29, డిసెంబర్ 2017, శుక్రవారం

కర్మ సన్యాసయోగం - 5 వ అధ్యాయము-




JAH WE # Yes Us # Krishna Consciousness

51.  శాంతి అనేది పరిశ్రమలో యంత్రాలు ఆడించి ఉత్పత్తి చేసేది కాదు.

52. ప్రభుత్వాలు శాసనం చేస్తే వచ్చేది కాదు.

53. ఇంట్లోకూర్చని వంట చేస్తే ఉడికి వచ్చేది కాదు.

54. వ్యక్తియొక్క మనస్సు కోరికలనే తుఫాన్ గాలులకు  చిక్క కుండా  స్థితియే శాంతి.

55. జ్ఞాన స్థితిలో పరమ శాంతి పొందాలంటే కోరిక, ఆశ అనే చిన్న ఫలాన్ని విడిచిపెట్టాలి.

56. సుఖసంపదల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, ఆశలతో కర్మలు చేసేవాడు ఆయుక్తుడు.

57.  అట్టివాడు ఉత్తమ్, మహ్యమా, అధమ జన్మలు ఎత్తి జన్మ జన్మ బంధాలకు చిక్కుతాడు.

58. దేహంలో ఉన్న ఆత్మను  గ్రహించనివాడు అజ్ఞాని.

59. సత్రములో దిగిన జ్ఞాని సత్రము బాగోగులు పట్టించు కోడు, పొద్దున్నే వెళ్లిపోదా మను కుంటాడు.         

60. జ్ఞాని అయినవాడు అద్దెకొంప  దేహంలో  ఉంటూ  ప్రారబ్ధం పూర్తి కాగానే విడిచి వెళ్లిపోతాడు.

61. మనుష్యులలో శ్రేష్టుడు బ్రాహ్మణుడు, అధమాధముడు చండాలుడు, జంతువులలో ఉత్తమ మైనది గోవు, నీచాతి  నీచమైనది కుక్క, మధ్యమ మైనది ఏనుగు. 

62. పసువులకు ఉపయోగపడే వస్తువు మనుష్యులకు పనికిరాదు, లోకవ్యవహారంలో మనుష్యులకు జంతువు లకు  ఉన్న తారతమ్యము తెలుసుకొని బ్రతకటమే మాన వత్వము.

63.  న్యాయ యుక్త వ్యవహార భేదములను అందరు పాటించవలసినదే. 

64. లోకవ్యవహార దృష్టిలో వారి వారి యోగ్యతలను అనుసరించి ఆవశ్యకత భేదములను పాటించుటే జ్ఞానుల వైసిష్టము. 

65.  అందరి యెడల ప్రేమాదరములు, పరమాత్మ భావములు సమానముగా ఉండునని తెలుసుకొనవలెను. 

66.  శరీరమునకు అవయవములు ఎంత అవసరమో, సమాజమునకు కుల కర్మాచారనములు కూడా అంతే అవసరము. 

67.  అన్ని అంగములు ఆత్మీయత భావముతో ఉండుట వల్ల ఆరోయముగా ఉండగలుగుతున్నారు అదేవిధముగా అందరూ సమాన భావముతో ఉండి నప్పుడు అసమానత భేదము కానరాదు. 

68. శరీరములో ఏదైనా అన్గామునకు దేబ్బాగిలిన తగు చికిస్చ చేసుకోనగా బాగుపడును, అట్లే లోకవ్యవహారములో న్యాయవవస్తయందు తత్వజ్ఞానులు ధర్మముగా నడచిన లోకము బాగుపడును. 

69.  సమభావ స్థితి మనస్కులైనవారు శరీరము ఉన్నను దానితో సంభంధం ఉండదు, ఎందుకనగా జనన మరణ చక్రము నుండి విముక్తులగుతారు. 

70. సత్వ, రజ స్థమో గునములలోని దోషములు హెచ్చు తగ్గులు ఉండవచ్చును. పరమాత్మునిపై నమ్మకము ఉన్న వానియందు గుణములు అతీతముగా ఉండును. 

71.  మానవుడు అహంకార స్పర్స , సుఖము చుట్టు తిరుగుట వల్ల  గుణ అతీతుడుగా ఉండలేక ఉన్నాడు. అయినా చిత్తము సత్వగుణము చుట్టు ఉన్నయడల సంభవము.

72. ప్రియలాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగి పోనివాడును పరమాత్మయందు ఏకీభావం స్థితి యందు ఉండును. 

73. లోకవ్యవహార దృష్టిలో అనేక విధములుగా సుఖ దు:ఖాలు బుద్ధి బ్రహ్మస్థితి నుండి మారదు.

74. జ్ఞానియొక్క అంత :కరణమునందు సంశయము, బ్రమ, మోహము లేశమాత్రమును ఉండవు.

75. భౌతిక శరీరములయందు ధ్యాస ఉండక, లోక వ్యవహారములో తలదూర్చక నిగ్రహస్థితిలో ఉన్నయడల పర మాత్మ లీలలు తెలుసుకోగలుగుతారు.

76. ఇంద్రియవిషయాలను, బాహ్య స్పర్శ విషయమును పూర్తిగా మనస్సునుండి తొలగించవలెను.

77. ఇంద్రియభోగములు దు:ఖ కారకములు, అనిత్యములు    ఇట్టి వారికి ధ్యానజనిత సుఖము లభింపదు.

78. వైరాగ్య ఉప రతి శ్రేష్ఠములు,  ధ్యాన జనిత సుఖఃము పరమాత్మసాక్షాత్కారము, అక్షయానందము పొందుటలోనే ఉంది పరమాత్మస్వరూపము.

79. మిడతలు మోహావేశమునకు చిక్కి అగ్నిజాలాలచుట్టి తిరిగి తాపము అనుభవించి దగ్దమగును. 

80. అజ్ఞానులు భోగములే సుఖ హేతువులని భావించి సుడిగుండములో పడిపోతారు. 
81.స్త్రీ కారణంగా భోగలాలసులుగా మారితే బలము, వీర్యము, ఆయువు క్షిణించును. 

82. మనస్సు, బుద్ధి, ప్రాణములు, ఇంద్రియములు క్షిణించును. 


83. అజ్ఞానిగా మారి కామాగ్నికి ఈర్ష్యాగ్ని తోడై ఆరోగ్యమును దగ్దము చేయును. 


83. ఇంద్రియభోగములు స్వప్న సదృశములు, మెరుపువలె క్షణ భంగురములు మానవజన్మ వైశిష్టము తెలుసుకొని ప్రవర్తించవలెను . 


84. కామ క్రోధాదులను జయించుటకు నిత్యమూ భగవంనామమే శరణ్యము అని గమనించవలెను. 


85 అపేక్ష వలన, అశ్రద్ధ వలన, ఉపేక్ష వలన భోగవస్తువులను సేకరించి అనుభవించితే పాస్చాత్తాపి బడ్డా ఫలితము ఉండదు. 


86. పరవళ్లు త్రొక్కు నది సముద్రము చేరగానే నామ రూప రహతమగును అట్లే కామక్రోధాలను నిగ్రహించుకోగలిగితే  

మటుమాయమగును. 

87. సంకల్ప వికల్ప ప్రవాహమనే క్రోధ విజృంభణ ప్రభావాలకు చిక్కకుండా యుంటేనే   సమర్థుడుగా మారుతాడు. 


88. స్త్రీ పుత్రాదులకొరకు, ధన మాన సంపదల కొరకు ప్రలోభాలకు చిక్కి పరమాత్మను విస్మరిస్తున్నారు. 


89. అంత రాత్మ యందే సుఖించు వాడును, ఆత్మయందే రమించు వాడును, సాంఖ్యయోగిగా మారును. 


90. ఆత్మజ్ఞాని అయినవాడు సచ్చిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణము పొందును.         



కర్మ  సన్యాసయోగం - 5  వ అధ్యాయము-
ప్రాంజలి ప్రభ- అంతర్గత సూక్తులు (5/100) , 
 రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  
91. తనకు లేనిదాన్ని ఇతరులకు ఉన్నదానిని  కోరు కోవటమే కామం .   

92. కామంవల్ల వళ్ళు గగుర్పాటు జరగటం, మొఖంలో ప్రసన్నత చెడటం జరుగు తుంది .

93. కోరు కున్నది పొంద లేకపోయిన, దానికి మరొకడు అడ్డు పడిన కళ్ళు ఎరపడటం తో వచ్చేది క్రోధం. 

94. క్రోధం వల్ల శరీరంలో కంపం, చమటలు పట్టడం,  కళ్ళు ఎర్రబడటం, నోటికి ఎటువంటి మాటలైనా రావటం సహజం . 

95. అక్షయ సుఖం, శాశ్వత సుఖం, దుఃఖం లేని సుఖం, సుఖం బయట నుండి కోరేది కాదు లోపలనుండి ఊరేది దీనినే అనుభవం అంటారు. 

96. మహాత్ములు బాహ్యవస్తువులను త్యజించి, బంధాన్ని  పెంచు కోకుండా నిరంతరం ఆత్మ జ్ఞానంలో గడుపుతారు. 

97. పాపాలను తొలగించుకున్నవారు, దైతభావన ఛేదించిన వారు, మనస్సును స్వాదనములో పెట్టుకున్నవారు, సమస్త ప్రాణుల హితాన్ని కోరుకున్నవారు మాత్రమే ఆనందాన్ని పొందకలుగుతారు .

98. ఎవరు బాహ్యమైన స్పర్శాది విషయాలను బయటనే నిలిపి వేసి, దృష్టిని భూ మధ్యను నిలిపి ముక్కులో సంచరించే ప్రాణ, అపాన, వాయువులను సమం చేసి, మనోబుద్ధులను, ఇంద్రియాలను నిగ్రహించి, ఆశ భయ క్రోధాలను  విడిచిపెట్టి, మోక్షాన్ని కోరుకునేవాడు. మనన శీలుడు

99. పరమాత్ముడు సంసార సముద్రాన్ని దాటుటకు విజ్ఞానాన్ని మహర్షులద్వారా అందచేయడం, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం అవడం మరలా ఆహారాన్ని అందుకోవటం దేవుని సృష్టి అని గమనించాలి. 

100. మనకున్న అశాంతి, సంసార భ్రాంతి క్షణము మాత్రమే దానిని జయించుటకు భగవంతుని యదార్ధ తత్వాన్ని   తెలుసుకొని నిరంతరం భక్తిమార్గంలో ఉన్నవానికి కలుగు ను పరమశాంతి. దానికి మించినది ఏదీలేదు.  

భగవద్ గీత యందు (5వ ధ్యాయము ) లో ఉన్న అంతర్గత సూక్తులు సమాప్తము.                    
        --((*))--

                  

   

16, డిసెంబర్ 2017, శనివారం

కర్మ సన్యాసయోగం - 5 వ అధ్యాయము- అంతర్గత సూక్తులు (1 /10 )

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణా యనమ:
కర్మ  సన్యాసయోగం - 5  వ అధ్యాయము-
Image may contain: text
ప్రాంజలి ప్రభ- అంతర్గత సూక్తులు (1  /10 
  రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

1. మనకు కావలసింది శ్రేయస్సే కానీ ప్రేయస్సుకాదు, శ్రేయస్సు అనగా శాశ్విత ఆనందం. 

2. ప్రేయస్సు అనగా నశించిపోయే ఇహలోక, పరలోక భోగాలు. విషాదములోను, సంతోషములోను, ప్రేయస్సు ను  కోరుట  మంచిది కాదు. 

3. కల్ప వృక్షం వద్దకు పోయి మౌనంగా ఉండుట ఎంత తప్పో, భోగాలను కోరుట కూడా అంతే తప్పు.

4. సన్యాసం అంటే విడిచి పెట్టడం, యోగం అంటే చెయ్యటం, సన్యాసయోగం గ్రహించుట ఎట్లు ? 

5. కర్మ సన్యాసం అంటే కర్మలు విడిచి పెట్టడం, కర్మయోగం అంటే కర్మలు చేయటం, ఈ రెండు ఒక్కటేనా,  అని  భగవంతున్ని కోరుట? . 

6. కర్మ సన్యాసం కంటే కర్మ యోగం శ్రేష్టమని భగవంతుడు తెలియ పరిచాడు.

7. వయసును బట్టి పనులు, చదువు చేయాలని భగవంతుడు తెలియపరిచాడు. (5  ఏళ్ల పిల్లవాడు డిగ్రీ చదువుట ఎంతకష్టమో ఈ గీతను అర్ధం చేసుకోనుట కొందరికి కష్టము)

8. జీవితంలో  గడ్డు పరిస్థితి వచ్చి నప్పుడు బుద్ధి ని ఉపయోగించాలి, లేదా పరమాచార్యులను సంప్రదించి పరిష్కారం చేసుకోవాలి .

9. మానవులు రజోగుణ ప్రభావంవలన వాసనా భారంతో క్రుంగి పోవుట సహజము. 

10. వాసనా భారము తగ్గితే  గాని మనస్సు ప్రశాంత పడదు. మనస్సు ప్రశాంత పడాలంటేకర్తవ్య భావముతో ధర్మాన్ని నిలబెట్టాలని దీక్ష పడితే వాసనా భారం కొంత తగ్గుతుంది. 

11. కొందరు శరీరము ద్వారా, వాక్కు ద్వారా కర్మలు చేయకుండా  మౌనం గా ప్రార్ధన చేస్తారు వారే కర్మ సన్యాసులు.

12. కొందరు నిష్కామ భావంతో ఫలితంపై ఆసక్తి చూపక, కర్తవ్య భావముతో అంట ఈశ్వరార్పణం అని బుద్ధితో చేసే కర్మలను కర్మ యోగం అందురు.         

13. ఎవరైతే ద్వేషించకుండా, దేనిని కోరకుండా ఉంటారో అతడే నిజమైన నిత్య సన్యాసి.

14. ఎవరైతే దుఃఖ కారణాలను ద్వేషించ కుండా, సుఖ కారణాలను కోరకుండా, మంచి చెడ్డల యందు తటస్థ భావము వహించి, సమ చిత్తం కలిగి ఉంటాడో అతడే నిత్య సన్యాసి.

15. శరీరాన్ని మనస్సుని, బుద్ధిని కలవర పెట్టే వాసనలు బంధాలు (అనగా ద్వందాలను ) తట్టుకొని  ప్రతి ఒక్కరు జీవితము సాగించవలెను.

16. శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, మానవమానాలు, రాగద్వేషాలు ఇవే పాశాలు, యమపాశాలు,  చేధింన వాడే నిజమైన సన్యాసి.

17. సన్యాసి వేషం వేసుకొని అన్నింటిపై ఆశక్తి  చూపినవాడు సంసారేకాని సన్యాసి కాడు.

18. భార్యా బిడ్డల పై ఆసక్తి,, భోగాలపై ఆసక్తి, ధన సంపదలపై ఆసక్తి, ఆశ్రమాలపై ఆసక్తి, భవణాలను కట్టాలని ఆసక్తి,  ధనం కోసం ఇతరులను ఆశ్రయించటం ఉన్న ఆసక్తి, కనుక ఉంటే అట్టివాడు సంసారి ఆయన సన్యాసితో సమానం.

19. అనాలోచితముగా త్వరపడి సన్యాసిగా మారిన రెంటికి చెడిన రేవడ అవుతాడు.           

20. కర్మలు బంధదాయకాలు అందుకే "కర్మణా బధ్యతే జంతు: " అన్నారు భగవానుడు. 
 

21. బంధాల నుండి తప్పించుకొని జ్ఞాణ నిష్టా శిఖరాన్ని ఎలా చేరుకోవాలో  ప్రయత్నిమ్చ మన్నారు. 

22. పనస తొనలు తీయాలంటే చేతికి నూనె వ్రాసుకుంటే తేలికగా తీయవచ్చు. 

23. పాత్రకు కళాయి పూసి వంట వండితే ఎటువంటి చిలుము  పట్టదు. 

24. విద్యుత్తును పరీక్షించేవాడు రబ్బరు తొడుగును ఉపయోగిస్తే ప్రమాదాలు ఉండవు. 

25. జ్ఞాన ప్రభావంతో కర్మలు చేస్తే బంధాలు అడ్డురావు అని భగవానులు తెలియ పరిచారు. 

26. నిర్మల హృదయము,, మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, సర్వత్రా, ఆత్మ దర్సనము నిష్కామ కర్మాచరణ చేయాలి. 

27. కోరికల పట్ల అనాసక్తి కలిగి, బుద్ధి నిర్మలంగా ఉంచు కొన్నవాడు విశుద్దాత్ముడుగా మారుతాడు.   

28. కోరికలేని వానికి అలజడులు, ఆందోళనలు, నిరాశ నిస్పృహలు ఉండక, మనస్సు ప్రశాంతముగా ఉంటుంది అట్టివాడే విజితాత్ముడు.

29. ఇంద్రియాలకు దాసుడై వెంట బడి పోకుండా ఉన్నవాడే జితేంద్రియుడు. 

30. ప్రాణులన్నీ యదార్ధ స్వరూపాన్ని తెలిసికొని ఆత్మలలో తేడాలు ఉండవని గ్రహించగలరు.

31. సర్వమును ఆత్మయే అని జ్ఞానంతో ఏకర్మలు చేసిన అతడు యోగ యుక్తుడు.

32. ఇంద్రియములు మనస్సును అధీనములో ఉంచుకొన్న వాడు తత్వవిదుడు. 

33. అందరినీ  తనలోను, తనని అందరిలోనూ, చూడ గలుగుతూ ఉండేది  ఆత్మయోక్కటే            

34. కన్ను చూస్తున్నా, చెవి వినబడుతున్నా, నాలుక రుచి చెపుతున్నా, చర్మము స్పర్శ స్తున్నా, ముక్కు వాసన చూస్తున్నా, పాదాలు నడుస్తున్నా, నోరు మాట్లాడుతున్నా, చేతులు  పట్టుకుంటున్నా ఇంద్రియాలు పనిచిస్తున్నా నేను  సాక్షిగా ఉంటాను. 

35. ఆలోచనలలో, భావనలలో  కర్మల తాలూకు వాసనలు - జ్ఞాపకాలు ఉండవు. 

36.  కర్మను సన్యసించటము కాదు, కర్మతో సంగ భావాన్ని సన్యసించాలి. 

37. దేహేంద్రియాలను వాటియొక్క వృత్తులను తెలియపరుస్తూ ఉండేది ఆత్మ ఒక్కటే. 

38. మనసు నేను, బుద్ధినేను అనే భ్రమలో ఉండి ఆత్మను మరచి ఉంటారు. 

39. ఎవరైతే శాస్త్ర విషయాలను గురువు ద్వారా శ్రవణం చేసి మనన నిధి ధ్యాసనల ద్వారా గట్టి పరుచు కొన్నవాడు
 తత్వ విదుడు. 

40. కర్మలవల్ల లభించిన ఫలితం ఏదైతే ఉందో అది భగవంతుడు ప్రసాదించిన ప్రసాదంగా భావించాలి.   

41. అన్నీ చేసేవాడు భగవంతుడు నాదేం లేదు అనే నిశ్చయ జ్ఞాణం కలిగి ఉండి, ధర్మం తప్పక నడిచే వాడే నిజమైన మానవుడు. 

42. నిరంతరం మనస్సును పరమాత్మపై నిలపటము వలన బుద్దివికసించి ధర్మకార్యములు చేయ గలుగు మార్గం ఉంటుంది. 

43. పూర్వ పాప పుణ్య ఆలోచలు ఏవి ఉన్నాయో అవి మనస్సుపై ముద్రగా   మరలా మరలా కర్మలను చేయిస్తూ కర్మ భంధం లోకి నెట్టివేస్తాయి. 

44. బురదలో ఉన్న తామరాకు బురద నంటించుకోదు, అలాగే  ప్రపంచంలో ఉన్నా, ప్రపంచ విషయాలకు వ్యామోహాలకు దూరంగా ఉండాలి. 

45. సాధకులకు కావలసినది లౌకిక ప్రయోజనము కాదు, పారమార్ధిక ప్రయోజనము కావాలి. 

46. పారమార్ధిక ప్రయోజనమంటే ముక్తియే, మోక్షమే అట్టి మోక్ష ప్రాప్తికి ఆత్మ జ్ఞానము కావాలి. 

47. ఆత్మజ్ఞానం అనుభవంలోకి తెచ్చు కొనుటకు ధ్యాన నిష్ఠ నిలవాలి.  అందుకు మనస్సు ఏకాగ్రం కావాలి. 

48. ఏకాగ్రం కావాలంటే చిత్తం అన్ని మాలిన్యాలనుండి శుద్ధి పడాలి. 

49. చిత్తశుధ్దికోసమే  కర్తృత్వం లేకుండా కర్మలు ఆచరించి, శుద్ధికోసం సంగరహిత కర్మలు నాచరిస్తూ భగవంతుణ్ణి ప్రార్ధించాలి. 

50.    బ్రాహ్మణుడు గొఱ్ఱెను చూస్తే అయ్యో అనుకుంటాడు అదే కసాయివాడు చూస్తే ఎంతమాంసం వస్తుందో అని ఆలోచిస్తాడు. బ్రాహ్మణునిది కేవలం దృష్టి, కసాయి వానిది సంగ దృష్టి.     

30, నవంబర్ 2017, గురువారం

ప్రాంజలిప్రభ - భగవద్గీత (అంతర్గత ) సూక్తులు 4 వ అధ్యాయం


ఓం శ్రీ రామ్ : శ్రీ మాత్రే నమ: ఓం శ్రీ కృష్ణాయనమ: 
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 
61. ఏ ప్రాణికైనను ఏవిధముగాను, ఏమాత్రమును కష్టమును కల్గించకుండా ఉండవలెను

62. మేలుగూర్చియు భావముతో, కపటము లేకుండా, ప్రియవచనములతో యధార్ధ  భాషణం చేయవలెను.

63. ఏ ప్రకాముగానైనను ఎవరి సొత్తును, అధికారమును అపహరించకుండా ఉండవలెను.

64. మానసికముగా గని, వాచికముగా గాని, శారీరకంగా గాని, సర్వావస్థలయందును సదా సర్వదా మైధునములను పరిహరించవలెను.

65. శరీరానిర్వాహణకు మాత్రమేతప్ప మరి ఏ ఇతర భోగ్య వస్తువులను సమకూర్చ కొనకుండా ఉండవలెను.

66. బాహ్యాభ్యన్తర ప్రియాప్రియములు, సుఖదుఃఖములు మొదలగు  ప్రాప్తించి నప్పుడు  సదా సర్వదా సంతుష్టుడై ఉండవలెను.

67    ఏకాదశి మొదలగు ఉపవాసములు ఆచరించుట ఆరోగ్యమునకు అవసరంగా భా వించ వలెను .

68. లోకహితమును  గూర్చు శాస్త్రముల అధ్యయనము    దైవ నామగుణ సంకీర్తనము చేయవలెను .

69. భగవంతునకు సర్వస్వమును అర్పించి భగవదా దేశములను పాటించ వలెను.

70. ప్రతివిషయమును అదేపనిగా ఆలోచించక, మనం చేసే పనులలో నిజా నిజాలు గ్రహించి  పరులను నొప్పించక, మనం కష్టాలు కొని తెచ్చుకోక, ఆంతర్యాన్ని అర్ధం చేసుకొని అర్ధాన్ని పొందెందుకు నిరంతరమూ శ్రమించవలెను. 

   
71. ఆసనము సుస్థిరంగా ఉంచి గాలిని లోపలకు పీల్చుట, బయటకు వదులుట ప్రాణాయామము చేయాలి ప్రతి నిత్యము.

72. ఎదో ఒక ధ్యేయస్థానమునందు చిత్తమును స్థిరముగా ఉంచిన ఇంద్రియములను నిగ్రహించుకో వచ్చును.

73. మమత, ఆసక్తి,,ఫలేచ్చను వదలి భగవన్నామముతో ప్రాణాయామము చేయవలెను.

74. యోగాభ్యాస అనుకూలగా సాత్వికాహారమును తీసికొనవలెను, అతిగా తిన్న ,, అసలు తినక పోయిన కష్టమే. 

75. హృదయము ప్రాణ వాయు స్థానము, అపాన వాయుస్థానము గుదము, నాభి సమాన వాయు స్థానము, కంఠము ఉదాన వాయు స్థానము, శరీర మంతయు వ్యాన వాయుస్థానము  వీటినే పంచ ప్రాణులందురు. 

76. పరమార్ధ సాధానకు దూరమైనవాడు నిరంతరము చింతాగ్నిజ్వాలలో మసి అవ్వక తప్పదు 

77. మానవ జన్మయందు కర్తవ్య కర్మను అనుసరించని వానికి ఏ జన్మ నందును నిజమైన సుఖమును పొందజాలడు.

78. తల్లి తండ్రులను, పతిని, గురువుని దైవముగా భావించి వారికి సేవలు చేయుట నైతిక భాద్యత అని భావించవలెను. 

79. నిస్వార్ధ భావముతో సేవించుట వలన బ్రహ్మ  ప్రాప్తి కలుగునని భగవంతుడే ఉదహరించెను.

80. కర్తవ్య తత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన ప్రాపంచక బంధములనుండి సర్వదా  విముక్తుడగును.

    
81. యజ్ఞములన్నింటిని త్రికరణ శుద్ధిగా అమలుజరిపినప్పుడే దేశము సుసంపన్నముగా ఉండును.  .   
         
82. ద్రవ్యములను  వినియోగించి చేయు యజ్ఞమును ద్రవ్య యజ్ఞము అందురు 

83. నేయి, చెక్కర, పాలు, పెరుగు, నువ్వులు, బియ్యము, పండ్లు, చందనము, కర్పూరము, శుఘంధ యుక్తమైన ఓషదులు అగ్నియందు హోమము చేయుట వలన శాంతి కలుగును.     

84. జ్ఞానులు నుండి భగవ తత్వమును తెలుసు కొనుట వళ్ళ శ్రద్ధ సమగ్రత పెరుగును. 

85. భక్తిశ్రద్ధలతో సాదరముగా దండ ప్త్రణామమును చేయవలెను.

86. దూడను చూచిన గోమాతకు వాత్సల్యముతో పొదుగు పొంగి పాలు కారును. 

87. బిడ్డను చూసిన జననికి స్తన్యము చిమ్మి పాలు కారును 

88. యోగ్యుడైన వానివద్దకు చేరిన మనుష్యుడు విద్య తప్పుకు వచ్చును 

89. కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో జ్ఞానులను సముచిత రీతిలో ప్రశ్నించి పరమాత్మ తత్వమును పొందవలెను

90. లోకవ్యవహారములో జ్ఞాని మనస్సు, బుద్ధి శరీరములో ఉండును.

91. జగతంతయు  నీటియందు మంచువలె, ఆకాశమునందు  మేఘమువలె, బంగారములో నగ వలె,  బ్రహ్మ రూపమై ఉండును.

92. నీవు మహాపాపి అయినా జ్ఞాన నౌక సహాయముతో  పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయట పడగలవు.

93. అగ్ని సమిధులను భస్మము చేసినట్లు జ్ఞానమనే అగ్ని కర్మలను భస్మము చేయును.

94. నీవే పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు  అని ప్రార్ధించ వలెను .                             
95. లోకవ్యవహారమునకు ప్రతి ఒక్కరు ఎదో ఒక వ్యాపారము చేయవలెను.  

96. వ్యాపారమందు పూర్తిగా నిమగ్నమైతే ఆకలిడప్పులు, నిద్దరాసుఖములు, విశ్రాన్తి దుమారం పట్టవు.

97. శరీరమునకు క్లెశము కలిగినను పట్టించుకొనక, ధనలాభమువలన చిత్తము పసన్నతను పొందును. 

98. ఇంద్రియములు వశమగువరకు (దేశసేవ కొరకు) శ్రద్దగా తీవ్రముగా అభ్యాసము చేయవలెను.  

99. సూర్యోదయము ఆయిన వెంటనే గతంలో జరిగినవణ్ణి మరచి, శాంతిని చేకూర్చినవి గుర్తు పెట్టుకొనవలెను .

100. ఎట్టి పరిసస్థితిలలో విస్వాసము కోల్పోయి, సంశయాగ్రస్తుడుగా మారకము, ఇటువంటి వాని జీవితము వ్యర్ధము, ఫలితములను ఈపరిస్థితిలో చూడలేడు. 

101. వేదశాస్త్రపారాయణమువలన, మహాపురుషుల వచనములు వినుటవలన మనసులో ఉన్న సంశయములన్ని తొలగించుకొని జీవించ వలెను. 

102. స్త్రీ, ఐశ్వర్యము చుట్టూ వచ్చే సందేహాలకు భయము చెందక ధైర్యము వహించి, ఓర్పుతో నిజా నిజాలు గ్రహించిన నాడు మనసుకు శాంతి ఏర్పడును. 

103. వివేకా జ్ఞానప్రభావము వలన మనిషిలో ఏర్పడే సంశయములన్ని తొలగి పోవును. 

104. ప్రతిఒక్కరు మోహావేశమునకు లొంగక కార్యోన్ముఖులై   ( అనగా హృదయ ముందు ప్రేమ నింపుకొని సంశయములు తొలగించుకొని ఇతరులలో ప్రేమను నింపుటకు) యుద్ధము చేయవలెను. 

105. మమత, ఆసక్తి, ఫలేచ్చలను త్యజించి యుద్దము చేయుట (సమస్యలనుండి బయట పడుటకు) శ్రేయస్కరమని పరమాత్ముడు తెలిపెను. 

జ్ఞాన కర్మ సన్యాసయోగము (నాల్గవ అధ్యాయము సమాప్తము.)        .                
       

24, నవంబర్ 2017, శుక్రవారం

ప్రాంజలిప్రభ - భగవద్గీత (అంతర్గత ) సూక్తులు 4 వ అధ్యాయం


ప్రాంజలిప్రభ - భగవద్గీత (అంతర్గత ) సూక్తులు 
రచయత. మల్లాప్రగడ రామక్రృష్ణ
Jai Shree Krishna.. May Lord Krishna's flute invite the melody of love into your life.. #eternallove #LordKrishna #haribol #Krishna #Kanhaiya #kahna #art #beautiful #lovethis #stunning #instalike #instadaily #instagood #instamood #instacool #instalove #fab #bansuri #flute #peacock #Hinduism #spiritual #spirituality #Indian #desi

1. ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని యోగమాయ లోక మంత విస్తరించును.

2. జన్మరహితుడు. నిత్యడు. సమస్త ప్రాణులకు ఈశ్వరుడు ఒకరున్నట్లు గమనించ వలెను.

3. సాకార రూపములో సమస్త ప్రజలను రక్షించును.

4. సత్పురుషులను రక్షించుటకు దుర్మార్గలను శిక్షించుటకు అవతరించును.

5. ధర్మమునకు హాని కలిగినప్పుడు , అధర్మము పెచ్చు పెరిగి నప్పుడు పరమాత్ముడు అవతరిస్తాడని తెలుసుకొనవలెను .

6. ప్రతి ఒక్కరు కర్మలు కర్త్వభావముగా ఆచరించాలి.

7. జన్మ తత్వ రహస్యాలను గమనించి ఆచరించ వలెను .

8. ప్రతి ఒక్కరు ద్రృడమైన భక్తి తాత్పర్యములతో, భగవంతుని ప్రార్ధించిన
జన్మలేకుండా చేయును. 

9. ప్రతి ఒక్కరు తగు విధముగా సేవలు చేయుచు జ్ఞాణాన్ని పొంది అందరికి సహకరించుచూ జీవించ వలెను .

10 . కర్మఫలములు ఆసించువారు ఇతర దేవతలను పూజించరు. అట్టి వారికి సిధ్ధి సీఘ్రముగా లభించును. 

11. పరమాత్ముడు తన దివ్యలీలల ద్వారా మనుష్యుల మనస్సును తన వైపు లాగు కొనును .

12. భక్తి నౌకను ఆశ్రయించిన వారికి సంసార సముద్రమునుండి తరింప చేయుపకు తానే చుక్కాని పట్టువాడై వారిని ఉధ్ధరించును.

13. భగవంతుని జన్మ కర్మల దివ్యత్వం నెరింగిన వానికి తనువు చాలించిన పిమ్మట భగవత్ప్రాప్తి కలుగును.

14. ధర్మ శాస్త్రాలలో నుడివిన రీతిగా  స్వయముగా ప్రవర్తించి ధర్మప్రభావమును చాటాలి. 


15. సాదు పరిరక్షణము, దుష్టశిక్షణము, ధర్మసంస్థాపనము నెరవేర్చుటకు భగవంతుడు అవతరించును . 


16. రూప, గుణ, ప్రభావ, నామ, మహిమా, దివ్యకర్మలు వినుచు, కీర్తించుచు, స్మరించుచుఁ, ఉన్నచో సంసా సాగరమును దాటగలరని భగవంతుడు బోధించెను. 

17.  ప్రకృతి తన ఆధీనములో ఉంచుకొని యోగ శక్తితో జనులపై గల వాత్సల్యముతో మనుష్యాది రూపములో జన్మించును . 

18. దయ, సమత్వము, ధర్మము, నీతి , వినయము, కలిగి ఉండిన వానికి భగవంతుడు ప్రత్యక్షమగును. 
  
19. రాగ, భయ, క్రోధ, అనేక దుర్గుణములు తొలగించి మనస్సును శాంతి మార్గమున ఉంచును. 

20. ప్రతిఒక్కరు సమస్తకర్మలు తమకొరకై గాక భగవద్ సేవలో భాగమని భావించి, అందులోనే సంతుష్టి చెంది,    
భారమును భగవంతునిపై ఉంచి, నడుచు కొనవలెను.               
21. భగవంతుని యేయే భావాలతో పూజించిన ఆయా భావాలతో ఆదుకొనును.

22. తనకోసం వ్యాకులచెందేవాని విషయమున వ్యాకులచెఞది ఆదు కోనును .

23. వియోగము సహింప లేక బాధతో వేడుకున్న తాను వియోగ బాధ అను భవించి ఆదు కోనును.

24. తనకు సర్వస్వము ధారపోయు వానీకి తిను సర్వాత్మనా ఆదుకొనును.

25. గోపాలుని వలే మిత్రుడుగా భావించిన వానికి మిత్రుడగును.

26. యశోదా నందుల వలే పుత్రునిగా భావించిన వానికి పుత్రుడగును.

27. రుక్మిణి వలే భర్తగా సేవించిన వారికి భర్తగా ఉండును .

28. హనుమంతునిళలే స్వామిగా సేవించిన వానికి స్వామిగా కనబడును్

29. గౌపికల వలే మధుర భక్తీతో భజించిన వారి విషరమున ప్రియతముగా ఉండూను .

30. ధర్మనీతి లోక మంతా వ్యాపింప చేసి శుభములు ప్రసాదించంటయే కాక దివ్య లీలా రసానందము కలుగ చేయును.

31 . భగవంతుడు తన సృష్టి రచనాది కర్మల యందు కర్తృత్వము గాని, పక్షపాత దృష్టి గాని, ఆసక్తి గాని చూపక  కర్మలయొక్క దివ్యత్వమును ప్రకటించును.

32 . బుద్ధి, జ్ఞానముల, విషయ సుఖాది వాసనలతో మాయకు చిక్కి కామ్య ఫల ప్రాప్తికై  ఉపాసకులను ఆశ్రయిస్తారు. ఇది అవసరమా ?

33 .మందబుద్ధులు సద్య:ఫలములకై ఆరాట పడుచు, ధనము శరీరము ఆర్పించుట అవసరమా, నవవిధాలలో ఏదో ఒక విధముగా ప్రార్ధించిన మనసు ప్రశాంత పరచగలనని భగవంతుడు తెలిపెను.

34 .  బ్రాహ్మణులు శమ దమాది కర్మలు ఆచరించి, ప్రజలకు ధర్మ ప్రవర్తనతో ధర్మబోధ చేయవలెనని తెలిపెను.

35.క్షత్రియులు సౌర్యము, తేజస్సులతో కూడిన కర్మలను ఆచరిస్తూ ప్రజల కష్టాలను ఆదు కొనుటకు ప్రాణాలను అర్పించుటకైనా సిద్దిముగా ఉండవలను.

36 .వైస్యులు కృషి, గోరక్షణాది కార్యములందును, వాణిజ్య వ్యాపారములందును సహాయ సహకారములు అందిస్తూ ధర్మంతో నడుచుకొనవలెను.

37 .  సూద్రులు  తదితర సామాజిక సేవలయందును, తగువిధముగా దేశసేవకు సహకరిస్తూ జీవన గమనాన్ని సాగించాలం తెలిపెను.

38  సత్వగుణ ప్రధానులైనవారు మరణా నంతరము ఊర్ధ్వలోకములకు చేరుదురని, తమో గుణము కావారు పశుపక్షాదులుగా జన్మింతురని, రజోగుణము కలవారు మనుజులుగా పుడతారని తెలిపెను . 

39. జ్ఞానిఆయన వాడు ఫలాపేక్ష లేకుండా, మర్మాలను ఆచరించి కర్తృత్వ బుధ్దిగాని వానికి ఉండవు. 

40. భగవంతుని కర్మల దివ్యత్వమును, తత్వరహస్యమును తెలుసుకొన్న మహాపురుషులు లోకములో ఉండునని తెలియ పరిచెను.             

41  కర్తవ్య కర్మలన్నీ " మమత, ఆసక్తి , ఫలేచ్చ, అహంకారం" అనే  భంధముల నుండి ముక్తులవ్వాలి . 

42. ఏది అసలు, ఏది నకిలీ, ఏది బ్రాంతి, ఏది మాయ, ఏది నిత్యం , ఏది త్యాగం, ఏది మర్మం, తెలుసు కోవాలనుంటే భక్తి, మౌన మార్గం ఒక్కటే.

43. మహాపురుషుల ప్రే రణ, ఆజ్ఞా అనుకరించి నడుచు కుంటే మనసు ప్రశాంతముగా వుండును .

44. శాస్త్రజ్ఞానము లేనివారు పుణ్యమును పాపముగాను, పాపమును పుణ్యముగాను భావించవలసి వచ్చును. 

45. దానము స్వీకరించి, వేదములను నేర్పుచు, యజ్ఞములను చేయిన్చుచుచు, ధర్మబోధ చేయుచు జయమును గడుపుతే బ్రాహ్మణునకు కార్త్య కర్మ అని తె లుసు కొనవలెను. 

46. కర్మయను అకర్మ, అకర్మ యందు కర్మ దర్శించువాడు బుద్ధిశాలి, అతడే యోగి. అని ఎలుసుకొనవలెను. 

47. కర్మ తత్వము తెలుసుకొని, అకర్మ స్వరూపమును ఎరిగి, వికర్మ లక్షణము తెలిసి నిగూడత్వముతో జీవితం గడపాలి. 

48. శాస్త్రసమ్మతములై, కామసంకల్పవర్జితములై, జరుగునో ఆటలే కర్మలన్నియు జ్ఞానాగ్నిచే భస్మము చేసి పండితునిగా మారాలి.

49. అగ్నిచే వేగింప బడిన విత్తనములు మొలకెత్తే లక్షణములు కోల్పోవును. 

50. స్త్రీ, పుత్రులు, ధనము, కీర్తి ప్రతిష్టలు, గృహము, గౌరవము, స్వర్గ్ సుఖమును ఆశించేదానినే ఇచ్ఛ కామము అని అందురు.         
   
51.మమతా, ఆసక్తి, ఫ్లేచ్చా,ఆహాహ్మ్క్రం లేకుండా కేవలము లోకహితముకొరకు శాస్త్రసమ్మతమైన యజ్ఞము, దానము తపస్సు చేయవలెను . 

52.   అంత:కరణమును, శరీరేంద్రియములను జయించిన వాడు, భోగసామాగ్రీ త్వజించినవాడు, ఆసారహితుడై శారీరక కర్మలు చేయును. 

53. కోరకుండానే లభించిన పదార్ధాలను సంతుష్టి పొందిన వానికి సమదృష్టి కలిగి యుండును. 

54. సుఖదుఃఖాలకు అతీతుడైన వాడు, అసూయ లేకుండా ఉంటే ఎటువంటి భంధములకు చిక్కకుండా ఉండ గలడు.         

55. వర్ణాశ్రమధర్మాలను, ప్రకృతి, కుటుంబ  పరిస్థితులను గమనించి చేయుకర్మలన్ని యజ్ఞములుగా గమనించవలెను . 

56. యజ్ఞ సృవాద సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము కర్త  బ్రహ్మము, హవనక్రియము బ్రహ్మము, యోగి ద్వారా పొందిన యజ్ఞఫలము బ్రహ్మము. 

57.  విషయభోగములు సనాధకునిపై ఎట్టి ప్రభావము చూపలేవు. అగ్నిలో గడ్దవలె అవిశ్వయముగా భస్మమగును . 
58. సుఖముపై ఆసక్తి, రామణీయ బుద్ధిలేని కారణమున, ప్రేమ భావాలకు చిక్కక ఇంద్రియాలను జాయించుకు ప్రయత్నిమ్చవలెను. 

59. ఇతర ప్రాణుల సుఖముగూర్చు లక్ష్యముతో యధాశక్తి ద్రవ్యమును ఉపయోగించుట మనుష్యుల ధర్మము.

60. మౌనమువహఞ్చి, అన్నముమాని  వస్త్రము ఉంచుకొని వాన చలి ఎండకు ఓర్చుకొని, పండ్లు పాలను తీసుకోని వన వాసము నందు చేయు తపస్సే తపో యజ్ఞము అన్నారు.   
--((*))--
     

             

11, నవంబర్ 2017, శనివారం

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము.

ఓం శ్రీ రామ్ : శ్రీ మాత్రే నమ: ఓం శ్రీ కృష్ణాయనమ: 
Photo
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/5)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 


51 . మనస్సు బుద్ధి ప్రాపంచిక విషయములపై పోకుండా పరమాత్మునిపై నిశ్చల స్థితిని ఉంచవలెను.

52 .పరమాత్మ ప్రాప్తికి మానవుడే అర్షుడు. స్వధర్మ పాలనద్వారా, సాధన ద్వారా,  పొంద వచ్చును.

53 .ప్రలోభాలకు లొంగక, ఆకర్షణకు చిక్కక, సచ్చిదానంద ఘనపారమాత్మ యందే నిరంతరమూ సంతుష్టుడై ఉండుము. 

54 . అట్టి వ్యక్తి శాశ్వితముగా నిత్యానందం నందు  మగ్నుడై స్వయముగా ఆనంద రూపుడగును    

55 . అట్టి స్థితిలో శరీర నిర్వాహణ ప్రారబ్ధాను సారము తనంతట తానే సాగి పోవును. 

56 .  ప్రారబ్దాను సారము లోకదృష్టిలో అతనిద్వారా లోక హితము కొరకు కర్మలు జరుగు చుండును. 

57 .ఇంతవరకు భగవానుడు ఎవరయినా సరే అనాసక్త భావముతో కర్తవ్య కార్మలు ఆచరించ వలెను. 

58 ప్రతి వ్యక్తియు వర్ణాశ్రమ ధర్మాలను, స్వభావమును, పరిస్థితులను, ప్రకృతిని అనుసరించి కర్తవ్య కార్మలు చేయవలెను. 

59 జనకాదులను ఆదర్శముగా గొని, వారిని కనురెప్ప లాగా ఆదరించి ఫలాసక్తి లేకుండా సేవలు అందించటయే అందరి కర్తవ్యముగా భావించ వలెను. 

60 . ఆసక్తి రహిత కర్మల ద్వారా అంత: కరణ సిద్ధి కలిగిన సాధకునకు భగవదనుగ్రహముచే తత్వజ్ఞానము తనంత తానే ఏర్పడును.     .    .       

61. వివిధ జాతులవారును, వివిధ సమాజముల వారును, వివిధ వర్ణాశ్రమముల వారును, కర్తవ్య కర్మలు భగవంతునికిసమర్పించి నప్పుడే ఫలితము  తెలియును.   
      
62. భగవంతుని దోష దృష్టి గలవారును, పరమాత్ముని సామాన్యునిగా భావించు వారును, విశ్వాసము లేని వారును, భగవంతుని శక్తి తెలుసు కోలేరు.

63. తామస స్వభావులు, వివేక రహితులు, విపరీత బుద్ధితో చిత్తం వశము కాక, వర్తమాన స్థితిలో బ్రష్టులుగా  ఉందురు. 

64. నదులు సముద్రమును చేరినట్లు, మనుష్యులు రాగద్వేషాలను త్వజించి, ఆ కర్మలను పరమాత్మ ప్రాప్తికి సాధనములుగా చేసు కొనవచ్చును. 

65. బుద్ధి, మనస్సు, ఇంద్రియముల ద్వారా ప్రారబ్ధ ఫల రూపము జరుగును.           

66. జ్ఞానియొక్క క్రియలు కార్తృత్వభావములుగాని, రాగ ద్వేషములు, అహంకార మమకారములుగాని, ఏమాత్రము దరి చేరవు. 

67. రాగ ద్వేష అను ఇద్దరు దొంగలు, ధర్మమార్గమున పోయే మనుష్యుని కలసి మిత్రులువలే నటించి, అతని మనస్సు, ఇంద్రియమును, వివేక శక్తిని నష్టపరుచును. 

68. దిలీప్ మహారాజు గోవును రక్షించుటకు సింహము చేతిలో శరీరము అర్పించుటకు సిద్ధమయ్యేను. 

69. పావురము కొరకు సీబీఐ చక్రవర్తి శరీరము కోసి మరణించుటయు సిద్ధమయ్యెను . 

70. ప్రహ్లాదుడు స్వధర్మము పాటిస్తూ పెక్కు సారులు మృత్యు ముఖమున చేరెను. 

కనుక సుఖదు:ఖలు అనిత్యములు, అట్లే జీవుడు నిత్యుడు, జీవన హేతువు అనిత్యము కనుక ధర్మముతో నడుచుకొనవలెను .  
      


ఓం శ్రీ రామ్ : శ్రీ మాత్రే నమ: ఓం శ్రీ కృష్ణాయనమ: 

71.కోరికలను సాదించు కొనుటకు గాని, భయము నుండి బయట పడుటకు గాని, లోభములకు లోబడి గాని, కడకు జీతమును కాపాడుటకు గాని ఎట్టి పరిస్థితిలో ధర్మములు తప్పరాదు . అట్టి 

72. ఇతర ధర్మములో సుఖమున్నప్పటికిని అది ప్రేరేపించిన, మనసుకు తృప్తి నివ్వదు, భయమును పెంచునని తెలుసుకొనవలెను.     

73.  ఎవరైనా సరే తమ కులధర్మాన్ని విస్మరించి ఇతర కులాలను తూలనాడిన, మనకన్నా అగ్రమైనదని భావించి దానిలో చేరిన , వారిచేత  పూజలందు కొనుటవలనను వారి వృత్తులను భంగము కల్గించినను అట్టి  వారు పాపములు పొందుదురు . 

74. పర ధర్మము ఎంత గుణ సంపన్నముగా ఉన్నను అది భయావహమే, ఏమాత్రము శుభము కాదు ,  ఆచరించినచో జాతిలో వెంటనే పతితుడగును అని తెలుసు కొనవలెను . 

75. కామము నశించిన తోడనే క్రోధము తనంతట తానే  రూపు మాయను. 

76. నెయ్య్, సమిధులు వేసిన కొద్దీ అగ్ని వృద్ధి అయినట్లు,  భోగములనుభ వించిన కొద్దీ భోగోతుష్ట పెరుగుచునే యుండును .      

77. పాపములకు మూలము, మనుజునికి అజేయు శత్రువు కామమే గాని మరి ఎవ్వరు కాదని తెలుసుకొనవలెను . 

78. కామమే మల, విక్షేప, ఆవరణములు అను మూడు దోషములుగా పరిణత చెంది మనుష్యుని జ్ఞానము కప్పివేయును. 

79. రాగము, సంగము భగవద్విషయుక్తమైన అనురాగమని చెప్పక  కామోత్పాదక భోగాసక్తి యేనని గ్రహించ వలెను..   

80. మనోబుద్ధిఇంద్రియములనుండి ఈ కామరూప శత్రువును (సంసారిగా చల్లపరుచు కొనవలెను) లేదా పారద్రోల వలెను, లేనిచో జీవితములో ఆరోగ్యమును, ధనమును నశింప చేయును .  

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/9)

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

81. రోగి అపధ్య పదార్ధములను సేయించినట్లు, కొన్ని పరిస్థితిలో బుద్ధిమంతునకు కూడా పాపకర్మల ప్రేరే పిన్చబడును . 

82. ప్రయత్న శీలుడు, బుద్ధిమంతుని యొక్క మనస్సును కూడ ఇంద్రియములు బలాత్కరముగా చలింపచేయును.     
83. కామము మనుష్యుని జ్ఞానము కప్పి వేసి అంధునిగా చేసి, పాపములనెడి శత్రువు ఆవహించును. 

84. మనోబుద్ధి ఇంద్రియములద్వారా విషయ రూప లోభములచే జీవాత్మ యొక్క జ్ఞానమును కప్పివేయును. 

85. అభ్యాసము, వైరాగ్యము అను రెండు ఉపాయముల ద్వారా ఇంద్రియములు వశమగును. 

86. భగవంతుని నిర్గుణనిరాకార తత్వముల ప్రభావమహాత్య రహస్యములు యదార్ధ జ్ఞానమును జ్ఞానమ ని తెలుసు కొనవలెను . 

87.  సుగుణ నిరాకారా దివ్యసాకార తత్వముల లీలా రహస్య గుణ మహత్య ప్రభావముల యదార్ధ జ్ఞానమును వి జ్ఞానమని అందురు.             

88. ఇంద్రియములకంటెను వాటి అర్ధములు (రూప,ఆస,గంధ,శబ్దస్పర్శ లనేది తన్మాత్రలు) పరములు. 

89. (శ్రేష్ఠములు,సూక్ష్మములు, బలీయములు) అర్ధముల కంటే మనసు, మనసు కంటే బుద్ది శ్రేష్ఠమైనదిగా పరమాత్ముడు తెలిపెను . 

90.    సమిష్టి బుద్ధికంటే మూల ప్రకృతి శ్రేష్టము, ప్రక్రుతి కంటే పురుషుడు శ్రేష్టము. పురుషుని కంటే శ్రేష్టమైనది లేదు, ఆత్మ స్వయముగా అన్నింటి కంటెను బలీయ మైనప్పుడు అదే కామమనే శత్రువును జయించును. 

మూడవ అధ్యాయము - అంతర్గత భగవద్గీత కర్మ యోగము సమాప్తము. 
    
     --((*))--

9, నవంబర్ 2017, గురువారం

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము.

Om sri raam - sri matrenama: 
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/4)
जय श्रीराधेकृष्ण जय श्रीराम  जय श्री कृष्ण जय श्रीहरि  जय श्रीरणछोड़राय जय श्रीद्वारकाधीश हरे रामा हरे कृष्ण



రచయత: మల్లాపగడ రామకృష్ణ  

31.స్వధర్మ రూపాయజ్ఞములను (ప్రజాపాలన, వ్యవసాయ ము,  వాణిజ్యము, అధ్యయన అధ్యాపనములు సేవలు) తప్పక నిర్వహించవలెను 

32. యజ్ఞముల వలన దేవతలకు  హవిస్సులను అందించి దేవతలను తృప్తి పరిస్తే ప్రాణులన్నింటికీ సుఖము కలుగును. 

33. నిస్వార్ధ భావముతో దేవతలు ప్రాణులు పరస్పరము మేలు చేకూర్చుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు. 

34. దేవతులు ప్రసాదించిన భోగములు అనుభవిస్తూ దేవతను మరచిపోతే నిజముగా చోరుడే . 

35. పుత్రులు తల్లి తండ్రులను పోషించక పోయినను, తల్లి తండ్రుల మరణానంతరము శ్రాద్ధతర్పణాలు ఆచ రించకున్నను,  ఉపకారము పొంది పత్యుపకారము చేయకున్నను, దత్తపుత్రుడైన సంపద పొంది తల్లితండ్రులను సేవింపకున్నను వీరందరూ క్రుతఘ్ను లు, చోరులు. 

36.*దేవతలు సమస్త జగత్తునకు ఇష్టభోగములను అందించుదురు. 

37.* ఋషులు మహాత్ములు అందరికిని జ్ఞానప్రదానము చేయుదురు.    
  
38.* పితురులు తమ సంతానమును పోషించుచు వారికి హితమును గూర్చు చుందురు. 

39.* పశుపక్షి వృక్షాదులు అందరికి సుఖ సాధనములుగా తమను తాము అర్పించు కొనెదరు. 

40.* యోగ్యత, అధికారము, సాధన సంపదతోఁఅందరికి పుష్టిగా ఆహారము అందిచుటయే మనుష్య ధర్మముగా తెలిపెదరు.      
*వీటినే పంచ మహా యజ్ఞాలు అంటారు. వీటిని సక్రమముగా అనుకరించిన వారికి మన:శాంతి, ఆరోగ్యము కలిగి ఉండును   
   
   Om sri raam - sri matrenama: 
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/5)

41 .న్యాయోపార్జిత ధనముతో సేవా రూప యజ్ఞములను చేయువాడుము కేవలము అందు మిగిలే అన్నము లోక సేవార్ధము జీవిన్చుటకై ప్రసాద రూపమున భుజించువాడుగా ఉండవలెను.

42 . సుఖ భోగముల కొరకై శాస్త్ర విధిని అనుకరించేవాడు పాపములనుండి ముక్తుడగును.

43 . ప్రాయశ్చిత రూపమున నిత్యమూ హోమ బలివైశ్వదేవాది కర్మలను ఆచరిస్తూ ఎవరి భాగము వారికీ పంచుతూ ఉన్నాదాన్ని భోజనము చేవాడు పాపములనుండి విముక్తుడగును.

44 . బియ్యము, గోధుమలు శరీర పుష్టికి ఉపయోగపడును, వీటివలన రజస్సు వీర్యము ఏర్పడును,
రజో వీర్యాదల సంయోగమువలన ప్రాణులు ఉద్బహ్వించును.

45 ప్రాణులన్నియును అన్నము నుండి జన్మించును. అన్నోత్పతి వర్షము వలన ఏర్పడును. యజ్ఞమువలన వర్షములు కురియును.

46 .విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదాలు విహిత కర్మలకు మూలములు. వేదములు పరమాత్ముని నుండి ఉద్భవించినవని తెలుసుకొనలేను.

47 .ప్రతి ఒక్కరు భగవత్ప్రాప్తికై భగవదాజ్ఞానుసారము తన కర్తవ్య పాలన చేయవలెను.

48 సృష్టి చక్రము యజ్ఞములపై ఆధార పడి యుండును .పరమాత్ముడు యజ్ఞముల యందు ప్రతిష్టుతుడై యుండును. 

49 సృష్టి చక్రమును పాటించక ఇంద్రియ సుఖలోలుడైన వాడు ఖశ్చితముగా పాపి యగును.

50 కర్తవ్యమును త్యజించి, స్వార్ధ చింతనయందే నిమగ్నుడై, హితాహితముల గురించి ఏమాత్రము ఆలోచించక ఉండువారు దోషిగా పిలవ బడును.    . 
  .                   .