18, మే 2017, గురువారం

Mallapragada ramakrishna Telugu Stories- 17

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

ప్రేమంటే ఇదేనా ?

అప్పుడే అడుగు పెట్టింది కొత్తకాపురానికి, కోటి ఆశలతో,ఆశయాలతో ఒకవైపు ఉద్యోగం చేయాలి, మరోవైపు కాపురాన్ని సరిదిద్దు కోవాలి, అదే ఈనాటి స్త్రీకి, భర్త కూడా  అవకాశవాదిగా మారి పోతున్నాడు, ఈ  తప్పు ఎవరిదో  మీరే ఈ కధబట్టి మిరే చెప్పగలరు కథానాయికి ఆనందీ, కథానాయకుడు  ఆనందరావు . ఇక చదవండి. 

కంటికి కునుకు రాదు, ఎంతసేపు వేచి చూసిన గడియారం కదులుతుంది తప్ప, మనసులో వేధిస్తున్న ఆలోచనలకు దారి దొరకక, నోరు విప్పి చెప్పుకోలేక, సన్మార్గంలో నడుస్తున్న అనుమానం బీజంతో ఉన్నవానికి అంతా దుర్మార్గంగా కనిపిస్తున్నది, ఎప్పుడో చేసిన తప్పును పదే పదే వల్లిస్తూ,  ఎప్పుడూ  వెకిలి చేష్టలతో, మానసికంగా హింసించి సంతోష పడేవారు మావారు, అని తలుస్తూ వాకిటముందు కూర్చొని ఉన్నది ఆనందీ, ఆనందం అంటే ఏమిటో తెలియదు, పెళ్లయిన ఒక్కసిన్మాకు పోవటం, హోటల్ కు పోవటం అనేదిలేదు, చిన్నప్పటి నుండి కష్టాల్లో పెరిగి, పెళ్ళైన సుఖపడాలని ఆశతో జీవిస్తూ ఉన్న మహిళ.

నెమ్మదిగా పాడుకుంటున్నది, నీలి కన్నుల కృష్ణా, వాలు చూపులతో ఉడికిస్తున్నావా కృష్ణా, నీ నవ్వులో రాలు రత్నాలు, నీ కాలి  మువ్వల శబ్దం నన్ను ఒక్క నిముషము  కూడా  నిలవ నీయుటలేదు, నా మేని సొగసులు, అమాయకపు నడకలు, హొయలు పోయే నీకోసం, ఈ పండు వెన్నెల, ఆ పూల గంధాలు వేచి వున్నాయి మనకోసమే, అందుకొని అల్లుకోగా రారా..నా మనసే నీదిరా, నీవంటే నేనురా వెన్నెల స్నానాలు చేద్దాం.......రారా, ఇద్దరమూ ఒకటయ్యి, ఏలుదాము ఈ రస జగతిని., ..

రోజూ జరిగే భారతమే ఈరోజు మరీ ఎక్కువ అయింది, బాగుగా త్రాగి,  పచ్చి బూతులు పలుకుతూ, ఇంట్లోనించి బయటకుపో, నా కళ్ళ ఏదుట కనబడ వద్దు, నేను మారను, ఉండ గలిగితే ఉండు, లేకపోతె తక్షణం, బయటకు నడువు అన్న మాటలకు ఓర్పు నశించి, దుర్మా ర్గుని ఆశ్రయించి  ఉండే బదులు అనాధలకు,  సేవ చేయదలచి  కట్టు బట్టలతో నడిచింది బయటకు ఆనందీ. మత్తులో ఉండుట వల్ల  సోఫాలో పడుకున్నాడు ఆనందరావు .

నిద్రలేవంగానే కాఫీ రాలేదు , చక్కటి పలకరింతలేదు, తనతప్పు గ్రహించాడు, వెంటనే ఫోన్ తీసుకోని తెలిసిన వారందరికీ ఫోన్ చేసాడు, భార్యవివరాలు తెలియలేదు, భార్య  ఆఫీసుకు బయలు దేరాడు రాలేదని తెలుసుకున్నాడు, తను ఆఫీసుకు చేరాడు, ఆఫీసులో డబ్బు పోయ్యిందని దానికి కారణం  తనే కారణమని భావించి పోలీసులకు దొరకకుండా తిరిగాడు ఆనందరావు,  మారి, భార్య చేసిన సేవలు గుర్తు తెచ్చుకొని ఏడ్వసాగాడు, స్నేహితులెవరూ సహకరించలేదు, పలకరింపులు లేక, ఆఫీసుకు పోక, రోడ్డువెంట తిరుగుతున్నాడు, మనసు మనసులో లేదు, భార్యను మరువలేక త్రాగుటకు బానిస అయినాడు, ఒక వైపు పోలీసువోల్లు, మరోవైపు అప్పులవాళ్ళు వెంబడిస్తున్నారు, అనారోగ్యముతో బాధను భరించ లేక రోడ్డుమీద పడిపోయాడు.

కళ్లుతెరచి చూడగా ఒక ఆశ్రమంలో ఉన్నట్లు గ్రహించాడు, గురువుగాను చెప్పిన మాటలు విన్నాడు ఆనందరావు   
   ఆశ్రమంలో   ఈవిధముగా గురువుగారు నీతి  బోధ చెప్పటం మొదలు పెట్టారు, మనిషికి అహంకారమే పరమ శత్రువు, చెడుస్నేహము మనిషిని కుటుంబాన్ని నాశనం చేస్తుంది, కొన్ని అలవాట్లకు కొందరు బానిసగా మారుతారు,  చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటారు, అట్టివారు ఎవరైనా పశ్చాత్తాపముతో తప్పు వప్పుకుంటే వారిని ఆదేవుడు క్షేమించి మంచి మార్గము చూపిస్తాడు.
అక్కడి వాతావరణ, అలవాట్లు ఆనందరావుకు కొత్తఆశలు వేళ్ళు విరిశాయి, అక్కడ దేవుని ముందు కూర్చొని తనతప్పులు చెప్పుకున్నాడు, అక్కడ  వున్న  వారికి  సేవచేస్తూ ఉన్నాడు. 

అప్పుడే అక్కడకు ఒక ఉత్తరము వచ్చింది, మీ అప్పులు తీర్చటం జరిగినది, ఆఫీసు డబ్బు కట్టడం జరిగింది, ఇక మీరు స్వేశ్చా జీవి . 
   
దుర్జన స్నేహమ్ము - దూరమ్ము సేయుమా - వర్జించు 

వారలన్ నీవు 

అప్పులన్ జేయకుమ - ఆర్జనల్ చాలుగా - ముప్పులన్ 


దేబోకు నీవు 

గర్వమున్ వీడుమా - కల్లలన్ వీడుమా - సర్వ మా దైవమే 


నీకు 

అమ్మయే దైవ మా - అబ్బయే దైవమ్ము - బమ్మయే 


సృష్టించె నిన్ను


నీ ప్రేమ ఓప్పులో భాగము పంచుకున్నాను, ఆ చిరుకానుక 

నీకు అందిస్తున్నాను, నా గురించి వెదక వద్దు నీవు 

మారావని గమనించాను, నన్ను కలవాలను కుంటే  

రావచ్చు, క్షమించే గుణం ఒక్క స్త్రీ   కే ఉన్నది,  ఓర్పుతో 

నీకోసం వేచి ఉన్నాను.   

ఆశ్రమంలో  గురువు గారికి తన గురించి పూర్తిగా చెప్పటం 

వళ్ళ ఆయన సలహా ప్రకారము భార్యను కలవటానికి 

తిరుగు ప్రయాణమయ్యాడు ఆనందరావు .
 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి