28, అక్టోబర్ 2017, శనివారం

భగవద్గీతలో (అంతర్గత) సూక్తులు -1/2(మొదటి అధ్యాయము )

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:
Krishna
భగవద్గీతలో  (అంతర్గత)  సూక్తులు  -1/4(మొదటి అధ్యాయము ) (4-1-


31 .అధర్మ ప్రాభల్యము వలన కుల స్త్రీలు చెడుదురు, అందువలన వర్ణ సంకరము ఏర్పడును.


32. కామాన్ని జయించలేక స్త్రీ పురుషులు కొందరు వక్రమార్గమున అనుసరించి కొందరి అనాథలను సృష్టింస్తున్నారు, ఇది అవసరమా?


33. వర్ణ సాంకర్యము వలన మృతులై పితృలోకమందున్న వంశీయులు కుడా తిలోదకములు, పిండ ప్రదానాలు లేక అధోగతి పాలగుదురు.అది గమనించాలి


34. కామాన్ని జయించి నిగ్రహించు కోవటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి, అది వర్ణ సంకరము కాకుండా జాగర్త పడాలి, అట్లు అయినచో తల్లి తండ్రులు తృప్తి పడరు, వారి మరణించిన పుత్రులు "శ్రద్ధలేక అర్చనలు " చేసిన " ఖర్మలు"  చేసిన ఫలితము ఉండదు .


35 మహాపాపముల వలన కుల ధర్మములు, జాతి ధర్మములు అడుగంటును, అందుకనే ఏ స్త్రీ అయిన పురుషుడు అయిన సక్రమ మార్గమున నడుచు తీరాలి.
--((**))--
36.సాంకర్యమునకు కామ వాసనా ప్రాబల్యమే మూలము. జ్ఞానమునకు ప్రబల శత్రువుగా మారును, అట్టి పరిస్తుతులలో నిగ్రహించుటకు ఆధ్యాత్మిక పద్ధతిలో మౌనం వహించి నిగ్రహించుకోవాలి అప్పుడే   నీలో ఉన్న శత్రువుని జయించ గలగుతావు. తాత్కాలికంగా కామాన్ని జయించ గలుగు తావు.


37  మానవ జాతికి అశ్వ శునకము లాంటి పారిశుద్ధ్యం పనికి రాదేమో.


38 శారీరక దృష్ట్యా వర్ణసాంకర్యము ఉత్త మోత్తమని వాదించేవారు కలియుగములో పుడతారు చిత్రమేమో గాని అది ముప్పు అని తెలిసినా ఒప్పుకుంటారు, నిప్పు అని తెలిసిన పట్టుకుంటారు అటు వంటి వారికి కాలమే సమాధానము చెపుతుందని గమనింఛాలి. (గీత - 43  & 44 )


39.  దుర్మార్గులను చంపుట మహా పాపము కాదు, వారిలో ఉన్న దుర్మార్గాన్ని తొలగించుటకు ప్రయత్నం చేయాలి.


40. బలమైనవాడు బలహీనునకు అవకాశము ఇచ్చిన "పిల్లి పులిగా మారినట్లు "  బలహీనుడు బలవంతుని ఎదుర్కొనే శక్తిగా మారుతారని గమనించాలి.


41. 10 సార్లు ఓడిన దిగులు పడ నవసరము లేదు, ఎందుకనగా నీవు ప్రతిసారి కొత్తదనం కోసం ప్రయత్నిమ్చావు, ఎప్పటికైనా గెలుస్తానాని నమ్మకంతో కనుక విజయం తప్పక నిన్నే ఆవరిస్తుంది.


42  మానవులు ప్రతి విషయములోను తృప్తిని గ్రహించవలెను, ఏ పరిస్థిలోను అసంతృప్తిలో ప్రకటించిన అది మన శరీరమునే తిని వేయును, ఫలితము లేదని తెలిసిన ప్రయత్నాన్ని కాలానికి వదిలి వేయ వలెను కానీ అనుమానము పెట్టుకొని బాధ పెట్టుట ఎవరినీ బ్రతికించదు.


43 . అసంతృప్తిగా ఉన్నచో ఉన్నతాశయములే దరిచేరవు, ఆధ్యాత్మిక జీవిత్తమే గుర్తుకు రాదు, భయము ఆవహించి మనసుని వేదన గురి చేస్తుంది అది అవసరమా ?


44. విషాదము నుండి విచారము పుట్టును, విచారము నుండి వివేకమైన ఆలోచనలు వెంబడించును, వాటిని సద్విని యోగము చేసు కొనుటయే మానవుని లక్షణంగా భావించాలి


45 దు:ఖమువలన మానవునకు లోక పరిస్థితులు స్పష్టముగా భోదపడి వివేకము కలుగును.


46 .దు:ఖమువలన హృదయము మృధువై పరుల కష్టమునందు సానుభూతి, సహకారము అనే గుణము ఉద్భవించును


47. నరులకు తమ దు:ఖములే గురువులని తెలుసుకొని ప్రకృతి ననుసరించాలి.


48.  ధర్మసందేహములను తీర్చి ఆధ్యాత్మికోన్నతికి మారుటకు విషాదయోగమే మూలము.


49. ధర్మము అతి సూక్షమైన దనియు, అనంత మైనదనియు దాని ననుసరించు వ్యక్తులను బట్టియు, సమాజమును బట్టియు అది వివివిధ రీతులలో ఉండును.


50. వ్యక్తి పరముగ నియమము లకును, సమాజము యొక్క నియమము లకును వ్యత్యాసము ఉండును. వ్యత్యాసములను గమనించి నడుచుకోవటమే మానవుల లక్షణం అని తెలుసుకోవాలి.  
                       
51 కురుక్షేత్రం భారత దేశంలో ఉన్నది . ఆ ప్రాంత విశేషము కుడా తెలుసుకోవాలి ఎందుకనగా ఇక్కడ అగ్ని ఇంద్రుడు, బ్రహ్మ మొదలగు దేవతలు తపస్సు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అందువల్ల ధర్మ క్షేత్రం, పుణ్యక్షేత్రం కురుక్షేత్రం అని భగవానుడు తెలియ పరిచారు.


52 మనమున్న ప్రాంతము ఒక్క సారి పరిశీలించుకొని అడుగు పెట్టమని, మనచుట్టు ఉన్నవారిని గమనించి ప్రవర్తించమని, మనమున్న ప్రాంతము అందర్ని కలుపుకొని పుణ్యక్షేత్రముగా మార్చుకొనుటకు ప్రయత్నం చేయాలి.


53  మన చేతివేళ్ళు 5 వేరుగా ఉన్న వాటి ఉపయోగము సమానము అని గమనించాలి, అట్లాగే అన్నదమ్ములు గుణములు వేరైనా శుభ కార్యమునకు అశుభ కార్యమునకు తప్పక ఏకం అవ్వాలి అని గమనించలి.


54. అన్నాదమ్ములలో, అక్కా చెల్లళ్ళల్లో పెద్దవారి మాటలకు విలువ ఇచ్చి ప్రవర్తించాలి, వారు చెప్పే విషయాలలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి


55. ఏవిషయములో నైనా ఎత్తుకు పై ఎత్తు వేసి బ్రతుకును సార్ధకము చేసుకోవాలి,  ధర్మ భద్దముగా నడుచు కోవాలి.   


56. పెద్దవారు ఎవరైనా సరే తను అనుకరించే విధానాలు అందరిని సంప్రదించుకొని నడుస్తూ ఉంటే అందరికి మంచిది. మూర్ఖముగా ఒక్కరినే నమ్ముకొని ప్రవర్తించినా మంచిది కాదు అని గమనించాలి


57. అవసరమునకు సంఖ్యా బలము కన్నా, గుణబలం ఉన్న చోట తప్పక విజయము జరుగు నని గమనించాలి.


58 . అధికారంలో ఉన్న వాడు బలమైన అసమర్థుడుంటే వానికి ఎంతటిసమర్ధుడైన, గొప్పవారైనా తలవంచక తప్పదు, అది అధికారానికి గౌరవించక తప్పదు. 


59. ప్రాణానికి ప్రాణం దూరంగా ఉన్నా మనసు మాత్రం దగ్గరగా ఉంటుంది. భావాలన్నీ శుభ సూచకాలు అందిస్తాయి. అది  ఆధారపడి ఉంటుంది . 


60. అధి కారుని కొరకు,  ప్రాణాలనైనా ఆర్పించుటకు సిద్దీముగా  ఉంటారు కొందరు, అంతిమ శ్వాసవిడుచు వరకు విజయమునకై విరోచితముగా సమస్యను పరిష్కారిస్తారు మరికొందరు. ఏది ఏమైనా అది అధికారము ఉన్నంతవరకే.  

               
                  . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి