3, సెప్టెంబర్ 2015, గురువారం

ప్రాంజలి ప్రభ- -ఆనంద పారవశ్యం-3

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
ఆనంద పారవశ్యం -3

 ఆనంద పారవశ్యం ...  

బ్రహ్మానందం కారు నడుపుకుంటూ పాటలు వింటూ ఉన్నాడు. ఒక్కసారిగా మబ్బులు మారుతున్నాయి వెంటనే బ్రహ్మానందం కారు ఆపివేశాడు.
రాజేశ్వరి ఏమిటి కారు ఆపారు మనం చాలా దూరం పోవాలి తొందరగా పోనిక. ఇక ముందుకు పొతే లోతట్టు బ్రిడ్జి ఉన్నది అక్కడవున్న వాయగు పొంగుతున్నది అన్నాడు 
ఏమి కలగన్నావా 
లేదు అక్కడ వర్షం పడుతున్నట్లు తెలుసుతున్నది. అక్కడ వర్షంఇక్కడఆపుతావెందుకు 
ఆ వరద ఈ చుట్టుప్రక్కల గ్రామాలను ముంచి వేస్తుంది ఇక ముందుకు పొయ్యామంటే మనం కూడా ఇరుక్కుంటాం అంటుండగానే బ్రహ్మాండమైన వర్షం మొదలైనది. 

అందుచేత మనమంచి కోసం చెపుతున్నా మీరు మూర్ఖులుగా పోదామంటే పోతాను అన్నాడు బ్రహ్మానందం. 

నేను చెప్పేది చెయ్యాలి   తప్ప సొంత తెలివి ఉపయోగించకు 

కారును ఆపి తిట్లు శాపనార్ధాలు వింటున్నాడు , వర్షం పెరిగి  గాలి తోడై శబ్దం చేస్తుంది.

అప్పుడే వరదరావటం ముందు కారు దాకా నీరు రావటం కారులో వారు నీటిలో మునిగి చనిపోవటం అది ఒక కలగా జరిగి పోయింది.  

వాన వెలిసింది 

బ్రహ్మానందం నీ ఆలోచనవల్ల మా అందరి ప్రాణాలు కాబడిన వాడి వైనావు 
అంతా ఆ భాగావంతుడి మాయ, అనుకోకుండా ఆ పాత కధ గుర్తుకొచ్చింది వెంటనే ఆపాసాను అంతే 
ఎం కదా
అంతా మనమంచికే కధ .....  మాకు చెప్పు వింటాం
ఒక రాజు గారికి భీముడు అనే అంగ రక్షకుడు వుండేవాడు.వాడు నిజాయితీగా పనిచేసేవాడు.  అందుకని రాజుగారికి అతడంటే చాల యిష్టం. అత నెప్పుడు యేది జరిగినా అది అంతా మన మంచికే అని అంటూ వుండే వాడు.
ఒకసారి రాజుగారి పాదానికి గాయమైకాలి బొటనవేలు తీసేయాల్సి వచ్చింది. రాజు బాధపడుతూంటే భీముడు 
దిగులెందుకు మహారాజా! ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అన్నాడు. రాజుకి చాలా కోపం వచ్చింది 
నా వేలు పోయి నేను బాధ పడుతుంటే నీకు ఎగతాళిగా వుందా?అంటే భీముడు మరీ అదేమాట అన్నాడు ఏది జరిగినా మన మంచికే అని. రాజుకు కోపం వచ్చి అతన్ని చెరసాలలో పెట్టమని ఆజ్ఞాపించాడు.అతన్ని చెరసాలలో పెట్టేటప్పుడు కూడా అతను యిదీ మన మంచికే అంటూ లోపలి వెళ్ళాడు. 

కొన్నాళ్ళ తర్వాత రాజు వేటకి వెళ్ళాడు..అక్కడ దారి తప్పి అడవిలో చాల దూరం వెళ్ళిపోయాడు.అతని వెంట సైనికులూ,అంగ రక్షకుడూ యేవరూలేరు.అక్కడికి కొంత మంది ఆటవికులు వచ్చి అతన్ని బంధించి తీసుకొని వెళ్ళారు. వారి నాయకుడి ముందు నిలబెట్టారు. అతడు ఇతన్ని మన దేవతకు బలి యిచ్చేద్దాం అని అన్నాడు. సరే అతనికి స్నానంఅదీ చేయించి దేవత దగ్గరికి తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. వారు అతనికి స్నానం చేయించేటప్పుడు అతని కాలికి బొటనవేలు లేక పోవడం గమనించారు. నాయకుడి దగ్గరకు వెళ్లి యితనికి అంగ వైకల్యం వుంది ఇతను బలి యివ్వటానికి పనికి రాడు. అన్నారు. సరే అయితే అతన్ని వదిలి వేయండి అని ఆజ్ఞాపించాడు. రాజు బ్రతికి జీవుడా నాయి తన గుర్రం యెక్కితిరిగి తిరిగి ఎలాగో ఒకలాగా తన రాజ్యానికి చేరుకున్నాడు. అప్పుడు అతనికి తన కాలికి బొటనవేలు లేకుండా వుండడం వల్ల తను బ్రతికి బయట పడ్డాడు కదా! మరి భీముడు చెప్పింది నిజమే కదా!తనకు వేలు లేక పోవడం వల్ల తనకు మంచే జరిగింది అని అతన్ని చేరసాల నుంచి విడిపించి అతన్ని క్షమాపణ కోరాడు. 

భీముడు క్షమాపణ యెందుకు మహారాజా యిది కూడా నామంచికే గదా జరిగింది.అన్నాడు.అదెలా? అని రాజు అడిగాడు.నేను చెరసాల లో వుండకుండా  వుంటే నేను మీ వెంట వేట కు వచ్చేవాడిని. 
. అడవిలో మీ అంగ రక్షకుడిగా నా ధర్మం నిర్వర్తించేందుకు మీ వెంటే వుండేవాడిని.
అప్పుడు ఆ ఆటవికులు మిమ్మల్ని వదిలేసి బాగున్న నన్ను బలి యిచ్చేవారు కదా! మీరు నన్ను చెరసాలలో పెట్టి నందున నాకు మేలే జరిగింది. మీరు నా ప్రాణం కాపాడినట్టే కదా! నాకు మేలే జరిగింది. 
మీరేమీ బాధపడకండి. ఏది జరిగినా మన మంచికే అని నేనందుకే చెప్తూ వుంటాను.
. అని.అన్నాడు. 
రాజు భీముడికి మంచి బహుమానం యిచ్చి జీతం ఎక్కువచేసి గౌరవించాడు.దీని వల్ల నీతి యేమంటే. మనం అందరం ఏది జరిగినా దేవుడి ప్రసాదమని స్వీకరించగలిగే ప్రవర్తన కలిగి వుండాలి(positive attitude).

అలా కధ చెప్పి బ్రహ్మానందం మీరు బయలుదేరుదామంటే బాయలు దేరుదాం 
అంతా మనమంచికే ఇక బాయలు దేరుదాం అంటూ కారు కదిల్చాడు బ్రహ్మానందం
--------------------------శుభోదయం ----------------------



The Wolf inside the woman…   
సర్వేజనాసుఖినోభావంతు

ఆనంద పారవశ్యం ... 

మానవుల మనుగడకు ఇంద్రియములు శరీరము లోపల, శరీరము బయట పనిచేస్తుంటాయి.  బయటకు కనిపించే వాటిలో ముఖ్యమైనవి  నేత్రములు ఇవి కలువపూలు లాగా కొన్ని సార్లు విచ్చు కుంటాయి, మరికొన్ని సార్లు  మకులిస్తాయి, కన్ను విచ్చుకున్నప్పుడు అందం ఒకయెత్తు, కన్ను మూసుకున్నప్పుడు అందం మరోక యెత్తు, ఇందులో ఎత్తు అనగా ఆకర్షణ, ఆకర్షణ ఉండుట బట్టే ఈ ప్రపంచమంతా  పరిబ్రమిస్తున్నది, ఈ ఆకర్ష ణే  లేకుంటే ప్రపంచ మంతా ఏనాడో సంద్రముగా మారేది. 

 ముఖ్యముగా స్త్రీలలో  ఇది  ప్రత్యక్షముగా కనిపిస్తుంది.  ఇదేయే వారి ఆయుధము, దీని ద్వారా నే కొత్త సృష్టిని,  సృష్టిన్చగలుగుతున్నారు,  పారవశ్యములో మున్చగలుగు తున్నారు. కాంతా మణి కన్ను మిటితే చాలు దీపమ్ చుట్టూ తిరిగే పురుగు లాగా తిరుగుతారు, ప్రేమికులను తిప్పుకొనే శక్తి స్త్రీల కున్నది, ఇది తాత్కలము వేలుగున్నంత వరకు పురుగులు  తిరుగు తుంటాయి, అట్లాగే ఆకర్షణ ఉన్నంతవరకు మాత్రమే ఎ పువ్వు చుట్టూ అయిన తుమ్మెదలు తిరుగు తాయి, ఆకర్షణ  తగ్గినా పట్టించు కొనేవారు ఉండరు.  ఇది లోక సహజం. 

అందరి శిరస్సులలో ఒక విధమైన శక్తి జాగ్రుతమోతుంది అదియే ఓంకారం ఇది ఆ బ్రహ్మదేవుడు కల్పించాడు దాన్ని గుర్తించుటకు మానవులకు సాద్యము కాదు, కొందు మహాసాదువులు యోగులు ఇంకా ఈ ప్రపంచములో అనేకమంది జీవిచియున్నారు,  వారు చెప్పే మాటలను  యిట్టె ప్రతి ఒక్కరు ఆకర్షించు తున్నారు.  ఇది వారి తప్పు కాదు, వారు చేసిన కృషి, వారి పూర్వులు చేసిన తప: ఫలము.  

ఈనాడు  ఆశక్తి బయటకు కనిపిస్తున్నది, కొందరు సిద్ధిని సద్వినియోగం చేస్తుంటే, కొందరు దుర్వినియోగము చేస్తున్నారు, ఏది ఏమైనా ఆకర్షణ శక్తి అంతా  శిరస్సులో ఉన్నది. శిరస్సు నందు ప్రతి ఒక్కరికి మూడు  నేత్రములు ఉంటాయి కుడికన్ను ఎడమకన్ను మద్య పాలభాగామునందు మరో కన్ను ఉంటుంది.  ఇది ఆ పరమశివునికి  మాత్రమే ప్రత్యక్షముగా కనబడుతుంది.

మన శరీరంలో అనేక నాడీ గ్రంధులు ఉన్నాయి, ఇవి మనసును బట్టి చలిస్తూ ఉంటాయి.  ఇవి అమృత ఘడియల యందు   ఒక విధముగా, ఉషోదయ సమయము నందు మరో విధముగా, మద్యాహ్న సమయము నందు   మరో విధముగా సూర్యా స్తమయం, చంద్రోదయం అవుతున్నప్పుడు మరో విధముగా, సమస్త లోకాలకు చంద్రుడు  వెన్నెలను కురిపించు సమయాన ఆనంద  పారవశ్యముగా ఉండే విధముగా ఆ విధాత సృష్టించాడు. ఆజ్ఞాచక్రం నందున్న తాపిని అను గ్రంధి యందు నిబిడీ కృతమై యున్నా 'సాఫల్య' అనే శక్తి జాగ్రుత మోతుంది. ప్రతి ఒక్కరికి సఫలము, సాఫల్యము సంభోగము పై ఆధార పడి ఉంటుంది. ఇది ఎవరు చేసిన వారి కర్మ ననుసరించి జరుగుతూ ఉంటుంది. ఒకరికి  ఎక్కువ, ఒకరికి  తక్కువ అనుకోవటం, ఒక బ్రమ మాత్రమే, పతి ఓక్కరికి ఆకర్షింమ్చి, ఆకర్షిమ్పబడు నంతకాలం ఎటువంటి రుగ్మతలురావు, ఎటువంటి ఆలోచనలు రావు, అందుకే నేను ఎప్పుడు చెపుతుండే వాడ్ని మనోనిగ్రహన శక్తి పెంచుకుంటే సాధించ లేనిది లేదు ఆకర్షిమ్చలేని దేది ఉండదు, సత్యం ధర్మం న్యాయం మన ఫాల నేత్రంలో జాగ్రుతమై ఉంటాయి.

ఈ నేత్రాల వల్లే పతి ఒక్కరు పాలన, పరాక్రమము,  చూప గలుగుతారు పాలన అనగా నాదృష్టిలో " సంసార సుఖము అందించి సుఖ పడువారు, సుఖం కొరకు పరాక్రమించు వారు మాత్రమే" ఈలోకం లో  జీవించ గలుగుతున్నారు. 

ఆనంద పారవశ్యం ... 

ముగ్గురు   వ్యక్తులు ఒకచోట కలిస్తారు. వారిలో  రోజు కొకరు ఒక సమస్య చెపుతారు. ఆ సమస్యకు మిగతా ముగ్గురుకి  నవ్వు వచ్చే విధముగా హాస్య విషయాలు తెలియపర్చాలి  నాల్గవాడికి నచ్చే విధముగా ఉండాలి. అవి ధర్మ భద్దముగా ఉండాలి 

సందర్భం ఏదైనా తీసుకొవచ్చు ఇందులో నిభందనలు ఏమి ఉండవు


 చెవిలో చిన్న మాట   
విద్యార్ధి: టీచర్  మా అమ్మ మా నాన్న  చెవిలో ఏదో ఒక చిన్న మాట చెప్పింది 
టీచెర్  : నాకెందుకు  చెపుతావు, మీనాన్న నే ఏమి చెప్పాడో  అడగ పోయావా 
విద్యార్ధి : అడిగాను టీచర్ మీ టీచర్ ఆడుగు, సమాధానము చెపుతుంది అన్నారు అందుకే అడుగుతున్నాను. 
టీచర్ : మీ అమ్మను అడగ పోయావా,
విద్యార్ధి  : ఏదడిగినా పెద్ద విషయాలు నీ వెప్పుడు వినకూడదు, అందుకనే  చేవిలోచేప్పాడు మీ నాన్న 
టీ చర్ : మీరు చెప్పిందినాకు ఏమి వెనబడుటలేదు, మీరు నా  కు చెప్పేవి  వినబడుట  లేదు పెద్దగా చెప్పండి 
 ముందు నీ చెవిలో గుబిలి తీసుకొ  బాగుగా వినబడుతుంది అన్నది విద్యార్ధితో . 
విద్యార్ధి : మీరు చెప్పవద్దు, మీ పాఠం వినావద్దు , మిమ్మల్ని అడగను  
టీ చెర్ , మా నాన్న చెవి కొరుకుతా అప్పుడే చెపుతాడు ..
టిచర్ :         అ ఆఅ  ఏమిటిరా ఇంతలేవు అప్పుడే కోపమా ............. 
                       అందరూ  ఒక్కటే నవ్వులు ...............

2. ప్రియుడు : ప్రియురాలుని చేవిలోచిన్న మాట చెపుతాను పార్కుచాటుకు వస్తావా  
ప్రియురాలు: నీవు చెవిలో చెప్పఖర లేదు, నేను నిన్ను ప్రేమెంచలేదు ఆ చెప్పేదేదో  చెప్పు  ఇక్కడే ఆనంద్ 
ప్రియుడు : పార్కులో జనం ఉన్నప్పుడు చెప్పుతున్నాడు:  నీవు మంధరకు  సూర్పనకు తక్కువగా ఉన్నావు అన్నాడు 
పార్కు లో వారు  విని అసలే మగవారు మూర్ఖులు చెవులు ముక్కు కోస్తారు జాగర్తా 
ప్రియుడు : అ   ఆఅ అంటం  సరిపోయింది,........  రుసరుస అంటూ పోయింది ప్రియురాలు    
అందరూ  ఒక్కటే నవ్వులు ...............

3. భర్తః : భార్య దగ్గర చేరి  భర్త  నెమ్మదిగా చెవిలో చిన్నమాట అన్నాడు 
భార్య: నాకేం చెవుడు లేదు నిమ్మదిగా వచ్చి చెప్పారు
భర్త: అయ్యో మరిచాను చేవుడునాకు కదూ, ఎదురింటావిడ  ఏదో చెప్పి వెళ్ళింది నీవు లేనప్పుడు 
బార్య : ఏమిటి  నేను లేనప్పుడు ఆమెతో సరస మాడారా
భర్త : అమ్మతోడు నాకు చెవిలో చెప్పింది, నేను పెద్దగా చెప్పమన్న చెప్పకుండా వెళ్ళింది 
భార్య :  వేల్లికనుకుంటాను ఉండు

 భర్త: ఏమిటి కనుక్కోని రావటానికి వెళుతున్నావా , యదురింటావిడను  పిలిచి నీవు బయటకు పోతున్నావా 
 బార్య : ఆవిడను తెస్తా సరసమాడు 
భర్తా : హరి ఎంతమాట  ............. హరి అనాల్సినది నేను నీవు కాదు ఆ ............        అందరూ  ఒక్కటే నవ్వులు ............... 



                                 ఇంకా ఉంది ................. (4)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి