14, మే 2019, మంగళవారం





శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం-29-   సుదంతుని  కధ

గంధర్వనగరం అనే సుందర పట్టణం లో ప్రజలను కన్నబిడ్డలు లాగా చూసు కొనే మహారాజు ఉన్నాడు .దానికి దగ్గర లో చిన్న అడవి ఉంది .అందులో సుదంతుడు అనే పేరున్న మహర్షి ఉన్నారు .ఆయన సద్గుణ సంపన్నుడు .తపోనిధి .ఆశ్రమ ధర్మాలన్ని టిని సక్రమంగా నిర్వహిస్తూ మౌని గా పవిత్ర జీవితాన్ని గడుపు తున్నాడు .మంత్ర మననం తో రుషి అయాడు .హృదయం లో ఆత్మా రాముడిని దర్శిస్తూ ఆనంద బ్రహ్మ లాగా ,ఆనంద మూర్తి గా ఉన్నాడు .వృద్ధాప్యం ప్రవేశించి ,ఆకలి దప్పుల చే పీడింప బడుతున్నాడు.

ఒక రోజు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ఎంతో శ్రమ పడుతూ బయల్దేరాడు .వచ్చిన వారందరినీ ఆదరిస్తూ భోజన పానీయాలతో సంతృప్తి పరుస్తున్నాడు భరద్వాజుడు .కాని సుదంతుని పట్టించు కోలేదు .ఆకలిగా ఉన్న సుదంతుడు భరద్వాజ మహర్షి దగ్గర కు చేరి ,నమస్కరించి ,’’మహర్షీ! అందర్ని ఆదరించారు .నా మీద అనాదరం ఎందుకు చూపిస్తున్నారు?నేను కడు దరిద్రుడిని .వృద్ధుడిని.ఆకలి దప్పిక తో బాధ పడుతూ భరించ లేక మీ చెంతకు చేరాను .’’అని విన్న వించాడు .మహర్షి హృదయం కరిగి ,జాలిగా సుదంతుని వైపు చూశాడు.ఓదార్చాడు .దుఃఖించ వద్దని చెప్పాడు .అతనికి ఆతిధ్య మివ్వ కుండా ఉండటం లో తన తప్పేమీ లేదని ,అదంతా సుదంతుడు చేసిన పాప కర్మ ఫలమే నని వివరించాడు.

‘’పూర్వం నువ్వు ఒక రాజ్యానికి రాజు గా ఉండే వాడివి .అందర్నీ బాగా చూసే వాడివి .విద్యా వంతుడివే అయినా నీవు  ఎందుకో హనుమ ను దూరం చేసుకోన్నావు .హనుమను దేవుడు కాదని ,ఒక సామాన్య మైన కోతి అని భావించి నిన్దిన్చావు . అంతే కాదు హను మంతుడిని ఉపాసించే వారిని బాధించావు .కాని నీ తల రాత ఇంకో విధం గా ఉంది .నీ శత్రువులు అందరు ఏకమై ,నిన్ను ఓడించి,నీ రాజ్యాన్ని ఆక్రమించి ,నిన్ను అడవులకు పంపారు .నీ భార్యా ,పిల్లలు చని పోయారు .నువ్వు అన్నీ పోగొట్టు కోవటం చేత కుంగి ,కృశించి ,ఆ అడవి లోనే మరణించి ,బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడి నందుకు బ్రాహ్మణుడి గా జన్మించావు .నిష్కామంగా ,నిశ్చల బుద్ధి తో తపస్సు చేసి రుషి అని పించు కొన్నావు .అయినా మారుతి ని దూషించిన ఫలితం గా నువ్వు ఆకలి బాధ కు గురి అయావు .ఆ దుష్కృతి పోగొట్టు కోవ టానికి నువ్వు హను మంతుని సేవించు .నేను హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను .దాన్ని తీవ్రం గా జపిస్తూ ,నీ కోర్కెను తీర్చుకో ‘’అని చెప్పాడు.

భరద్వాజుడు ఉపదేశించిన హనుమాన్ మంత్రాన్ని అక్కడే ,ఆయన సమక్షం లోనే జపించాడు సుదంతుడు .అప్పటికప్పుడు హనుమ ప్రత్యక్షమై సమాదరించాడు .సుదంతుడు హనుమ పాదాల పై వాలి నమస్కరించాడు .తనను ఉద్ధరించ మని అనేక రకాలుగా స్తోత్రాలు చేశాడు .అంజనా నందనుడు ఆనంద పడి,’’సుదంతా !బాధ పడకు .నన్ను సేవించు.నీకు ఇదే చివరి జన్మ .’’అని ఊరడించి అదృశ్యమైనాడు ..అప్పటి నుండి సుదంతుడు నిత్యం హనుమ ను సేవిస్తూ పూజిస్తూ స్మరిస్తూ ఉపాశిస్తూ జీవితాన్ని గడి పాడు .జీవితాన్ని ధన్యంచేసుకొని చివరకు  హనుమ  లో లీనమయ్యాడు .

‘’రాజ్య ప్రదం హనూమంతం వదాన్యం మధుర ప్రియం

శ్రియం చింతా మణిం కామ ధేనుం కల్పక మాశ్రయే.’’

‘’సపీత కౌపీన ముదంచి తాన్జలిం సముజ్జ్వలం మౌన్జ్య జినోప వీతినం


సకుండలం లంబశిఖం సువాలం తమాన్జనేయం శరణం భజామి ‘’.

Image may contain: 2 people
ప్రాంజలి ప్రభ 
నేటి కవితానందం  
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

ఐశ్వర్యం లో ఉన్న 
పేదరికంలో ఉన్న 
గుణం లేకపోతె గుండు సున్నా 

పట్టు పరుపులపై నిద్రించిన  
కటిక నేలపై నిద్రించిన 
బుధ్ధి లేక పొతే గుండు సున్నా 

పంచ భిక్ష పరవాన్నాలు తిన్నా 
గంజి నీరు త్రాగి ఉన్నా 
శక్తి లేక పొతే గుండు సున్నా 

అందుబాటులోది చూడకున్నా  
లేని దానికోసం వెంపర్లాడినా 
మనసు లేక పొతే గుండు సున్నా 

నల్లెరులా పరుగెత్తిన 
పల్లేరులా గుచ్చుకుంటూ వెళ్లినా 
కరుణ లేకపోతె గుండు సున్నా 

కారుచీకట్లు కమ్మి ఉన్నా 
పండు వెన్నెల పొంచి ఉన్నా 
దాహం తీరకపోతే గుండు సున్నా

మంచులా కరుగుతూ నీడ ఉన్నా 
నిప్పే వెలుతురుగా ఉన్నా  
ఆకలి తీరకున్న నిండు సున్నా 

వానచినుకు స్పర్శకు తనువున్నా  
సహజ సౌందర్యంతో వెలిగి పోతున్నా 
బతుకు సార్ధకం లేకపోతె నిండు సున్నా 

మర యంత్రంలా బ్రతుకుతున్నా 
దేశానికీ ఎవ్వరికి ఉపయోగం లేకున్నా 
ఉన్నా లేనట్లే అదే నిండు సున్నా 


--((**))--


పేదవాని కధ  
ఒకసారి చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు. అతను అడిగాడు:
'నేను ఎ౦దుకు పేదవాడను?
బుద్ధుడు సమాధానం చెప్పాడు: మీరు ఎ౦దుకు పేదవారు  అంటే మీరు  ఎటువంటి ఔదార్యము  కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు.
నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది అని ఆ పేదవాడు అడిగాడు.
అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు

మీరు ఇతరులతో ప0చుకోగల ఐదు నిధులను కలిగివున్నారు.

 మొదట మీ ముఖం ఉంది. మీరు ఇతరులతో మీ  ఆనందాలను(నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం ... ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ..

రెండవది మీ కళ్ళు మీకు ఉన్నాయి. మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు .. నిజం.. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు .. వాటిని మంచి అనుభూతిగా చేయండి ..

 మూడవది  మీ నోరు మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించండి .. వాటిని విలువైనదిగా భావించండి .. ఆనందం మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ..

 నాలుగవది మీకు గుండె ఉంది. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు .. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.. వారి జీవితాలను తాకవచ్చు..

 మీరు కలిగి ఉన్న చివరి సంపద మీ శరీరం .. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు ..అవసరమైనవారికి సహాయం చేయగలరు .. సహాయం  చెయ్యడానికి  డబ్బు అవసరం లేదు ..

ఒక చిన్న శ్రద్ధ ,సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు.
భగవంతుడు మనకిచ్చిన జీవితం..
కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !
ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి సహాయపడుతూ, జన్మను చరితార్థం చేసుకుందాం.
  
శుభం.....

--((**))--
ప్రాంజలి ప్రభ
నేటి కవితానందం
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

గాలి మనిషిని ఆవరించు
తేన పలుకులతో వరించు
నాదాల హరిలా పరవసించు
మాటలు తూటాలు చలించు

పలాయనంతో సర్వం మరచు
చిత్తగింపుతో  నిజము చరచు
అభ్యుదయమని గొప్పగా అరచు
మనిషి మేధావితనం వ్యక్త పరచు

పుట్టినప్పుడు బట్ట కట్ట లేదనుచు
పోయినప్పుడు వెంట ఏదీ రాదనుచు
నిన్ను రక్షించే చైతన్య కవచమనుచు
నీలో ఉన్న దైవమే నిన్ను నడిపించు

తెలుగు నుడికారం జీవిత మనుచు
పరిమళ ప్రాకారం దేశము అనుచు
హృదయ సహకారం పెద్ద లనుచు
తోడుండే కాలమే సౌజన్య మనుచు

--((*))--

శ్రీ ఆంజనేయ స్వామి కధలు -2

పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు .వేద వేదాoగ పారంగతుడు. బుద్ధిమాన్,  స్వధర్మా చరణనిష్టుడు.  పుత్రులు ,పౌత్రులతో, భార్య విశాలాక్షితో సుఖ జీవితం  గడుపుతున్నాడు. అతిధి పూజలో జన్మ ధన్యం చేసు కొంటున్నాడు.

 ఆ గ్రామానికి ఒక ప్రభువులా వెలిగి పోతున్నాడు కేశవుడు. కొంత కాలానికి అతని జీవితం లో, విషాదం అలముకొంది.  ప్రియ అర్ధాంగి, అకస్మాత్తుగా మరణించింది. అతని దుఖం పట్ట శక్యం కాకుండా ఉంది.  బాధ తట్టుకోలేక, కాశీ నగరం చేరాడు.
అక్కడ నిత్యం, గంగా స్నానం తో, పవిత్రతను పొందుతూ,  విశ్వేశ్వరున్ని దర్శిస్తూ, అభిషేకం చేస్తూ, విశాలాక్షీ దేవి దర్శనంతో ఊరట చెందుతున్నాడు . కొంత కాలం కాశీలో గడిపి , తర్వాత, ప్రయాగ , గయా, మొదలైన  క్షేత్రదర్శనం చేసి, పితృ కార్యాలను, నిర్వహిస్తూ,  విధ్యుక్త ధర్మాలన్నీ  నిర్వహిస్తూ, కొన్ని నెలలు గడిపి , మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు . ప్రయాణంలో ఒకరోజు చీకటి పడటంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు.  ఆ వటవృక్షం, చాలా పురాతనమై, ఊడలతో బాగా విస్తరించి ఉంది .అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకొని, ఒక పిశాచం, అందంగా ఉన్న కేశవుని తినాలని, ఉబలాట పడింది.

 మనోహర సుందర యువతి గా మారి, అతని దగ్గరకు వచ్చింది. శృంగార చేష్టలతో రెచ్చగొట్టటం ప్రారంభించింది. అతనికి ఏమీ పాలు పోలేదు.
 ”యువతీ !ఎవరు నువ్వు ?అర్ధరాత్రి ఒంటరిగా ఇలా రావటం తగదు. వివాహం అయిందా ?నేను భార్య లేని వాడను. నా అండ దండలతో ఉండగలవా ? నువ్వు ఒప్పుకొంటే, నాతో నిన్ను, మా ఊరు తీసుకొని వెళ్తాను” అని చెప్పాడు . ఆమె అంగీకరించింది . వారిద్దరూ  ఆ రాత్రి ఆనందంగా గడిపారు .మర్నాడు ఆ ఇద్దరు ఇంటికి చేరారు .  కొంత కాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద, ధూళి దూసర దేహంతో , రుద్రాక్షమాల ధరించి , వ్యాఘ్ర చర్మాంబర దారి అయిన, ఒక యోగి, శిష్యులతో కనిపించాడు.

కేశవుడు ఆయన్ను చేరి, తన ఇంటికి వచ్చి, ఆతిధ్యం స్వీకరించమని కోరాడు.
 సంతోషంతో ఆ యోగి, శిష్యులతో, కేశవుని ఇంటికి వచ్చాడు. లోపలికి  వెళ్లి, భార్యను రమ్మని పిలిచాడు .  అ యోగి పిలవవద్దని వారించాడు. కేశవునితో యోగి, ”కేశవా! ఆమెను తెలుసుకొనే కాపురం చేస్తున్నావా ? పెళ్లి చేసుకోన్నావా ?నిజం చెప్పు" అని అడిగాడు. దానికి కేశవుడు, జరిగిన విశేషాలన్నీ, వివరంగా తెలిపాడు. తనకేమీ తెలీదని, తనను ఉద్ధరించ మని వేడుకొన్నాడు . కేశ్శవునిపై యోగికి జాలి కలిగి, అతన్ని ఉద్దరించాలని భావించాడు. ”ఈమె విషయం నేను చెప్పను. నువ్వే గ్రహించు .”అని చెప్పి, శ్రీ రామ తారక మంత్రాన్ని ఉపదేశించి, వెంటనే జపిoప చేయించాడు. 

 ఒక రుద్రాక్షమాలను ఇచ్చి దానితో జపం చేయమన్నాడు.
 చేతిలోని ఆ మాల వల్ల, సూర్య తేజంతో వెలిగి పోతున్నాడు. ఆమె భయపడి ఆ జపమాలను దూరంగా విసిరేయమని కోరింది . తన దగ్గరకు రావద్దని ప్రార్ధిస్తూ, ఏడుస్తూ దూర దూరంగా జరిగింది . అప్పుడు భక్త సులభుడైన ఆంజనేయస్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచిని చుట్టి, విసిరేశాడు.  కేశవుడికి జరిగినదంతా తెలిపి, స్వామి అదృశ్య మైనాడు. కేశవుడు యోగిని దర్శించి, జరిగినదంతా తెలియ జేసి , తన్ను ఉద్ధరించమని వేడాడు . యోగి కృపాళువై, ”రామ, ఆoజనేయులను, నిత్యం జపించు . ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్టించు.
 జీవితాంతం, హనుమ పూజ మానవద్దు ” అని హితవు చెప్పి శిష్యులతో వెళ్లిపోయాడు.

 యోగి ఆదేశించిన విధంగా, కేశవుడు, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మిచి , స్వామిని ప్రతిష్టించి, యదా విధిగా పూజలు నిర్వహిస్తూ,
హనుమద్భక్తులను ఆదరిస్తూ,  హనుమ కధలను వినిపిస్తూ,
 హనుమదనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది , చివరకు ముక్తిని పొందాడు.

--((**))--




ప్రేమలో వెలుగే మలుపు 

ప్రాంజలి ప్రభ - నేటి కవితానందం 



ఉషోదయ వెలుగు 

ప్రేమకు తోలి మలుపు 
చామునఛాయా వెలుగు 
కళ్ళ మెరుపులతో మలువు 

జఱిగి పోతున్న వెలుగు 
పెళ్లితో తోలి మలువు 
దోసలపిండి పెనం పై వెలుగు 
గుటకలు వేస్తూ నవ్వుల మలుపు 



చుక్కల చీరలో చక్కని వెలుగు 

మక్కువ కొద్ది మనసులో మలుపు 
మబ్బులో మేఘానికి చిక్కిన వెలుగు 
ఉరుము ఉరికి వర్షపు జల్లే మలుపు 

ఊహల ఉయ్యాల సఫల వెలుగు 
గాలి సవ్వడికి కదిలే ఊహ మలుపు 
అలంకారములేని దేహపు వెలుగు 
స్వప్నాల సంపద పంచే మలుపు  



చెప్పుకోలేని తృప్తి పరిచే వెలుగు

దాహంతో ఆకలిని తీర్చే మలుపు   
సౌందర్యం తో ఆరాధనే వెలుగు 
అనుక్షణం అణుకరణతో మలుపు 

--((**))--




తెలివి చిన్న కధ (1)

ప్రాంజలి ప్రభ - మల్లాప్రగడ రామకృష్ణ 

ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు.



అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ  ఉండదు.

 "ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?" అడిగాడు బాస్.



 "చెయ్యలేదు"


"సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! ".



తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది తనకి. చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు. 



"ఈ రోజు ఎంత మంది కష్టమర్స్ కి  సేల్స్ చేశావు?".



 "సర్ ! కేవలం ఒకరు" అని బదులిచ్చాడు తను.



 "ఒకటేనా ! నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?"



 "8,009,770 పౌండ్స్" చెప్పాడు మన సేల్స్ మాన్. 



"వాట్ !!" అదిరిపడ్డాడు  బాస్. 



"అంత పెద్ద సేల్ ఏమి చేశావు?"  అడిగాడు. 



"వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను."



"గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే? "  అన్నాడు బాస్.         



"పూర్తిగా వినండి, తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు. దాని కన్నా ఒక బోట్  లో వెళుతూ నది మధ్య చేపలు పడితే  బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్  డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేదు అన్నారు. అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4 డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను.తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను.” 



బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు. "ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా !!!"



 "లేదు సార్ !" బదులు ఇచ్చాడు సేల్స్ మాన్.



"మరి ? "  అన్నాడు బాస్. 



 " ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే  హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను." 



బాస్: " అరే యార్ …!! ఇంతకీ  నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?"



అప్పుడు ఆ సేల్స్ మాన్ చెప్పాడు "

హనుమాన్ విద్యామందిర్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్."టీచర్ కి, సేల్స్ కు,ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్ 
ఏబిసిడి లు నేర్పమని వస్తే ,పదేళ్ల తర్వాత వచ్చే భగవద్ గీత,  ఐఐటి -నీట్-సివిల్స్ ,రాంక్  పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం... అని ఆన్సర్ ఇచ్చాడు



ఇదండీ మన విద్యా విధానం అందుకే వెనుకబడి ఉన్నది, మన తెలివి మనం ఉన్నచోట పనికి రాలేదు, వేరోచోటికి పొయ్యాక తేలివి బయట పడింది.  ఎక్కడైనా దోచుకోవటమే ఇది చదువులు నెపంతో తల్లి తండ్రుల బలహీనతను సొమ్ము చేసు కోవాలను కోవటమే, అక్కడది వ్యాపారము ఏది ఏమైనా తెలుగోడి తెలివి అమోఘం. అందుకే అన్నారు పెద్దలు వినయం ఉన్న చోట "గర్వం, దర్పం, స్వాతిశయం దరి చేరవు, ప్రేమతో కూడిన సద్గుణం ఏర్పడి సంపద వచ్చి చేరుతుంది. ఫలితం అసించ కుండా పనిచేస్తే   మన:శాంతి ఏర్పడుతుంది.                 


--((**))--

3, మే 2019, శుక్రవారం


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

🌸 మహాస్వామి వారి అన్నపూర్ణావతారం🌸

పరమాచార్య స్వామివారు ఒక తమిళ సామెతను ఎప్పుడూ చెప్పేవారు, “అందరికీ అన్నం పెట్టు, భేదం చూపకుండా” అని. ఆహారం పెట్టేటప్పుడు ఎవరు, ఏమిటి అన్న ఎటువంటి బేధం చూపరాదని చెప్పేవారు. రాత్రిపూట దొంగలకు కూడా ఆహారం అందించే ఒక కేరళ సంప్రదాయం గూర్చి ఎప్పుడూ తెలిపెవారు. కేరళలోని చేరుక్కుణ్ణం అన్న ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ దేవాలయంలో ఈ పధ్ధతి ఉంది. దేవాలయంలోని భక్తులందరి భోజనాలు అయ్యాక, ఆహార పొట్లాలు కట్టి, వాటిని చెట్టుకు వేలాడదీసేవారు అటుగా వెళ్ళే దొంగలకోసమని.

సంగం సాహిత్యంలో ఉధియన్ చేరాళదన్ అన్న చేర రాజు మహాభారత యుద్ధ సమయంలో పాండవ కౌరవ ఇరు పక్షాల వారికీ అన్నం పెట్టి ‘పేరుం సోట్రు చేరాళదన్’ అన్న పేరు ఎలా పొందాడో తెలిపేవారు.

వేటగాడైన కన్నప్ప శివునికి ఆహారం పెట్టాడు. వేటగాడైన గుహుడు శ్రీరామునికి ఆహారం పెట్టాడు. ఇక్కడ, శ్రీశైలం అడవులలో ఉండే చెంచులు పరమాచార్య స్వామివారిచే ఆహారం పొందారు.

రవాణా వ్యవస్థ అంతగా లేని 1934లో పరమాచార్య స్వామివారు మందీమార్బలంతో కీకారణ్యంలో ఉన్న శ్రీశైలం వెళ్తున్నారు. దారిలో ఒకచోట వారికి చెంచులు ఎదురయ్యారు. ఆ చెంచులు మొదట వీరిని శతృవులుగా భావించి బాణాలు చేతబూని విల్లు ఎక్కుపెట్టారు. కాని స్వామివారి దివ్య తేజస్సు చూసి, తప్పు తెలుసుకుని వీరిని ఆదరించారు.

వీరిని అడ్డగించాలని వచ్చినవారే వీరికి కాపలావాళ్లై, సామాను మోస్తూ, రాత్రిపూట పహారా కాస్తూ పరమాచార్య స్వామివారిని సపరివారంగా తదుపరి చోటుకు చేర్చారు. సెలవు తెసుకునే ముందు అందరూ ఒకచోట చేరారు.

మహాస్వామి వారి వారికి కొంచం ధనం ఇవ్వమని మేనేజరును ఆదేశించగా వారు దాన్ని తాకడానికి కూడా ఇష్టపడలేదు. ఆ చెంచుల నాయకుడు మేనేజరుకు ఎదో చెబితే, వారు దాన్ని నిరాకరిస్తూ తల అడ్డంగా తిప్పి కుదరదన్నారు.
మహాస్వామివారు చిటికె వేసి మేనేజరును పిలిచి, “అతను ఏమి అడిగాడు, నువ్వు ఎందుకు లేదన్నావు?” అని అడిగారు.

“పెరియవా ముందర వారు నృత్యం చేయాలనుకుంటున్నారు”

“నృత్యం చూడడం వల్ల శ్రీమఠం గౌరవం తగ్గుతుందని మేనేజరుగా నీ అభిప్రాయం కనుక నేను వారి నృత్యం చూడనని నువ్వు అన్నావు”
మహాస్వామి వారి మాటల్లో ఎక్కడా కోపం కనబడలేదు. మేనేజరు మౌనంగా నిలబడ్డారు.

ఎంతో గొప్ప కళాకారుల నృత్యాలు కూడా చూడని మహాస్వామివారు వారి నృత్యాన్ని చూడడానికి అంగీకరించారు ఒక షరతు పైన; మగవారు ఎవరైనా నృత్యం చెయ్యవచ్చు. కాని వారితో పెద్దవారు కాని బాలికలు మాత్రమే కలిసి నృత్యం చెయ్యాలి.

“సందర్భాన్ని బట్టి మీకు వివిధ నృత్యాలు ఉన్నాయి కదా; దేవుని కోసం, గెలిచినప్పుడు, ఆటలకోసం అలా. మరుప్పుడు మీరు చెయ్యదలచుకున్న నృత్యం ఎలాంటిది” అని అడిగారు మహాస్వామివారు.

“మేము ఇప్పుడు చెయ్యబోయే నృత్యం కేవలం మాకు అత్యంత దగ్గరైన ఆప్తులకు మాత్రమే” అని తెలిపారు.

పరమాచార్య స్వామి వారు వారి నృత్యాన్ని చూసి, వారినందరినీ ఆశీర్వదించి, వారికి మంచి విందు ఏర్పాటు చేశారు.

--- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

      --((**))--


మే నెల 7 వ తేదీ 
మంగళ వారము అక్షయతృతీయ రోజున
బంగారం తప్పక కొనాలా?

అక్షయతృతీయ అంటే ఏమిటి?వివరణ?

ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి  చందనోత్సవం.
అదే రోజున పరశురామ జయంతి మరిన్ని  అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత

1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి  “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో,
      వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” 
      ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు     సంరక్షకునిగా
     నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

అక్షయ తృతీయ రోజున బంగారం తప్పక కొనాలా?
అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది.ఈ రోజున కొన్నది 
అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని
కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది.

అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు
తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.

అసలు ఈరోజున బంగారం  కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడిలేదు. 
ఇది కేవలం వ్యాపార జిమ్మిక్ మాత్రమే
అక్షయ తృతీయ నాడు, మనం  చేపట్టిన ఏ  కార్య  ఫలమైనా, [ అది  పుణ్యం కావచ్చు;లేదా  పాపం  కావచ్చు.] అక్షయంగా,  నిరంతరం, జన్మలతో  సంబంధం
లేకుండా,  మన  వెంట  వస్తూనే ఉంటుంది. 
పుణ్య  కర్మలన్నీ  విహితమైనవే. అందునా,  ఆ రోజు ఓ  కొత్త  కుండలో గానీ,
కూజాలో గానీ,  మంచి నీరు  పోసి, దాహార్తులకు శ్రధ్ధతో  సమర్పిస్తే, ఎన్ని  జన్మలలోనూ,  మన  జీవుడికి దాహంతో  గొంతు ఎండి పోయే పరిస్థితి  రాదు.
అతిధులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో  కూడిన భోజనం  సమర్పిస్తే,  
ఏ  రోజూ  ఆకలితో  మనం అలమటించవలసిన రోజు  రాదు.

వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది.
అర్హులకు  స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే,  
మన  ఉత్తర జన్మలలో, వాటికి  లోటు  రాదు.
గొడుగులు, చెప్పులు, విసన కర్రల లాటివి దానం  చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఆ  రోజు నిషిధ్ధ  కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో  శ్రేయస్కరం. 

ఓ  సారి  పరిశీలిస్తే,"భాగవతం" ప్రధమ స్కంధం ప్రకారం, పరీక్షిన్మహా రాజు  
కలి పురుషుడికి  ఐదు  నివాస స్థానాలను కేటాయించాడు.  
అవి: 
1 .జూదం, 2 .  మద్య పానం, 3 . స్త్రీలు, 4 . ప్రాణి వధ, 5 . బంగారం.  
వీటితో పాటు కలి కి  లభించినవి 
 ఇంకో  ఐదు*
అసత్యం, గర్వం, కామం, హింస, వైరం.  
జాగ్రత్తగా  పరిశీలిస్తే, ఆ పైన  ఉన్న  ఐదిటికీ ఇవి  అనుషంగికాలు.
ఆ  పై  ఐదిటినీ ఇవి  నీడలా వెన్నంటే  ఉంటాయి.
అక్షయ తృతీయ  రోజు ఎవరైనా, ఈ  ఐదిటిలో దేని  జోలికి  వెళ్ళినా,  
కలి పురుషుడి దుష్ప్రభావం అక్షయంగా వెంటాడుతూనే  ఉంటుంది.

--((**))--


శ్రీ ఆది శంకరాచార్య విరచితం
సాధన పఞ్చకమ్ (ఉపదేశపఞ్చకమ్)
🕉ఓంశ్రీమాత్రేనమః🕉
అద్వైత చైతన్య జాగృతి

పఞ్చరత్నమాలికా
వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతి స్తజ్యతామ్ !
పాపౌఘః పరి ధూయతామ్ భవసుఖే దోషోనుసన్ధీయతాం
ఆత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ !! 1

ప్రతిదినము వేదాధ్యయనము చేయవలెను, అందులో చెప్పిన కర్మలు శ్రద్ధగ ఆచరించుము. ఈ కర్మాచరణమే ఈశ్వర పూజగా మారును గాక! కామ్య కర్మలను త్యజింపుము నిష్కామ కర్మలను చేయుము. పాపములను బోగొట్టుకొనుము. సంసార సుఖములోగల దోషముల నెరుగి జీవితమును అనుసంధానము చేసుకొనుము. ఆత్మ జ్ఙానము నందు ఇచ్చమును పెంపొందించుకొనుము. శీఘ్రమే నిజ గృహమునుండి వెడలుము.

సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం
శాన్త్యాదిః వరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ !
సద్ విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శృతిశిరోవాక్యంస మాకర్ణ్యతామ్ !! 2

సజ్జనులతో కలిసి ఉండుము, భగవంతుని యందు ధృఢమైన భక్తిని కలిగి యుండుము.
శాంత్యాది గుణములను ఆశ్రయించుము. కామ్య కర్మలను విసర్జించుము. సద్ విద్వాంసులను ఉపాసింపుము (సత్ యందు రమించు విద్వాంసులు అందుకే సద్ అను పదమ వేఱుగా చూపబడినది అని ఒక భావము). వారి పాదుకలను ప్రతి దినమూ సేవింపుము. బ్రహ్మ ప్రాప్తికి తోడ్పడు ఏకాక్షర బ్రహ్మ మంత్రమైన ఓం కారమంత్రమను సేవించుము, ఉపాసించుము. శ్రుతి శిరస్సులైన ఉపనిషత్ వాక్యములను వినుము.

వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరఃపక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్ సుమిమ్యతాంశృతిమతిస్తర్కోనుసన్థీయతామ్ !
బ్రహ్మైవాస్మి విభావ్యతామహరహర్తర్వః పరిత్యజ్యతాం
దేహేహం మతిరుజ్ ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ !! 3

తత్త్వమసి ఇత్యాది మహావాక్యముల అర్థమును విచారింపుము, వేదాంతమును ఆశ్రయింపుము.
“కుతర్కమును వీడుము”. శ్రుతిసమ్మతమగు తర్కమును గ్రహింపుము. “నేను బ్రహ్మమును” అని ప్రతిదినము భావింపుము. గర్వాహంకారములను వీడుము. శరీరమున అహంబుద్ధిని వదిలి వేయుము. పెద్దలతో వాదులాడకుము (ఇక్కడ పెద్దలనగా జ్ఙానముచేత, అనుభవముచేత అని వ్యాఖ్యానము).

క్షుద్ వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నంనతు యాద్యతాంవిధివశాత్ ప్రాప్తేనసంతుష్యతామ్ !
శీతోష్ణా విసహ్యతాం స తు వృథావాక్యం సముచ్చార్యతాం
ఔదాసీస్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతామ్ !! 4

ఆకలి దప్పిక అను వ్యాధులకు చికిత్స కావింపుము. భిక్షాన్నమను ఔషధమును సేవింపుము. రుచికరమగు భోజనపదార్థములను యాచింపక, విధివశాత్ లభించిన దానితో తృప్తిని పొందుము. చలి, వేడి వంటి ద్వంద్వములను తితిక్షాబుద్ధితో సహింపుము. వ్యర్థముగ వాక్యోచ్చారణ చేయకుము ( అనవసర ప్రసంగములు అనవసర మాటలాడకుము). ఔదాసీన్యమును వహించుము. లోకుల యెడ నైష్ఠురడవు కాకూడదు.

ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సునమీక్ష్యతాం జగదిదంతద్బాధితందృశ్యతామ్ !
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నావ్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధస్త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ !! 5

ఏకాంత ప్రదేశమున సుఖముగ కూర్చుండుము. పర బ్రహ్మమున చిత్తమును సమాధాన మునర్చుము. ఈ జగత్తును పూర్ణబ్రహ్మముగ జూచుచు అది అంతయును విలీనమైనదిగ భావింపుము. పూర్వ కర్మముల క్షయమునొనర్చుకొనుము. జ్ఙానము నాశ్రయించి రాబోవు కర్మలయందాసక్తుడవు కాకుండ ఉండుము. ప్రారబ్ధ భోగము ననుభవించుచు, బ్రహ్మమున నెలకొనియుండుము.


యః శ్లోకపఞ్చకమిదం పఠతే మనుష్యః
నఞ్చిన్తయత్యనుదినం స్థిరతాముప్యేత !
తస్యాశు సంసృతిదవానలతీవ్రఘోర
తాపః ప్రశాన్తిముపయాతిచితి ప్రసాదాత్ !! 6

ఏ మానవుడు నిత్యమూ ఈ శ్లోక పంచకమును పఠించుచు, స్థిర చిత్తముతో భావార్థమును చింతించుచుండునో, అతడు శీఘ్రముగనే సంస్మృతి, తీవ్ర దావానల, తీవ్ర ఘోర తాపమును, చైతన్య స్వరూపుడైన ఈశ్వరును అనుగ్రహముచేత పోగొట్టుకొనును.

!!ఇతి శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాదవిరచిత సాధన పఞ్చకమ్!!
ఇది శ్రీ శంకర భగవత్ పాదులు రచించిన సాధన పంచకమ

--((**))--


సంసారం నుంచి తప్పించే సంస్కారం
🕉ఓంశ్రీమాత్రేనమః🕉
అద్వైత చైతన్య జాగృతి

మన వేదాంతమంతా రెండు పదాల చుట్టూ తిరుగుతుంది. ఒకటి మమకారం, రెండోది అహంకారం. ఈ రెండూ మనిషి చుట్టూ చేరడమే సంసారం. దీన్నే మాయ అని పిలిచారు. ఆ మాయ ఏడుస్తున్న చంటి పిల్లాడిలాంటిది. చంకలోకి ఎక్కదు. క్రింద నిలబడదు. ఈ మాయారూపమైన అహంకారం మనిషి నుంచి దూరమైతే అతనిలో వ్యక్తమయ్యేది ఓంకారమే. అహంకారాన్ని అణచివేసే శక్తి ఓంకారానికి ఉంది. ఓంకారం పరమాత్మ స్వరూపంగా చెప్పబడింది. ఈ రెండింటిలో ఏదైనా ఒక దానికే మనలో స్థానం ఉంది. అహంకారమనే మాయా సంసారం దాటాలంటే సంస్కారం కావాలి. అది మనిషిని ప్రభావితం చేసినప్పుడు అహంకారం దూరం అవుతుంది. రెండు రూపాయల విలువ చేసే ఇనుముకు సంస్కరిస్తే వందల రూపాయల విలువ చేసే వస్తువుగా మారుతుంది. ఖర్చు లేకుండా పొందేది సంస్కారం.

సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమృతోపమే
కావ్యామృత రసాస్వాదః సంగమస్సజ్జనైస్సహ

సంసారం అనే విష వృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు కాస్తుంటాయి. మొదటిది కావ్యామృత రసాపానం, రెండోది సజ్జనుల సాంగత్యం అని హితోపదేశం తెలిపింది. అత్యద్భుత జ్ఞాన సముద్రాన్ని అందించిన రుషులకు కృతజ్ఞత తెలిపి, రుషి రుణం తీర్చుకోవడానికి గ్రంథపఠనం చేయాలి. ఆ గ్రంథాల సారాంశాన్ని మనసు నిండా నింపుకోవడానికి సజ్జన సాంగత్యం చేయాలి. ఈ రెండింటివల్ల చంచలమైన మనస్సు స్థిరీకృతమై మనల్ని సత్యం వైపు నడిపిస్తాయి. లేదంటే సమయపేదరికంతో బాధపడుతున్న మనుషులంతా బాహ్యమైన వినోదకార్యక్రమాల్లో జీవిస్తారు. ఇవాళ ఆధ్యాత్మికత కూడా వినోదాత్మకంగా మారడం దురదృష్టకరం. దేవునిలో వినోదం ఉండాలి గాని వినోదంలో, ఆడంబరంలో దేవుడు ఉండకూడదు. ఇటీవల ఆరాధనలు, పూజలు, బాహ్యాండర వినోదంగా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. అందువల్ల అంతర్గత శుద్ధికి ఆస్కారం ఉండదు. వినోదం చుట్టూ తిరిగే మనసు పొందే ఫలితం కోరికలేగాని ఇంకోటి కానేరదు. అందుకే గీతాచార్యుడు.

--((**))--