29, మే 2017, సోమవారం

విశ్వములో జీవితం -9***

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
విశ్వములో జీవితం -9

దేవుడున్నాడా లేడా?

 ఇద్దరు మనుషులు దేవుడున్నాడా లేడా అని వాదించు కుంటున్నారు అప్పుడే మూడో వ్యక్తి వచ్చి మీ సమస్య ను క్షణం లో తిరుస్తాను అన్నాడు. మరి చెప్పేవే అన్నాడు. నాకు తైలం పడందే, లాభం లేనిదే ఏవిషయము బయటకు చెప్పొద్దన్నారు మాగురువుగారు అన్నాడు.

నీకు లాభం వచ్చే సలహా ఇవ్వలేము కానీ ఇంద తైలం అంటూ చేతిలో పెట్టారు. వెంటనే తైలం లో ఉన్నాడు దేవుడు అంటూ వెళ్లి,పోయాడు. అంటే అతని మాటలకు  అవాక్కయ్యారు.

చేసేది లేక వాళ్లిద్దరూ దగ్గర ఉన్న గుడికి వెళ్లి పూజారిని ప్రశ్నిద్దాం అనుకున్నారు, వెళ్లారు పూజారిని అడిగారు. నేను కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తాను ముందు అవి తీసుకురండి అన్నాడు. సరె అని అవి తీసుకు వచ్చి ఇచ్చారు వెంటనే దేవునికి నైవేద్యం పెట్టి తీర్ధం ఇచ్చి కొబ్బరిచిప్ప చేతిలో పెట్టి ఇక వేళ్ళ మన్నాడు. మేము అడిగిన దానికి సమాధానము చెప్పలేదు ఎందుకు అన్నాడు. 

ముందు ప్రాసాదం తినండి అన్నాడు, తిన్నారు.

ఇప్పుడు చెపుతున్న వినండి దేవుడు మీ డబ్బులతో ప్రసాదం కొనిపిచ్చి సగమే మీకు పెట్టాడు కదా అవును, అవును
మిగతా సగం లో దేవుడున్నాడు ఎందుకంటే అది అందరి కీ సమానంగా ప్రసాదాన్ని పంచుతాను అందరు దేవుని ప్రసాదం పెట్టాడు అను కుంటారు. మీలో దేవుడు ఉన్నాడు కదా ఇంత దూరం రాగలిగారు, దేవుడ్ని చూడగలిగారు  అన్నాడు పూజారి. 

పూజారి చెప్పిన మాటలు అర్ధం గాక బుర్రగోక్కున్నారు.

నడుస్తూ మరలా వాదించు కున్నారు అప్పుడే వారికీ ఓతాగుబోతు ఎదురయ్యాడు. త్రాగుబోతులు నిజం చెపుతారు అతన్ని అడుగుదామా అని అతని దగ్గరకు వెళ్లారు వారు.

బాబులు మీరు అడిగిన దానికి నిజం చెప్పాలంటే నాకు కిక్ తగ్గింది, కిక్ ఎక్కించండి అన్నాడు  అప్పుడు నిజం చెపుతాను .
వెంటనే దగ్గర ఉన్న షొప్ వద్దకు పోయి అతనికి కిక్ ఎక్కించారు.
    
కోట్లు ఖర్చు పెట్టి గొప్పగా పెళ్ళీళ్ళు చేస్తారు ఎందుకో చెప్పండి అన్నాడు.
అది వారి తాహతు తగ్గ వారని తలంచి పెళ్లి ఘనంగా చేస్తే నలుగురు మెచ్చు కుంటారని భావిస్తారు.
ఎలా సంపా ఇంచారో అనవసరం ఒక్క రోజులో కోట్లు ఖర్చు పెట్టాడు అంటే ఎంతో మంది బాగు పడ్డట్టేగదా .
అంటే (నగల షాప్ వారు, వస్త్రాలు షాపువారు, వంట వారు, కళ్యాణ మండపం వారు ఇంకా ఎన్నో ఎన్నో ) అప్పుడు వీళ్ళందరికీ దేవుడు కనిపిస్తాడు అన్నాడు

నేను అడిగిన దానికి సమాధానము చెప్పలేదు అన్నాడు.

అనవసరముగా నా సమయాన్ని వ్యర్థం చేసారు, నాకు కిక్కు ఎక్కించి నా ఆరోగ్యం పాడు చేశారు కనుక మీమీద కేసు పెడతా పదా పోలీస్ స్టేషన్కు అంటూ ఇద్దర్ని పట్టుకున్నాడు
మీకు దేవుడున్నాడా లేదో ఆ పోలీసులే చెపుతారు.

వదులురా బాబు వదులు మమ్ము బుద్ధి తక్కువై పని చేసుకోకుండా వీధిని పడి సమయాన్ని వ్యర్ధం చేసుకున్నాం

మాకు బుద్దొచ్చింది మమ్మల్ని వదులు మాకు నీలో దేవుడు కనబడు తున్నాడు అంటూ గుంజుకొని చేతులను వదిలించుకొని ఓదేవుడా మమ్ము రక్షించు అంటూ పరుగెత్తారు ఇద్దరు.  

అందమైన కలలు కంటాము అవి ఆచరణకు నోచుకోవు -  మనం చేసిన పుణ్యమే మనల్ని సక్రమ మార్గంలో నడిపిస్తుంది. ఒకరు వేలెత్తి చూపని జీవితాన్ని దేవుడే కల్పిస్తాడు  ఇదే నా నమ్మకం - నమ్మకం మీద జీవిస్తే మన:శాంతి తో ఆరోగ్యంతో దైవధ్యానంలో ఉండగలుగుతారు.                  
                             

విశ్వములో జీవితం -8

ॐ श्री राम - श्री मात्रे नम :
విశ్వములో జీవితం -8
ప్రాంజలి ప్రభ. కల్పన
ఎవరనుకోవాలి, ఏమనుకోవాలి నా మనసును దోచిన వారెవరో, ఆకర్షించిన వారెవరో, ద్వేషించిన వారెవరో తెలుసుకోలేని వయసు నాది, అయినా ఎక్కడో నా మనసు లాగుతున్నది, అది ఎందుకో తెలియుట  లేదు. ఎందరినో ఆకర్షించు తున్నది, ఎన్నో ఎన్నెన్నో మాటలు నేర్చుకోవాలని ఉన్నది, మృదు మధురంగా పలకాలని ఉన్నది. అందానికి  దాసోహం అవ్వాలా, ప్రేమ చూపులకు లొంగి పోవాలా, వయసు ఎదుగు దలకు అవసరమా, అనే ఆలోచనలు యవ్వన వంతులను వెంబడి స్థాయి. 

కధలో కావ్య సుందరి వర్ణనలకు లొంగి పోతామా, ఆవే ఆలోచనలతో నిద్రలో కూడా కలలుగా మారుతాయా ?

ఊహల్లో చిక్కి వాస్తవాన్ని గమనించ లేక పోవుటకు నాకు వయసే కారణమా?

స్వశ్చముగా పరిమళించే మల్లికను చూసినా
  ఆకు పై చలిస్తున్న ఆని ముత్యము చూసినా,
చెంత చేరి సేద తీర్చే స్వాతి ముత్యమును చూసినా, 
తీయని ఓదార్పు తో కనుల చూపులు చూసినా 
మది గదిలో కల్లోలం ఏర్పడుటకు కారణము ఏది, ప్రకృతి పరవసాన్ని ఆస్వాదించి అనుభవించుటకే కదా ఈ వయసు ఇన్ని ఆంక్షలు, కట్టుబాట్లు ఎందుకు ?     

తీయని ఓదార్పు వెచ్చని కన్నీటి బొట్టు, మనసును తొలచి వేస్తుంది.  నా ఆలోచనలు ప్రేమగా మారుతున్నాయి, ప్రేమ అంటే ఏమిటో ఇప్పుడే తెలుస్తున్నది.  

ప్రేమ ఊహ అయితే, ఆ  ఊహకు సాక్షం నీవు 
ప్రేమ తలపు నీవే అయితే,  నా ఊపిరి తలపులు నీవు
ప్రేమ మధుర భావము అయితే, నా భావానికి భాష నీవు 
ప్రేమ కమ్మని కల  అయితే, నా కలకు కల్పన నీవు  
ప్రేమ రాగం అయితే, ఆ రాగాన్ని మీటే స్పందన నీవు  

నీ ఆలోచనలో అంతరంగంలో పెనవేసి, మదికి చల్లని చందన లేపనం అద్దుతున్న ఎవరు నీవు,
పారిజాతల పరిమళంలా నను చుట్టేసి చిత్రంగా నవ్వుతున్న ఎవరు నువ్వు, చూపులకు చిక్కక, నవ్వులు కురిపిస్తూ గాజులు శబ్దం వినిపిస్తూ ముఖం కనబడక ముసుగులో నన్ను ఊరడించి, ఉడికించి, హెచ్చరించి, నన్ను వదిలి పోలేవులే, వయసు ఉడుకు చూపు దామనుకున్నా ఆ సమయము రాలేదని తెలుసుకొని చూసి చూడనట్లుగా పోతున్నావు నీవు,  నన్ను కూడ కదులు అనే భావపు చూపులు చూపావు.          

అప్పుడనుకున్నా దివి నుండి భువికి నాకోసం జాలువారిన చంద్రోదయానివా,నా చేయి వీడని అమృత బంధానివా..నాకల సుందరివా అనుకోవటం టప్ప ఏమి చేయలేను నేను.

ఆకాశములో పక్షి ఎగురుటకు రెక్కలు ఎంత అవసరమో, పురుషునకు విషయ జ్ఞానము, ఓర్పు అంత న్నా ఎక్కువ అవసరము     


విశ్వములో జీవితం -7

om sri raam - sri maatrenama:
విశ్వములో జీవితం -7  
ప్రాంజలి ప్రభ - సమస్య
నా కష్టాన్ని సమస్యలను, ఎన్నడూ ఎవ్వరికి తెలిపను, నేను చేసేది నిజాయితీగా ఉండాలి, ధర్మం తప్పకుండా ఉండాలి అనుకునేవాడిని, అప్పుడే అనుకోని విధముగా నాలో ఉల్లాసం, ఉత్సాహం వస్తుంది, అప్పుడే నాకు తెలియని శక్తి నన్ను నడిపిస్తున్నదని తెలుస్తున్నది. కష్టాలు భగవంతుడు కల్పిస్తాడు. మంచి మాటతో, శక్తి తో కష్టాలు తొలగించుకో మన్నాడు    

నేను మట్టిని నమ్ముకున్నాను, మట్టినుండి ఖనిజాలను తీసి వ్యాపారం చేస్తున్నాను, మట్టి యందు  పంట పండించి అన్నము అందరికి దొరికేలా చేస్తున్నాను, అనుకోని విధముగా నాకు పెరిగిన సంపదను నలుగురికి పంచాను, సంపదున్నా  లేనివాడినై ఇతరుల  హృదయంలో సంతోషం చూడాలని సంపదతో సహకరిస్తున్నాను. అందుకే భగవంతుడు మట్టిని అందించాడు. మానవులు బుద్దితో మట్టిని బంగారము చేసుకో మన్నాడు.         

పిరికితనం అంటే నాకు తెలియదు, ఎటువంటి సంఘటనలను సమస్యలను ఎదుర్కొనే శక్తి ఉన్నది, సంపద ఉన్నది, దానికి తోడు సాహసాలు చేసే ధైర్యం ఉన్నది. ప్రమాదాలు ఎన్నిఎదురైనా గుండె నిబ్బరముగా, దైర్యంగా ఎదుర్కొనగలను,  సముద్రంలో చిక్కినా వడ్డుకు చేరగలను , అంతరిక్షము లో వదిలినా తిరిగి రాగలను, అందుకే భగవంతుడు ప్రమాదాలు కల్పిస్తా డు ధైర్యంతో ఎదుర్కొనే శక్తి ధైర్యం మానవులకు ఇస్తాడు.           

మనం ఎ0దరినో కలుస్తాం, మ రెందరివో  సలహాలను పాటిస్తాం, మనం చేసే పనిలో పటుత్వం కోసం అందరి సహాయ సహకారం ఆరాధిస్తాం, మనకు ఎన్నో అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోవటం చేతకావాలి. దేవుడు కల్పించిన అవకాశమును బట్టి నీవు పొందాలను కున్న, వరాలు పొంది దుర్వినియోగం చేయక జీవించ మన్నాడు.           

ప్రేమ ఎక్కడుంటుందో, ఎలాఉంటుందో, ఎవ్వరు చెప్పలేరు, చూపలేరు అప్పుడే భగవంతుని కోరాను ఆపదలలో ఉన్నవాడి వద్దకు నన్ను పంపాడు, వాడిని రక్షించాను, అతని మాటల్లో ఉన్న మాధుర్యాన్ని గమనించాను కల్ముషము లేని ప్రేమతో పలికాడని తెలుసుకున్నాను. అతని కళ్ళవెంబడి నీరు ఆనందబాష్పాలు నన్ను కూడా కన్నీరు తెప్పిచ్చాయి.

సమస్యలను ఎదుర్కొనుటకు ప్రతిఒక్కరు కొంత విద్యను సంపా  దించాలి, అవిద్య వళ్ళ సమస్యలను సులభ మార్గమున తీర్చుకు తెలివి నుపయోగించాలి.  
--((*))--         

28, మే 2017, ఆదివారం

విశ్వములో జీవితం -6

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


విశ్వములో జీవితం -6  
ఆశ -పాశం
జీవితమ్ లో మనం అనేక సంఘటనలు చూస్తాము. అనేక మందిని కలుస్తాము, స్నేహాన్ని పెంచు కుంటాము. మన శరీరాన్ని జాగర్త 
చేసు  కుంటూ జీవిస్తాము.
    
ఒకనికి డబ్బు వయసు ఉన్నదని నలుగురు భార్యలు పెళ్లి చేసుకున్నాడు ముద్దుగా పద్మిణి, రాగిణి, కామిణి మోహిణి అని పిచుకొనేవాడు వారిని ఎంతో ప్రేమగా చూసు కుంటాడు, వయసు ఉడికిన తర్వాత అనారోగ్యంతో ఉన్నప్పుడు భార్యలు కూడా చూడటం తగ్గించారు ఎందుకు ?
నాల్గవ భార్య వద్దకు చేరి నేను సుఖ పెట్టలేనుగా కొంత డబ్బు తీసుకోని వెళ్తావా, నాతో జీవితాతం ఉంటావా అని అడిగాడు?     
మీ అందాన్ని చూసాను ఆనాడు, అది ఇప్పుడు నాకు కనబడుట లేదు, నన్ను చూసే కళ్ళే నీకు   కనబడుట లేదు, శరీరము సహకారించుట లేదు, మిగతావారు నీకున్నారు నా బతుకే ఎడారి కాకుండా నీవే మార్గం చూపు అన్నది నాల్గవ భార్య.   


అర్ధం చేసుకొనే తత్త్వం తో చెపుతున్నా, బలవంతంగానో హింసతోగానో ప్రేమ పొందటం సాధ్యం కాదు,
నీ  ఆలోచనలకు నేను అడ్డురాను, నా సహాయము ఎప్పుడు నీకు ఉంటుంది అన్నాడు. నీమాట గౌరవించటం తప్ప  ఏమి చేయవలనో నీవే చెప్పు అన్నది . 

మూడవ భార్య వద్దకు పోయి నేను నీకోసం ఎంతో ఖర్చు చేసాను, నీవు కోరిందల్లా కొని పెట్టాను, ఈ వయసులో నాకు తోడుగా ఉండి సేవలు చేస్తావా అని అడిగాడు. ధనం మీకు ఉన్నది, ఎవరు సేవలు చేయమన్నా చేస్తారు నేనే చేయాలా?
నీ సంపద చూసి నేను నీదగ్గర చేరాను అది క్రమేపి కరిగి పోతున్నది. నాకు న్యాయం చేసే భాద్యత నీ మీదే ఉన్నది, నీవు ఆటో ఇటో అయినా వనుకో నా బ్రతుకు ప్రస్నార్ధకం అవుతుంది, ముందు అది తేల్చండి ఆ తర్వాత మీకు సేవలు చేస్తానో చేయనో తెలుపుతాను అన్నది. ఆశ ఎన్నటికీ హితవు కాదు శాంతి ఎప్పటికి చేటు కాదు, నా సహాయము ఎప్పుడు నీకు ఉంటుంది అన్నాడు.

రెండవ భార్య వద్దకు పోయి  ఇదే విధముగా అడిగాడు, బంధు
వుల ప్రోత్సాహముతో నాకు వేరే మార్గము లేక నీతో కలిసాను, ఇంతకన్నా నేను ఏమి చెప్పలేను అన్నది. నా సహాయము ఎప్పుడు నీకు ఉంటుంది అన్నాడు.

మొదటి భా
ర్య వద్దకు పోయి నీకు అన్యాయం చేసాను నన్ను క్షమించ గలవా అన్నాడు. నేను ఎప్పుడు నీకు దాసిని, నన్ను క్షమాపణ అడగకండి, నేను నీ సుఖం కోసమే సర్వస్వం అర్పించాను, నాలో ప్రేమ లేదని వేరొకరిని ఆశ్రయించిన నోరెత్తకుండా నీకు సేవలు చేసే ధర్మ పత్ని నండి, నీమాట ఎప్పటికీ జవదాటను నీ అనారోగ్యమే నా ఆరోగ్యము  మీతోపాటు నరకమునకు రమ్మన్నా వస్తాను అన్నది.                            
       
ధనముందని ఆశ పడ్డ, యవ్వన ముందని స్త్రీలను వివాహమాడిన వయసు పెరిగిన తర్వాత ఆదుకునేది ఒక్క భార్య మాత్రమే.  

మంద ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్లు,  భార్యలు ఎక్కువైతే వత్తిడి ఎక్కువైనట్లు, దిగుడు బావిలో నీటిని నాచు కప్పి వేసినట్లు, నిమ్మ చెట్టు మొదలు తొలగించిన జల సంసర్గమువల్ల పెద్ద చెట్టు అయినట్లు, స్త్రీ వ్యామోహంలో చిక్కిన ఎవరైనా జీవితంలో ఎదగలేనట్లే. ఆశాపాశానికి చిక్కకు అభాసుపాలు కాకు, సిరి ఉన్నదని స్త్రీలను కలిస్తే అనారోగ్యము రాక ఆరోగ్యము ఎలావుంటుంది.   
--((*))--



27, మే 2017, శనివారం

విశ్వములో జీవితం -5

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
విశ్వములో జీవితం -5  భార్యను బట్టి భర్త.

ఏమండి ఎందుకు అంత తొందరగా పరిగెడుతున్నారు, అంత డబ్బు తీసుకోని వెళుతున్నారు, ఎక్కడికి అని అడిగింది భార్య . నీకు ఎన్నో సార్లు చెప్పాను వెళ్ళేటప్పుడు అడగవద్దని అని బయటకు నడిచాడు.
అప్పుడే గురువు ఎదురయ్యాడు, నమస్కారం గురువుగారు అన్నాడు. నేను మందుల షాపు వద్దకు పోతున్నాను, ఆరోగ్యంగా ఉ
న్నావుగా ఎవరికీ మందులు , నాకే సార్ మన:శాంతి కోసం మందు తెద్దామని పోతున్నాను అన్నాడు.

గురువుగారు నీవు అమాయకుడిలా ఉన్నావు, ఇలా కూర్చో నేను చెప్పేవి విను అన్నాడు.

మనలో ఇష్టాన్ని మన: స్పూర్తిగా మనల్ని నమ్మైనవారికి చెప్పుకుంటే, అవతలవాని మనస్సు అర్ధం చేసుకో గలుగుతావు, 
నీ మనసు ప్రశాంతముగా ఉంటుంది  .
ప్రేమగా అక్కున చేర్చుకో కలిగితే ఇరువురి మద్య అనురాగం రెట్టింపు అవుతుంది.
కష్ట నష్టాలల్లో నేను నున్నానని తోడును గౌరవించు కోగలిగితే, మనస్సు ఉల్లాసంగా
ఉత్సాహంగా మారుతుంది.
భాగస్వామితో మాటలు పంచు కుంటూ, భాద్యత
ను  పంచుకుంటూ, ఎవరు గొప్పా అని ఆలోచించ కుండా, తప్పులను బలహీనతలను భూతద్దంలో చూడక ఒకరికొకరు క్షమాపణలతో మనస్సు కలత  చెందకుండా ఆరోగ్యమైన నవ్వులమధ్య సాగి పోవటమే నిజమైన జీవితం అన్నారు. 

అర్ధం లోని పరమార్ధాన్ని గ్రహించ కలిగితే నిత్యమూ శాంతిమయం
పోరు బాటలో నడవద్దు, మౌనంగా శాంతి బాటలో నడిస్తే ఆరోగ్య దాయకం

గూటీకి చేరిన భర్తను శాంతి వచనాలతో పలకరించి సంతోష పెట్టాలి
భార్య .
వాద ప్రతివాదానలకు దిగినా క్షణావేశానికి లోను కాకుండా మంచో చెడో  గమనించి ఓర్పతో ఓదార్పు చూపటమే మానవుల లక్షణం అని గమనించాలి.

టీచర్ గారు ఇంటి కొచ్చేంగానే భార్య మంచిగా గౌరవించక, "నాకేం క్లాస్ చెప్పనక్కర్లేదు ' లోపలకు దయచేయండి అంటే ఎట్లావుంటుంది?
ఇంజనీర్ ఎండలో దగ్గరగా ఉండి కార్మికులద్వారా పనిచేయించి ఇంటికి వస్తే భార్య "ఎందుకండీ ఆ ప్లాన్లు అన్నీ నామీద ప్రయోగిస్తారా " అంటే ఎలా ఉంటుంది ?
జడ్జిగారు కోర్టులో లాయర్ల మాటలు విని తీర్పు చెప్పి ఇంటికి వచ్చి  భార్యను
ముద్దుకు పలకరిస్తే వాయిదా అని మీ మాటలు మీకే చెపితే ఎలా ఉంటుంది ?
డాక్టరుగారు రోగులను రక్షించి ఇంటికి వస్తే భార్య మీ రోగం ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు అంటే ఎలా ఉంటుంది?                                                       
పైలెట్ ఉద్యోగ
ము  ఆయిన తర్వాత ఇంటికి చేరగానే భార్య మీరు ఎగిరే విమానంలో పనిచేసినా నాముందు ఎగరకండి అంటే ఎలా ఉంటుంది?
న్యాయవాది కోర్టులో వాదించి ఇంటికి చేరగానే భార్య భగవద్ గీత పట్టుకొచ్చి అంతా నిజమే చెపుతా అబద్దం చెప్పను అని చెప్పించి లోపలకు రమ్మంటే ఎలా ఉంటుంది?   
నటుడు చిత్రంలో నటించి ఇంటికి చేరగా భార్య మీరు అక్కడ నటించండి నావద్ద మాత్రం నటించకండి అన్నప్పుడు ఎలా ఉంటుంది?.  
సాఫ్ట్ వేర్ ఉద్యోగము నుండి ఇంటికి చేరగా భార్య వైరస్ బుద్దులు నావద్ద చూపకండి నేను అస్సలే యాంటీ వైరస్ను అంటే ఎలా ఉంటుంది?
పూజారి గుడిలో పూజచేసి ఇంటికి చేరగా భార్య దక్షణ ఇంతేనా, ప్రసాదమింతేనా అంటే ఎలా ఉంటుంది ?
రాజకీయనాయకుడు ఉపన్యసించి ఇంటికి చేరగా భార్య మీ ఉపన్యాసం నాకు చెప్పకండి ప్రజలు నమ్ముతారేమోగాని నేను నమ్మను అంటే ఎలావుంటుంది?
పై నుదహరించిన భార్యలు, ఇంకా ఎందరో  భర్తలను ఆటపట్టించుటకు ఛలోక్తిగా మాట్లాడిన మనసు నొచ్చుకోకుండా భర్తలు భరించటం లో ఉంటుంది శాంతి. .
భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త ఒకరి కొకరు అర్ధం చేసుకొని జీవించాలి గాని పంతాలు పట్టింపులు ఎప్పుడు పనికిరావు.   
గురువుగారు మీరు చెప్పిన విషయాలు నాకు బాగా తెలిసినాయి,
ఇంటికి వెళ్లి నాతప్పు తెలుసుకొని ప్రేమను నా శ్రీమతికి పంచి ఆమె ప్రేమను పొంది మన:శాంతిగా బతుకుతాను.
గురువుగారు " తధాస్తు " 

--((*))__   
 

విశ్వములో జీవితం- 4***

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: Exploring the Science of "Sleeping Hot" 
విశ్వములో జీవితం- 4
నిద్ర 
మనకు ఆరోగ్యాన్ని పెంచేది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచేది ఏమిటో తెలుసా ?
ఆలోచనలు ప్రక్కకు నెట్టి, కోరికలను కూడా మరచు నట్లు చేసేది సుఖ నిద్ర. 
   
నిద్రకు అనుకూలమైన పరిస్థితులు మనమే కలగచేసుకోవాలి, వెన్నెలలో, చల్లటి గాలిలో అరుగు దొరికితే హాయిగా నిద్రపోవచ్చు. నిద్రపోతున్నప్పుడు చెమట పడుతున్నది, కలవరింతలు వస్తాయి, గురక వస్తున్నది ఇవి ఎందుకొస్తాయి ఒక్కసారి ఆలోచిద్దాం.

ముందుగా మనం నిద్రపోయే ప్రదేశము శుభ్రముగా ఉంచుకోవాలి, దుప్పటి దులుపుకొని సరిగా మంచముపై పరచుకొని,  తలక్రింద సరిఅయిన దిండు పెట్టుకోవాలి       
1/20 వ మందంతో ఉన్న మిలియన్ల కొద్దీ ఫైబర్స్తో, కాస్పర్ దిండు మీరు నిద్రించే విధంగా అనుగుణంగా రూపొందించబడింది. మీ జిజ్ఞాసను ఆలోచనను మరచు నట్లు చేస్తుంది. 

జంట ఉన్నప్పుడు ఒకరకంగా నిద్ర ఉంటుంది, జంట ఉన్నప్పుడు మెలి కలయికతో సుఖ నిద్ర ఉంటుంది.  జంట లేనప్పుడు మరోరకంగా నిద్ర ఉంటుంది. ఆలోచనతో ఎదో కొరత ఉన్నట్లు భావిస్తారు, ఎదో మనసులో వెళితే ఉంటుంది, ఎదో చూద్దాము అని వేచి ఉండి కళ్లకు శ్రమ వచ్చేదాకా వేచి ఉంది నిద్రపోతారు. 
పడుకునేముందు కడుపు నిండా నీరు త్రా గండి, లేదా పాలు త్రాగి పడుకున్నట్లైతే ఇంకా మంచిది. దూది పరుపు దిండు శ్రేయస్కరమైనది. ఆధునిక పరికరములు ప్రక్కన పెట్టుకొని నిద్రకు అంత మంచిది కాదు (సెల్ల్, ఎలక్ట్రిక్ పరికరములు దగ్గర్లో ఉంచకూడదు)           

ఎలక్ట్రిక్ లైటింగ్, టెలివిజన్, ఇంటర్నెట్ మరియు కెఫిన్ వంటివి అన్నింటిని విలాసవంతులకు ముందు రోజులు పోలిస్తే నిద్రపోయే సమయాన్ని తగ్గిస్తాయి. ఊబకాయం, మూడ్ డిజార్డర్స్ మరియు ఇతర ఆధునిక రోగాల పెరుగుదలకు ఈ విధమైన నిద్ర లేమి కొన్నిసార్లు బాధ్యత వహిస్తుంది.

మనం నిద్ర పోతున్నప్పుడు మనకు ఏమి తెలియదు, కొందరు ఒంటి కన్నుతో నిద్రపోతారు (భల్లూకం లాగా) మరికొందరు కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు, (చేపలాగా) కొందరు లేచిన తర్వాత ప్రక్క వారిని నిద్రపోకుండా చేస్తారు. కొందరికి నిద్రలో స్వర్గ సుఖాలు అనుభవించినట్లు, మరికొందరికి నరకములో ప్రవేశించినట్లు కలు వస్తాయి. అది మానసిక వత్తిడి అని నా భావము. 

జీవుని మనస్సు శారీరక, ఇంద్రియ, ప్రాణ సంబంధమైన బంధనాలలో బంధించి సంచరిస్తూ 'నేను', 'నాది' అన్న అహంభావముతో వివిధములైన లౌకిక, ఆనందాల మధ్య సంచరించుచూ వాటి మంచి, చెడు ఫలితములను అనుభవింపజేస్తుంది. ఇది అంతా సుఖ నిద్రలో జరుగు తుంది. 

కేవలము మనస్సు మాత్రమే మనిషి యొక్క బంధనాలకు, చెడు వంచనలకు, మార్పులు చెందుటకు కారణ మగుచున్నది. దాని వలననే దుఃఖాలకు, పుట్టుక, చావులకు కారణ మగుచున్నది. ఇవన్నీ రాజస, తామస గుణాల ప్రభావమేనని అందువలన మంచి, చెడుల వివేకము నశిస్తుందని గమనించాలి. సాత్విక గుణం తో మానవులు ఉన్నట్లయితే ఆరోగ్యానికి హాని ఉండదు, ఆలోచనకు తావు ఉండదు. సుఖమును పంచే తనువుకు విశ్రాంతి కలుగుతుంది.      
   --((*))--

 

విశ్వము లో జీవితం-3

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
విశ్వము లో జీవితం-3
బ్రతికి బ్రతికించు 
మానవులమై ఉండి మనం కొన్ని విషయాలు   తెలుసుకోవాలి, సృష్టికి ముందే పంచ భూతాలు ఉన్నట్లు మనపెద్దలు చెప్పగా, సంస్కృత గ్రంధాల ద్వారా మనకు తెలుస్తున్నది. వాటిని ప్రత్యక్షంగా చదవ గలుగుతున్నాము. వీటి అన్నింటికీ మూల గురువు పరమేశ్వరుడు, భూమి, ఆకాశం, గాలి, జలము,  అగ్ని సృష్టించినవారు. భూమి మీద వృక్షాలను, జీవరాశిని సృష్టించాడు.

సృష్టి అనేది  పుట్టుకు వీలుగా ఒక అధిపతిని నియమించినట్లు మనకు తెలుస్తున్నది. నుదుటిమీద రేఖలద్వారా జీవన కాలము వ్రాసి భూలోకం లో జీవించాలని, ప్రకృతి ననుసరించి బ్రతకాలని ఆ విధాత వ్రాసి నట్లు తెలుస్తున్నది.   సృష్టిని పాలించేవారు శ్రీ మహావిష్ణు అని తెలుస్తున్నది. త్రిమూర్తులకు గురువు ఆదిపరాశక్తి అని తెలుస్తున్నది.       పార్వతి ఈశ్వర శక్తిగా, బ్రహ్మిణి బ్రహ్మ శక్తిగా, లక్ష్మి విష్ణు శక్తిగా ఆ త్రిమూర్తులు వారి భార్యల శక్తి మానవులందరిని రక్షించు చున్నదని ప్రతి ఒక్కరు గ్రహించగలరు.

విషయానురక్తి బట్టి బంధము నిలబడు తుంది, ఈ బంధమనేది ఇరువైపులా పదునున్న కత్తి వలే ఉంటుంది. మంచి మాటలు వ్రాసే కలములా, చెడు ఎదిరించే కత్తిలా మానవులు బ్రతకాలని తెలిపేది.           

కొందరిలో బుద్ధి వికసించు తుంది, దానివల్ల సకర్మలు చేయుచు, సన్మార్గములో సంపాదన చేస్తూ, ఉన్నదానిలో రేపటి గురించి ఆలోచించ కుండా దానం చేసేవారు, ముక్తి మార్గం కోసం జీవితంలో కష్ట సుఖాలు అనుభవించి తన జీవన సాఫల్యాన్ని తెలుసుకొని జీవించటానికి ప్రయత్నీస్తారు. ఇటువంటి వారికీ ఇంద్రియాలు అదుపులో ఉంటాయి, అట్టివారు పాపాలకు, కళంకాలకు, చావుకు, విచారానికి, బంధానికి చిక్కకుండా నిర్మల మనస్సుతో, ప్రశాంత వాతావరణంలో బ్రహ్మా నందం   పొందుతున్నారు. వారి వాక్కు వేదవాక్కు, స్వయం ప్రకాశముతో వెలుగుతూ ఎవ్వరికి భయపడని స్థితిని చేరుతారు.    
           
వారు పాపాలకు, కళంకాలకు, చావుకు, విచారానికి దూరమై బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. స్వయం ప్రకాశముతో తాను ఎవరికి భయపడడు.

అదే జ్ఞానము. అదే శాశ్వతము, స్వచ్ఛమైనది. అత్యున్నతమైనది. తనను తాను వ్యక్తీకరించుకొన్న స్థిరమైనది. కనిపించని ఆనంద స్థితి. అది జీవాత్మ కంటే వేరైనది కాదు. లోపల, బయట ఉండేది అదే. అది ఎల్లప్పుడు విజయాన్ని సాధించేది. మోక్ష మార్గాన్ని చూపేది.

విశ్వ మంతా అజ్ఞానము కమ్ము కుంటున్నది, మిడి మిడి జ్ఞానంతో తాను చెప్పేది సత్యమని, తాను చేసేది ధర్మమని, తానూ బోధించేది న్యాయమని వాదించే వారు పెరుగుతున్నారు వారి నుండి జాగర్త వహించటం ప్రతి ఒక్కరి లక్ష్యం.      

శుద్ధిగా ఉన్న బంగారాన్ని అనేక ఆభరణాలుగా మార్చవచ్చు, పత్తిని అనేక రకాల వస్త్రాలుగా తయారు చేయవచ్చు, మట్టితో అనేక రకాల పాత్రలు తయారు చేయవచ్చు అట్లాగే మనిషిలో ఉండే గుణం ఒక్కటే ఇది అనేక విధాలుగా పరిభ్రమించినా మంచి మార్గం లో ఉంచి  బ్రతుకు సాగించటమే శక్తికి తగ్గ (ధనాన్ని)బంగారాన్ని, వస్త్రాన్ని, మట్టిని ఉపయోగించి బ్రతికి బ్రతికించటానికి  ప్రతి ఒక్కరు ముందుకు రావాలి      
--((*))--

విశ్వములో జీవితం -2

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

విశ్వములో జీవితం -2 
ఒకరికి ఒకరు

ఈ విశ్వములో కేవలము విద్య ఒక్కటి మాత్రమే కాదు, విద్యతో పాటు వినయము కూడా ఉండాలి, వీటికి తోడు దానగుణము తప్పక ఉండాలి, అనగా విద్యను దాచకుండా తాను తెలుసుకున్న విద్యను తోటివారికి అందించటమే, విద్యా " జ్ఞానము " వళ్ళ మానవులకు మంచి చెడులు తెలుసుకొని మాయ మాటలకు నమ్మకుండా జీవితాన్ని ఓర్పుతో నేర్పుతో సరి దిద్దు కోవటమే ముఖ్యమైన లక్షణం.  .

విద్య లేని వారు వింత పశువు అనే వారు, కానీ అది తప్పు, అందరు అందలం ఎక్కే వారయితే మోసేవారు ఎవరు అనే ప్రశ్న వస్తున్నది. కానీ అవిద్యా ప్రభావము వళ్ళ కొంత నిరుత్సాహము తప్పదు, ఆయినప్పడికి ప్రకృతి సహకారంతో, తోటి వారి సహాయముతో తాను సంపాదించినదే సంతృప్తిగా భావించితే జీవితం అంతా సుఖమయం. కానీ ఎదుటి వారిని చూసి ఆలోచించి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం, అసంతృప్తిగా ఉండటం అవసరమా ?            

రాత్రి వచ్చే కల తెల్లవారితే మాయ మవుతుంది, దాని వళ్ళ ఎటువంటి హాని ఉండదు, కలలు రావటానికి కారణం మనలో ఉన్న అసంతృప్తి ఒక కారణం, మరియు మనం చూసిన కొన్ని సంఘటనలను ఉహించుకొని నిద్రపోవటం వల్లనే. అందుకే మనం నిద్రపోయేప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని తలచుకుంటే మంచిది. శ్రమ తక్కువగాను ఆలోచన ఎక్కువగాను ఉండటం వళ్ళ కలలు ఱావచ్చును.     

నా ఉద్దేశ్యములో ఏ రోజు పని ఆరోజే చేసుకొని రేపటి గురించి ఆలోచన చేయకుండా ఉండ గలిగిన వాడికి,  బాగా కష్టపడి కడుపు నిండా భోజనము చేసిన వాడికి మంచిగా నిద్రవస్తుంది.    

నమ్ముకున్నదానిపైన నిరంతరం దృష్టి ఉంచడం. ఒకసారి ఏదైనా చేయాలనే నిర్ణయానికి వస్తే ఎవడేమనుకున్నా వెనక్కు తిరక్కుండా ‘జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా!‘ అనుకుని, అనుకున్నదాన్ని సాధించేవరకు కష్టించడం, ఫలితాన్ని మాత్రం మాట్లాడకుండా స్వీకరిచడం - మంచైనా చెడైనా తప్పదు.  మనం మన మనస్సు బట్టి నిర్ణయాలు తీసుకుంటాం, సహకరించే వారి సలహాను పాటిస్తాం, సరైన జ్ఞానము వళ్ళ బుద్ధి వికసించుతుంది.   

ఎర్రని పుష్పము క్రిష్టల్ ముందుంచి నప్పుడు ఎర్రదనం క్రిష్టల్ ల్లో ప్రతి బింబిస్తుంది. అట్లాగే మనచుట్టు వున్నా వారి ప్రభావము మనపై కొంత పడి, చేసేపనిలో కొంత ఆసౌకర్యము కలుగవచ్చు, ఆయన పట్టుదల విడవకుండా ప్రయత్నిమ్చటమే మానవులకు ఉన్న నిజమైనా ధర్మం.    

ధన వనితాది విషయం భోగాలకు చిక్కకుండా విశ్వములో జీవితాన్ని సాగించాలి.  బురద నీటిలో కలు పువ్వు కాడ ఉండి పైన అందాలు విరజిమ్మే విధంగా ఉండే పువ్వుని గమనించాలి  సముద్రములో ఎగిరే చేపలు లాగా ప్రేమను పంచుకుంటూ ఒకరికి ఒకరై విశ్వములో జీవించాలి.  
  --((*))--
 

విశ్వములో జీవితం -1

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
విశ్వములో జీవితం -1
ఒక్క సారి ఆలోచిస్తే?
మనం ఒక్క సారి ఆలోచిస్తే మనకు ప్రతి రోజూ కొత్తగా కనిపిస్తుంది, నిద్రపోవటం తెల్లవారితే లేవటం కష్ట బడటమ్ ఇదే జీవితం అని అందరికి తెలుసు కానీ రేపు ఏమి జరుగుతుందో మాత్రం ఎవ్వరు కనుగొనలేరు ఎందుకు? మనం అద్దం  లో చూసామనుకో మనబొమ్మే కనబడుతున్నది కానీ వేరే బొమ్మ అక్కడ కనబడదు.

మంచి చెడు గమనించి బ్రతికే శక్తి మానవులకు ఉన్నది, కానీ జ్ఞానేంద్రియాలు తెలిపే ఆనందాన్ని దు:ఖాన్ని సమానంగా అనుభవిస్తాం.
సినిమా చూసి మనసు ఉల్లాసం ఉత్సాహం గా మార్చుకోవడం, లేదా  భయాందోలనకు దిగుతాం, అది  తెలిసి వెళతాం కానీ దాని వెనుక ఎందరో కృషి ఉన్నది, తెరమీద బొమ్మల రావటానికి ఒక ప్రొజక్టర్ ఉన్నది, దానికి కనిపించని కరంటు పంపితే గాని చిత్రాన్ని చూపలేదు. అనగా ఎదో శక్తి మనచుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నది అనగా ప్రకృతిలో మారే ప్రతి చర్యకు ఎదో ఒక కారణం  తప్పక ఉన్నది అని గ్రహించవలెను.              

మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఎవరినయినా ఆశ్రయించాలి, లేదా మనమే శోధన ద్వారా తెలుసు కోవాలి, తెలుసుకున్న దానిని ప్రపంచానికి తెలియ పరిస్తే అర్ధం చేసుకున్నవారికి కొంత మంచి ఉండవచ్చు, అర్ధం కానివారికి తేలిక భావంగా ఉండవచ్చు,  అర్ధాన్ని ఆచరించటం, గమనించటమే మనకు అవసరము, చెడును వేలెత్తి చూపి మంచిని పెంచుట అవసరం, మానవులలో మార్పు రావటానికి సహకారం మరీ అవసరం.      

ఎవరి శక్తి వారికి తెలియదు, ఎందు కంటే మన ఆలోచన మన సంసారం భాదలు సుఖాలు కమ్మి వేస్తాయి, ఏదైనా అడిగిన దానికి వెంటనే చెప్పలేరు. అంత మాత్రాణ శక్తి హీనులు కాదు, ఎందుకంటే మనలో అహం అడ్డు పడుతుంది, మనకెందుకు జరిగేవి జరుగక మానవు అని వాదనలో ఉండుట మంచిది కాదు. మనలో ఉన్న శక్తి తో ఎదుటి వానిలో ఉన్న జీవాన్ని ఉత్తేజ పరుచుటకు ప్రోత్సహించాలి. అది మంచి మాటలతో అందరిని ఉత్తేజ పరచాలి .       

మానవులకు మానసిక పరిస్థితిని గ్రహించటం ఎవరి వళ్ళ కాదు, మెలుకవలో అంతర్గతముగా మనస్సులో కలిగే మార్పులే నిగ్రహ శక్తిని పెంచు తాయ్ నిద్రలో ఎటువంటి కలలు రాకుండా మనసు ప్రశాంతముగా నిద్రపోతే ఉషోదయం ఎప్పుడు ప్రశాంతముగా ఉంటుంది. 

మన హృదయంలో విజ్ఞాన సంపద నిండి ఉంటుంది, అదే ప్రేమగా మారి సుఖ మార్గముగా చూపు తున్నది, గడియారం కదిలినట్లు గుండె చప్పుడుతో నిజమేదో గ్రహించు అని హెచ్చరిస్తున్నది అని తెలుసు కోవాలి. బుద్ది వికసించి బలహీనత నుండి బయట పడితే మానవ బలం పెరుగు తుంది. 

సూర్యుని బింబము నీటిలో చూసి పట్టుకోవటానికి ప్రయత్నిమ్చే మనస్సు మనది, అది సాధ్యము కాదని మనకు తెలుసు, ఒక మూర్ఖుడుగా ప్రయత్నీమ్చితే ఫలితము ఉంటుందా ? మొండి వాదనకు దిగటం తప్ప,  అది అవసరమా ?            

కుండ నీళ్లలో ఉన్న సూర్యుణ్ణి పట్టలేము, తలయెత్తి నింగి నున్న సూర్యుణ్ణి చూడలేము కానీ నిత్యమూ దర్శనముగా ప్రత్యక్షంగా కనిపించే దేవుణ్ణి ఒక్కసారి రెండు చేతులతో నమస్కరించుటే మనం చేయగల నిజ స్థితి . 

అదేవిధముగా ప్రతిఒక్కరు తన తోటి వారికి వెలుగు చూపటం నేర్చు కోవాలి, కొవ్వొత్తి వెలుగు చూపి కరిగినట్లు మనం పరులకు సహాయం చేయటం, వెలుగును పంచటం వళ్ళ కష్టములు ఎదురైనా సంతృప్తి వళ్ళ మానవులకు జీవనా ధారము అని గమనించాలి .   
--((*))--

26, మే 2017, శుక్రవారం

Mallapragada ramakrishna Telugu stories-21

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:



వియోగ ప్రేమ 

భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి వియోగ వేదన ఎలావుంటోందో ఒక్కసారి ఆలోచిస్తే ఎవరి తప్పు అయినా చీకటి పడిన ఒక్కటవటం  లోక సహజం, తాడు తెగేదాకా లాగ కుండా జాగర్త పడటమే మానవునియొక్క జీవిత లక్ష్యం.

మొగవారు మూర్ఖులుకాదు కొంత కోపావేశముతో ఆడవారిని ఏమైనా అనవచ్చు అంత మాత్రాన ప్రేమ లేదని వాదించుట స్త్రీకి అవసరమా, అలాగే స్త్రీలలో భర్త ననుసరించి తాను అనుకున్నది సాధించాలని పట్టు పట్ట వచ్చు కానీ సంసారాన్ని వీధిని పాలు చేయట కూడ, భాద్యత ఇద్దరిది. తప్పును వేలెత్తి చూడ కుండా సర్దుకు పోవటమే లోక సహజము.

రమణీయం, కమనీయం,అమూల్యమ్, అనిర్వచనీయం, రెండే అక్షరాలు ప్రేమ.  అనంత సౌఖ్యాలు కల్పించేది, మనస్సును ప్రశాంత పర్చేది ప్రేమ.  కోటి కోట్ల వెలుగులను అందించేది, మనస్సును నిర్మల పరిచేది, ఆనంద చైతన్య కెరటాలు ఇరువురి లో ఉత్పత్తి అయి, మధుర మోహన మౌన రాగాలు ఉల్లా సము,  ఉత్సాహము కల్పించేది ప్రేమ.

దినములెన్నో కాదు హితము కోరి మనసు నెరిగి వయసులో కరిగి వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా నిలబడేది ప్రేమ.   


ఎన్నో సంఘటనలు జరిగాయి మనమధ్య, నాకోసం నీవు ఎంతో కష్టపడ్డావు, నీకోసం నేను కూడా అంతే  కష్ట పడ్డానని అను కుంటున్నాను.


ఆశ వచ్చినప్పుడు నీవు నాకు కనుల పండగ చేస్తావు, లోన నుండి వెలుగు జిమ్మి రూపు జూపి క్షణములో నేను ఎంతో నేర్పుగా ఓర్పుగా పలికిన మాటలకు నమ్మినట్లు, గౌరవించి నట్లు నటన చూపుతావె.


ఇరువదేండ్లు గడచి కూడ నింక నీకు నామీద నమ్మకము లేక నన్ను ఆడిస్తున్నవే, కరుణ యున్న దని దనుచు బలికి కష్టపెట్టు చున్నావే, నే నెప్పుడూ నీ దాన్నే అని బాసలు చేస్తూ దూరంగా ఉంటావే, నీ దరి ఉన్న లాభమేమి, తనివి నీయకున్నచో ?.


చక్కదన మంటూ చిక్కన వానిని ఊరించి దరిచేరగా దూరముగా జరిగి ఒక్క దినము ఒక్క రీతిలో మనసు నంతా కరిగించే పలుకులు పలికి, మాయకు చిక్కిన వాడు ఆడినట్లు ఆడించి తృప్తి పడుట ఎందుకు ?                    


ప్రేమను తేలిపే మార్గాలలో నిన్ను గౌరవించి తెలుపు తున్నాను, వయసు ఉన్నంత వరకు దేవుడు కల్పించిన సుఖము అనుభవించుట తప్పు కాదు, మనది జన్మ జన్మల బంధమని అనుకోవటం జరుగుట లేదెందుకు, నీ మానసిక బాధలకు కారణము నేనే అయతే అనేక విధములుగా నీకు వినతి తెలుపు తున్నాను, తప్పును తెల్పిన సర్దుకొని బ్రతక గలను. సామ దాన భేద దండోపాయముతో పం దేది ప్రేమ కాదు, మన:స్పూర్తిగా ఒకటిగా బ్రతికించేదే ప్రేమ.    

ఎలాంటి పరిస్తితి లో ఐనా " నీ జ్ఞాపకంతో " పెదాలపై  అనుకోకుండా ఆహ్లాద కరమైన చిరునవ్వు తెప్పించేది,."నీ దూరం" గుర్తు రాగానే అప్రయత్నం గా కన్నుల్లో నీటి చెలమలు చెంపలపై కార్చేది, మనమధ్య జరిగిన ప్రేమ.

నిన్ను తల్చుకుని కనులు మూసుకుంటే , లోపలి భారందిగి పోఇ , మనసు తేలిక చేసేది, నీ దుఃఖపు కన్నీటి చుక్కను చూసి విలవిలలాడి తుడిచేందుకు తహతహలాడి చేయి చాపేది, వేదనలో ఉండి నీ భుజంపై తలవాలిస్తే , తిరిగి వేయిఏనుగుల బలం తెప్పించి , నిను నిలబెట్టేది మరచిపోలేని మనమధ్య ఏర్పడిన తనువులు కలిపిన బంధం, అదే జీవితంలో ,మరచిపోవాలన్న మరువ నీయని ప్రేమ.  


యెంత దూరం లో ఉన్నా , సామీప్యం లో ఉన్న భావన ఇస్తూ ఉరట నిచ్చి , తిరిగి మరళా రెట్టింపు ఉల్లాసం ఇచ్చేది, మనమధ్య నలిగినా సుఖస్పర్శ ప్రేమ. 


నీ ఉహ, నీ వస్తువు ఏది చూసినా, తాకినా , అంతరంగంలో అనన్య, అపురూప అనుభూతి కల్గించేది, 

ఓటమి లో, నిరాశలో , ఒక నీ మాట , ఓదార్పు , తిరిగి ఊపిరి పోసి , ఉత్తేజం, ఉత్సాహం నింపేది,
నిద్దురలో, మెలకువలో, చీకటిలో, అశాంతి లో "నీ తోడుంది " అన్న ఆ భావన, ధైర్యంగా ముందుకు పంపేది నిజమైన ప్రేమ.  

"మాధవా" నాదే తప్పు చెప్పుడు మాటలు విని అదే నిజమనుకొని మనమధ్య నేను ఒక అఘాతము సృష్టించు కున్నాను, దాన్ని దాటి రావటానికి నీ సహాయ సహకారము అర్ధిస్తున్నాను, ఇది విషమ కాలమని భావిస్తున్నాను, అన్యధా ఆలోచించక నన్ను నీదానిగా చేసుకో, నాసర్వస్వమూ నీకు అర్పించుటకు నేను సిద్దమే, కాలము మామధ్య బందాన్ని విడదీసింది అనుకున్నా, అదేకాలమే మనల్ని మరలా కలుపుతున్నది యిది దేవుడు ఆడుఇంచిన నాటకమే. 


                                         తోడూ నీడ 
                  సముద్ర కెరటాన్ని చూసి భయ పడకు
తలవంచి నమస్కారము చేయగా
  నీ నీడను చూసి భయం చెందకు
 నీకు తోడుగా నేనుండగా

ముసురును చూసి ముసుకెందుకు
నీ ప్రక్కన వెచ్చగా నేనుండగా 
కాలమును చూసి కలలెందుకు 
 నిముషముకూడ విడవక నేనుండగా

నీవు చీకటిని చూసి భయపడకు
వెలుగుగా నేనుండగా 
గులాబీని చూసి గుబులెందుకు
సువాసనగా నేనుండగా

ధనమును చూసి దిగులెందుకు
ఖర్చుచేసేవాడిగా నేనుండగా 
పక్కను చూసి పక్కగా పక్కగా ఎందుకు
నీ మోజును తీర్చె నేనుండగా

నమ్మకము- ఉన్నచోట-తోడూ నీడ- ఉంటుంది =
 అహం - ఉన్నచోట- అంధకారము- ఉంటుంది
Displaying scan0056.jpg   Displaying scan0056.jpg Displaying scan0057.jpg

' ఆరుద్ర ' కూనలమ్మ పదాలు
×++ +++ +×+
జప తపంబుల కన్న
చదువు సాముల కన్న 
ఉపకారమే మిన్న
ఓ కూనలమ్మ
మగని మాటకు మాటి
కెదురు పల్కెడు బోటి
మృత్యుదేవత సాటి
ఓ కూనలమ్మ
కవితా రసపు జల్లు
ఖడ్గాల గలుగల్లు
కరణాలకే చెల్లు
ఓ కూనలమ్మ
భీష్ము డనుభవశాలి
భీముడే బలశాలి
కర్ణుడే గుణశాలి
ఓ కూనలమ్మ
అన్న మిచ్చిన వాని
నాలి నిచ్చిన వాని
నపహసించుట హాని
ఓ కూనలమ్మ
కాపు వాడే రెడ్డి
గరిక పోచే గడ్డి
కానకుంటే గుడ్డి
ఓ కూనలమ్మ
దుర్యోధనుడు భోగి
ధర్మరాజొక జోగి
అర్జునుండే యోగి
ఓ కూనలమ్మ
ఆడి తప్పిన వాని
నాలి నేలని వాని
నాదరించుట హాని
ఓ కూనలమ్మ
పై ఎనిమిదిన్నీ ప్రచారంలో ఉన్న పాత కూనలమ్మ పదాలు.
సేకరణ :-
డా !! సోమయాజుల త్యాగరాజ శాస్త్రి
శుభ సాయంత్రం !
అవును రాధా "దేవుడు ఆడించిన నాటకమే " 

మనమధ్య ఉన్న ప్రేమను ఏ గ్రహము వేరు చేయలేదు ఇది తద్యం.              
పురుష సూక్తము - తాత్పర్యము
వేదమంత్రాలలో భావగర్భితమైనది, మంత్ర శక్తిలో అతి ప్రధానమైనది పురుష సూక్తం. పురుషుడంటే భగవంతుడు. భగవంతుని మహాత్మ్యమును కీర్తించే సూక్తం ఇది. దేవాలయాలలో, ఇంట్లో, భగవదారాధనలో, నిత్య పారాయణలో, వైదిక ప్రక్రియలలో పురుష సూక్త పఠనం కద్దు. పురుష సూక్తం హిందువుల జీవితంలో ఒక అంతర్భాగమై ఉందన వచ్చు. పురుష సూక్తంలో సంహిత (దేవతా ప్రార్థన), బ్రాహ్మణం (యాగ వివరాలు), అరణ్యకం (ఉపనిషత్తులు) - సనాతన సత్యాన్ని తెలిపే సాధనాలు - ఈ మూడు గర్భితమై ఉన్నాయి. ఈ పురుష సూక్తం భగవంతుని మహాత్త్వాన్ని కీర్తించటంతో ప్రారంభమై, భగవంతుని త్యాగ ఫలంగా ఈ ప్రపంచము, జీవులు ఆవిర్భవించాయని చెబుతుంది. తరువాత జీవుడు భగవంతుణ్ణి పొందటానికి అజ్ఞానాన్ధకారాన్ని దాటే మార్గం చెబుతూ అందుకైన హేతువును, దారిని వివరిస్తుంది. ఈ విధంగా పురుష సూక్తం ఒక పరిపూర్ణ శాస్త్రంగా ఒప్పారుతోంది.
అథ పురుషసూక్తమ్ ||
ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ| గాతుం యజ్ఞపతయే | దైవీ స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ | శన్నో అస్తు ద్విపదే| శం చతుష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
హరిః ఓం |
ఓం సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్ఠద్దశాంగులమ్ | ౧
పురుష ఏవేదగ్ం సర్వమ్ | యద్భూతం యచ్చ భవ్యమ్|
ఉతామృతత్వస్యేశానః | యదన్నేనాతిరోహతి | ౨
ఏతావానస్య మహిమా | అతో జ్యాయాగ్‍శ్చ పూరుషః |
పాదోఽస్య విశ్వా భూతాని | త్రిపాదస్యామృతం దివి | ౩
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః | పాదోఽస్యేహాఽఽభవాత్పునః |
తతో విశ్వజ్‍వ్యక్రామత్ | సాశనానశనే అభి | ౪
తస్మాద్విరాడజాయత | విరాజో అధి పూరుషః |
స జాతో అత్యరిచ్యత | పశ్చాద్భూమిమథో పురః | ౫
యత్పురుషేణ హవిషా | దేవా యజ్ఞమతన్వత |
వసంతో అస్యాసీదాజ్యమ్| గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః | ౬
సప్తాస్యాసన్పరిధయః | త్రిః సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్పురుషం పశుమ్ | ౭
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్| పురుషం జాతమగ్రతః |
తేన దేవా అయజంత | సాధ్యా ఋషయశ్చ యే | ౮
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | సంభృతం పృషదాజ్యమ్ |
పశూగ్‍స్తాగ్‍శ్చక్రే వాయవ్యాన్ | ఆరణ్యాన్గ్రామ్యాశ్చ యే | ౯
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
ఛన్దాగ్‍ంసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాదజాయత | ౧౦
తస్మాదశ్వా అజాయంత | యే కే చోభయాదతః |
గావో హ జజ్ఞిరే తస్మాత్ | తస్మాజ్జాతా అజావయః | ౧౧
యత్పురుషం వ్యదధుః | కతిధా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ | కావూరూ పాదావుచ్యేతే | ౧౨
బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః | పద్భ్యాగ్‍ం శూద్రో అజాయత | ౧౩
చంద్రమా మనసో జాతః | చక్షోః సూర్యో అజాయత |
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ | ప్రాణాద్వాయురజాయత | ౧౪
నాభ్యా ఆసీదంతరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ | తథా లోకాగ్‍ం అకల్పయన్ | ౧౫
వేదాహమేతం పురుషం మహాంతమ్ | ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః | నామాని కృత్వాఽభివదన్ యదాస్తే| ౧౬
ధాతా పురస్తాద్యముదాజహార | శక్రః ప్రవిద్వాన్ప్రదిశశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా అయనాయ విద్యతే | ౧౭
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః | తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచంతే | యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః | ౧౮
|| ఓం నమో నారాయణాయ ||
|| ఉత్తరనారాయణమ్ ||
అద్భ్యః సంభూతః పృథివ్యై రసాచ్చ | విశ్వకర్మణః సమవర్తతాధి |
తస్య త్వష్టా విదధద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమాజానమగ్రే | ౧
వేదాహమేతం పురుషం మహాన్తమ్| ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా విద్యతేయఽనాయ | ౨
ప్రజాపతిశ్చరతి గర్భే అంతః | అజాయమానో బహుధా విజాయతే |
తస్య ధీరాః పరిజానంతి యోనిమ్| మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః | ౩
యో దేవేభ్య ఆతపతి | యో దేవానాం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాతః | నమో రుచాయ బ్రాహ్మయే | ౪
రుచం బ్రాహ్మమ్ జనయంతః | దేవా అగ్రే తదబ్రువన్ |
యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే| ౫
హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ| అహోరాత్రే పార్శ్వే |
నక్షత్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్| ఇష్టమ్ మనిషాణ |
అముం మనిషాణ| సర్వమ్ మనిషాణ | ౬
ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ| గాతుం యజ్ఞపతయే | దైవీస్స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ | శన్నో అస్తు ద్విపదే| శం చతుష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
తాత్పర్యము:
భగవంతుడు వేలాది తలలు కలవాడు, వేలాది కన్నులు కలవాడు, వేలాది పాదాలు కలవాడు; భూమండలం యావత్తూ వ్యాపించి పది అంగుళాలు అధిగమించి నిలిచాడు.
మునుపు ఏది ఉన్నదో, ఇక ఏది రాబోతున్నదో సమస్తం భగవంతుడే. మరణం లేని ఉన్నత స్థితికి అధిపతి యైన వాడూ ఆయనే. ఎందుకంటే ఆయన ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించిన వాడు కనుక.
ఇక్కడ కానవస్తున్నదంతా భగవంతుని మహిమే. కానీ, ఆ భగవంతుడు వీటికంటే శ్రేష్ఠుడు. ఉద్భవమైనవన్నీ ఆయన పావు భాగమే. ఆయన ముప్పాతిక భాగం వినాశములేని గగనములో ఉంది.
భగవంతుని ముప్పాతిక భాగం పైన నెలకొని ఉంది. తక్కిన పావు భాగం ఈ ప్రపంచంగా ఆవిర్భవించింది. తరువాత ఆయన ప్రాణుల జడ పదార్థాలన్నిటిలో చొరబడి వ్యాపించాడు.
ఆ ఆది పురుషుని నుండి బ్రహ్మాండం ఉద్భవించింది. దానితో పాటు బ్రహ్మ ఆవిర్భవించి సర్వత్రా వ్యాపించాడు. తదనంతరం ఆయన భూమిని సృజించాడు. ఆ పిదప ప్రాణులకు శరీరాలను సృష్టించాడు.
భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకొని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి వసంతకాలం నెయ్యిగాను, గ్రీష్మకాలం వంట చెరుకు గాను, శరత్కాలము నైవేద్యము గాను అయినవి.
ఈ యజ్ఞానికి పంచభూతాలు, రాత్రి, పగలు, కలిసి ఏడు పరిధులైనవి. ఇరవై ఒక్క తత్త్వాలు సమిధలయినాయి. దేవతలు యాగాన్ని ఆరంభించి బ్రహ్మను హోమ పశువుగా కట్టారు.
మొదట ఉద్భవించిన ఆ యజ్ఞ పురుషుడైన బ్రహ్మపై నీళ్ళు చలారు. పిదప దేవతలు, సాధ్యులు, ఋషులు, ఎవరవేరున్నారో ఆ యావన్మందీ యాగాన్ని కొనసాగించారు. (బ్రహ్మ పై నీళ్ళు చల్లి పవిత్రీకరించటం మొదలైన విధులతో యజ్ఞం ప్రారంభమవుతుంది).
ప్రపంచ యగ్నమైన ఆ యాగం నుండి పెరుగు కలిసిన నెయ్యి ఉద్భవించింది. పక్షులను, జింక, పులి వంటి వన్యమృగాలను, పశువు వంటి సాదు మృగాలను బ్రహ్మ సృష్టించాడు.
ప్రపంచ యగ్నమైన ఆ యాగంలో నుండి ఋగ్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, గాయత్రి మొదలగు ఛందస్సులు ఉద్భవించాయి. దాని నుండే యజుర్వేదము పుట్టినది.
అందులోనుండే గుర్రాలు, రెండు వరుసల దంతాలు గల మృగములు, పశువులు, గొర్రెలు, గేదెలు ఉద్భవించాయి.
బ్రహ్మను దేవతలు బలియిచ్చినప్పుడు ఆయనను ఏ ఏ రూపాలుగా చేశారు? ఆయన ముఖము ఏడిగా అయినది? ఆయన చేతులు ఎదిగా చెప్పబడినది? తోదలుగా, పాదాలుగా ఏవి చెప్పబడ్డాయి?
ఆయన ముఖము బ్రాహ్మణుడుగా అయినది. చేతులు క్షత్రియుడుగా, తొడలు వైశ్యునిగా, పాదాలు శూద్రునిగా ఉద్భవించారు.
మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు. కాంతి నుండి సూర్యుడు, ముఖము నుండి ఇంద్రాగ్నులు , ప్రాణం నుండి వాయువు ఉత్పన్నమైనారు.
నాభి నుండి అంతరిక్షము ఉద్భవించింది. శిరస్సునుండి స్వర్గము, పాదాల నుండి భూమి, చెవి నుండి దిశలు ఉత్పన్న మైనాయి. అట్లే సమస్త లోకాలు ఉద్భవించాయి.
సమస్త రూపాలను సృష్టించి, పేర్లను కూర్చి ఏ భగవంతుడు క్రియాశీలుడై ఉంటూ, మహిమాన్వితుడూ, సూర్యునిలా ప్రకాశించే వాడూ, అంధకారానికి సుదూరుడు అయిన భగవంతుని నేను తెలుసుకున్నాను.
ఏ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడో, ఇంద్రుడు నాలుగు దిశలలో అంతా చక్కగా చూసాడో, ఆయనను ఇలా గర్హించిన వాడు ఇక్కడే, అంటే ఈ జన్మలోనే ముక్తుడు అవుతాడు. మోక్షానికి మరో మార్గము లేదు.
దేవతలు ఈ యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించారు. అవి ప్రప్రథమంగా ధర్మాలుగా రూపొందాయి. ప్రారంభంలో ఎక్కడ యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించిన సాధ్యులు, దేవతలు వసిస్తున్నారో, ధర్మాన్ని ఆచరించే మహాత్ములు ఆ ఉన్నత లోకాన్ని ప్రాప్తిన్చుకొంటారు.
(ఇక్కడి వరకే పురుష సూక్తము. కానీ దక్షిణాదిలో పురుష సుక్తాన్ని ఉత్తర నారాయణం, నారాయణ సూక్తం, విష్ణు సూక్తం లోని మొదటి శ్లోకంతో పాటు కలిపి పారాయణం చేస్తారు. ఈ కిందవి అవి).
నీటినుండి, భూసారము నుండి ప్రపంచం ఉద్భవించింది. ప్రపంచాన్ని సృజించిన భగవంతుని నుండి శ్రేష్ఠుడైన బ్రహ్మ ఉద్భవించాడు. భగవంతుడు ఆ బ్రహ్మ రూపాన్ని చక్కదిద్ది దానిలో వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మ యొక్క ఈ ప్రపంచ రూపు సృష్టి యొక్క ఆదిలో ఉద్భవించింది.
మహిమాన్వితుడు, సూర్యునిలా ప్రకాశమానుడు, అంధకారానికి దూరుడు అయిన భగవంతుని నేను ఎరుగుదును. ఆయనను ఇలా తెలుసుకోనేవాడు ఇక్కడ ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. ముక్తికి మరో దారి లేదు.
భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై వెలుగు తున్నాడు. జన్మలేని వాడుగా ఉంటూనే ఆయన అనేక రూపాలలో ఉద్భవిస్తున్నాడు. ఆయన నిజ స్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు. బ్రహ్మ వంటి వారు సైతం మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు.
ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో, దేవతల గురువుగా భాసిస్తున్నాడో, దేవతల కంటే పూర్వమే ఉద్భవించాడో, ఆ ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కారము.
భగవంతుని గురించిన సత్యాన్ని తెలిపేటప్పుడు దేవతలు ఆదిలో దానిని గురించి ఇలా అన్నారు: "భగవంతుణ్ణి అన్వేషించే వారు ఎవరైనప్పటికీ ఇలా తెలుసుకున్నాడంటే అతడికి దేవతలు వశులై ఉంటారు."
హ్రీ మరియు లక్ష్మీ దేవి నీ అర్ధాంగినులు. రేయింబవళ్ళు నీ పార్శ్వాలు. నక్షత్రాలు నీ దివ్య రూపం. అశ్వినీ దేవతలు నీ వికసిత వదనం.
ఓ భగవంతుడా! మేము కోరుకున్న దానిని ప్రసాదించి కరుణించు. ఈ ప్రపంచ సుఖాన్ని ఇచ్చి మమ్ము కరుణించు. ఇహపారాలలో సమస్తాన్ని ప్రసాదించి కరుణించు.
ఓం శాంతి శాంతి శాంతి

25, మే 2017, గురువారం

Mallapragada ramakrishna Telugu Stories-20

ఓం శ్రీ రాం   శ్రీ మాత్రేనమ:


ఉపవాసము!
.
ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.
.
భక్తితో కావచ్చు.. బరువు తగ్గేందుకు కావచ్చు.. కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి.

మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది.

 ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయ ముక్కల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటివాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ నీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు.

 ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా.. మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ; సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ; పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.


. హిందూమతంలో ఉపవాసదీక్ష
శివరాత్రి
నాగులచవితి
తొలి ఏకాదశి
కార్తీక సోమవారం
.ఇస్లాంలో ఉపవాసవ్రతం!


సౌమ్

సౌమ్ అనగా ఉపవాసం. ఇస్లాం ఐదు మూలస్థంభాలలో మూడవది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసంను పార్సీ భాషలో రోజా అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు.
రామాయణం లో వాల్మీకి మహాముని వర్ణించారు ఉపవాసం ఆరోగ్యానికి ఒక దివ్వఔషధము. చెట్లకు సమస్త జీవరాశికి పరిణామ దసలున్నాయి అవేవి మనిషిలా పలురకాల ఆలోచనలతో కుంగి పోవు. వాటికి వర్తమానమే ముఖ్యం దాన్ని అవి ఆనందందంగా గుర్తిస్తాయి. పోను పోను చెట్లు మొడు లౌతాయి పచ్చదనం లేని కట్టెలౌతాయి ఆచెట్లపై ఉన్న పక్షులకు అది గడ్డు కాలమే అవుతున్నది. అయినా నాలుగు చినుకులు పడితే తరువు తనువూ సమస్తము పత్ర హరిత మయమవుతున్నది. పువ్వుల కాయలతో నిండుగా ఉంటుంది.

అదే మనుష్యులు ఆశతో ఆకలితో ఎక్కడా దొరకనట్లుగా చూసిన ఆహారాన్ని ఎక్కువగా తింటారు కొందరు, కొందరు ఏది చూసిన అను మానంతో తింటారు, మరికొందరు ఉదరపోషణ ధర్మానికి శక్తిని ఇచ్చే పోషపదార్ధాల ఆహారాన్ని తింటారు. ఎంత తిన్న వయసు పెరిగిన కొద్ది మన శరీరంలో మార్పులు వస్తాయి. అమర్పులకు తగ్గట్టుగా మనం ఆహారం తీసుకోవాలి, వయసు పెరిగితే చెట్లలాగా వికసించే శక్తి మనకు ఉండదు.

అందుకే శనివారం, మంగళవారం ఉపవాసము ఉండుట మంచిది అని పెద్దలు చెప్పారు ఎందుకనగా మనం తిన్న ఆహారము జీర్ణము కావాలి అది ఒక సంచి అదే పనిగా తిండిని తొక్కుతూ పోతే శరీర భాగాలు పని చేయటం తగ్గు గుతుంది.  బద్దకం పెరుగుతుంది, నిద్రముంచు కొస్తుంది. ఇది ఎవరికీ మంచిది కాదు.               

ఉపవాసం ఆరోగ్యానికి, వీర్యశక్తికి తప్పని అవసరం. ప్రకృతి ని బట్టి మానవులు అసలు విషయము గ్రహించి ప్రస్తుత స్థితిని బట్టి ఆనందము అను భవించుటకు ఉపవాసము అవసరము.   

Mallapragafda Ramakrsihna Telugu Stories-19


ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
              
ఆలింగనం అంటే ఏమిటి -(?)

మనసులు కలసిన వేళ, హృదయం స్పందించిన వేళ, ప్రకృతి కరుణించిన వేళ, ప్రశాంత వాతావరణంలో, పున్నమి వెన్నెల కాంతులలో, చల్లగా వీచే గాలియందు ఆణువణువూ తపించే స్పర్శ హృదయాలు ఏకమవుటం లో ఉన్న ఆనందం, స్వర్గం కన్నా మిన్న అని నేను అనుకుంటాను, స్వర్గాన్ని అయినా వర్ణించగలము కానీ, సుఖాన్ని వర్ణించటం ఎవరి తరము కాదు. విద్యార్థులతో ఉన్న పెద్దలతో రామకృష్ణ శర్మ పంతులుగారు ఈవిధముగా చెపుతున్నారు.
  
ఆలింగనం మనుషుల మధ్య ఆప్యాయతకు అనురాగానికి గట్టి ఆనవాలు, తోలి వలపునకు అది ఓనమాలు, జన్మ జన్మ బంధాలకు, ఆత్మీయతకు, జీవిత సాఫల్యానికి, తన్మయత్వ స్వభావానికి, తరుణం మించకుండా తమకం తగ కుండా, చలామణి అవుతూ, నిత్య ఆశల వలయంలోకి లాగుతూ, మనస్సును నిర్మలంగా ఏరోజుకారోజు మార్చేది ఇది.

ఒక్కో రకం ఆలింగనానికి ఒక్కో రకం అనుభూతి, వాత్సాయన గ్రంధంలో అనేక రకాల అనుభూతులు మనకు తెలియ పరిచారు.

పెద్దలు మనకు దీవెన ఒక ఆలింగనం అట్లాగే లాలన పాలన చూసి ఆనంద పడుతూ ఇచ్చేది ఆలింగనం .

కరచాలనం చేసి, దరహాసముతో, మెత్తగా ప్రియమార హత్తు కొనుట మర్యాద పూర్వక ఆలింగనం. దేశాధినేతలు, ప్రముఖులు, జరిపే మర్యాద పూరకముగా, గౌరవ సూచనగా జరిపేది.  ఒకరకం ఆలింగనం.

పాలిండ్లు పొంగారి యవ్వన గర్వంతో బాహుబలిని ఆకర్షించి అనంత సుఖాలు పొందాలని ఆశించి, పెదాలు రుచిచూడాలని  ఘాడంగా ఆలింగనం చేసే శృంగార నెరజానుల ఆలోచనే వేరు, ఇది ఒక అనుభూతి.

ఆలింగనాన్ని ఆశించకుండా దూరం దూరం అని మడి కట్టుకు కూర్చున్న, మన:స్పర్ధలు పెరిగి, ఆరోగ్యము నలిగి, వయసు పెరిగి, ఆలోచనల మనిషి గా, అనుమాన మనిషిగా మారితే అపార్ధం పెరిగి సంసారం వీధిన పడుటకు ఆలింగనం లేకపోవుట కుడా ఒక కారణం. ఈ అనుభూతి పొందలేనివాడు సంసారిగా జీవిన్చలేడని నాభావన.
ఆశ్రయం కోసమో, అనుభందం కోసమో మద పిచ్చితో మగువ, మగవాన్ని రెచ్చగొట్టి కోరిక తెలియచేసి నేను కన్యను నీవు బ్రహ్మ చారివి మనమధ్య లేదు ఎటువంటి సందేహము నా భాహు భాండాలలో చుక్కు మదనా అని వెంబడి పడేవారు, అటువంటి పరిస్థితులలో లొంగి పోయేవారు సహజం.

విశ్వనాధ గారి వర్ణన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం
పుష్కరతీర్థంలో జలకాలాడిన మేనక నిలువెల్లా తడిసిన బట్టలతో విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చింది. ఆ 'సురవధూటి' జుట్టును ముని తుడవబోయాడు. ఆమే వారించి తుడుచుకో, ఆమె తివురు ... అతడు వారించి తుడవగా . అతడు తివురు ... చేతులందేయుచు పెనంగా చివరిదైన ఫలము తడి కౌగిలింతగా పరిణమించే అన్నారు.
 అపనలతో తహ తహ లాడే శృంగార ఆలింగనాల పర్యవసానం చప్పుకో నవసరం లేదు.

నల్లని మేఘాలలో వెలుగుల విరజిమ్మే విద్యుత్తుదాగి వున్నట్లే....మనం చేసే ప్రతి కష్టంలోనూ సుఖం దాగి వుంటుంది. ఎదో కొత్తదనం మనలో దాగి ఉన్నది, అది  ప్రపంచానికి అందచేయటమే మనలక్ష్యం గా జీవించాలి,  అలాగే మనం చేసే పని మనం చేస్తున్నాము అనుకుంటాము, మనల్ని చేయిన్చేవాడు ఒక పరమాత్ముడు వెనక ఉండి నడిపిస్తు న్నాడని అనుకోలేము, ఇది నా కష్టార్జితం అని, ఇది నా సుఖాల సంతతని, నా తోడు ఆలింగన మని    అనుకుంటాం, కానీ రుణాల భంధమని గమనించ లేక పోతాం అయినా ఇది మాయా ప్రపపంచం, భాహు బందాలలో చిక్కి సుఖ సౌఖ్యాలు పొందిన వానికే మనస్సు ప్రశాంతిగా ఉండ కలుగు తుందని నాభావనా.          

తపస్సు కొకరు, చదువుకు ఇద్దరు, సంగీతానికి ముగ్గురు, ప్రయాణానికి నలుగురు, వ్యవసాయానికి ఐదు లేక ఏడుగురుండాలి.యుధ్ధానికి మాత్రం ఎక్కువమంది అవసరం. ప్రతిఒక్కరి జీవితానికి స్త్రీ పురుషుని సంగమం ఒక్కటే ఒక్కటి, ఇరువురికి నిత్యకల్యాణం పచ్చ తోరరణం, మనస్సు శాంతి కి సునాటికి మనోనిగ్రహ శక్తికి ఇది ఒక మార్గం అని నా భావనా   

ఈరోజు కొన్ని సామెతలను ఉదాహరింస్తున్నాను, మిగతా భాగము రేపు చెప్పుకుందాం

ప్రేమ కలయికకు ఒక నిదర్శనమైతే,  దయ, కరుణ, స్నేహము, వాత్సల్యము, బంధము, ఆత్మీయత, అనురాగము అనేవి కుడా ప్రేమకు చిహ్నాలు.

ప్రతి ఒక్కరు సృష్టి రహస్యానికీ తోడ్పాటుగా ఉండాలి " జోడు లేని బతుకు, తాడూలేని బొంగరం " అంది ఒక సామెత ఉన్నది. అనగా బ్రహ్మచారి జీవితం తడులేని బొంగరం ఒకటేనని దీని భావం ప్రతిఒక్కరు తప్పకుండా పెళ్లాడాలని, సమాజ పురోగతికి తోడ్పడాలనేది మన పూర్వీకుల ఆకాంక్షగా ఈ సామెత చెపుతున్నది. పురుషులు కానీ స్త్రీ కాని పెళ్లి కాకుంటే పరిపూర్ణులు కాలేరని మన పెద్దల నమ్మిక.

మీరందరూ అనవచ్చు పెళ్లిళ్లు కావటంలేదు, చదువులు ఉద్యోగాలు అంటూ కాలయాపన చేస్తూ వయసు ముదిరేదాకా ఉంటున్నారు, ఎంత ఉన్న సంపాదన సరిపోవటంలేదని ప్రతిఒక్కరు అనుకుంటున్నారు, ప్రపంచ ఆధునిక పోకడలకు బానిసలై భయపడుతున్నారు, ఈవయసులో చేయాల్సిన పని ఆవయసులో చేయక భాధను తెచ్చుకుంటున్నారు.

ఏది ఏమైనా మన పెద్దలు చెప్పిన సామెత ఒకటి గుర్తు చేస్తాను " కళ్యాణ మొచ్చినా, కక్కొచ్చినా ఆగవు "
పెళ్ళి సంబందాల కోసం తిరగడం వాళ్ళ ఏడు జతల చెప్పులు అరిగా యంటారు. అంటే సంభందాలు కుదరటం అంత  కష్టమని భావన అయితే కొన్నిసార్లు పెద్దగా ప్రయత్నం లేకుండానే పిల్లలకు మంచి సంభందాలు వచ్చి వెంటనే  ఇరువైపులా అంగీకారం కుదిరి చెకఃచెకా పెళ్లిళ్లు జరుగుతాయి. కక్కు వస్తే ఆపడం అసాధ్యం అలాగే సమయమొస్తే ఇబ్బందులన్నీ తొలగి పెళ్లి తథ్యం.

ఆలింగన సుఖం తెలిసిన వారి మధ్య బంధం విడదీయుట అసాధ్యం. రేపుకొన్ని విషయాలు తెలుసుకుందాం మీకందరికీ వందనం అంటూ లేచారు తెలుగు మాష్టారు.                   
                          


18, మే 2017, గురువారం

Mallapragada Ramakishna Telugu stories -18

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రేమంటే ఏమిటి -( ?)

కుర్చీలో కూర్చొని పేపర్ లో సినిమాలు చూస్తున్నాడు, అప్పడే గుండె కొట్టుకోవటం మొదలు పెట్టింది, ఆగు ఆగు అంటూ గుండెపై చెయ్ పెట్టాడు, అప్పుడే గజ్జల శబ్దం వస్తున్నది, ఎక్కడా అని చూస్తున్నాడు మాధవ్, ఆ ఇంటిలో అడుగు పెడుతున్న అందాల అతిలోక సుందరి నీడ గుమ్మం దగ్గర పడుతున్నది, సూర్య కిరణాల వెలుగులో పోత పోసిన బంగారంలా కనబడుతూ కిల కిల నవ్వులతో అలా లంగా పైకెత్తుకుంటూ, జడ కుప్పెలు సవరించు కుంటూ కుడిపాదం పెట్టి లోపలి వస్తూ రావచ్చా అని అడిగింది రాధ.

ఆరూపాన్ని చూడగానే కొట్టు కుంటున్న గుండె ఆగినంత పని అయ్యింది, నోరు తెరచి కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండి పోయాడు, ఎప్పుడూ చూడని అందాలు విరజిమ్మే బంగారు గులాబీ అనుకున్నాడు మాధవ్ .

ఏమిటిరా మాధవ్ అలా బిత్తర మొహం వేసి చూస్తున్నావు, ఆడపిల్లని చూడని మొహంలా అన్నది తల్లి.

లేదమ్మా, ఎం లేదు ఎదో ఆలోచిస్తూ అలా చూస్తున్నా, బంగారు సీతాకోక చిలుక కనబడింది దాన్ని చూస్తున్న. నీవు ఎవరిని చూస్తున్నావో నాకు తెలుసు,   ఇదిగోరా అలా షాపుకు పోయి, ఈ కాగితంలో వ్రాసినవణ్ణి తీసుకురా అని అట్లాగేనమ్మా అంటూ బయటకు నడిచాడు మాధవ్ .

రాధ నవ్వును చూసి రామచిలుక ఓరాధ ఇటురా, నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టాలని ఉంది అని అరుస్తున్నది. అక్కడున్నవారు నెవ్వర పోయారు.

రాధ లోపలకు అడుగు పెట్టగానే దిష్టి తీసి మరీ బయట పారబోసింది ఎర్రనీరు కన్నతల్లి.

పక్కపోర్షన్ లో ఉన్న మాధవ్ ఇంటర్లో రాధ చేరాలిట కాస్త నీవు తోడుగా వెళ్ళు. 

మంచిగా తలదువ్వాడు ఫుల్ ప్యాంటుషర్టు వేసి కళ్లజోడుపెట్టి, షూస్ వేసుకొని నెమ్మదిగా నడుస్తున్నాడు రాధతో .

ఎం మాధవ్ ఏవన్నా మాట్లాడు సరదాగా,  వెంటనే అన్నాడు, నీవు చాలా అందంగా ఉన్నావు,
ఎలా తెలుసుకున్నావు

నిగనిగలాడే నైలాన్ గౌనులో తళ తళ మెరిసే పావడా పైన ఉన్న లోన అందాలు చూసే వారికి మతి పోతున్నది, కురులలో మల్లెపూల గుబాళింపు, నడకలో నాజూకైన శ్వరాలు, ఇంకా ఏమని చెప్పేది, ఎలా చెప్పేది అన్నాడు .

ఇకచాలు ఆపు నీ మాటలు నాకు నచ్చుట లేదు    
అప్పుడే జేబులోనించి ఒక కాగితము తీసి ఇలా చదవటం మొదలు పెట్టాడు. 

చిగురించిన తోటలలోనో,  వికసించిన పువ్వులలోనే, అమృత వలయములు జనించినప్పుడు, విలయములై జ్వలించి నప్పుడు,  కాలానికి నమస్కారం చేద్దాం, ప్రేమకు గొళ్ళెం తీద్దాం, ఆనందపు అంచులు చూద్దాం, భవిషత్తుకు పునాది వేద్దాం, నవ వసంత మార్గంలో యవ్వన సమరంలో పోరాడి గెలుద్దాం, స్వర్గ సుఖాలు అనుభవిద్దాం అని చదివాడు  మాధవ్. 

ఆమ్మో ప్రేమ భావాలు నాకు అర్ధం కావు, నేను చదువు కోవాలి,   బాగా చదువు కోవాలి నీకు తోడుగా నేను చదువుతా అన్నాడు రాధతో, కోఎడ్యుకేషన్ కాలేజీలో ఇంటర్లో చేరింది, మాధవ్ డిగ్రీలో అడుగు పెట్టాడు. 

కొత్తగా చేరిన వారిని రాగింగ్ చేయుట అనాదిగా వస్తున్నది.
అప్పుడే రాధను చూసిన కొందరు కొంటె విద్యారులు ఈ విధముగా అడిగారు - "వన్ ఫోర్ త్రి " అంటే ఏమిటో చెప్పి వెళ్ళండి. ఇది రాగింగ్ కాదు చెప్పలేక పోతే ఇంకా ప్రశ్నలు వేస్తాము, రక రకాల పద్దతిలో వేదిస్తాం అన్నారు.
వెంటనే తనతో వస్తున్న మాధవ్ వంక చూసింది ఓరచూపుగా, సీనియర్గా చెపుతున్నా వదిలేయండి అని గట్టిగా అన్నాడు.

దమ్ముంటే నీవే నీతో వస్తున్న అమ్మాయికి చెప్పాలి అన్నారు.
     
అప్పుడే డిగ్రీ సీనియర్లు వచ్చి మేము చేసే రాగింగ్ కు నీవు వప్పుకోవాలి, అప్పుడే అమ్మాయిని నిన్ను వదిలేస్తాము, లేదా దానికి సమాధానము చెప్పి వెళ్ళాలి  అన్నారు.

143 అంటే - ఐ లవ్ యు - మాతో చెపతా వేమిరా ఆ అమ్మాయి మొఖం చూస్తూ చెప్పాలి - చెకచెకా చెప్పాడు.
అట్లా కుదరదు. అంకెలను తెలుగులో వర్ణించి చెప్పాలి అన్నారు
     
అప్పుడే మాధవ్ ఇలా చెప్పాడు  కాలేజీలో 143 అంటే - వన్ అనగా ఒంటరిగా ఒకరుకి  ఒకరు కలుసుకొని ఒక టవటం - ఫోర్ అనగా నాలుగు దిక్కుల మధ్య, నమ్మకంతో నయనాల చూపులు కలిపి, రేండు చేతులు రెండు కాల్లకు బందాలై అనుబంధం గామారటం - త్రి అనగా త్రికరణ శుద్ధిగా మనసు మనసు ఏకమై తనువూ తనువూ కలసి సంతృప్తి పడుటే అన్నాడు అంతే ఆటే వెళుతున్న తెలుగు మాష్టర్ చప్పట్లు కొడుతూ అక్కడకు వచ్చాడు, మిగతా విద్యార్థులందరూ ప్రక్కకు తప్పుకున్నారు, మీరిద్దరూ నాతో రండి అని లోపలకు తీసికెళ్ళాడు, మాష్టర్ గారు తెలుగు భాషతో వీళ్ళిద్దర్నీ తింటాడు మనదారి మనం వెళదాం అని క్లాస్ రూమ్ లోకి వెళ్లారు విద్యార్థులు.

మాష్టర్ ఇలా చెప్పటం మొదలు పెట్టాడు
 
ధనము చేత "ధర్మము" రక్షించ బడును. యోగము చేత విద్య రక్షించ బడును. సత్ స్త్రీల చేత గృహము సురక్షితమగును. మృదుత్వముచే భూపాలురు రక్షితులు అగుదురు.ప్రేమ చేత అందరూ బతక గలరు. కొంటె తనానికి తగు విధముగా బుద్ధి చెప్పితేనే తోటి వారు బ్రతుకుతారు  అన్నాడు.

గురువు ధర్మ వర్తను డైతే విద్యార్థులు కూడా ధర్మ ఆచరణ శీలురు ఔతారు. విద్యార్థులు మూర్ఖులుగా మారితే తల్లి తండ్రుల భాదించిన వారౌతారు. అలాగే చిన్న వయసులో ప్రేమ అని చదువు పాడు చేసుకోకండి, బాగుగా చదువుకొని మంచి ఉద్యోగము సంపాదించి వివాహము చేసుకుంటే సుఖము సౌఖ్యం, అందుకే చిన్నప్పుడే ప్రేమ బీజం అంత  మంచిది కాదు మీకు చెప్పాలనే ఇక్కడకు పిలిపించా అన్నాడు తెలుగు మాష్టర్ !


అప్పుడే మాష్టరుకు ఒక నోటీస్ తెచ్చి ఇచ్చారు.

ఇప్పుడే తెలిసింది మనకాలేజీ బాలికల విభాగము ప్రాత్యేకముగా ఇక్కడనుండి మార్చటం జరుగుతున్నది కొత్త భవనంలోకి అని చెప్పాడు.

అప్పుడే రాధా - మాధవ్ ఒకరి కొకరు చేతులు ఊపుకుంటూ విడిపోయారు.

అప్పుడే ఒక విద్యార్థి మాష్టర్ వద్దకు వచ్చి ప్రేమకు మరణం లేదు అన్నారు దాని గురించి చెపుతారా .
గంట మ్రోగింది నేను క్లాసుకు వెళుతున్న ఇంటికిరా అన్ని వివరంగా చెబుతాను అన్నాడు మాష్టర్ , అట్లాగే అన్నాడు విద్యార్థి .