28, ఫిబ్రవరి 2017, మంగళవారం


ప్రాంజలి ప్రభ - సుందరకాండ (1)
మూలం : వాల్మీకి రామాయణము: (రచన మల్లాప్రగడ రామకృష్ణ)
అథ: సుందరకాండ ప్రారంబ: - ప్రధమ: సర్గ:
210 సంస్కృత  శ్లోకాల ఆధారముగా తెలుగు- వచస్సు   
O -- O -- O

హనుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకుడు అతనిని గౌరవించుట, సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట, దక్షిణ తటముచేరి అచట లంక శోభను చూచుట.
O -- O -- O

హనుమంతుడు  - సముద్ర లంఘన - ప్రయత్నము

జాంబ వంతుడు, వానరులందరు, కలసెను, సీతాన్వేషినిమిత్తం దక్షిణదిక్కు అంతా చూసెను
వానరరాజు, ఇచ్చిన సమయంలో సీతకొరకు వెతికెను, కానరాక దిగులుతో అందరూ ప్రాణార్పణం చేయ తలంచెను, అందరితో అంగదుడు, జటాయువును తలస్తూ విలపించ సాగెను, కార్యార్దమై జటాయువు భాత్రు సంపాతి అంగదుని కలిసెను.

సంపాతి దక్షిణదిక్కున లంకలో సీత రావణుని బందీలొ ఉందని చెప్పెను, సంపాతికి సీత జాడ తెలుపగా రెక్కలు వచ్చి వెళ్ళేను,

అందరు కలసి, సముద్ర వడ్డుకు చేరి సముద్రాన్ని దాట తలచెను, వానరులు సముద్రాన్ని దాటగల శక్తి గూర్చి తెలుపెను, అంగదుడు, జాంబవంతుడు సంశయములో పడెను, జాంబవంతుడు హనుమతుని శక్తిని తెలిసినవాడు, హనుమంతుని సకి హనుమంతునకు తెలియదు, ఎవరైనా గుర్తు చేస్తే, అమోఘ బల సంపన్నుడు, కార్య దీక్ష పరుడు, మనమందరము      
హనుమంతుని శక్తి గుణ గణాలను పొగుడుదాము, సీతా అన్వేషణకు సహకరిద్దాం

సముద్రాన్ని దాటుటకు అందరు  హనుమంతుని ప్రేరేపించెను

రామనామ జపంతో, హనుమంతుడు మహేంద్రగిరిపై ఉండెను, జాంబ వంతా దులందరూ కలసి హనుమంతుని పొగడెను, తనశక్తి తనకే తెలియక ప్రొత్సాహముతో  శక్తిని పెంచుకోనెను. 

చారులు సంచరించే మార్గానా సముద్రంపై పోవుట నిశ్చయించెను, పచ్చిక బీల్లపై ఉన్న హనుమంతుడు ఆకు పచ్చని వర్ణముతోను, పచ్చిక బీల్లపై ఉన్న నీటి బిందువులు వైడూర్య మణులవలె మెరుపులతోను, దూరముగా ఉన్న  జలము పై సూర్య కిరణాల ప్రభావ వెలుగులతోను
ధీరుడైన హనుమంతుడు మహేంద్రగిరిపై సీఘ్రముగా సంచరించెను

మహేంద్రగిరిపై చిత్రవర్ణములుగల ధాతువుల తోను, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతా మూతృల తోను, స్వేచ్చ జీవులుగా సింహాలు, ఉత్తమ గజాల సంచారముల తోను
హనుమంతుడు మహ హృదములో ఐరావతం వలే ప్రకాశించెను

సకల విద్యలు నేర్పిన గురువు గారగు సూర్యనికి నమస్కరించెను, బాల్యంలో భాధపెట్టిన దేవతల రాజైన ఇంద్రునికి నమస్కరించెను, సకల సృష్టికర్త ఐన బ్రహ్మదేవునకు, సకల భూతములకు నమస్కరించెను.

మారుతి కడలిపై గగన సీమలొ ప్రయాణం చేయ తలంచెను

ప్రాంజలి ప్రభ - సుందరకాండ (2)సుందరకాండ ప్రధమ సర్గ - 2 వ భాగము

మారుతి తూర్పునకు తిరిగి తండ్రి ఐన వాయుదేవునకు నమస్కరించెను, దక్షణ దిక్కుకు తిరిగి వెళ్ళుటకు శిరస్సు పైకి ఎత్తి ఆబోతువలె ప్రకాశించెను, హనుమంతుడు పౌర్ణమినాడు సముద్రుడు పొంగినట్లుగా శరీరాన్ని పెంచెను, వానరులన్దరూ చూచుచుండగా రామకార్యము కొరకు ఆకాశమార్గమున ప్రయాణం చేసెను.

పాదాల కదలి కలకు చెట్లపై ఉన్న పక్షులు భయ పడెను, వక్షస్థల ఘాతముతో చెట్లు కూలి పోయెను. సింహం విజ్జ్రుమ్భించి నట్లు విజ్జ్రుమ్భించ గా మృగాలు మరణించెను, మద్యమ జ్వాలలతో కూడిన అగ్ని నుండి ధూమము బయలు దెరెను.

కొలుచుటకు శక్యము కానంత పెద్దదిగా శరీరమును పెంచెను, చేతులతోనూ, పాదములతోను, పర్వతమును గట్టిగా నొక్కెను, పర్వతము ఒక్కసారి ఊగగా చెట్లపైఉన్న పూవ్వులన్ని రాలెను, హనుమంతునిపై పుష్పాభిషేకమువల్ల పుష్పముల కొండవలె  ఉండేను.

పర్వతముపై మదించిన ఏనుగులు మదోదకమును కార్చు చుండెను, పర్వతముపై ఉన్న ప్రాణులన్నీ వికృతమైన స్వరముతో అరచు చుండెను, సమస్త వర్ణ శిలలమద్య అగ్ని పుట్టివర్ణ దూమములు వచ్చు చుండెను,
భూ ప్రకమ్పనల మద్య హనుమంతుడు బయలు దేరుటకు నిశ్చయించెను

తొకలపై స్వస్తిక్ చిహ్నములుగల సర్పములు నిలిచెను, విషము క్రక్కుచు దంతములతో శిలలను కరచెను
శిలలు అగ్నిజ్వాలకు దగ్ధమై వేయి ముక్కలై ఎగెరెను, గిరిపై ఓషధ చెట్లు ఉన్న, శాంతింప చేయలేక పోయెను
                                                                                 
                                                                                       ఇంకా ఉన్నది -3

ప్రాంజలి ప్రభ - సుందరకాండ ప్రధమ సర్గ - 3 వ భాగము

భూతాలు పర్వతమును బద్దలు చేయు చున్నాయని తలచెను, తినుచున్న లేహ్యములు, భక్ష్యములు, మాంసములు విడిచెను,  
 మునులు, యక్షులు,  విద్యాధరులు వారి స్త్రీలతో పైకే ఎగిరెను,
అణిమా సిద్దులుగల విద్యాధరులు హనుమంతునిచూసి ఆరాదించెను. 

మెడలో హారములతోను ,  పాదములకు అందెలతోను, భుజములకు దండ కడియములతో,చేతులకు కంకణములతోను, విద్యాదరస్త్రీలు ఆశ్చర్యపడుచు, భయముతో తమ ప్రియులతోను, విద్యాధరులు పర్వతముపై నిలిచి హనుమంతుని గూర్చి సంభాషించెను. 



శోభగల హనుమంతుడు భుజమును,  కంఠంను వంచెను,
తేజస్సును,వీర్యమును,బలమును, పెంచి ఊపిరి బిగపట్టెను,  
నేత్రములు పెకిఎత్తి, పాదములతో గిరిని అదిమి  పై ఎగెరెను,  
మహాబలశాలీ, వానర శ్రేష్టుడు చేతులను చేర్చి సముద్రముపై చేరెను.     

  మకరములకు నివాసమైన సముద్రమును దాట దలచెను,
పర్వతమువంటి శరీరముగల హనుమంతుడు ఒక్కసారి కదలెను,
రోమములు దులుపుకొని, మహా మేఘము వలె ఘర్జించెను,
రామునికోరకు, వానరులకోరకు సముద్రముపై లంఘించెను. 
 ఇంకా ఉన్నది ---4
ప్రాంజలి ప్రభ - సుందరకాండ ప్రధమ సర్గ - 4 వ భాగము
హనుమంతుని సముద్రలంఘనము
గగనమునుండి   దేవలోకమునకుపోయిఅక్కడ సీతనువెదికెదను 
కాన raa నిచో లంకకు పోయి రావణుని నగరముతోసహా తే గలగు తాను  
ఆకాశము నుండి వానర వీరులందరికి మారుతి అమృత మాటలు పల్కెను 
గమ్భీరముగా జెప్పుచూ నొక్క యూపు lo లొ సముద్రముపై కెగసెను  

 
అతని తొడల వేగమునుండి వచ్చిన గాలికి చెట్లువ్రేళ్ళతో సహా పైకి ఎగేరెను
దూరమునకు పోవు భందువులను పంపినట్లుగా కొంతదూరము పోయెను 
మరలి చెట్లు అన్ని సముద్రములో రెక్కలు తెగిన పర్వతముల వలే పడెను
మహ సముద్ర మంతా పగటి పూట నక్షత్రాలతో నిండిన ఆకాశంవలె ప్రకాశించెను

హనుమంతుని రెండు బాహువులు పాము పడగలువలే కనిపించెను 
అతని రెండు నేత్రములు పర్వతముపై రెండు అగ్నిజ్వాల లవలే  ప్రకాశించెను 
   అతని వాలము ఇంద్ర ద్వజము వలే ధగ ధగ మెరుయు చుండెను
అతని ముఖము సంద్యారాగముతో కూడిన సూర్యబింబమువలె నుండెను

హనుమంతుని  ఎఱ్ఱనైన పిరుదులు బ్రద్దలైన ధాతుశిలలవలె నుండెను
అతని జంకల నుండి వచ్చేవాయువు మేఘము యురుము వలె నుండెను 
ఉత్తరము నుండి దక్షణ దిక్కు వైపు పోవు ఉల్క వలే ప్రయాణించు చుండెను   
 రామభాణము ఎంత వేగముగా పోవునో అంతే వేగముగా పోచుండెను
---5

ప్రాంజలి ప్రభ - సుందరకాండ ప్రధమ సర్గ - 5 వ భాగము

 
హనుమంతుడు  త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఎనుగువలె నుండెను,
అతని ముఖము చుట్టు తోక ఉండగా సూర్యునివలె ప్రకాశించు చుండెను,
 అతని నీడ సముద్రము పై పడి ఒక పెద్ద నౌక వలె కనబడు చుండెను,
వక్షస్తలమునుండి వెడలిన గాలిచే కెరటములు రెండంతలు ఎగసి పడు చుండెను. 

 ఉత్తరమునుండే వచ్చే వాయువు హనుమంతునికి ఎగురుటకు  తోడ్పడెను, 

 తాకాలని కేరటములు పైకి ఎగిరి పెద్ద గుంటగా ఏర్పడి పైకి ఎగురు చుండెను,
భూమి యందు ఉన్నసముద్రమును మారుతి త్రాగుచున్నట్లుగా కన బడెను,
హనుమంతుడు ఆకాశమున తలపైకి ఎత్తిన ఆకాశాన్ని  మ్రింగి నట్లుండెను. 

 ఆధారము లేకుండ  రెక్కల పర్వతమువలె హనుమంతుడు ప్రకాశించు చుండెను,
మేఘ పంక్తులలోకి పోవుచూ బయటకు వచ్చుచూ గరుత్మంతుడివలె ఉండెను,
ఎరుపు,నలుపు,తెలుపు,పచ్చ, మేఘాలల్లో హనుమంతుడు ముచ్చటగా నుండెను,
హనుమంతున్ని చూసిన ఋషీశ్వరులు, దేవతలు, గంధర్వులు పరాక్రమమును  ప్రశంసించెను. 

కొండంత ఎత్తుగా లేచుచున్న సముద్ర తరంగములను వక్షస్థలముతో 'డి' కొని ఎగేరెను,  
 హనుమంతుని తో వచ్చే గాలి, మేఘముల గాలి, సముద్రపు గాలి కలసి భీకరశబ్దముగా వినబడెను,
సముద్రములో ఉన్న తరంగాలన్ని భూమి ఆకాశాన్ని తాకు చున్నట్లుగా ఉండెను,
ఎగసిపడుతున్న సముద్ర తరంగాలను లెక్క పెట్టు చున్నాడా అన్నట్లు దాటు చుండెను. 
----6
మింగళములు, మొసళ్ళు, వస్త్ర విహీనులయన మనుష్యుల్లా  ఉండెను సర్పములు హనుమంతుని చూసి గరుత్మంతుడని భావించి భయ పడెను 
హనుమంతుడు ఆకాశములో మేఘముల కన్న ముందుకు పోవు చుండెను
మేఘాలచే కప్పబడుచు బయాకువచ్చు చూ ఉండే చంద్రుడిలా ప్రకాశించు  చుండెను


 అతని నీడ సముద్రము మీద పది యోజనాలతో విస్తీర్ణముగను 
ముప్పది యోజనాల పొడవుతో ఉండెను
 దేవా దాన గంద్రర్వులు పుష్ప వృష్టిని కురిపించెను 
హనుమంతుని చూసి దేవగణాలన్ని పరమా నందమును పొందెను   




రామకార్యార్ధమై  వేడలుచున్న హనుమంతునకు సూర్యుడు తపించ కుండెను  
తండ్రియగు వాయుదేవుడు సువాసన కలిగిన  చల్లని గాలిని  వీచు చుండెను
సముద్రుడు హనుమంతునకు సహాయ పడనిచో అందరు నన్ను నిందించెదరని తలపోసేను
హనుమంతునకు సముద్రుడు శక్తి కొలది సాయపడి కృతజ్ఞతను తెలపా లనుకొనెను
.......7
ప్రాంజలి ప్రభ - సుందరకాండ ప్రధమ సర్గ - 7 వ భాగmu
హనుమంతుడు కొంత సమయం అలసట తీర్చుకొనుటకును 
రామకార్య కోసం పోతున్న హనుమంతునకు అల్పాహారం ఇచ్చుటకును 
సముద్రుడు  కర్తవ్యంగా భావించి సహాయము చేయుటకును 
 మైనాకున్ని మారుతికి సహాయం చేయమని సముద్రుడు కోరెను 

 
మైనాకా హనుమంతుడు సీతాన్వేషణ కొరకు  సముద్రముపై పోవు చుండెను 
 ఇక్ష్వాకు వంశీయులన్న  అందులో రాముడు నాకు పూజ్యులును 
పాతాలద్వారమువద్ద ఉన్న నీవు పైకి లేచి హనుమంతునకు సహాయ పడుమనెను 
త్రిలోక పూజ్జ్యుడైన హనుమంతునికి ఆతిధ్యం ఇవ్వటం మనిద్దరి కర్తవ్యం అనిపల్కెను 
 
  మైనాకా  పూర్తిగా అన్ని దిక్కులు ఎగరగల సామర్ద్యం ఉన్నావును 
వానర శ్రేష్టుడైన హనుమంతునికి సహాయము చేయమనికోరెను 
శ్రీరాముని ధార్మికత్వమును, స్తీతాదేవి  యోక్క పాతివ్రత్యమును 
పవన పుత్రుని యోక్క కార్య దక్షతను తలచుకొని పైకి లెమ్మనెను 
-----8

ప్రాంజలి ప్రభ - సుందరకాండ ప్రధమ సర్గ - 8 వ భాగmu సూర్యుడు  మేఘములను చీల్చుకొని వెలుగును యిచ్చినట్లును 
సముద్రము చీల్చుకొని బంగారు మైనాక శిఖరము పైకి వచ్చెను 
వృక్ష లతా గుల్మములతో నిండిన మధురఫలాలున్న శిఖరమయ్యేను 
నల్లనైన ఆకాశము మైనాక పర్వతము వల్ల ఎర్రగా మారిపోయేను 

హనుమంతుడు పర్వతము అడ్డురావడం విఘ్నమని భావించెను 
వేగమును రెట్టిమ్పుచేసి హృదయముతో పర్వతమును గట్టిగా కొట్టెను 
పర్వతము ప్రక్కకువరగగా  మైనాకుడు హనుమంతుని శక్తిని పొగడెను
వానరొత్తమా పర్వతముపై విశ్రాంతి తీసుకొని ఫలాలు భుజించి వెల్ల మని కోరెను 

 మైనాకుడు హనుమంతునితో వినమ్రతతో విన్నవించు చు న్నాను 
నీకు ఆతిద్య మివ్వాలని తలంచి నేను, సముద్రుడు కలసి ప్రార్దిమ్చుతున్నాను 
నేను నీకు పినతండ్రిని కృత యుగంలో జరిగిన సంఘటనను తెలిపెదను  

పూర్వము పర్వతములకు రెక్కలు ఉండేవి, మీదపడతాయని ఋషులు భయపడెను
దేవతలరాజగు ఇంద్రుడిని ఋషులు,  పర్వతముల నుండి రక్షించ 
మనెను
ఇంద్రుడు వజ్రాయుధముతొ పర్వతముల రెక్కలను నరుకు చుండెను 
అప్పుడే నీ తండ్రి వజ్రాయుదానికి గురికాకుండా సముద్రములోనన్ను   పడ వేసెను
...9
ఆ విశ్వాసమును పురస్కరించుకొని నేను నీకు ఆతిద్యమిస్తున్నాను
నీ తండ్రి ఋణము, సముద్రుని కోరిక నీ మూలముగా తీర్చగలుగు తున్నాను 
కావున కొంత తడువు నాపై విశ్రాంతి తీసుకొని వేల్లగలవని కోరు చున్నాను
నా యందలి కంద మూల ఫలాదులు నారగించి కార్యమును సాధించ మనెను 

దేవతలలో ప్రధానుడైన వాయుదేవుని కుమారుడవును 
వేగము, బలము, బుద్ధి మొదలగు గుణములున్న వాడవును 
  నీవు ధర్మమను కాపాడుటకు నిగ్రహ సమర్దుడవును 
నమ్మినవారికి మన:శాంతిని కల్పించిన మహాను భావుడవును

నీ తండ్రి నాకు చేసిన మహోపకారానికి బ్రత్యుపకారముగాను 
  ఈ నారేక్కలును నీతండ్రి కాపాడినాడు, నీతండ్రిఅంతవాడవును 
కావున మహాత్మా సముద్రునకు, నాకు సంతోషము కల్గించమనెను  
మారుతి మైనాకునితో మిత్రమా నీ మధుర వినయ భాషలకు సంతోష పడితిననెను     

    నీ యాదరాభిమానము పొందలేదని చింతవలదనెను 
ప్రత్యేకముగా ఇంకావేరుగా నాకాతిద్యముతో పనిలేదనెను
 ఆతిద్యమిచ్చినట్లుగా భావిస్తున్నాను, నేను లంకకు పోవలెను 
నేను ప్రతిజ్ఞ చెసి ఉన్నాను కావున నేమాత్రమును నేనాగ రాదనెను 


పర్వతమును తాకి హనుమంతుడు వేగముగా పైకి ఎగిరెను 
హనుమంతుని చూసి సముద్రుడు మైనాకుడు శుభాశీర్వాదములు నొసగెను
దుష్కరమైన యా పనిని జూచి సర్వ దేవతా గణములు సంతోషించెను
దేవేంద్రుడు గొప్ప ఆనందముతో మైనాకుని జూచి మెచ్చుకొనెను

దేవేంద్రుడు పలికే
హిరణ్యనాభ నీవు చేసిన పనికి చాలాసంతోషించితిని  నేను
నావలన నీకపకీర్తి జరుగదు, నీవు స్వేచ్చగా తిరగ వచ్చును 
హనుమంతునకు సహాయ పడిన వాడవై నా భయమును తీర్చినవాడవును 
రామ కార్యార్ది యైన వానర సహాయమునకు నే నభయ మిచ్చు చున్నాను 

   
 సురస  హనుమంతుని బరీక్షించ బొవుట  

నాగమాత అను సురసను  దేవతలు కలసి మాట్లాడెను 
నీవు ఒక్క క్షణకాలం హనుమంతుని విఘ్నం కలిగించమనెను 
నిన్ను జయించి ప్రయాణముసాగించునో, భయముతో వేనుతిరుగునో చూడాలనుకున్నామనెను 
 ఆమాటలకు సురస నేను క్షణకాలం ఆపుతానని దేవతలకు మాట ఇచ్చెను 

సురస రాక్షస రూపం ధరించి పెద్ద నోరు తెరిచి హనుమంతునకు అడ్డముగాను 
నిల్చొని ఓ వానరా నీవు నాకు  ఆహారముగా దేవతలు నాకు అవకాసం ఇచ్చెను 
నీవు నా నోటిలో ప్రవేశించి నా ఆకలి తీర్చి, దేవతలకోర్కను తీర్చమనెను 
ఆంజనేయుడు సురస మాటలకు యుత్చాహముగా చెప్పే ఈ విధముగా
అనెను 
 అమ్మా " ఒట్టు పెట్టుకొని చెపుతున్నాను "  నేను రామ కార్యార్ధమై  లంకకు పోవుచున్నాను, 
మాతా అయోధ్యాధిపతి యైన ధశరధ మహారాజు కుమారుడు శ్రీరాముడు  ప్రతిజ్ఞాపరిపాలకుడై  లక్ష్మణుని తోడను,
 భార్య యైన  సీతాదేవి తోడను దండ కారణ్యములలొ బ్రవేసించెను,
  ఆ శ్రీరాముడు ధర్మభద్దుడై రాక్షసులతో భద్ధ వైరము గల వాడగుటచే  రావణుడు రామలక్షణులు లేని సమయమున సీతను నపహరించెను . 

నేను రామాజ్ఞచే సీతాన్వేషణ తత్పరుడు నై లంకకు బోవుచున్నాను, సీతాదేవి యొక్క క్షేమవార్తను దెలిసి కొని రామునకు జెప్పి మరలవచ్చి నీ నోటిలొ బ్రవేసించెదును. 
దయతో నన్నిప్పటికి  విడువుము.నమస్కరిస్తూ చెపుతున్నాను, అనివేడు కొనగా ఆ మాటలు విని యా సురస యిట్లు అనెను .

ఆమాటలకు ఓయీ హనుమంతా నా కడ్డమైన వానిని తినమని బ్రహ్మవరము దానిని నేనతిక్రమించలేను, 
నీకు శక్తి యున్నచో నానోటిలో ప్రవేశించి పొమ్మనెను 
ఒ సురసా నేను పట్టేంత నోరు తెరువుము, శరీరమును పదియోజనాలు పెంచెను 
   సురసకన్న హనుమంతుడు పెరగగా నూరుయొజనాల  వరకు  పెంచేవిధముగా హనుమంతుడు శ్రీరమును పెంచెను 
క్షణంలో అంగుళ రూపంగా మారి సురస నోటిలో దూకి అంతే  వేగముగా బయటకు వచ్చెను. 

హనుమంతుడు సురస నోటిలోనుంచి రాహుముఖము నుండి చెంద్రుడు వచ్చినట్లు వచ్చెను 
సురస నిజరూపముతొ నాయనా, నీవు సుఖముగా వెళ్లి శుభముగా రమ్ము, నీకు కార్య సిద్దగును 
లంకాసౌధముచూసి, నాశనముచేసి, సీతా దేవిని శ్రీరామునితొ గలిపి సిద్ధుడవగు మనెను
హనుమంతుడు సర్వ భూతములు బ్రశంసింపగా గగనంలో వేగముగా పోవు చుండెను  




హనుమంతుడు - సింహికను జంపుట
ఆకాశమునందు పక్షులు, కైశికాచార్యులు,హంసలు సంచరించు చుండెను 
సింహములుమీద, పెద్దపులులుమీద, ఐరావతములు మీద దేవతామూర్తులు సంచరించుచుడెను    
సర్పములు లాగా అనేక విమానాలు మహావేగాముతో ప్రక్కన సంచరించు చుండెను 
ఆకాశములో అగ్ని గోళాలు డీ కొన్న శబ్ధాల్లో  హనుమంతుడు పయనించెను 

 దేవతలకోరకు హవిస్సులను మోసుకొని పోవుచున్న అగ్ని కనబడు చుండెను
గ్రహములు, అశ్విన్వాది నక్షత్రములు, సూర్యుడు, తారాగణములు ప్రకాశించు చుండెను
మహర్షిగానములతోను, గంధర్వులతోను, నాగులతోను, యక్షులతోను నిండి ఉండెను 
హనుమంతుడు ఆకాశములో సంచరిస్తున్నప్పుడు ఆకాశము చాందినీ గుడ్డవలె నుండెను

ఆకాశమర్గములొ పోవుచున్న హనుమంతుడిని సింహిక చూసెను 
చాలాకాలము తర్వాత మంచి భోజనము దొరికిందని ఆనందించెను 
సింహిక అనే రాక్షసి ఆలోచించి హనుమంతుని నీడను ఆకర్షించెను
హనుమంతుని వేగము ఎదురుగాలికి ఓడ ఆగినట్లు తగ్గి పోయెను

హనుమంతుడు తలవంచి క్రిందకు చూడగా సముద్రముపై పెద్ద జంతువును చూసెను
నీడను చూచి ఆకర్షించే జంతువు సుగ్రీవుడు  చెప్పిన సింహిక ఇదే ననుకొనెను
సింహికను చూసి హనుమంతుడు తన శరీరమును వర్షాకాలమునందు మేఘము వలె పెంచెను
సింహిక కుడా శరీరమును పెంచి  పెద్దగా పెద్దగా గర్జించి హనుమంతుని వైపు పరుగెత్తెను



హనుమంతుడు  సింహిక యొక్క శరీరములొ ఉన్న మర్మస్తానములను చూసెను 
వజ్రమువంటి దేహముగల హనుమంతుడు శరీరము చిన్నది చేసి అమె నోటిలోకి దూకెను 
పౌర్ణమియందు రాహువుచే మ్రింగ బడుచున్న చంద్రుడు వలే ఉండెను
హనుమంతుడు ఆమె ముఖములో పడగా సిద్ధిలు, చారుణులు  భయపడెను

హనుమంతుడు వాడి ఐన  గోళ్ళతో మర్మస్తానములను చీల్చివెసెను 
తక్షణమే మనోవేగాములో సమాణవేగాముతో ఆకాశం పై కి ఎగిరెను 
సిద్ధులు పల్కెను హనుమంతుడు ఉపాయముగా ధైర్యముగా సింహికను చంపెను
సిద్ధులు, గంధర్వులు నీకిష్టమైనా పనిని మంగళ ప్రదం అగుగాక  అని దీవించెను

"ఓ వానరోత్తమ నీకు ఉన్నట్లు ఎవనికి  ' ధైర్యము, సూక్ష్మద్రుష్టి, బుద్ధి, నేర్పు అను నాలుగు లక్షణాలు ఎవరకి ఉండునో వారు ఎ కార్యము చేయ వలసి వచ్చిన వైఫల్యము ' మనస్సు ప్రశాంతముగా ఉంటుందని సిద్ధులు, గంధర్వులు పలికెను

హనుమంతుడు ఆవలి ఒడ్డు  సమీపించి అక్కడ ఉన్న వృక్ష పంక్తిని చూసెను
వృక్షములతో ఉన్న ద్వీపమును, పర్వతప్రాంతము నందలి వనములు చూచెను 
సముద్రమును, తీరము నందలి జల ప్రాయ  ప్రదేశములను, నదులను చూసెను 
మేఘమువలె ఉన్నతనశరీరమును చూసి అందరు కుతూహల పడుదురని అనుకొనెను

పూర్వము త్రివిక్రముడే వామనుడుగామారి బలిచక్రవర్తిని అనగత్రొక్కెను
నేను నా రూపమును ఉపసంహరించుకొని సహజ రూపను మారెదను
 యజ్ఞానమువల్ల కలిగిన మోహము వీడి జ్ఞాని వలే ప్రవర్తిమ్చవలెను 
హనుమంతుడు అక్కడ నుండి త్రికూట పర్వతముపై ఉన్న లంకా పురమును జూచెను  

సర్వవస్తు సంమృద్దముగా, విచిత్రమైన రంగులు కలిగి ఉండెను 
మొగలి డొంకలు, విరిగిచేట్లు కలిగి, ఎత్తైన కొబ్బరి చేట్లుకలిగి 
ఉండెను
 ధగ ధగ మెరుస్తూ ఆకాశమును తాకుతున్న భవనాలు కలిగి
ఉండెను
ఉన్న లంకాపురమును లంబ పర్వతముపై నుంచి చూసెను 

హనుమంతుడు పెద్ద పెద్ద తరంగముల పంక్తులతో నిండినదియును 
దానవులకు, పన్నాగులకు నివాసమైనది యును, చుట్టూ సముద్రము, రక్షణ కవచముగా ఉన్నదియును,అగు లంకాపట్టనము హనుమంతునకు అమరావతి నగరమా అనిపించెను




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి