17, నవంబర్ 2016, గురువారం

ప్రాణ దాతలు (story)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 
సర్వేజనా సుఖినోభవంతు
ప్రాణ దాతలు 
 ఏమిటోయ్ పొద్దున్నే ఆకుకూర పట్టుకొచ్చావ్, అలా కూర్చొని వాగే బదులు కాస్త మీ భార్యకు సహకరిస్తే మీ సొమ్మేపోదు అన్న మాటలకు అంత రుసరుస పలుకులతో మాట్లాడుట మంచిది కాదే  అన్నాడు భర్త.

మాటలకేం చక్కగా మాట్లాడుతారు,  నా మాటలకు మాత్రం సమాధానము రాదు. ఏమిటే అట్లా మాట్లాడుతావు నీవు ఏదంటే అదే చేస్తున్నాగా, సరే మీరు ఇప్పుడు ఏమిచేయ వద్దులే అంతా  నేను చేసు కుంటాలే, అప్పుడే కోపం వచ్చిందా ఏమిటి, కోపం కాదండి మీచేత పనిచేయిన్చటం మంచిది కాదు కదండీ, అన్ని నీవే అంటావు అంతా మీ ఆడోళ్లకే చెందుతుంది.  ఏమాటైనా నవ్వుతూ ఆకుకూర తీసుకొని లోపలకు వెళ్ళింది.

అవునే మనపిల్లలు కనిపించుట లేదే, అయ్యే రామ మీకు చెప్పలేదా, స్కూలు పిల్లలతో చెన్నై టూర్ కు వెళ్లారు, ఎదో చేతి ఖర్చు కావాలంటే ఇచ్చాను.

అవునే రాత్రి  నిద్రలో పిల్లలొచ్చి అడిగారు నేను ఒప్పు కున్నాను కూడా.
ఈ వయసులో అంత  మతి మరు పేంటీ, ఏమోనే పిల్లలను స్కూల్లో దించే అలవాటుగా అడిగా అంతే.
మనం ఈ కార్తీకమాసంలో విజయవాడ వెళ్లి కృష్ణలో స్నాన మాచరించి, దుర్గమ్మను కొలిచి అక్కడే ఉన్న మాగురువు గారు శర్మ గారింటికి వెళ్లి వద్దామా, పిల్లలు ఎటుతిరిగి చెన్నై కి వెళ్లారుకదా అని అడిగాడు భర్త శంకరం భార్య పార్వతితో.
నీమాట ఎప్పుడు కాదన్నానండి అని నవ్వుతూ పలికింది. అవునే నామాట ఎప్పుడూ కాదనవు, సరేలే ఒక మూడు రోజులు సరిపడే బట్టలు సర్దు నేను బస్సు టిక్కెట్లు తెస్తాను, ఈ రోజు రాత్రికె వెల్దాము,
అట్లాగేనండి అన్నీ సర్దుతా
తెల్లవారుజామునే విజయవాడ లో ఉన్న శర్మగారి ఇంటికి చేరారు.
శర్మ గారి కుటుంబం సాదరంగా ఆహ్వానించింది, అయన భార్య సరస్వతి, పిల్లలు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు, చేతికి టవల్ అందించారు. అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని ఉభయ పక్షాల క్షేమ సమాచారాలు తెలుసు కున్నాక కృష్ణ స్నానం దైవదర్శనం అంటూ  మేము శర్మ గారి భార్య పిల్లలతో బయలు దేరాము.    

మేము ఘాట్ దగ్గర స్నానం చేసి పైకి వచ్చాము గుడికి పోదామని, అప్పుడే శర్మగారి పిల్లవాడు గబగబా నీటిలోకి దూకాడు నీటిలో కొట్టుకు పోతున్న పిల్లవాన్ని కాపాడాడు, నేలమీద పడు కోపెట్టి పొట్ట వత్తాడు, నోటి నుండి నీరు కారుతూ కదిలాడు, ఆపిల్లవాని తల్లి తండ్రులు ఆ ఆమ్మ వారు నీలో ప్రవేశించి కాపాడింది బాబు, ఈ బాబు వాని తల్లి తండ్రులు చాలా పుణ్యాత్ములు అంటూ దీవించి వెళ్లారు.
అప్పుడే ఒక్కసారి తనపిల్లలు చేసే పనులు  గుర్తు తెచ్చు కుంది పార్వతి. నా పుత్రుడు మోటార్ సైకిల్ తో  ముసలావిడకు  డాషిచ్చి,    అయ్యో పాపం అనక పోగా,  అడ్డు వచ్చిందని తిట్టి మరీవచ్చాడు,    పోలీసులకు డబ్బులిచ్చి కేసులేకుండా చేసాడు.    

నా పుత్రిక ఎమన్నా తక్కువ తిన్నదా ఇంటి ముందుకు బిచ్చగాలొస్తే వారిపై కుక్కను తరిమి సంబర పడేది.  పనివాళ్లను కూడా నీటికి వచ్చినట్లు తిట్టేది. 
మచ్చుకైనా గౌరవ భావము లేదు నా బిడ్డలకు. అనుకున్నది. 

అమ్మవారి దర్సనం చేసుకొని శర్మ గారి ఇంటికి చేరాము.
అప్పుడే శర్మ గారి తండ్రి గారికి సేవలు చేస్తున్నారు, ఆయన వయసు 70 దాకా ఉండవచ్చు, పిల్లలు తాతా బాగున్నావా పలకరింపులు ఆయన ఓపికతో కధలు చెపుతున్నాడు 

శరణ కోరినవారికి అనేక మార్గాలు చూపిస్తాడు ఆ పరమాత్ముడు, అన్నింటికీ మూలం బుద్ధి, ఇది సక్రమముగా నడుస్తున్నప్పుడు, మానవుని  ప్రతిభ, ప్రజ్ఞ, నలుదిశలా పరిమళిస్తుంది. రాగ ద్వేషా లు, మానవుని ప్రధమ శత్రువులు వాటిని మానవులు త్యజించాలి.  కానీ కొందరు ఎవరో ఒకరికి భయపడి బంధాలు తెంచుకుంటున్నారు, వయసు మీరిన తల్లి తండ్రులను దూరంగా ఉంచు తున్నారు. ఎందుకు అలా ప్రవర్తిస్తారో నాకు తెలియుట లేదు, వారు పెద్దవారు కారా వారి పిల్లలు వారిని అట్లా చూస్తారని అనుకోరు ఎందుకు , ఇది అంతా కలియుగ మహిమ అనుకుంటున్నాను అని భాదతో శర్మ గారి తండ్రి గారు భాదతో పలికారు.  అవును శంకరం గారు మీ నాన్నగారు బాగున్నారా, వారు నాకు ప్రాణ దాత ఎలాగంటే మీనాన్నగారు నేను ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్ళము, ఒకనాడు క్యామ్పుకు ఇద్దరం కలసి వెళ్ళాము, అక్కడ వాతావారణం నాకు పడ  లేదు, అంతా వర్క్ మీనాన్న చేసాడు అప్పుడే నాకు ఎదో పురుగు కుట్టింది,జ్వరం కూడా వచ్చింది వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు, నాకు సేవలు చేసాడు అటువంటి ప్రాణదాతకు నేను రుణపడి ఉన్నాను 
మీఇంటికి వచ్చి కలవాలని అనుకుంటున్నాను అన్నాడు.      
వింటుంటే పార్వతి మనసు కరిగి పోయింది. నేను ఉద్యో గం మానేసి మావ గారికి, అత్తయ్య గారికి సేవలు అందిస్తాను. 

అప్పుడే నెమ్మదిగా భర్త దగ్గరికి చేరి ఏమండి మీ తల్లితండ్రులను   వృద్ధాశ్రమం నుండి తీసుకొస్తే ఎంత బాగుంటుంది.

అవునే నేను చాలా తప్పు చేసాను,   ప్రాణ దాతలను నిర్లక్ష్యం చేసాను, అన్న  లు  వంత  పలికారని నేనుకూడా వెనకాడాను, వారికి సేవ చేయకుండా వృద్ధాశ్రమం లో ఉంచాను, నెలకు కొంత డబ్బు పంపుతున్నాను కానీ వారి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఇప్పుడు శర్మ గారి కుటుంబం చూసాకా నేను తల్లి తండ్రులకు  సేవ  చేద్దా మనిపిస్తున్నది.
అవునండి నాకు అదే అనిపిస్తున్నది        

వృద్దశ్రమంలోకి పార్వతీ శంకరులు పిల్లలతో లోపలకు ప్రవేశించారు. అక్కడ  ఉన్న తల్లి తండ్రుల పాదాలను కన్నీళ్లతో కడిగాడు, "సాగరంలో నీటి బుడగ మరల సాగరంలో కలసి పోవటమే మోక్షమని తెలుసుకున్నాము" తల్లి తండ్రులకు సేవచేయుటయే మానవజన్మ పరమార్ధమని తెలుసుకున్నాను. 
 మావయ్య గారు అత్తయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నాను రండి, మీకు సేవలు  చేయుటకు మేము సిద్ధముగా ఉన్నాము, రండి తాత గారు, అమ్మొమ్మగారు అని పిలుస్తూ పిల్లలు కన్నీళ్లతో అభిషేకించారు.     
        

      
  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి