వావి వరుసలు చూడరు, నా సంపాదన నా ఇష్టం అనే భావం వల్ల వారు చనిపోయిన తరవాత నీచ నికృష్ట జన్మ ఎత్త వలసి యన్నది. 

108. యోగం, భోగం రెండు జీవితంలో సాగుతాయి, నిర్ణయించు కొనే శక్తి కుడా మానవులకు భగవంతుడు ఇస్తాడు, నిర్నయిన్చుకొనే బుద్ధి  కూడా ఇచ్చాడు. నిర్ణయం నీ ప్రేమపై వది లేస్తాడు అదే సృష్టి మహత్యం. 
 
109. పుట్టిన బిడ్డలు స్నేహితుని వల్ల చెడిపోరు, జన్మ కారకులు కొందరు, పుట్టిన ప్రాంత ప్రభావము కొంతవరకు అని గమనించ వలెను.   

110. పుణ్యం - జ్ఞానం -సాధన చేయ వలెనని భగవంతుడు మనకు తెలియ పరిచాడు, ఆచరణ లోనే ఉన్నది జీవితం అని తెలియ పరిచాడు భగవంతుడు. 

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:

భగవద్గీత - ఆరవ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము (6/110)
111. పరబ్రహ్మ పరమాత్మను పొందుటయే పరమపద ప్రాప్తి, పరంధామ ప్రాప్తి,  నైష్ఠిక శాంతి ప్రాప్తి అని అందురు. 

112.  యోగి శాస్త్రజ్ఞుల కంటే, తాపసుల కంటే, సకామా కర్మలు ఆచరించు వారికంటె శ్రేష్ఠుడు. 

113. భగవంతుడినే సర్వ శ్రేష్ఠుడుగా సర్వగుణ దారునిగా, ప్రియతమునిగా, సర్వశక్తిమంతునిగా గుర్తించి ప్రదించవలెను. 

114. పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార తత్వప్రభావ మహత్వాది రహస్యములు సంపూర్ణ జ్ఞానమునే జ్ఞానము అందురు. 

115. సుగుణ, నిరాకార, సాకార, తత్వముల లీలా రహస్య మహాత్వగుణ ప్రభావాదులను సమగ్రముగా తెలుసు కొనుటయే విజ్ఞానము అందురు . 
        
116. ప్రతిఒక్కరు అంతరాత్మ నాయందే  లగ్నమొనర్చి శ్రద్దా దరముతో నన్నే భుజించువాడు యోగులలో శ్రేష్ఠుడు.

భగవద్గీత - ఆరవ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము సమాప్తము .