30, నవంబర్ 2017, గురువారం

ప్రాంజలిప్రభ - భగవద్గీత (అంతర్గత ) సూక్తులు 4 వ అధ్యాయం


ఓం శ్రీ రామ్ : శ్రీ మాత్రే నమ: ఓం శ్రీ కృష్ణాయనమ: 
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 
61. ఏ ప్రాణికైనను ఏవిధముగాను, ఏమాత్రమును కష్టమును కల్గించకుండా ఉండవలెను

62. మేలుగూర్చియు భావముతో, కపటము లేకుండా, ప్రియవచనములతో యధార్ధ  భాషణం చేయవలెను.

63. ఏ ప్రకాముగానైనను ఎవరి సొత్తును, అధికారమును అపహరించకుండా ఉండవలెను.

64. మానసికముగా గని, వాచికముగా గాని, శారీరకంగా గాని, సర్వావస్థలయందును సదా సర్వదా మైధునములను పరిహరించవలెను.

65. శరీరానిర్వాహణకు మాత్రమేతప్ప మరి ఏ ఇతర భోగ్య వస్తువులను సమకూర్చ కొనకుండా ఉండవలెను.

66. బాహ్యాభ్యన్తర ప్రియాప్రియములు, సుఖదుఃఖములు మొదలగు  ప్రాప్తించి నప్పుడు  సదా సర్వదా సంతుష్టుడై ఉండవలెను.

67    ఏకాదశి మొదలగు ఉపవాసములు ఆచరించుట ఆరోగ్యమునకు అవసరంగా భా వించ వలెను .

68. లోకహితమును  గూర్చు శాస్త్రముల అధ్యయనము    దైవ నామగుణ సంకీర్తనము చేయవలెను .

69. భగవంతునకు సర్వస్వమును అర్పించి భగవదా దేశములను పాటించ వలెను.

70. ప్రతివిషయమును అదేపనిగా ఆలోచించక, మనం చేసే పనులలో నిజా నిజాలు గ్రహించి  పరులను నొప్పించక, మనం కష్టాలు కొని తెచ్చుకోక, ఆంతర్యాన్ని అర్ధం చేసుకొని అర్ధాన్ని పొందెందుకు నిరంతరమూ శ్రమించవలెను. 

   
71. ఆసనము సుస్థిరంగా ఉంచి గాలిని లోపలకు పీల్చుట, బయటకు వదులుట ప్రాణాయామము చేయాలి ప్రతి నిత్యము.

72. ఎదో ఒక ధ్యేయస్థానమునందు చిత్తమును స్థిరముగా ఉంచిన ఇంద్రియములను నిగ్రహించుకో వచ్చును.

73. మమత, ఆసక్తి,,ఫలేచ్చను వదలి భగవన్నామముతో ప్రాణాయామము చేయవలెను.

74. యోగాభ్యాస అనుకూలగా సాత్వికాహారమును తీసికొనవలెను, అతిగా తిన్న ,, అసలు తినక పోయిన కష్టమే. 

75. హృదయము ప్రాణ వాయు స్థానము, అపాన వాయుస్థానము గుదము, నాభి సమాన వాయు స్థానము, కంఠము ఉదాన వాయు స్థానము, శరీర మంతయు వ్యాన వాయుస్థానము  వీటినే పంచ ప్రాణులందురు. 

76. పరమార్ధ సాధానకు దూరమైనవాడు నిరంతరము చింతాగ్నిజ్వాలలో మసి అవ్వక తప్పదు 

77. మానవ జన్మయందు కర్తవ్య కర్మను అనుసరించని వానికి ఏ జన్మ నందును నిజమైన సుఖమును పొందజాలడు.

78. తల్లి తండ్రులను, పతిని, గురువుని దైవముగా భావించి వారికి సేవలు చేయుట నైతిక భాద్యత అని భావించవలెను. 

79. నిస్వార్ధ భావముతో సేవించుట వలన బ్రహ్మ  ప్రాప్తి కలుగునని భగవంతుడే ఉదహరించెను.

80. కర్తవ్య తత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన ప్రాపంచక బంధములనుండి సర్వదా  విముక్తుడగును.

    
81. యజ్ఞములన్నింటిని త్రికరణ శుద్ధిగా అమలుజరిపినప్పుడే దేశము సుసంపన్నముగా ఉండును.  .   
         
82. ద్రవ్యములను  వినియోగించి చేయు యజ్ఞమును ద్రవ్య యజ్ఞము అందురు 

83. నేయి, చెక్కర, పాలు, పెరుగు, నువ్వులు, బియ్యము, పండ్లు, చందనము, కర్పూరము, శుఘంధ యుక్తమైన ఓషదులు అగ్నియందు హోమము చేయుట వలన శాంతి కలుగును.     

84. జ్ఞానులు నుండి భగవ తత్వమును తెలుసు కొనుట వళ్ళ శ్రద్ధ సమగ్రత పెరుగును. 

85. భక్తిశ్రద్ధలతో సాదరముగా దండ ప్త్రణామమును చేయవలెను.

86. దూడను చూచిన గోమాతకు వాత్సల్యముతో పొదుగు పొంగి పాలు కారును. 

87. బిడ్డను చూసిన జననికి స్తన్యము చిమ్మి పాలు కారును 

88. యోగ్యుడైన వానివద్దకు చేరిన మనుష్యుడు విద్య తప్పుకు వచ్చును 

89. కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో జ్ఞానులను సముచిత రీతిలో ప్రశ్నించి పరమాత్మ తత్వమును పొందవలెను

90. లోకవ్యవహారములో జ్ఞాని మనస్సు, బుద్ధి శరీరములో ఉండును.

91. జగతంతయు  నీటియందు మంచువలె, ఆకాశమునందు  మేఘమువలె, బంగారములో నగ వలె,  బ్రహ్మ రూపమై ఉండును.

92. నీవు మహాపాపి అయినా జ్ఞాన నౌక సహాయముతో  పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయట పడగలవు.

93. అగ్ని సమిధులను భస్మము చేసినట్లు జ్ఞానమనే అగ్ని కర్మలను భస్మము చేయును.

94. నీవే పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు  అని ప్రార్ధించ వలెను .                             
95. లోకవ్యవహారమునకు ప్రతి ఒక్కరు ఎదో ఒక వ్యాపారము చేయవలెను.  

96. వ్యాపారమందు పూర్తిగా నిమగ్నమైతే ఆకలిడప్పులు, నిద్దరాసుఖములు, విశ్రాన్తి దుమారం పట్టవు.

97. శరీరమునకు క్లెశము కలిగినను పట్టించుకొనక, ధనలాభమువలన చిత్తము పసన్నతను పొందును. 

98. ఇంద్రియములు వశమగువరకు (దేశసేవ కొరకు) శ్రద్దగా తీవ్రముగా అభ్యాసము చేయవలెను.  

99. సూర్యోదయము ఆయిన వెంటనే గతంలో జరిగినవణ్ణి మరచి, శాంతిని చేకూర్చినవి గుర్తు పెట్టుకొనవలెను .

100. ఎట్టి పరిసస్థితిలలో విస్వాసము కోల్పోయి, సంశయాగ్రస్తుడుగా మారకము, ఇటువంటి వాని జీవితము వ్యర్ధము, ఫలితములను ఈపరిస్థితిలో చూడలేడు. 

101. వేదశాస్త్రపారాయణమువలన, మహాపురుషుల వచనములు వినుటవలన మనసులో ఉన్న సంశయములన్ని తొలగించుకొని జీవించ వలెను. 

102. స్త్రీ, ఐశ్వర్యము చుట్టూ వచ్చే సందేహాలకు భయము చెందక ధైర్యము వహించి, ఓర్పుతో నిజా నిజాలు గ్రహించిన నాడు మనసుకు శాంతి ఏర్పడును. 

103. వివేకా జ్ఞానప్రభావము వలన మనిషిలో ఏర్పడే సంశయములన్ని తొలగి పోవును. 

104. ప్రతిఒక్కరు మోహావేశమునకు లొంగక కార్యోన్ముఖులై   ( అనగా హృదయ ముందు ప్రేమ నింపుకొని సంశయములు తొలగించుకొని ఇతరులలో ప్రేమను నింపుటకు) యుద్ధము చేయవలెను. 

105. మమత, ఆసక్తి, ఫలేచ్చలను త్యజించి యుద్దము చేయుట (సమస్యలనుండి బయట పడుటకు) శ్రేయస్కరమని పరమాత్ముడు తెలిపెను. 

జ్ఞాన కర్మ సన్యాసయోగము (నాల్గవ అధ్యాయము సమాప్తము.)        .                
       

24, నవంబర్ 2017, శుక్రవారం

ప్రాంజలిప్రభ - భగవద్గీత (అంతర్గత ) సూక్తులు 4 వ అధ్యాయం


ప్రాంజలిప్రభ - భగవద్గీత (అంతర్గత ) సూక్తులు 
రచయత. మల్లాప్రగడ రామక్రృష్ణ
Jai Shree Krishna.. May Lord Krishna's flute invite the melody of love into your life.. #eternallove #LordKrishna #haribol #Krishna #Kanhaiya #kahna #art #beautiful #lovethis #stunning #instalike #instadaily #instagood #instamood #instacool #instalove #fab #bansuri #flute #peacock #Hinduism #spiritual #spirituality #Indian #desi

1. ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని యోగమాయ లోక మంత విస్తరించును.

2. జన్మరహితుడు. నిత్యడు. సమస్త ప్రాణులకు ఈశ్వరుడు ఒకరున్నట్లు గమనించ వలెను.

3. సాకార రూపములో సమస్త ప్రజలను రక్షించును.

4. సత్పురుషులను రక్షించుటకు దుర్మార్గలను శిక్షించుటకు అవతరించును.

5. ధర్మమునకు హాని కలిగినప్పుడు , అధర్మము పెచ్చు పెరిగి నప్పుడు పరమాత్ముడు అవతరిస్తాడని తెలుసుకొనవలెను .

6. ప్రతి ఒక్కరు కర్మలు కర్త్వభావముగా ఆచరించాలి.

7. జన్మ తత్వ రహస్యాలను గమనించి ఆచరించ వలెను .

8. ప్రతి ఒక్కరు ద్రృడమైన భక్తి తాత్పర్యములతో, భగవంతుని ప్రార్ధించిన
జన్మలేకుండా చేయును. 

9. ప్రతి ఒక్కరు తగు విధముగా సేవలు చేయుచు జ్ఞాణాన్ని పొంది అందరికి సహకరించుచూ జీవించ వలెను .

10 . కర్మఫలములు ఆసించువారు ఇతర దేవతలను పూజించరు. అట్టి వారికి సిధ్ధి సీఘ్రముగా లభించును. 

11. పరమాత్ముడు తన దివ్యలీలల ద్వారా మనుష్యుల మనస్సును తన వైపు లాగు కొనును .

12. భక్తి నౌకను ఆశ్రయించిన వారికి సంసార సముద్రమునుండి తరింప చేయుపకు తానే చుక్కాని పట్టువాడై వారిని ఉధ్ధరించును.

13. భగవంతుని జన్మ కర్మల దివ్యత్వం నెరింగిన వానికి తనువు చాలించిన పిమ్మట భగవత్ప్రాప్తి కలుగును.

14. ధర్మ శాస్త్రాలలో నుడివిన రీతిగా  స్వయముగా ప్రవర్తించి ధర్మప్రభావమును చాటాలి. 


15. సాదు పరిరక్షణము, దుష్టశిక్షణము, ధర్మసంస్థాపనము నెరవేర్చుటకు భగవంతుడు అవతరించును . 


16. రూప, గుణ, ప్రభావ, నామ, మహిమా, దివ్యకర్మలు వినుచు, కీర్తించుచు, స్మరించుచుఁ, ఉన్నచో సంసా సాగరమును దాటగలరని భగవంతుడు బోధించెను. 

17.  ప్రకృతి తన ఆధీనములో ఉంచుకొని యోగ శక్తితో జనులపై గల వాత్సల్యముతో మనుష్యాది రూపములో జన్మించును . 

18. దయ, సమత్వము, ధర్మము, నీతి , వినయము, కలిగి ఉండిన వానికి భగవంతుడు ప్రత్యక్షమగును. 
  
19. రాగ, భయ, క్రోధ, అనేక దుర్గుణములు తొలగించి మనస్సును శాంతి మార్గమున ఉంచును. 

20. ప్రతిఒక్కరు సమస్తకర్మలు తమకొరకై గాక భగవద్ సేవలో భాగమని భావించి, అందులోనే సంతుష్టి చెంది,    
భారమును భగవంతునిపై ఉంచి, నడుచు కొనవలెను.               
21. భగవంతుని యేయే భావాలతో పూజించిన ఆయా భావాలతో ఆదుకొనును.

22. తనకోసం వ్యాకులచెందేవాని విషయమున వ్యాకులచెఞది ఆదు కోనును .

23. వియోగము సహింప లేక బాధతో వేడుకున్న తాను వియోగ బాధ అను భవించి ఆదు కోనును.

24. తనకు సర్వస్వము ధారపోయు వానీకి తిను సర్వాత్మనా ఆదుకొనును.

25. గోపాలుని వలే మిత్రుడుగా భావించిన వానికి మిత్రుడగును.

26. యశోదా నందుల వలే పుత్రునిగా భావించిన వానికి పుత్రుడగును.

27. రుక్మిణి వలే భర్తగా సేవించిన వారికి భర్తగా ఉండును .

28. హనుమంతునిళలే స్వామిగా సేవించిన వానికి స్వామిగా కనబడును్

29. గౌపికల వలే మధుర భక్తీతో భజించిన వారి విషరమున ప్రియతముగా ఉండూను .

30. ధర్మనీతి లోక మంతా వ్యాపింప చేసి శుభములు ప్రసాదించంటయే కాక దివ్య లీలా రసానందము కలుగ చేయును.

31 . భగవంతుడు తన సృష్టి రచనాది కర్మల యందు కర్తృత్వము గాని, పక్షపాత దృష్టి గాని, ఆసక్తి గాని చూపక  కర్మలయొక్క దివ్యత్వమును ప్రకటించును.

32 . బుద్ధి, జ్ఞానముల, విషయ సుఖాది వాసనలతో మాయకు చిక్కి కామ్య ఫల ప్రాప్తికై  ఉపాసకులను ఆశ్రయిస్తారు. ఇది అవసరమా ?

33 .మందబుద్ధులు సద్య:ఫలములకై ఆరాట పడుచు, ధనము శరీరము ఆర్పించుట అవసరమా, నవవిధాలలో ఏదో ఒక విధముగా ప్రార్ధించిన మనసు ప్రశాంత పరచగలనని భగవంతుడు తెలిపెను.

34 .  బ్రాహ్మణులు శమ దమాది కర్మలు ఆచరించి, ప్రజలకు ధర్మ ప్రవర్తనతో ధర్మబోధ చేయవలెనని తెలిపెను.

35.క్షత్రియులు సౌర్యము, తేజస్సులతో కూడిన కర్మలను ఆచరిస్తూ ప్రజల కష్టాలను ఆదు కొనుటకు ప్రాణాలను అర్పించుటకైనా సిద్దిముగా ఉండవలను.

36 .వైస్యులు కృషి, గోరక్షణాది కార్యములందును, వాణిజ్య వ్యాపారములందును సహాయ సహకారములు అందిస్తూ ధర్మంతో నడుచుకొనవలెను.

37 .  సూద్రులు  తదితర సామాజిక సేవలయందును, తగువిధముగా దేశసేవకు సహకరిస్తూ జీవన గమనాన్ని సాగించాలం తెలిపెను.

38  సత్వగుణ ప్రధానులైనవారు మరణా నంతరము ఊర్ధ్వలోకములకు చేరుదురని, తమో గుణము కావారు పశుపక్షాదులుగా జన్మింతురని, రజోగుణము కలవారు మనుజులుగా పుడతారని తెలిపెను . 

39. జ్ఞానిఆయన వాడు ఫలాపేక్ష లేకుండా, మర్మాలను ఆచరించి కర్తృత్వ బుధ్దిగాని వానికి ఉండవు. 

40. భగవంతుని కర్మల దివ్యత్వమును, తత్వరహస్యమును తెలుసుకొన్న మహాపురుషులు లోకములో ఉండునని తెలియ పరిచెను.             

41  కర్తవ్య కర్మలన్నీ " మమత, ఆసక్తి , ఫలేచ్చ, అహంకారం" అనే  భంధముల నుండి ముక్తులవ్వాలి . 

42. ఏది అసలు, ఏది నకిలీ, ఏది బ్రాంతి, ఏది మాయ, ఏది నిత్యం , ఏది త్యాగం, ఏది మర్మం, తెలుసు కోవాలనుంటే భక్తి, మౌన మార్గం ఒక్కటే.

43. మహాపురుషుల ప్రే రణ, ఆజ్ఞా అనుకరించి నడుచు కుంటే మనసు ప్రశాంతముగా వుండును .

44. శాస్త్రజ్ఞానము లేనివారు పుణ్యమును పాపముగాను, పాపమును పుణ్యముగాను భావించవలసి వచ్చును. 

45. దానము స్వీకరించి, వేదములను నేర్పుచు, యజ్ఞములను చేయిన్చుచుచు, ధర్మబోధ చేయుచు జయమును గడుపుతే బ్రాహ్మణునకు కార్త్య కర్మ అని తె లుసు కొనవలెను. 

46. కర్మయను అకర్మ, అకర్మ యందు కర్మ దర్శించువాడు బుద్ధిశాలి, అతడే యోగి. అని ఎలుసుకొనవలెను. 

47. కర్మ తత్వము తెలుసుకొని, అకర్మ స్వరూపమును ఎరిగి, వికర్మ లక్షణము తెలిసి నిగూడత్వముతో జీవితం గడపాలి. 

48. శాస్త్రసమ్మతములై, కామసంకల్పవర్జితములై, జరుగునో ఆటలే కర్మలన్నియు జ్ఞానాగ్నిచే భస్మము చేసి పండితునిగా మారాలి.

49. అగ్నిచే వేగింప బడిన విత్తనములు మొలకెత్తే లక్షణములు కోల్పోవును. 

50. స్త్రీ, పుత్రులు, ధనము, కీర్తి ప్రతిష్టలు, గృహము, గౌరవము, స్వర్గ్ సుఖమును ఆశించేదానినే ఇచ్ఛ కామము అని అందురు.         
   
51.మమతా, ఆసక్తి, ఫ్లేచ్చా,ఆహాహ్మ్క్రం లేకుండా కేవలము లోకహితముకొరకు శాస్త్రసమ్మతమైన యజ్ఞము, దానము తపస్సు చేయవలెను . 

52.   అంత:కరణమును, శరీరేంద్రియములను జయించిన వాడు, భోగసామాగ్రీ త్వజించినవాడు, ఆసారహితుడై శారీరక కర్మలు చేయును. 

53. కోరకుండానే లభించిన పదార్ధాలను సంతుష్టి పొందిన వానికి సమదృష్టి కలిగి యుండును. 

54. సుఖదుఃఖాలకు అతీతుడైన వాడు, అసూయ లేకుండా ఉంటే ఎటువంటి భంధములకు చిక్కకుండా ఉండ గలడు.         

55. వర్ణాశ్రమధర్మాలను, ప్రకృతి, కుటుంబ  పరిస్థితులను గమనించి చేయుకర్మలన్ని యజ్ఞములుగా గమనించవలెను . 

56. యజ్ఞ సృవాద సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము కర్త  బ్రహ్మము, హవనక్రియము బ్రహ్మము, యోగి ద్వారా పొందిన యజ్ఞఫలము బ్రహ్మము. 

57.  విషయభోగములు సనాధకునిపై ఎట్టి ప్రభావము చూపలేవు. అగ్నిలో గడ్దవలె అవిశ్వయముగా భస్మమగును . 
58. సుఖముపై ఆసక్తి, రామణీయ బుద్ధిలేని కారణమున, ప్రేమ భావాలకు చిక్కక ఇంద్రియాలను జాయించుకు ప్రయత్నిమ్చవలెను. 

59. ఇతర ప్రాణుల సుఖముగూర్చు లక్ష్యముతో యధాశక్తి ద్రవ్యమును ఉపయోగించుట మనుష్యుల ధర్మము.

60. మౌనమువహఞ్చి, అన్నముమాని  వస్త్రము ఉంచుకొని వాన చలి ఎండకు ఓర్చుకొని, పండ్లు పాలను తీసుకోని వన వాసము నందు చేయు తపస్సే తపో యజ్ఞము అన్నారు.   
--((*))--
     

             

11, నవంబర్ 2017, శనివారం

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము.

ఓం శ్రీ రామ్ : శ్రీ మాత్రే నమ: ఓం శ్రీ కృష్ణాయనమ: 
Photo
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/5)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 


51 . మనస్సు బుద్ధి ప్రాపంచిక విషయములపై పోకుండా పరమాత్మునిపై నిశ్చల స్థితిని ఉంచవలెను.

52 .పరమాత్మ ప్రాప్తికి మానవుడే అర్షుడు. స్వధర్మ పాలనద్వారా, సాధన ద్వారా,  పొంద వచ్చును.

53 .ప్రలోభాలకు లొంగక, ఆకర్షణకు చిక్కక, సచ్చిదానంద ఘనపారమాత్మ యందే నిరంతరమూ సంతుష్టుడై ఉండుము. 

54 . అట్టి వ్యక్తి శాశ్వితముగా నిత్యానందం నందు  మగ్నుడై స్వయముగా ఆనంద రూపుడగును    

55 . అట్టి స్థితిలో శరీర నిర్వాహణ ప్రారబ్ధాను సారము తనంతట తానే సాగి పోవును. 

56 .  ప్రారబ్దాను సారము లోకదృష్టిలో అతనిద్వారా లోక హితము కొరకు కర్మలు జరుగు చుండును. 

57 .ఇంతవరకు భగవానుడు ఎవరయినా సరే అనాసక్త భావముతో కర్తవ్య కార్మలు ఆచరించ వలెను. 

58 ప్రతి వ్యక్తియు వర్ణాశ్రమ ధర్మాలను, స్వభావమును, పరిస్థితులను, ప్రకృతిని అనుసరించి కర్తవ్య కార్మలు చేయవలెను. 

59 జనకాదులను ఆదర్శముగా గొని, వారిని కనురెప్ప లాగా ఆదరించి ఫలాసక్తి లేకుండా సేవలు అందించటయే అందరి కర్తవ్యముగా భావించ వలెను. 

60 . ఆసక్తి రహిత కర్మల ద్వారా అంత: కరణ సిద్ధి కలిగిన సాధకునకు భగవదనుగ్రహముచే తత్వజ్ఞానము తనంత తానే ఏర్పడును.     .    .       

61. వివిధ జాతులవారును, వివిధ సమాజముల వారును, వివిధ వర్ణాశ్రమముల వారును, కర్తవ్య కర్మలు భగవంతునికిసమర్పించి నప్పుడే ఫలితము  తెలియును.   
      
62. భగవంతుని దోష దృష్టి గలవారును, పరమాత్ముని సామాన్యునిగా భావించు వారును, విశ్వాసము లేని వారును, భగవంతుని శక్తి తెలుసు కోలేరు.

63. తామస స్వభావులు, వివేక రహితులు, విపరీత బుద్ధితో చిత్తం వశము కాక, వర్తమాన స్థితిలో బ్రష్టులుగా  ఉందురు. 

64. నదులు సముద్రమును చేరినట్లు, మనుష్యులు రాగద్వేషాలను త్వజించి, ఆ కర్మలను పరమాత్మ ప్రాప్తికి సాధనములుగా చేసు కొనవచ్చును. 

65. బుద్ధి, మనస్సు, ఇంద్రియముల ద్వారా ప్రారబ్ధ ఫల రూపము జరుగును.           

66. జ్ఞానియొక్క క్రియలు కార్తృత్వభావములుగాని, రాగ ద్వేషములు, అహంకార మమకారములుగాని, ఏమాత్రము దరి చేరవు. 

67. రాగ ద్వేష అను ఇద్దరు దొంగలు, ధర్మమార్గమున పోయే మనుష్యుని కలసి మిత్రులువలే నటించి, అతని మనస్సు, ఇంద్రియమును, వివేక శక్తిని నష్టపరుచును. 

68. దిలీప్ మహారాజు గోవును రక్షించుటకు సింహము చేతిలో శరీరము అర్పించుటకు సిద్ధమయ్యేను. 

69. పావురము కొరకు సీబీఐ చక్రవర్తి శరీరము కోసి మరణించుటయు సిద్ధమయ్యెను . 

70. ప్రహ్లాదుడు స్వధర్మము పాటిస్తూ పెక్కు సారులు మృత్యు ముఖమున చేరెను. 

కనుక సుఖదు:ఖలు అనిత్యములు, అట్లే జీవుడు నిత్యుడు, జీవన హేతువు అనిత్యము కనుక ధర్మముతో నడుచుకొనవలెను .  
      


ఓం శ్రీ రామ్ : శ్రీ మాత్రే నమ: ఓం శ్రీ కృష్ణాయనమ: 

71.కోరికలను సాదించు కొనుటకు గాని, భయము నుండి బయట పడుటకు గాని, లోభములకు లోబడి గాని, కడకు జీతమును కాపాడుటకు గాని ఎట్టి పరిస్థితిలో ధర్మములు తప్పరాదు . అట్టి 

72. ఇతర ధర్మములో సుఖమున్నప్పటికిని అది ప్రేరేపించిన, మనసుకు తృప్తి నివ్వదు, భయమును పెంచునని తెలుసుకొనవలెను.     

73.  ఎవరైనా సరే తమ కులధర్మాన్ని విస్మరించి ఇతర కులాలను తూలనాడిన, మనకన్నా అగ్రమైనదని భావించి దానిలో చేరిన , వారిచేత  పూజలందు కొనుటవలనను వారి వృత్తులను భంగము కల్గించినను అట్టి  వారు పాపములు పొందుదురు . 

74. పర ధర్మము ఎంత గుణ సంపన్నముగా ఉన్నను అది భయావహమే, ఏమాత్రము శుభము కాదు ,  ఆచరించినచో జాతిలో వెంటనే పతితుడగును అని తెలుసు కొనవలెను . 

75. కామము నశించిన తోడనే క్రోధము తనంతట తానే  రూపు మాయను. 

76. నెయ్య్, సమిధులు వేసిన కొద్దీ అగ్ని వృద్ధి అయినట్లు,  భోగములనుభ వించిన కొద్దీ భోగోతుష్ట పెరుగుచునే యుండును .      

77. పాపములకు మూలము, మనుజునికి అజేయు శత్రువు కామమే గాని మరి ఎవ్వరు కాదని తెలుసుకొనవలెను . 

78. కామమే మల, విక్షేప, ఆవరణములు అను మూడు దోషములుగా పరిణత చెంది మనుష్యుని జ్ఞానము కప్పివేయును. 

79. రాగము, సంగము భగవద్విషయుక్తమైన అనురాగమని చెప్పక  కామోత్పాదక భోగాసక్తి యేనని గ్రహించ వలెను..   

80. మనోబుద్ధిఇంద్రియములనుండి ఈ కామరూప శత్రువును (సంసారిగా చల్లపరుచు కొనవలెను) లేదా పారద్రోల వలెను, లేనిచో జీవితములో ఆరోగ్యమును, ధనమును నశింప చేయును .  

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/9)

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

81. రోగి అపధ్య పదార్ధములను సేయించినట్లు, కొన్ని పరిస్థితిలో బుద్ధిమంతునకు కూడా పాపకర్మల ప్రేరే పిన్చబడును . 

82. ప్రయత్న శీలుడు, బుద్ధిమంతుని యొక్క మనస్సును కూడ ఇంద్రియములు బలాత్కరముగా చలింపచేయును.     
83. కామము మనుష్యుని జ్ఞానము కప్పి వేసి అంధునిగా చేసి, పాపములనెడి శత్రువు ఆవహించును. 

84. మనోబుద్ధి ఇంద్రియములద్వారా విషయ రూప లోభములచే జీవాత్మ యొక్క జ్ఞానమును కప్పివేయును. 

85. అభ్యాసము, వైరాగ్యము అను రెండు ఉపాయముల ద్వారా ఇంద్రియములు వశమగును. 

86. భగవంతుని నిర్గుణనిరాకార తత్వముల ప్రభావమహాత్య రహస్యములు యదార్ధ జ్ఞానమును జ్ఞానమ ని తెలుసు కొనవలెను . 

87.  సుగుణ నిరాకారా దివ్యసాకార తత్వముల లీలా రహస్య గుణ మహత్య ప్రభావముల యదార్ధ జ్ఞానమును వి జ్ఞానమని అందురు.             

88. ఇంద్రియములకంటెను వాటి అర్ధములు (రూప,ఆస,గంధ,శబ్దస్పర్శ లనేది తన్మాత్రలు) పరములు. 

89. (శ్రేష్ఠములు,సూక్ష్మములు, బలీయములు) అర్ధముల కంటే మనసు, మనసు కంటే బుద్ది శ్రేష్ఠమైనదిగా పరమాత్ముడు తెలిపెను . 

90.    సమిష్టి బుద్ధికంటే మూల ప్రకృతి శ్రేష్టము, ప్రక్రుతి కంటే పురుషుడు శ్రేష్టము. పురుషుని కంటే శ్రేష్టమైనది లేదు, ఆత్మ స్వయముగా అన్నింటి కంటెను బలీయ మైనప్పుడు అదే కామమనే శత్రువును జయించును. 

మూడవ అధ్యాయము - అంతర్గత భగవద్గీత కర్మ యోగము సమాప్తము. 
    
     --((*))--

9, నవంబర్ 2017, గురువారం

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము.

Om sri raam - sri matrenama: 
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/4)
जय श्रीराधेकृष्ण जय श्रीराम  जय श्री कृष्ण जय श्रीहरि  जय श्रीरणछोड़राय जय श्रीद्वारकाधीश हरे रामा हरे कृष्ण



రచయత: మల్లాపగడ రామకృష్ణ  

31.స్వధర్మ రూపాయజ్ఞములను (ప్రజాపాలన, వ్యవసాయ ము,  వాణిజ్యము, అధ్యయన అధ్యాపనములు సేవలు) తప్పక నిర్వహించవలెను 

32. యజ్ఞముల వలన దేవతలకు  హవిస్సులను అందించి దేవతలను తృప్తి పరిస్తే ప్రాణులన్నింటికీ సుఖము కలుగును. 

33. నిస్వార్ధ భావముతో దేవతలు ప్రాణులు పరస్పరము మేలు చేకూర్చుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు. 

34. దేవతులు ప్రసాదించిన భోగములు అనుభవిస్తూ దేవతను మరచిపోతే నిజముగా చోరుడే . 

35. పుత్రులు తల్లి తండ్రులను పోషించక పోయినను, తల్లి తండ్రుల మరణానంతరము శ్రాద్ధతర్పణాలు ఆచ రించకున్నను,  ఉపకారము పొంది పత్యుపకారము చేయకున్నను, దత్తపుత్రుడైన సంపద పొంది తల్లితండ్రులను సేవింపకున్నను వీరందరూ క్రుతఘ్ను లు, చోరులు. 

36.*దేవతలు సమస్త జగత్తునకు ఇష్టభోగములను అందించుదురు. 

37.* ఋషులు మహాత్ములు అందరికిని జ్ఞానప్రదానము చేయుదురు.    
  
38.* పితురులు తమ సంతానమును పోషించుచు వారికి హితమును గూర్చు చుందురు. 

39.* పశుపక్షి వృక్షాదులు అందరికి సుఖ సాధనములుగా తమను తాము అర్పించు కొనెదరు. 

40.* యోగ్యత, అధికారము, సాధన సంపదతోఁఅందరికి పుష్టిగా ఆహారము అందిచుటయే మనుష్య ధర్మముగా తెలిపెదరు.      
*వీటినే పంచ మహా యజ్ఞాలు అంటారు. వీటిని సక్రమముగా అనుకరించిన వారికి మన:శాంతి, ఆరోగ్యము కలిగి ఉండును   
   
   Om sri raam - sri matrenama: 
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/5)

41 .న్యాయోపార్జిత ధనముతో సేవా రూప యజ్ఞములను చేయువాడుము కేవలము అందు మిగిలే అన్నము లోక సేవార్ధము జీవిన్చుటకై ప్రసాద రూపమున భుజించువాడుగా ఉండవలెను.

42 . సుఖ భోగముల కొరకై శాస్త్ర విధిని అనుకరించేవాడు పాపములనుండి ముక్తుడగును.

43 . ప్రాయశ్చిత రూపమున నిత్యమూ హోమ బలివైశ్వదేవాది కర్మలను ఆచరిస్తూ ఎవరి భాగము వారికీ పంచుతూ ఉన్నాదాన్ని భోజనము చేవాడు పాపములనుండి విముక్తుడగును.

44 . బియ్యము, గోధుమలు శరీర పుష్టికి ఉపయోగపడును, వీటివలన రజస్సు వీర్యము ఏర్పడును,
రజో వీర్యాదల సంయోగమువలన ప్రాణులు ఉద్బహ్వించును.

45 ప్రాణులన్నియును అన్నము నుండి జన్మించును. అన్నోత్పతి వర్షము వలన ఏర్పడును. యజ్ఞమువలన వర్షములు కురియును.

46 .విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదాలు విహిత కర్మలకు మూలములు. వేదములు పరమాత్ముని నుండి ఉద్భవించినవని తెలుసుకొనలేను.

47 .ప్రతి ఒక్కరు భగవత్ప్రాప్తికై భగవదాజ్ఞానుసారము తన కర్తవ్య పాలన చేయవలెను.

48 సృష్టి చక్రము యజ్ఞములపై ఆధార పడి యుండును .పరమాత్ముడు యజ్ఞముల యందు ప్రతిష్టుతుడై యుండును. 

49 సృష్టి చక్రమును పాటించక ఇంద్రియ సుఖలోలుడైన వాడు ఖశ్చితముగా పాపి యగును.

50 కర్తవ్యమును త్యజించి, స్వార్ధ చింతనయందే నిమగ్నుడై, హితాహితముల గురించి ఏమాత్రము ఆలోచించక ఉండువారు దోషిగా పిలవ బడును.    . 
  .                   .               

6, నవంబర్ 2017, సోమవారం

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము


Om sri raam - sri matrenama: 

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము 
రచయత: మల్లాపగడ రామకృష్ణ  


 1 . ఫలమును కాంక్షించు వారిని " కృపణా: ఫలహేవ:" అని తెలిపిన వారిని ఆత్యంత ధీనులుగా గుర్తించ వలసిన పరిస్థితి ఉన్నది. 

2 . ఉత్పత్తిని అనుసరించి జనులందరు తమ మనో సిద్ధి కొఱకై అర్ధించ వలెను. 

3 . నేను మీకు శరణాగతుడను, నా కర్తవ్యమును తెలుపమని అర్ధించవలెను. 

4 . నీలో ఎంత శక్తి ఉన్నా ఎదుటి వాని శక్తిని బట్టి మాత్రమే ప్రవర్తించవలెను

5 .  కర్మ కంటే జ్ఞానము శ్రేష్టము అని తెలుసు కొన వలెను, జ్ఞాన విస్తరణ కొరకు కర్మలు చేయవలెను. 

6 .  మనసు మనసులో లేనప్పుడు చెప్పెడి మాటాలు కలగాపులగపు మాటలుగా బ్రమలుగా మనుషులను తాకును. అవి ఎవరకు అవసరము? 

7 . పుణ్య పాపరరూప సమస్త కర్మాచరణములను త్యజించిన వాడే బుద్ధి యుక్తుడని కొందరూహించెదరు. 

8 . బుద్ధి మోహ పంకిలము నుండి బయట పడి పరమాత్మను ధ్యానించుటయే అందరి లక్ష్యంగా మారాలి 

9 . రాజ్యాధి పత్యము కానీ, లోకాధి పత్యము కానీ పొందిన శోకము మాత్రమూ పోదు. 

10 .  ప్రకృతి నుండి ఉత్పన్నమైన గుణములన్నియు మనుషులపై వత్తిడి చేయును, వాటిని ఎవ రూ గమినించలేరు. శరీరేంద్రియముల మనస్సు ద్వారా జరుగు క్రియలకు అభిమాన పాత్రు లగుదురు. 

11. ఏ కాలము నందైనను, ఏ మనుష్యుడైనను  క్షణకాలము కుడా కర్మచేయకుండా ఉండలేడు. 

12. మనము చేసే ప్రతి పని అంతర్గతములే ప్రకృతి ననుసరించి కర్మలు  చేయు యుండును. 

13. మమతా శక్తులను, ఫలేచ్చలను, త్వజించినవాని  ప్రశాంతముగా  ఉండును. 

14. గుణాతీతుడైన జ్ఞానికి గుణములతోగాని వాటి కార్యములతో గాని ఎటువంటి సంభంధము ఉండదని గమనించవలెను. 

15. పూర్వజన్మల కర్మ సంస్కారము మనుష్యులను వెంబడించును, దాని ద్వారానే మనుష్యులు జీవించ గలుగుతారు. 

16. సత్వ రజస్తమోగుణాలు ప్రకృతిని బట్టి, తోడుని బట్టి, సాటివారిని బట్టి, పిల్లలను బట్టి మనుష్యుల్లో మారుతూ ఉండును . 

17. ప్రతి ఒక్కరు దృశ్యాఅదృశ్య ల మధ్య జీవితకాలం జరిగి పోతున్నది అని తెలుసుకోవాలి. 

18. పట్టు బట్టి వినుట, పట్టు బట్టి చూచుట మొదలగు క్రియలు మనుష్యులను వెంబడించిన నిగ్రహించు కొనవలెను. 

19. మనస్సును నిగ్రహించుకొనుటకు ప్రయత్నిమ్చ వలెను. 

20. అలవాటు, ఆసక్తి, సంస్కారము వలన మనస్సు అప్రయత్నముగానే వాటి ప్రభావమునకు లోనగును, అది దోషము కాదు, మనస్సుని కట్టడి చేసుకొని నిత్యకృత్యాలు చేయవలెను.           
      
21. ఎవరైనా సరే ఇహపర భోగములను, రాగద్వేషములను త్యజింపవలెను . 

22. ఇంద్రియ కార్మలను శాస్త్ర విధి ప్రకారముగా చేస్తూ ఉండవలెను . 

23. ఇంద్రియములను వశపరుచుకొని శబ్దాది విషయము లను గ్రహిస్తూ, యజ్ఞదాన తపశ్చర్యలు, వాణిజ్య వ్యాపారములు, సేవలు అదేవిధముగా సమస్త కర్మలు చేయవలెను 

24. అసురీ సంపదతో ఉన్నవాడు మిధ్యాచారి అంటారు, మిధ్యాచారి కన్నా దైవీ సంపదలతో ఉన్నవాడు కర్మయోగి శ్రేష్ఠుడు .                    

25. స్వధర్మమును నిష్కామభావముతో చేయుటవలన మనసు ప్రశాంతముగాను, తెలియని ధైర్యము వెంబ డించును . 

26. కర్తవ్య కర్మలు చేయుట వలన  మనుష్యుని   అంత: కరణము శుద్ధమై అతని పాపములకు ప్రాయశ్చతము కలుగును. 

27. శరీర నిర్వహణకు ప్రతిఒక్కరు ఎదో ఒక పనిచేయ వలెను  అట్లు చేయని యడల మనిషి మనిషిగా బ్రతుకుట కస్టము.

28. మనుష్యుడు స్వార్ధ బుద్ధితో శుభాశుభకర్మలలో దేనిని దేనిని ఆచరించినను నానా యోనిలో జన్మించ వలసి వచ్చును . 

29. మానవ జన్మలో చేసిన కర్మలే బంధ హేతువులు అని గమనించవలెను. 

30. మమతా శక్తులతో, ధర్మ, అర్ధ, కామ, లోభి.  మోక్షాలను ఇంద్రియ నిగ్రహముతో  జయించి నవారికి పునర్వజన్మలు ఉండవు 

     

2, నవంబర్ 2017, గురువారం

ప్రాంజలిప్రభ - భగవద్గీత ( అంతర్గత) సూక్తులు 2వ అధ్యాయం (31 to70)



Om Sri Ram - Sri matrenama:


ప్రాంజలిప్రభ - భగవద్గీత ( అంతర్గత) సూక్తులు
2వ అధ్యాయం (31 to70)(రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

31 ఆత్మ ఇంద్రియ గోచరము కానిది, మనస్సునకు అందనిది, వికారము లేనిది అని తెలుసుకొనెను. (గీత 25 ) 

32 .పుట్టినవానికి మరణించగా తప్పదు, మరణించని వాడు పుట్టక తప్పదు విషవలయములోకి చిక్కి సోకింప వలదు. (గాడిద 26 ) 


33 .ఆత్మ వధించుటకు విలుకానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను శోకింపదు.


34 స్వధర్మము మరచి ప్రవర్తించవలదు, కుల లక్షణం మరచి ప్రవర్తించ వలదు (గీత 27 ) 


35  మరణమునునది వస్తునాశముకాకుండా రూపాంతరము చెందుటగా భావించవచ్చును 



36 మంచుగడ్డ కరిగినప్పుడు, నీరు ఆవిరైనప్పుడు నాశనమైనట్లు గా గోచారించును. (గీత 29 ) 


37  ధైర్యమున్నవాడు ఏపని చేయకుండా కూర్చొన కూడదు, అతడట్లు కూర్చున్నచో నీ దైర్యమును చులకన చేసి మాటలాడుదురు, అది అవసరము కాదు .  

38. లోకులెల్లరు చేతకానివాడు అని నీ కీర్తిని  అపకీర్తిగా వర్ణించి  చిలువలు పలువలుగా చెప్పుకొందురు, అది నీకవసరమా, (గీత 30 ) 


39. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణముకంటె భాధాకర మైనదని భావించాలి. కారణం తెలుసుకొని మెలగాలి.   

40. నీకు తెలిసిన విషయమును చెప్పక పోయినా, ఆవరమైనప్పుడు ధైర్యమును ప్రకటించక పోయినా, పెక్కు అన రాని మాటలు అని, అవహేళన చేయుదురు ,అది నీకు అవసరమా ఓ మనిషీ (గీత 35 )


41. అవసరానికి సహాయ పడనప్పుడు నీ సఖులు, నీ శత్రువులు, నీ సామర్ధ్యమును నిందించి నిన్ను గూర్చి అనరాని మాటలు అందురు. అది నీకు అవసరమా? 

43. ప్రతి ఒక్కరు జయాపజయాలు, లాభ నష్టాలు , సుఖదుఃఖాలు సమానమని భావించి ప్రకృతి అనుసరించి బ్రతకాలి. 

44. బుద్ధిని జ్ఞానయోగములో ఉండి ప్రతి ఒక్కరు ప్రవర్తించ వలెను,  కర్మయోగమును బట్టి నడుచు కొనవలెను.  


45. భోగా సక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒకదారి తెన్నూ లేక కోరికలవెంట తిరుగుతారు, ఎవరూ  వివేక హీనులు కారు స్నేహ, ప్రేమ ప్రభావము కొంత పనిచేయను, బుద్ధి వక్రబుద్ధిగా మారకుండా ఉండాలి.. 


46. ఫలాశక్తి తో కర్మలు చేయువారు అత్యంత ధీనులుగా మారుతారు. 


47. మంత్రానుష్టానము లందును, యజ్ఞ యాగాది కృతు లందును, అనుష్టానములు సకర్మముగా ఉండవలెను, అట్లు కానిచో అనారోగ్యము, ప్రాణహాని కలగవచ్చును. 


48. పూజా పునస్కారములు వీలున్నంత వరకు చేయవలెను, లేనిచో మానవలెను, చేసిన ఫలితము లభించును. 

49. దైవ ప్రార్ధన సంసార దుఃఖమునుండి ఉద్దరించునని ఖశ్చితముగా తెలుపు చున్నాను.                     

50. ప్రయత్న పూర్వముగా నిశ్చయాత్మకముగా బుద్ధినేకాగ్ర మొనర్చి జీవిత లక్ష్యమేదో నిర్నయిన్చు కొనవలెను .  


  51. ఎవరయినా ధర్మముగా నడుచు కోవాలంటే ముందుగా ద్వందములనుఁ అతిక్రమించాలి. 

52. సత్వగుణ విశిష్టుడవై, యోగక్షేమముల  నావల త్రోసి ఆత్మా యందె మనసు లగ్నము చేయవలెను. 


53. యోగమనగా వస్తుప్రాప్తికి ప్రయత్నము, క్షేమమనగా ఉన్నదానిని సంరక్షణకై యత్నము అవి వదలినప్పుడే మనసు ఏకాగ్రత పెరుగుతుంది. 


54. జీవిత లక్ష్యం తెలుసు కొనలేక పలు రోగములకు మూల మగుదురు. దృఢ బుద్ధితో మనసు ఏకాగ్రత లో ఉంచు కొనిన లక్ష్యము తప్పక సాధించ గలరు.


55. ఒక లక్ష్యము లేకుండా మనస్సు సంపాదన చుట్టూ తిరిగి హృదయము ఆవేదన చెందుట  అవసరమా ?  ప్రేమించే వారిని వదలి సంపాదనే ధ్యేయముగా తిరుగుట అవసరమా, అట్టివారికిబుద్ధి నీలాలేదని గమనించాలి .   


56. సమత్వ బుద్ధి ఉన్న వాడు పుణ్య పాపములను రెండింటిని ఈ  లోకములోని జయించగల్గుతారు. 


57. జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ భంధములనుండి ముక్తులయ్యెదురు. 


58. ప్రతి ఒక్కరు ముఖ్యముగా మోహమనెడి ఊబి నుండి ముందుగా బయట పడవలెను. భక్తి భావం పెంచు కొనవలెను. 


59. దు:ఖ ప్రసంగములు తటస్థించినపుడు చిత్తక్షోభ నొందక, సుఖములు ప్రాప్తించి నప్పుడు ఉప్పొంగక సమబుద్ధి కలిగి యుండవలెను.            


60. ఎవరు దేనియందు అనురాగములేక, సుఖదుఃఖములను భరిస్తూ, ఇంద్రియములను  విషయ సుఖముల నుండి మార్చుకొన్నచో అతని బుద్ధి స్థిరముగా ఉండును. 

61. అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములు లోను కాకుండా ఉండుట ప్రయత్నిమ్చ వలెను. 

62. ఇంద్రియములను, ఇంద్రియార్ధముల నుండి అన్నివిధముల ఉప సంహరించు కొనిన వారి బుద్ధి స్థిరముగా ఉండును.            

63. అన్ని విషయములపై ఆసక్తి తొలగి పోనంత వరకు అతని మనసు జిహ్వ చాపల్యముగా మారుచునే ఉండును . 

64. చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసినప్పుడే  మనస్సు, బుద్ధి,  స్థిరముగా ఉండును.


65. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి పెరుగును, మనసు ఆలోచనలకు మూలమగును. 


66. విషయములను పొందుటకై కోరికలు పెరుగును, కోరికలు తీర నప్పుడు క్రోధము పెరుగును, ఆక్రోధము వలన మనిషి  ప్రవర్తన మారును. 


67. క్రోధము వలన వ్యామోహము కలుగును, దాని వలన బుద్ధి మారును, జ్ఞానము నశించును. 


68. బుద్ధి మనస్సు లేనివాడు స్థిరముగా ఉండలేక చపల చిత్తుడై, వివేకము కోల్పయి, పతన స్థితికి చేరుకోనును . 


69.రాగద్వేష రహితుడై, ఇంద్రియముల ద్వారా మన:శాంతి ని పొందును. 


70. మన:ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నియు నశించును. పరమాత్మ యందు మనసు లగ్న మగును. 

శ్రీ మద్భగవద్గీత - సాంఖ్యాయోగం

71. మానవ శరీరం ఒక రధం , ఇంద్రియాలు గుర్రాలు , కనుకనే కోరికలే గుర్రాలు గా పరిగెటుతాయని తెలుసు కోవాలి. 

72. బుద్ధికి ఆర్ఝ్యం పోసేది మనస్సు , మనస్సు కామక్రోదాల చుట్టు తిరగకుండా జాగర్త పడాలి.

73. స్వధర్మం శ్రేయోదాయకం , పరధర్మం ప్రమాద కరం అని భావించాలి. 

74. జన్మ కర్మల భంధం నుండి యెవరూ తప్పించు కోలేరని గమనించాలి.

75. మనః ప్రసన్నత ఉంచు కుంటే అన్ని శుభ శకునాలు వెంబడిస్తాయి అని గమనించాలి .

76. నీటిపైతేలుతున్న నావ గాలి నెట్టి వేసి నట్లు. ఇంద్రియాలు మనసను చేరి బుధ్ధిని మార్చివేయును. 

77. ఇంద్రియార్ధములనుండి ఇంద్రియములను నిగ్రహించు కొనుటవల్ల పురుషుని బుద్ధి స్తిరముగా ఉండును. 

78. యోగి మేల్కొని యుండును, అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము.

79. ప్రాపంచిక సుఖాకలకు ప్రాకులాడిన వాని మనస్సు స్తిరముగా ఉండదనీ గమనించ వలెను. 

80. కోరికలన్నీ త్యజించి మమతా అహంకార ,స్ప్రహ రహితుడై చరించునట్టి పురుఫుడే శాంతిని పొందును. 


----------//తదుపరి కర్మయోగం చదవగలరు//------