10, మే 2017, బుధవారం

Mallapragada Ramakrishna Telugu Stories- 9

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

Learn English is fun!
ఎందుకే  అంత కష్టపడతావ్, అంతా  నీ తాపత్రయం తప్పా, నిన్నెవరు గుర్తించరు, ఇంకా విమర్శిస్తారు తెలుసుకో అన్నాడు మధవ్  రాధతో
ఏదోనండి నాతృప్తి నాది, మీరు మాత్రం ఏమన కుండా నాకు సహకరిస్తే చాలు, అదే నాకు ఎనలేని సంతృప్తి.
అందుకే అన్నారు కష్ట బడే వారిని కష్టపెడతారు, సుఖ పడే వారిని పట్టించుకోరు అన్నాడు మాధవ్
ఇప్పుడు మనం తినలేం ఆవకాయ, మాగాయ, గోంగూర, చింతకాయ పచ్చడ్లు పెట్టి మరీ ఇద్దరు కొడుకు, కోడళ్ల కు ఇద్దరు  కూతురూ అల్లులకు కొరియర్ ద్వారా పంపిస్తు న్నావు,  పచ్చళ్ళు దేవు డెరుగు కనీసం మనల్ని గుర్తించే పరిస్థితే లేదు, అంతా నీ శ్రమ తప్ప .
ఏ మోనండి పిల్లలు మనల్ని గుర్తించక పోయినా మనం వారిని మరిచి ఉండలేమండీ.
ఇప్పుడు మరచి పోయానని చెప్పానా, లేదే వాళ్ళ గుణాలను గుర్తించి చెపుతున్నాను. 
       
నమస్కార మండి అంటూ కొందరు ఉద్యోగులు కలిశారు మాధవ్ గారిని, అందరిని సానుకూలంగా ఆహ్ఫానించి వారికి తగు అల్పాహారములు ఏర్పాటు చేసింది శ్రీమతి రాధా.
వచ్చిన విషయము తెలియపరుస్తు, మీరు వ్రాసిన "లోకమింతే "  అనే కావ్యానికి భాష ప్రాతిపది కముగా మొదటి బహుమతి కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించారు, కాశీ లో జరిగే ప్రత్యేక ఉత్సవము నందు రాష్ట్ర పతి చేతులు మీదగా మీరు అందు కోబోతున్నందుకు మా టీచర్ అసోసియేషన్ ద్వారా సంతోషము వక్త పరుచుటకు వచ్చామని చెప్పారు. మీరు అవార్డు తీసుకోని తిరిగి వచ్చుటకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము మీ తరుఫున ఎవరైనా వస్తానంటే మాకు తెలియ పరచండి ఏర్పాటు చేసుకోవాలి అని తీలియపరిచారు.

వారి మాటలకూ ఒక్కసారి మాధవ్ గారికి కళ్ళు చెమ్మగిల్లినాయ్ ఇప్పుడే ఉండండి అంటూ లోపలకు పోయి వచ్చినవారికి తాను రచించిన కావ్యాన్ని తలా ఒకటి చేతిలో పెట్టాడు.
మీకు అన్ని వివరముగా రెండు రోజుల్లో తెలియపరుస్తా అని అందరికి నమస్కార బాణాలు చెప్పాడు మాధవ్

రాధా అంతా  విన్నావు కదా కొడుకుల్లకు, కూతుర్లకు కబురు  చేయి, వాళ్ళ అభిప్రాయాలు కనుక్కొని చెప్పు అన్నాడు, నేను ఆ హనుమంతుని గుడిదాకా పోయి నమస్కరించి వస్తా అని గుడికి నడిచాడు మాధవ్.

కొడుకులు కూతుర్ల మాటలు విని ఓక్కసారి  బాధపడింది, భర్తకు ఏమిచెప్పాలో తెలియక ఉండి పోయినది.
మాధవ్ అడుగు పెడుతూనే ఏమన్నారు మనబిడ్డలు అని అడిగారు, తడబడుతూ ఈ అవార్డు తీసుకోకపోయినా పోష్టులోవస్తుంది నాన్న శ్రమ పడి పోవుట ఎందుకు ?

అవునే కష్టం విలువ వాళ్లకు తెలియదు, ఎదో కంప్యూటర్ విద్యనేర్చుకొని లక్షలు సంపాయించు తున్నారు, నేను లక్షలు సంపాదించ లేక పోయిన ప్రశంసా బహుమతితో ధనం పొందుట నాకు గొప్ప.
పిల్లలు వచ్చినా రాక పోయినా మన ఇద్దరం కాశీకి బయలు దేరుదాము,  నీకు నామీద నమ్మకం లేకపోతే నీవు రావద్దు.
అంత మాట అనకండి నేను మీతో వస్తాను, నా పిల్లల కన్నా మీరే ముఖ్యం
సరే రెండు రోజుల్లో మనం కాశీకి పోదాం, బహుమతి తీసుకోని పుణ్యక్షేత్రాలు తిరిగి వద్దాం, అన్నాడు.

అను కోని విధముగా బహుమతి ప్రధానము తారీఖు మార్చటం జరిగింది. అనుకున్న ప్రకారముగా ఉపాధ్యాయ పదవీ విరమణ జరిగింది. కొడుకులు కూతుర్లు ఎదో ఆశించి విరమణ సమయమున హంగామా చేశారు.

మాధవ్ మాత్రం లాయర్ పిలిపించి తనఆస్తి వివరాలు, రొక్ఖం వివరాలు తెలిపి వీలునామా రిజిస్ట్రేషన్ చేసాడు, ఆవిషయమే పిల్లలకు తెలియ పరిచాడు, నాన్న వచ్చిన డబ్బు ఎక్కడ దాస్తున్నాడో ఎవరికీ పెడుతున్నాడో, నీకు తెలియకుండా, మాకు ఇవ్వ కుండా ఉన్నాడు. అమ్మా నీవు జాగర్త పడాలి అని హెచ్చరించి వెళ్లారు.

 అనుకున్న ప్రకారముగా రాధా మాధవ్ కాశీలో బహుమతి తీసుకున్నారు, గంగలో స్నానమాచరించి పరమేశ్వరుని దర్శించి, గంగా హారతి చూడాలని పడవలో కూర్చున్నారు. ఒకవైపు హారతి మరోవైపు మాధవ్ కు  గుండె దడ పెరిగింది, పడవలోనుండి గంగలోకి విరిగి ప్రాణాలు అనంత వాయువులో కలిసాయి. 

మాధవ్ అకాల ముర్చువుని తట్టుకోలేక ఒక్కసారి మూర్ఛ పోయింది రాధ. తమతో పాటు వచ్చిన ఉపాద్యాయులు కొడుకులకు, కూతుర్లకు కబురుచేయక అందరూ వచ్చారు కర్మలు చేశారు, ఆస్తి వివరాలు అడిగారు. 

లాయర్ ద్వారా వీలునామా చదివించారు, దానిలో " నేనుకాని నాభార్య కానీ ముందుగా ఎవరు చనిపోయినా రెండవనారికి పూర్తి అధికారము వచ్చును, ఇరువురము చని పోయిన తర్వాత కొడుకులకు కూతుర్లకు సమాన భాగముల్లాగా పంచు కొన వలెను. లాకర్ లో ఉన్న డబ్బు ఈ ఇల్లు వృద్ధులకు నివాసమునకు మందులకు, వ్యాయామ శాలకు వాడవలెను. అనివ్రాసిన దాన్ని వివరించారు                     
కొడుకులు, కూతుర్లు ఆస్తి రాదని తెలుసుకొని తల్లిని అడిగి వెనుతిరిగారు ఫలితములేక. 

మాధవ్ రచించిన కవిత్వాలను ముద్రికవల్లా, వృద్దాశ్రమము వల్ల దినదినాభి వృద్దిగా మాధవ్ గారి పేరుతో అభివృద్ధి దిశలో తీసుకొచ్చింది రాధా 

ఇద్దరు కొడుకులు సంపాదన తారుమారై తల్లి పంచన చేరారు, అల్లుళ్ళ కోరికపై కూతుర్లు ఇంటికి వచ్చారు. ఎవ్వరిని వద్దనకుండా  పని పురమా యించి అభివృద్ధి దశలో కొచ్చారు, మాధవ్ ఆబ్దికం ఘనంగా ఏర్పాటు చేసారు. 

దు:ఖము వచ్చిన, సంతోషము పెరిగిన, గుండె ఆగి పోతుంది మరణ శాసనం అనే నిజం అదే రోజు రాధను వెంబ డించింది  అట్లు జరుగుట ఎవరి వళ్ళ ఏమో తెలియదు - డబ్బుకోసం కొందరి ఆశపరుల చర్యే     .......   



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి