3, నవంబర్ 2014, సోమవారం

188. Divotional Story 91 - Siva panchakshara namaskaara malastrotram


ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (9) (date 01-03-2016 to 07-03-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................




ప్రేమ ముచ్చట్లు ఎన్నో? మరెన్నో ? అయిన అందులో కొన్ని నా భావకవితల రూపంలో ఇందు పొందుపరుస్తున్నాను
మీ అభిప్రాయాలే  నాకు కొండంత బలం చేకూరుస్తాయి,      
 
 పెళ్లి కుదిరింది, పెళ్లి కూతురి మనసు  ఊహల పందిరిలో అలల దొంతరలో, కలలో వచ్చిన కోరకలతో, కను మూసిన, తెరిచినా ఏదో తెలియని తమకమును ఆవహించి ఏదో పొందాలి, మరేదో పొందాలి, ఆ అనుభూతి మరువలేనిది, ఎవ్వరికి చెప్పలేనిది అదే ఏమిటో అర్ధం కావటం లేదు, అప్పటికే మదిలో మెదిలిన  అక్షరూపములో వ్రాయటం మొదలపెట్టిది, ప్రేమ అనుటకు అక్షరాలు  రెండే వర్ణనలు అనంతము అందులో నాకుతోచినవి ఇందు పొందు పరుస్తున్నాను
 
నా  గుండె భారంగా మారి వేగం పెంచుకుంటూ
ఇంకా వేగంగా ప్రయాణిస్తు దడపెంచేస్తుంది
ఈ గుండె భాద తగ్గేదెప్పుడు, తెలిక పడేదెప్పుడు
దానికి తోడూ మేఘాలు రాపిడి పెరుగుతున్నదిప్పుడు
రాపిడికి మెరుపు పుట్టి, నేనున్నానని
ఘర్జనల వేగం పెంచెసింది ఇప్పుడు          
మేఘం నుండి చినుకు చినుకు రాలుతున్నప్పుడు
తెలియని కన్నీళ్ళు ఆనంద భాస్పాలుగా మారాయప్పుడు
 --((*))--

చేతి వెళ్ళు కదిలించటం మొదలు పెట్టింది కలికి 
కలవరం పెరిగి, తనువు తపనలు పెరిగి, కలకలం పెరిగే  
అప్పుడు కవితా హృదయమై,  రసతరంగమై, రసమాదుర్యమై
రసరమ్యమై, కాకి కోకిలకు సామ్యం కుదర్చగా, అధరం
మధురం  అంటూ చీకు చింత లేదంటూ తన్మయత్వంతో
మునిగి రసహృదయలు రసాస్వాదము పొందే   
 
--((*))--

మనసు  మనసులో లేదు మనుషుల  అంతరాలు, ప్రేమ ముచ్చట్లు 
కమ్ముకున్న వసంతాలు, వద్దన్నా వెంబడించే పేదల ముచ్చట్లు
అదృశ్యంగా హృదయంలో కాముకుడు చేరి  చేసే ముచ్చట్లు 
 హద్దులు దాటకుండా పొందికగా పొందే  నవరసాల ముచ్చట్లు 
ఊహల వలయంలో చిక్కి మధురం ఏదో గరళం ఏదో తెలుసుకో అన్నట్లు
అనమానం వీడి ఆనంద పారవశ్యంలో తేలేవి ప్రేమ ముచ్చట్లు ,   
దేశాల కతీతంగా, భాషల కతీతంగా, తనువుల తపనలే ముచ్చట్లు  
--((*))--
 

ప్రేమకు చిక్కినవారు నిజాలను గ్రహించలేరు 
తాడును చూసి పాము అనుకొని కెవ్వు మంటారు
పిల్లి నీడను చూసి పులిగా బ్రమించి వణికిపోతారు
ప్రేమ అనే బ్రాంతి లో చిక్కి నిజం తెలుసుకోలేక భయపడతారు
నీడలు మారినట్లు ప్రేమలు  తారుమారవుతాయని గమనించ లేరు
మంచివారి ప్రేమ మద్యాన్నపు నీడలా మొదట కరుచుగా ఉన్న
క్రమంగా  సుధీర్ఘమ్గా మారుతుందని ఓ సుభాషితం లో తెలియపరిచారు
కష్టం సుఖం లో ఉన్న తేడా ప్రేమలో ఉన్నప్పుడు తెలుసుకోలేరు 
సంకుచిత భావం లేకుండా ప్రేమను పండించుకోవాలని తపన పడతారు 
నిర్భయంగా ఉండి  ప్రేమ జారిపోకుండా, పట్టు వీడకుండా
 తనవంతు ప్రేమను అందిస్తూ ఓర్పుతో ఉండటమే ప్రేమ అంటారు
--((*))--

దేహంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రేమ బ్రతుకు తుంది
సంకుచిత మనస్కులను ప్రేమ మారుస్తుంది 
ప్రేమ ఉన్న వారిలో ఎటువంటి స్పర్ధలు రావాట మనేది
ఉండదు, ప్రేమ శత సంవస్చరములు బ్రతికిస్తుంది 
 
ఎన్నో సానుకూల రసాయనాలు ఉత్పత్తికి కారణం , 
మనిషిని వివేక వంతుడుగా మార్చుటకు మూల కారణం 
వయసులో ఉన్న స్త్రీ - పురుషులలో పెరిగిన  ప్రేమ కామ్య గుణం
ఏక సహచర్యం, ధర్మ భందం,విశ్వసనీయత వంటి పరిణామం 

ప్రేమతత్వం ప్రబలుతుంటేనే ఏర్పడును బలమైన సమాజం 
సవ్య మైన పంధాలో సాగే జీవితమే దేశానికి శ్రేయస్కరం 
ప్రేమ అనుభూతి మాత్రం స్మ్రుతి పదంలో అల్పం 
దాని ప్రభావం ప్రజలపై పనిచేస్తూ ఉంటుంది అనల్పం
--((*))--

యవ్వనం వచ్చిందని హృదయానికి తెలిసింది
పువ్వులా వికసించి ఆకర్షించాలని ఉన్నది
మదిలో తెలియని ఆశలు రేకెత్తించటం జరిగింది
కోటి వీణలు మ్రోగినట్లు హృదయ శబ్దం పెరిగింది
  
కన్నుల్లో తొలి పలకరింపు నీవైతే
పెదవుల్లో చిరునగవు నీకోసమైతే
బుగ్గల్లో తొలిసిగ్గు మెగ్గలేస్తే
వయ్యారి అడుగులు తబడటం జరిగే

సింగారి మోము సిగ్గుపడింది
బంగారి మెనూ పులకరించింది
జలతారు వెన్నెలై అగుపించింది
కన్నులసైగతో తెలుసు కోవాలంది

--((*))--

తలపే వలపై రుచి చూడాలనిపిపించే 
పలుకే పరువమై పలుగా పలకరించే
మాలిన్యాలను మట్టు పెట్టాలని పించే
నీ తోడును కోరడమే జయం తలపించే

నిరాశల నిషా ఒదిలి, ఆవేశం ఆవరించే 
నీ సౌరును తాకడం వల్లా వెలుగు పెంచే
దిగులు లేదిప్పుడు కొత్త రూపు అంకురించే
వగపులు నుసిగారాలాయి నీ వలపునుంచే
--((*))--


పదహారు కళలకు ప్రాణమా - ఓ అరవింద రూపమా
అందాల సువర్ణ కమలమా - అరవిరిసిన నయణమా
ఊసు లాడు కుందామా - విచ్చిన పెదాల మకరందమా
మనసు తలపులు తీయుమా - తట్టి లేపుతాను సుమా

పదహరు ప్రాయాల జాణవా - శృంగార కల బిందువా
కన్నుల్లో వెన్నెల కురిపించావా  - వెన్నెల్లో దీపాలు వెలిగించావా
ముగ్ధ మోహనంగా ప్రకాశించావా - కనువిందు చేయవా
నీ ఒడుపును చూపించవా - లోకాన్ని ఎలుటకు సహకరించావా
--((*))--

భావానికి దివ్య వెలుగు - నా కవితకు మనసు కలుగు
ధ్వని మంచు కరుగు - కమ్మని గేయానికి వేదన తొలుగు
అక్షర రూపమే ముసుగు - భందానికి హృదయం నలుగు
ప్రణయాస్వాదము జరుగు- ప్రాణానికి  ప్రాణం మెరుగు 
--((*))--

చిలిపి కల చిలక
వలపు వల మొలక
వరదలా పొంగే తునక
సమీరం లా తిరిగే గిలక 

కొమ్మ చాటు కన్నెమల్లి
పువ్వులా విరిసింది వల్లి
అది గంధాల కొండ లిల్లి
గుండె గూటిలో ఉండే పల్లి 
 

కన్నె తనం ఎదుగుతున్న మొక్క
పకృతిలో మెక్క ఎదిగినట్లు కన్నెలో
ముఖవర్చస్సు కొంత మెరుగు
వెన్నెల తరుము చీకటిని
 
కన్నె యదపొంగులు చూపు
కెరటాలు ఎగిరిపడటం సహజం
వయసులొఉన్న కన్నెపిల్ల
ఎగెరెగిరి పడటం కుడా సహజం
 
మేఘాల రాపిడికి శబ్దం సహజం
వయసులో కోరికలు రావటం నిజం
రబ్బరుబంతి క్రిదపడిన పైకేగురుతుంది
యవ్వనవనితను చిన్న మాటన్న
చేష్టలు కోపంతో ఉండుట జరుగుతుంది
 
యదలోని అలజడులు రేకెత్తిన
కన్నె నడక గుట్టుగా ఉంటుంది
కన్నె పిల్ల కలలు కనడం సహజం
కలలు రుజువుకు ప్రేమలో పడటం
హృదయరాగా లాపన వినేవాడికోసం
ఉండి ప్రతిఫలం పొందటమే ప్రయోజనం 
--((*))--
వయసు తెలుపుతుంది వాన
గొడుగున్న తడుపుతుంది లోన
జోరుగాలికి ఎగురుతుంది పైపైన
ఉరుములు మెరుపులు ఉండిన
మనసు తడబడు చుండిన
చెలి తనువు తడవకుండిన
వానలోజాన తనం చూపకుండిన  
వయసు జోరు మారకుండునా   
  
ఎయ్ నీ సొగసు నన్ను లాగుతున్నది
నీవు బహుగడసరి వాణి వనితెలిసింది
మన యిద్దరి మద్య ఏదో రాజీ ఉన్నది
మొండి గా ఉన్న నిన్ను మర వద్దంది   

తెలివి నీలో కను మరుగౌ తున్నది
సొగసు ముసుగు కమ్ముకుంటున్నది
లజ్జ ఉన్నా వ్యక్తం చేయ లేకున్నది
ఐన చెలి  నా మనసు వెంటాడుతున్నది 
--((*))--  
   
 

కాదులే అదినీకు  కాదులే
అది నిజములే అదినిజములే

ఒక మాటా ఒక బాటా చెల్లు బాటు కాదులే
నీ మాట, నీ బాటా నాదని నిజములే 
కాలంతో నడవకున్న సర్దు బాటు కాదులే
కాలంతో ఎదు రీదలేము,  అది నిజములే

ఎంత సేపు దాగి వుండు, మబ్బు చాటు సూరీడు
అలక పాన్పుఎక్కినవాడు, దిగాడు నిజములే
తప్పు చేసి ఒప్పకున్న, దిద్దు బాటు కాదులే
తప్పు ఒప్పు గా, ఒప్పు తప్పుగా, ఉండుట నిజములే 

వేట గాని ఎరను జూచి, మృగము లన్ని పారినా
బ్రతుకు కొరకు, జీవితము సాగుట నిజములే
మాటు వేసి కాపు వుండి, గిట్టు బాటు కాదులే
దొంగ దెబ్బ తీయుట, కొందరికి అలవాటులే

నేత మాట నేతి బీర, మర్మ మెరిగి మసలితే
మర్మ మేరిగినా, మనసు తట్టేవి నిజాలే
చుక్క ముక్క నోట్ల మూట, సాగు బాటు కాదులే
చుక్క వళ్ళ వళ్ళు హూనమ్, అవునని తెలుసులే

మబ్బు కమ్మి గాలి విసరి చెల్లా చెదురయ్యిన
కోరికలు వెంబడిస్తే బ్రతుకు దుర్బరం అని తెలుసులే
వాన చినుకు కెదురు చూపు, కలుసు బాటు కాదులే
ఎన్ని సుఖాలు ఉన్న ఏదో కొంత లోటు ఉండు, నిజములే

నా తల్లి కలం కదిపి కవిత మనసు కదిపితే
కవిత మనసు కదిపిన, కొంతసేపు మాత్రములే 
పెల్లుబుకిన ఆవేశం కట్టు బాటు కాదులే
ఆవేశం ఉంటె మనిషి కాదులే, అది నిజములే 
--((*))--
సంజ
గగనమొక పుష్పం, కన్ను తాకి మెరిసే సోకు
విరిసిన చెంగల్వ పూవా, ఎరుపు చేక్కిల్లా
వన్నెల గగనం విరిసే, రంగు పరికిణీలా
యామిని చేరింది, చిరుచుక్క చేరే

సంద్య మందారం కడలి అంచులు చేరి  
సంధ్య పరికిణి చిరిగి ఎడెద లోతులు మెరిసే
జలచరాలు వింతగా చూసి కులికే
పక్షులు పరవశించి ముందుకు ఉరికే

వాలు నీడలుదరి వరదలై పాకి
చుక్క వెలుగు చిరునగవుకు సొగసై
నిదురతూలిక నడక గుదము పై కోర్కె
వచ్చు నిశిలో కరిగి శశి తో కలిసే

రంగు రంగు రుమాలులుగామారి
వెండితేర ప్రక్కకు తొలగించి
వ్రాలినది త్రావిగా, సోకినది 
సంజ వెన్నెల బాట ప్రాణులకు స్వర్ణ ధారా   
--((*))--
  






అరుంధతీదేవి కథ పురాణ ప్రసిద్ధమైనదని చెప్పుతారు.
.
అయితే, పురాణాల్లో ముఖ్యంగా శ్రీదేవీ భాగవతం, శివపురాణం, భాగవతం, భారతం తదితర పురాణేతిహాసాల్లో వసిష్ఠుని గురించి చెప్పే కథా సందర్భంలో ఆయన ధర్మపత్నిగా అరుంధతీదేవి ప్రస్తావన వస్తుంది..
.
అరుంధతీదేవి ఒక అనార్య యువతి. వసిష్ఠుడు ఆర్య జాతీయుడు. వేదవనంలో తపస్సు చేసుకొంటున్న వసిష్ఠుడికి ఒకనాడు మధురమైన గీతం వినిపిస్తుంది. ఆ గీతం అతని మనసుని ఆకర్షిస్తుంది. పాడిందెవరని చుట్టూ పరికించి చూస్తాడు. సంధ్య అనే అమ్మాయి పాడిందా పాట. ఆమె అరుంధతీదేవికి సోదరి. ఆ పాట ద్వారా సంధ్యని, ఆమె ద్వారా అరుంధతీదేవినీ వసిష్ఠుడు కలుసుకొని, అప్రయత్నంగా సరస్సులో పడిపోయిన అరుంధతీదేవిని రక్షించడం ద్వారా అరుంధతీదేవి నివాసం ఉండే ఆశ్రమానికి చేరతాడు. ఇద్దరి మనసులు ఏకమవుతాయి..
.
అరుంధతీదేవి - వసిష్ఠుల ప్రణయం విషయం వసిష్ఠుడిని చిన్ననాటి నుండీ పెంచి పోషించిన ప్రాచీనుడికి తెలుస్తుంది. మొదట ప్రాచీనుడు ఆ ఇద్దరినీ చూసి పార్వతీ పరమేశ్వరులేమో అని భావిస్తాడు. తాము వసిష్ఠుడు - అరుంధతులమని వసిష్ఠుడు ప్రాచీనుడికి వివరిస్తాడు. అరుంధతీదేవి గురించి చెప్తాడు. ఆమె ఒక తాపస కన్య అనీ, ఈ పరిసర ఆశ్రమంలోనే ఉంటుందనీ వసిష్ఠుడు చెప్తాడు. ఆమె పేరు “అరుంధతీదేవి” అని చెప్పగానే, ప్రాచీనుడు “హరి హరీ! అంటరాని, చూడరాని, చెప్పరాని చండాల కన్య!” అనుకొంటూ తిరిగి వెళ్ళిపోతాడు.
.
తనకు వర్ణభేదం లేదనీ తన హృదయపు తలపులు మూసుకోలేదనీ అరుంధతీదేవి తన హృదయంలో ఉండి సర్వత్రా ఆమె ప్రతిబింబమే కనిపిస్తుందని తనలో తాను సమాధానం చెప్పుకుంటాడు వసిష్ఠుడు. అంతలో వసిష్ఠుని దగ్గరకొచ్చిన సంధ్యతో తాను క్షణంలో వచ్చేస్తాననీ, ఆమెను అరుంధతీదేవి దగ్గరకు వెళ్ళమని చెప్తాడు. “ఆర్య, అనార్య భేద భావాల్ని తునాతునకలు చేసి, ప్రాచీనుడి నోరు మూయించి, ఈ పారతంత్ర్య వాతావరణం నుంచి బైటికి దూకి వచ్చేస్తానని, తాను పొరపాటు చేసి, ఆమెను వదిలి వచ్చేశాననీ” పశ్చాత్తాప పడుతుంటాడు.

అంతలో మళ్ళీ ప్రాచీనుడు వస్తాడు.
అతడు వసిష్ఠుడిది స్త్రీ వాంఛ అని నిందిస్తాడు.
తనది స్త్రీ వాంఛ కాదనీ, తన జీవితం ప్రేమ యజ్ఞంలో బలయిపోయిందంటాడు.
ఇక, తపస్సు మానేసి గృహస్థాశ్రమానికి చేరమనీ, అప్పుడు గానీ కామం చల్లారందంటాడు ప్రాచీనుడు.
తనది కామం కాదంటాడు వసిష్ఠుడు. తపస్సు మానవలసిన పనిలేదనీ అంటాడు.
అయినా ఇప్పటికే మహా తపస్వివి. యౌవనస్థుడవు. కనుక ఇప్పటికైనా గృహస్థుడివి కమ్మంటాడు ప్రాచీనుడు. తగిన తేజోవతిని వివాహమాడి రాజయోగినిగా మారమని చెప్తాడు ప్రాచీనుడు.
అరుంధతీదేవి కంటే ప్రపంచంలో తేజోవతి లేదంటాడు వసిష్ఠుడు.
.
వసిష్ఠుడు అరుంధతీదేవినే తలచుకొంటూ, మానసిక సంఘర్షణకు గురవుతుంటాడు.
ఆనాటి నుండీ అరుంధతీదేవి ఉండే వేదవనంలోని ఆశ్రమం తప్ప, మిగిలిన ఆశ్రమాలన్నీ కరువు కాటకాల పాలవుతాయి. ప్రజలు ఆకలికి తట్టుకోలేక మునులు కుక్కలను కూడా వదలరు. వాటితోనే తమ ఆకలి తీర్చుకుంటుంటారు.
ఈ పరిస్థితిని గమనించిన ప్రాచీనుడు తన శిష్యుడు కులగిరిని పంపి త్రిమూర్తుల దగ్గరకెళ్ళి సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోమంటాడు. బ్రహ్మ, విష్ణువు తమ చేతుల్లో లేదనీ పరమేశ్వరుడి దగ్గరకెళ్ళమంటారు. అప్పటికే ఈశ్వరుడు అరుంధతీదేవి ఆశ్రమానికి బయలుదేరతాడు.

అరుంధతీదేవినే తలచుకుంటూ వసిష్ఠుడు తాను తప్పు చేశాననీ, ఇక శాశ్వతంగా అరుంధతీదేవికి దూరమవ్వాలని అనుకుంటుంటాడు. తన తపస్సు వ్యర్థమనుకుంటాడు. అది ఇసుక తుఫానులో చేసిన తపస్సులాంటిదని అనుకుంటాడు. తనకి మరణమే శరణ్యమనుకుంటాడు.
ఆ సమయంలోనే సాధారణ మానవుడిలాగే ఈశ్వరుడు అతడికి ప్రత్యక్షమవుతాడు.

ఆ స్థితిలో వసిష్ఠుడు ఈశ్వరుడిని గుర్తించలేడు. తన ప్రేమ సఫలం కానందుకు మరణించాలనుకుంటున్న వసిష్ఠుడిని శివుడే పలకరిస్తాడు. చైతన్యంతో జీవించడంలోనే నిజమైన పురోగతి దాగి ఉందని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోవాలనుకున్న వసిష్ఠుణ్ణి తన చేతితో స్పర్శిస్తాడు శివుడు. ఆ స్పర్శతో అతడు నూతన చైతన్యం పొందుతాడు. అయినా తన దారిని తనని పోనిమ్మంటాడు. అయితే అతనిదేదో భగ్న హృదయంలా ఉందనుకుంటాడు శివుడు. ఆ పూర్వాపరాలను అడగకుండానే, అతణ్ణి అంత కఠినంగా హింసించిన ఆ ప్రియురాలెవరని మాత్రం అడుగుతాడు. ఆమె మృదు స్వభావురాలేననీ, తానే కఠినాత్ముడిననీ వసిష్ఠుడు వివరిస్తాడు. తనది ఆర్యజాతి అనీ అనార్య జాతి కన్యను ప్రేమించాననీ చెప్తాడు వసిష్ఠుడు.

దానితో శివుడు అసలు భారతదేశంలో అలాంటి భేద భావమే లేదనీ ద్రావిడులు ఆర్యులు ఒకే జాతివారనీ స్పష్టం చేస్తాడు. భారతీయులదంతా దితి, అదితుల సంతానమే కదా అనీ చెప్తాడు. వెంటనే మళ్ళీ అది కూడా కేవలం “పెరుగుదలలో పరిసరాల ప్రాబల్యం మినహాహిస్తే, మానవ జాతి అంతా ఒక్కటే కదా?” అంటాడు..
.
దీనితో తన అజ్ఞానం క్షమార్హం కాదని తపిస్తుంటాడు వసిష్ఠుడు. పొరపాటు చెయ్యడం మానవ లక్షణమనీ దాన్ని సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపమే సరైన మార్గమని వివరిస్తాడు శివుడు. తన తప్పుని సరిదిద్దుకుంటానని వసిష్ఠుడు శివుడికి చెప్పి వెంటనే శివుణ్ణి వదిలేసి అరుంధతీదేవి దగ్గరకు వెళ్ళిపోతాడు. ధన్యుడవయ్యావంటూ శివుడు వసిష్ఠుణ్ణి దీవిస్తూ నిలబడతాడు.

ఇంతలో సంధ్య శివుడి దగ్గరకొచ్చి లోకాలన్నీ తమరినే వెతుకుతున్నాయని అంటుంది. శివుడిని సంధ్య తన అక్క అరుంధతీదేవి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి తీసుకొని వెళుతుంది.
మార్గ మధ్యలో ప్రజలు, గోష్పాదం, కుంభోదరం, మునులు కనిపిస్తారు. తాము ఆకలితో అల్లాడుతున్నామనీ కరువుని తీర్చమనీ అంటారు. శివుడితో వస్తున్న సంధ్యను వాళ్ళు మొదట పార్వతీదేవి అనుకుంటారు. తర్వాత కులగిరి గుర్తిస్తాడు. మాదిగ పిల్లను శివుడు ముట్టుకుంటున్నాడంటాడు. శివుడు మైల పడిపోతున్నాడని గోష్పాదం, కుంభోదరం అతని మాటకు జత కలుపుతారు. చావనైనా చస్తాంగానీ మైలపడిన చేత్తో తమకేమిచ్చినా తీసుకోమంటారు.
మరొక వైపు ప్రజలు ఆకలీ… ఆకలీ అని అరుస్తుంటారు.

“ప్రజలారా! మీరెంతకాలం కుల మత వర్గ విభేదాలతో అజ్ఞానులై ప్రవర్తిస్తారో అంతకాలం మీకీ అరిష్టాలు తప్పవు. ఇక ప్రస్తుతానికి మిమ్మల్ని ఈ విపత్తునుంచి రక్షించగలవారు ఒక్క పతివ్రతలు మాత్రమే. మీరు పోయి పతివ్రతలను ఆశ్రయించండి. మీకింత భిక్ష పెట్టగలర”ని అంటాడు శివుడు.

అక్కడే దూరంగా ఉన్న ప్రాచీనుడు వర్ణాధిక్యతతో ఈశ్వరుడిని కూడా గుర్తించలేని స్థితిలో ఉంటాడు. “మాదిగ పిల్ల తపస్సు చేయడం! ఉత్పాతాలు సంభవించడం! ఎంత విపరీతంగా వుంది. ఇక ఆర్య జాతి అడుక్కు తిన్నట్టే!” అనుకుంటుంటాడు.
కొంచెం దూరం వెళ్ళిన తరువాత సంధ్యా పరమశివులను చూస్తాడు. కానీ వాళ్ళిద్దరినీ అరుంధతీదేవి వసిష్ఠులనుకుంటాడు. తన మాట వినకుండా వశిష్ఠుడు మాదిగ పిల్లనే చేరాడనుకుంటాడు. అందువల్లనే ధర్మ గ్లాని ఏర్పడిందనుకుంటాడు. ఈ ఘోరకలిని చూడలేననుకుని ముఖం తిప్పుకుంటాడు. ఈ స్థితిలో వస్తున్న పరమశివుడే ప్రాచీనుడికి అభివాదం చేస్తాడు. ప్రాచీనుడు పరీక్షగా చూసి తమర్ని గుర్తుపట్టలేదంటాడు. తనని పరిచయం చేసుకుంటాడు. ప్రాచీనుడు అప్పుడు పరమ శివుడికి నమస్కరించి ఆ పక్కనున్న సంధ్యను పార్వతీదేవేనా అని అడుగుతాడు. తాను పార్వతీదేవిని కాదనీ, అరుంధతీదేవి తన అక్క అనీ శివుడు తనకు తాత అవుతాడని సంధ్య ప్రాచీనుడికి వివరిస్తుంది.
ఆ సంభాషణకీ, సంబంధానికీ ఆశ్చర్యపోయి వాటి పూర్వాపరాలను అడుగుతాడు ప్రాచీనుడు.
తమది ఆద్యార్య సంబంధమనీ, అరుంధతీదేవి మాతంగ కన్య అయినట్లే, కాటికాపరి అయిన పరమేశ్వరుడు కూడ మాతంగుడేననీ చెబుతుంది.

తమతో వేళాకోళమాడుతున్నారేమోననే సందేహాన్ని వ్యక్తం చేస్తాడు ప్రాచీనుడు.
ఇది వేళాకోళం కాదనీ సత్యమేననీ చెప్తాడు శివుడు. “అధికారం కోసం ఆర్య ద్రావిడుల మధ్య జరిగిన అనేక యుద్ధాల పర్యవసానంగా సమాజంలో హెచ్చుతగ్గులేర్పడ్డాయి. గుణాలను అనుసరించి వృత్తులు పుట్టాయి. వృత్తులను అనుసరించి వర్ణాలేర్పడ్డాయి. అవే కులాలైనాయి. మతంగ మహర్షి సంతానం మాల మాదిగలు. మతంగుడు ఆర్య ద్రావిడ సమైక్యతా మూర్తి. ఆర్య ద్రావిడులు మూలార్య జాతి శాఖలు. అన్నదమ్ములు. ఈ భేదాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం సంఘ సముద్రంలో పుడుతూ పోతూ వుండే అలల వంటివని తెలిసికూడా, మీ వంటి పెద్దలు వీటిని పాటించబూనడం కడుం గడు శోచనీయం” అని స్పష్టంగా వివరిస్తాడు.

ఈ భేద భావాలు స్వార్థం కోసం మానవులు సృష్టించుకున్నవనే కనీస జ్ఞానం తనకు కలగనందుకు సిగ్గుపడుతూ మౌనంగా ఉండిపోతాడు ప్రాచీనుడు.
ఆకాశం తెల్లని మేఘాలతో పొగలు వ్యాపించి ఉంటుంది. అదంతా అరుంధతీదేవి తపస్సు వల్ల కలిగిన పొగలుగానే ప్రజలు భావిస్తుంటారు.
అరుంధతీదేవి - వసిష్ఠుల పునఃసంయోగం
అరుంధతీదేవి తపస్సు తీవ్రమై, ఆ తపోవహ్నిలో భగ్నమవుతుందేమోనని, ఆమె తమ్ముడు శివోహం ఒక పాత్రతో నీళ్ళు పట్టుకొని ఆమె చుట్టూ తిరుగుతుంటాడు.
వసిష్ఠుడు ఆకాశంలో కనిపిస్తున్న దివ్యజ్యోతిని చూసి ఆశ్చర్యపోతూ ఆందోళన పడుతుంటాడు. “తపోవహ్నిలో భస్మమైపోతున్నావా అరుంధతీదేవీ” అంటూ విలపిస్తూ తానూ యోగవహ్నిలో చితాభస్మమైపోతానని అతడు యోగ ముద్ర ధరిస్తాడు. శరీరంలో నుండి మంటలు బయలుదేరతాయి. భస్మం వాసన గుప్పుమంటుంది.
పరమశివుడు ప్రవేశించి ఈ మహా చరిత్ర విషాదాంతం కారాదని, తన దగ్గరున్న కమండలంలోని తీర్థం తీసి ఇద్దరి మీదా చల్లుతాడు.
తపోవహ్ని చల్లారిపోతుంది.

కన్నులు తెరచిన అరుంధతీదేవి, పక్కనే ఉన్న వసిష్ఠుణ్ణి చూసి పాదాభివందనం చేస్తుంది.
ఆ తరువాత పరమశివుణ్ణి చూసి భక్తి భావంతో నమస్కరిస్తుంది. తానెంత అదృష్టవంతుణ్ణో కదా అని వసిష్ఠుడు మురిసిపోతాడు.
“కల్యాణ మస్తు” అని ఇరువురినీ పరమశివుడు దీవిస్తాడు. అరుంధతీదేవి తన పక్కనే ఉన్న ప్రాచీనుడికి నమస్కరించి, ఆశీర్వాదాలు కోరుతుంది.
అతడూ ఆమెను దీవిస్తాడు.
నమస్కరించిన వసిష్ఠుడినీ ప్రాచీనుడు దీవిస్తాడు.
పరమశివుని అనుగ్రహంతో జ్ఞానినైయ్యానని చెప్పి వెళ్ళిపోతాడు.
అప్పుడు వసిష్ఠుడు పరమశివుని పాదాలపై పడతాడు. ఏదైనా వరం కోరుకోమన్న శివుడితో తనకు అరుంధతీదేవిని అగ్ని సాక్షిగా వివాహం చేయమంటాడు వసిష్ఠుడు.
ఇద్దరినీ దగ్గరకు చేరదీసి ఒకటి చేస్తాడు శివుడు.
ఇంతలో ప్రజలు, మునులు, ముని శిష్యులు కొన ఊపిరితో వస్తారు. “ఆకలి తీర్చే వాళ్ళే దొరకలేదా” అని పరమశివుడు అడుగుతాడు. దానితో వాళ్ళు ఆకలి తీర్చేవాళ్ళే దొరకలేదని, ఈ పాపాత్ములకు అన్నపూర్ణ ఎక్కడ కనపడుతుందని పశ్చాత్తాప్పడతారు.

అరుంధతీదేవి “ఈ ప్రజలింత దీనావస్థలో ఉండటానికి కారణం ఏమిట” ని పరమశివుణ్ణి అడుగుతుంది.
అదంతా అరుంధతీదేవికి జరిగిన పరాభవ ఫలితమేననీ, ప్రజల్ని రక్షించమని పరమశివుడు అరుంధతీదేవికి చెప్తాడు.
ప్రజలంతా మాదిగల అన్నం తింటారా? అని సంధ్య అడిగితే, “తింటాం తింటాం” అంటారు.
“దేవీ! నీవే ఈ ప్రజల్ని రక్షించగలవ”ని వసిష్ఠుడు కూడా చెప్తాడు.
అప్పుడు వసిష్ఠుడి పాదధూళిని తీసుకొని తాను పతిభక్తి గలదాన్నయితే, అన్నపూర్ణమ్మకు నా పట్ల దయ ఉంటే కొండ రాళ్ళన్నీ పిండి వంటలుగా మారాలనీ, చెట్లన్నీ ఫలించాలనీ, చెరువులన్నీ మంచినీళ్ళతో నిండాలని కోరుకుంటుంది.
అలాగే జరుగుతుంది
ప్రజలంతా ఆనందిస్తారు
ఇంకా ఉన్నాయి  వచ్చేవారం 
చదవండి, చదవమని చెప్పండి 
సర్వేజనా సుఖినోభవంతు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి