21, జూన్ 2017, బుధవారం

विश्वमूलो जीवितं -29

ॐ श्री राम - श्री मात्रेनम:
 
గీత  జ్ఞానం

మానవులకు సహకరించేది ప్రకృతి, ప్రకృతి ననుకరించి సాగటమే మానవులయొక్క ముఖ్య లక్షణం ణమే.  మనం గమనించాల్సినది అంటి అంటకుండా బురదలో శాఖలు లేకుండా ఉండే కలువ పువ్వును ఆదర్శముగా తీసుకోవాలి ఎందుకనగా ఉషోదయము అయినవెంటనే వికసించే లక్షణం ఉన్నది కలువకు, అదే విధముగా ప్రతి ఒక్కరు ఉషోదయ వెలుగులో మనసును శుద్ధిచేసుకొని మనో నిగ్రహ శక్తితో చేయవలసిన కార్యకమాలు చేయుట ఎంతో మంచిది.

      మొక్కలు నీటి యందు తేలుట గమ్యం లేని ప్రయాణంలా సంచరించుట జరుగు తుంది అది చివరకు భూమి చేరగానే తన బలమంతా కేంద్రీకరించి బ్రతుకుటకు ప్రయత్నిస్తుంది, అదే విధముగా మనము కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటు, వాటి పరిష్కారం చేసుకుంటూ సాగిపోతూ చీకటిలో విశ్రాంతి తీసుకోవం వళ్ళ కొంత మన:శాంతి ఏర్పడుతుంది,సహాయ సహకారముతో కొంత ఉత్సాహము ఏర్పడుతుంది, మరునాడు ఉదయము కళ్ళ కొంత శక్తి తో ముందుకు సాగటం జరుగు తుంది.

శ్రీ కృష్ణ పరమాత్ముడు మనకు బోధ చేసాడు ఏమనగా ఎవరైనా ఈపరిస్థితిలో కూడా అధైర్య పడకూడదు, నిరుత్సాహపడకూడదు, ఇది చేయలేను అది చేయలేను అని మనసులో కూడా అనుకో కూడదు, నిత్యకృత్యాలు ధర్మం తప్పకుండ చేసినవారికి అంతా మంచే జరుగుతుందని భావించ వచ్చు,  కొన్ని పరిస్థితులలో తమ వారినే ప్రశ్నించ వలసిన పరిస్థితి వస్తే నిర భ్యంతరంగా ప్రశ్నించుటవల్ల కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి, మానతప్పు ఎదో ఎదుటివారి తప్పు ఎదో తెలుస్తుంది, ఏవిషయమైనా తెగేదాకా లాగకుండా జాగర్తపడుట మానవుల లక్షణం .
"కొండలపై నుండి ఉరవడిగా నీరు కారుతున్నది అన్నిటిలో ఒక చెట్టు క్రిందకు జారుతూ మరలా కొంత పట్టు దొరికిన వెంటనే వెనుకకు ఎగబాకి వెళ్ళుట గమనించగలరు అట్లాగే ఎవరైనా కొన్ని సంఘటనల ప్రభావము పనిచేసినప్పుడు కోపముతో వెళ్లిన తిరిగి వచ్చుట అనేదే అంత:కరణ శుద్ధికి మూలం మంచి చెడు గ్రహించి    బ్రతకటమే జీవితం 
అనేకమంది మనుషుల షేడ్స్ లో ఆకాశం ప్రకాశవంతంగా పింక్, ఎరుపు, నారింజ, నీలిమందు మరియు బూడిద రంగుగా చూడడం జరుగుతుంది. వారు సంతోషంగా మరియు విచారంగా జ్ఞాపకాలు లాగా ఉంటే తూర్పు నుండి పడమటి వరకు సూర్యునిలో  రోజువారీ మార్గంలో ఎన్ని మార్పులు జరుగుతాయో అన్ని మార్పులు మనలో౦ జరుగుతాయి. చీకటిలో సూర్యుడు దిగంతంలో పడుకుని ఉంటాడు, అలాగే మనలో అంతరాత్మ శాంతి కొరకు నిద్రకు ఉపక్రమించటం చాలా శ్రేయస్కరము.
 
ఒకప్పుడు అద్భుతమైన కాంతిని అణచివేయబడిన జాడలు కనిపిస్తాయి అంత మాత్రాన స్వయం శక్తి ఎప్పటికి మారదు మబ్బులు తొలగిన యధాప్రకారం వెలుగును చిమ్మును, అలాగే మనకి కొన్ని బాధలు వెంబడించిన అవి తొందరలో తొలగిపోతాయని గమనించాలి.     
నిద్రలో జ్ఞాపకాలు క్షిణించిన వెలుగులో అవి విజ్ఞావంతులుగా మారుస్తాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి