10, ఆగస్టు 2018, శుక్రవారం

SMALL STORIES - (PRANJALI PRABHA.COM)

నేటి చిన్న కత -Pranjali Prabha.com -9
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

ఓకే ఊరిలో ఓకే బ్రాహ్మణుడు ఉండే వాడు, నిత్యమూ వేదపారాయణం చేసేవాడు, ప్రజలందరికి ధర్మ సూక్ష్మములు తెలియ పరిచేవాడు. ఒక శిష్యుని వెంట పెట్టుకొని వారానికి ౨ రోజులు ప్రక్క గ్రామాలకు తిరిగేవాడు. ఏ గ్రామానికి పోయిన సన్మానాలు ఒప్పుకోడు, ఎటువంటి దానాలు తీసుకోడు. ఒకనాడు ప్రయాణంలో శిష్యునికి ఆహారం సర్దలేకపోయాడు, ఇంతచదువుకున్న ఒకని తిండి పెట్ట లేక పోయానని చాలా బాధ పడ్డాడు. 
ఆ గ్రామంలో ఒకని ఇంట శుభకార్యము జరుగుతున్నది. అక్కడి వెళ్లితే, శిష్యుని భోజనం దొరుకు తుందని ఆశించాడు. గురువుగారిని ఆహ్వానించారు, నా శిష్యుని ఆకలి తీర్చండి దాని నిమిత్తం నాలుగు వాక్యాలు హితబోధ చేసి నేను వెళతాను అన్నారు గురువు గారు. మీరు కూడా మమ్ము ఆశీర్వదించండి. ఆ పరమాత్ముని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి.

శ్లో === హత మశ్రోత్రియే దానం హతం సైన్య మనాయకమ్ | 
హతా రూపవతీ వన్ధ్యా| హతో యజ్నస్త్వ దక్షిణః ||

భావము === వేదము తెలియని వానికిచ్చిన దానము, నాయకుడు లేని సైన్యము, గోద్రాలైన రూపవతి, దక్షణ లేని యజ్ఞము ఇవి ఎందుకును కొరగావు

మీరు చెప్పినట్లుగా దానము పుచ్చుకోండి అన్నారు ఆశుభకార్యం చేసెవారు. నా కచ్చే దానం వేదం పాఠశాల నిర్వాహణకు ఇవ్వండి. పోనీ యజ్ఞము నిర్వహించి దక్షణ పుచ్చుకోండి అన్నారు ఆ పెద్దలు ఆ పరమాత్ముని భారం వేసి యజ్ఞమును నిర్వహించి, నా ఉదర పోషణకు కావలసినది స్వకరించి మిగతావి దానము ఇచ్చుటకు అనుమతి కోరుచున్నాను అన్నాడు. 
మోయి మాటే మాకు వేదవాక్కు అన్నారు. యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించగా వర్షం కుండపోతగా కురవగా ప్రతి ఒక్కరు సంతసించారు. 

--((**))--


ప్రాంజలి ప్రభ - చిన్న కధ (8) 

ఎదరొ మహానుభావుల అందరికి వందనములు . ఈనాడు 7 2 వ స్వా తంత్ర దినోస్చవము మనం జరుపు కుంటున్నాము. మనం గత చరిత్రను క్లుప్తముగా తెలుసు కుందాము.   భారత ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామము 1857   సిపాయిల తిరుగుబాటు ప్రారంభ మైనది. తరువాత వందేమాతర ఉద్యమాన్ని బాల గంగాధర్ తిలక్ న్యాయకత్వముతో ప్రజలందరినీ ఒకేమార్గంలో నడిపించారు. 1 9 0 6 లో దాదాబాయి నౌ రోజ్ ఆధ్వర్యంలో కాంగ్రస్ మహాసభలు జరిపి ఉద్యమాన్ని దారిలో తేవటానికి ప్రయత్నించారు. 1 9 2 0 మహమద్ ఆలి నాయకత్వములో మహాత్మ గాంధి సహకారముతో బ్రహ్మాండ మైన ఉద్యమాన్ని నడిపించారు. 
1 9 2 9  జవహర్లాల్ నెహ్రు నాయకత్వంతో మరి కొందరి నాయకులతో కలసి భారత దేశ ప్రజలందరినీ ఉద్యమ కారులుగా తాయారు చేసారు. అల్లూరి సితారారాజు బ్రిటిష వారికి ఎదురు తిరిగాడు.  గాంధీ గారు దండి యాత్ర, ఉప్పు సత్యాగ్రహం, విదేశ వస్తువుల్ని బహిష్కరించుట, రాట్నం వడుకుతూ, కొల్లాయి గుడ్డ ధరించి ఉద్యమ దారుడిగా మారాడు, వీరితో సుబాష్ చంద్రబోష్, బిబిన్ చంద్రపాల్, గోపాల కృష్ణా గోఖులే, లాలా లజపతిరాయ్, రాజ గోపాల చారి. ఇంకా ఎందఱో మరెందారో త్యగాఫలితముగా ఏర్పడింది ఈ దేశం. పిల్లలు రేపటి పౌరులుమీరే, ప్రపంచ దేశాలలో ప్రధాన దేశం  గా అభివృద్ధి పదంలో, విద్యా, విజ్ఞాన, పారిశ్రామిక దేశంగా మారటానికి విస్వ ప్రయత్నం జరుగుతుది. అగ్రరాజ్యాలతో పోటితో ముందుకు పోతున్నది.
ప్రతిఒక్కరిని కలుపుకొని సాగుదాం 
తల్లి తండ్రుల మాటలను విందాం 
గురువు పెద్దల బోధలు ఆచరిద్దాం 
దేశానికి మనవంతు సహకరిద్దాం 
  జైహిందు - జైహిందు - జైహిందు                                  



ధీర ధీర విశాల సంపద దిగ్దిగంతము లందు నన్ 
సారమై పరివారమై యొప్పును సారవంతులు మెచ్చగన్ 
ఊరికూరికి యున్నతస్థితి వుజ్వలంబై యొప్పెడిన్
భారతీసతి భాగ్య సంపద భవ్య మిట్లని తోచెడిన్ 

అర్తఃము;-- ధీ శక్తి లోనూ సంపదలోనూ ప్రపంచ మంతా మెచ్చు కొను నట్టుగా వుంటుంది,ప్రతి వూరు ప్రగతి సాధించి ఉజ్వలంగా వెలిగి పోతుంది.ఇలాగ భారత దేశభవిష్యత్తు ఉంటుందని,వుండాలని నేను ఆశిస్తున్నాను .మనము కూడా అలానే ఆశిద్దాము.

సారవివేక వర్తనల సన్నుతి కెక్కిన వారిలోపల౦ 
జేరినయంత మూఢులకు జేపడ దానడ యెట్టులన్న గా 
సారములోన హంసముల సంగతి నుండెడి కొంగ పిట్ట కే
తీరున గల్గనేర్చును దదీయగతుల్ దలపోయ భాస్కరా!

భావము:--నిజమగు యుక్తాయుక్త విచక్షణ గల నడతలచే, పొగడబడిన వారిలో కలిసిన మాత్రము చేత మూర్ఖులకు ఆ ప్రవర్తన అలవడదు. యెట్లన్న మడుగులోనున్న హంసలతో కలిసియున్నంత మాత్రమున కొంగలకు వాటి ప్రవర్తన అలవడదు కదా! 
ఆలాగున.హంసలతో కలిసి యున్నంత మాత్రమున కొంగలకు వాటి నడతలు రావు. అట్లే యోగ్యులైన వారితో కలిసివున్నంత మాత్రమున మూర్ఖులకా పేరు ప్రతిష్టలు రావు.

--((**))--

ప్రాంజలి ప్రభ (చిన్న కధ -6 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఒక ఊరిలో ఒక పండితుడు ఉన్నాడు, తనకు తెలిసిన విద్యను సహాయము చేస్తాడుకాని ఎటువంటి  
సహాయము కోరాడు, తీసుకోడు. ఏమన్నా ఆ పరమాత్ముడే నాకు సహాయము చేస్తాడని నమ్మకంతో 
జీవితం గడుపుతున్నాడు.  
ఒక దేవాలయములో మాట్లాడుతూ, నేను ఒకటే చెపుతున్నాను, భార్య భర్తలుగా మారినవారు ఒనరిగా నిద్రపోరాదు, విడివిడిగా నిద్రపోరాదు అట్లు చేసిన అనుమానం బీజం పోసిన వారవుతారు, బ్రహ్మచారులు మరెవరైనా బహిష్టు స్త్రీలతో మాట్లాడరాదు, అట్లు మాట్లాడినా మానసిక క్షోభకు గురి అవుతారు అన్నాడు, పెళ్ళికి శుభకార్యాలకు పిలిచినప్పుడు పోవాలి, యజ్ఞమునకు, చావుకు పిలవకుండా పోవాలి అని చెప్పాడు. 
అంతా విన్న భక్తులు మీమాటలు ఇప్పటి వారికి కొత్తవి కాదు ఆయన ఇంకా కొత్త విషయాలు చెప్పండి అన్నారు. అయినా ఈ శ్లోకం వినండి అంటూ బోధించాడు పండితుడు.    
     
శ్లో === నైకః స్వప్స్యా చ్చున్యగేహే శయానం నా ప్రభోధయేట్ | 
నోదక్య యా భిభా శేత యజ్ఞం గాచ్చేన్న చాహృతః || 

భావము === ఒంటరిగా యింటిలో ఒక్కడు నిద్రించ రాదు. నిద్రించు వానిని లేపరాదు. బహిష్టు స్త్రీలతో మాట్లాడరాదు. యజ్ఞమునకు పిలువక బోయినను వెళ్ళవలెను.

అక్కడ ఉన్న ఒక వ్యక్తి మీరు చెప్పే విషయాలు చాలా బాగున్నాయి ఇప్పుడు అందరు ఆంగ్ల  మాధ్యమంలో చదువుతున్నారు, వారు మన తెలుగును చులకన చేస్తున్నారు, మీరు ఏమనుకోకండి అన్నాడు. నేను ఏమి అనుకోలేదు మనభాష బతకాలనే చెపుతున్నాను, ఒక్క డన్నా  బాగు పడతాడన్నదే  నా ఆశ 
ఈ పండ్లు తీసుకోండి - ఇక్కడ ఉన్న భక్తులు ఎప్పుడో నా ఆకలి తీర్చినారు - ఇక నాప్రయాణము సాగించాలి - వస్తాబాబు 
--((**))--

ప్రాంజలి ప్రభ (చిన్న కధ -5) 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
  
ఒక స్వామి నిరాశతో నది ఒడ్డుకు వెళ్లి, నీటి యందు తన ప్రతి బింబమును చూస్తూ ఉన్నాడు అప్పడే ఒక వృద్ధుడు వచ్చి స్వామి ఏమయినది నీటిలో ప్రతిబింబమును చూచుట తప్పు కాదా అని తెల్పాడు, తప్పు అని తెలుసు ఆత్మహత్య చేసుకోవాలని నా మొఖం చూసుకుంటున్నాను అన్నాడు. ఎందుకు అంత బాధ పడుతున్నావు, కష్టమే మొచ్చింది అని అడిగాడు.

ఎంచెప్పాలి తాతగారు టి.వి., ఫేస్ బుక్కులు, ట్విట్టర్లు, వాట్సప్ లు వచ్చాక ప్రతి ఒక్కరు జ్ఞానబోధ చేస్తున్నారు, మా అవసరం లేకుండా పోయింది. ఇంతకూ మీరెవరు అన్నాడు స్వామి. 

నాపేరు ఆత్మ బంధువు, "స్వామీజీలు ఎమన్నా తక్కువ తిన్నారా, ఆత్మారాముని మరచి మధ్యన పుట్టుకొచ్చిన బాబాల వెంట బడుతున్నారు, డబ్బుకోసం జ్ఞాన్నాన్ని అమ్ము కుంటున్నారు", ఒక దేవుణ్ణే పూజించకుండా అనేక దేవుళ్ళని పూజిస్తున్నారు, దేనిలో ఎవరు ఏది చెపితే దానిని  నమ్ము తున్నారు, నీలో జ్ఞానం ఉన్న బోధ చేసే తెలివి ఉన్నా అహం, ఈర్ష్య, పెరిగింది. దాన్ని మార్చకోలేక పోతున్నావు ఈ శ్లోకంఒక్క సారి విను నీకె అర్ధం అవుతుంది అన్నాడు ఆత్మ బంధువు.                     

శ్లో === న లంఘయే ద్వత్సతశ్రీం నా ప్రదావేచ్చ వర్షతి | 
           నా చోదకే నిరిక్షేట స్వం రూప మితి ధారణా || 

భావము === లేగదూడను గట్టిన త్రాడును దాటరాదు. వానకురుస్తుండగా పరుగేత్తరాదు .  నీటి యందు తన ప్రతి బింబమును చుసుకోనరాదు . ఇది అన్నియు తప్పక జ్ఞాపక ముంచు కొనవలెను.

ఆత్మబంధువు నమో నమ:  అన్నాడు నేను లేగదూడను కట్టిన త్రాడును దాటాను, డబ్బు కోసమ్ వాన కురుస్తున్న పరుగెత్తాను, నన్ను క్షమించు ఆత్మ బంధువు అని కళ్ళు మూసుకున్నాడు. అంతే   వచ్చిన తాతగారు అంతర్ధాన మయ్యారు. నా తప్పు తెలిసింది ఎన్ని అవాంతరాలు వచ్చిన ఎన్ని ఆధునిక యంత్రములు వచ్చిన, మేధస్సుతో చెప్పే ఆత్మ జ్ఞానమునకు మించినది లేదు. నమో నమో ఆత్మబంధువు , నమో నమో అని దేవాలయము చేరాడు, డబ్బును ఆశించక బోధ  చేయుటకు. 

--((**))--



ప్రాంజలి ప్రభ (చిన్న కధ-4) . 
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ  

పిల్లల మనస్ తత్త్వం అర్ధం చేసుకోవటం చాలా కష్టం, మనం ఒక పని చేయ మంటే మరో పని చేస్తారు, అటు చూడదంటే ఆటే చూస్తారు. వారిని పెంచారంలో తల్లి  బాధ్యత ఎక్కువ. తల్లి అరిస్తే తండ్రి ముద్దు చేస్తాడు, తండ్రి అరిస్తే తల్లి ఓదార్చి చక్కదిద్దుతుంది ఇదే కలియుగ మాయ,

 ఒక నాడు బాబు అగ్గి పిలల్లతో ఆడుతూ 5 పుల్లలు కలిపి వెలిగించి ఊదాడు నిప్పు పక్క గుడ్డలపై మండింది, ఒక్కసారిగా మండింది.  తల్లి అరవగా "హనుమంతుడు లంకను కాల్చినప్పుడు ఎవ్వరు అరవలేదు నన్నెందుకు అరుస్తావు అన్నాడు". రావణడు దుర్మార్గుడు రాజధాని లంకను తగలబెట్టాడు, అప్పుడే తండ్రి వచ్చి తప్పు చేసావు ఓట్రించటం ఎందుకు అన్నాడు. తల్లి మీదకన్నా తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఆ బాబుకు, " తప్పు చేసాను క్షమించు నాన్న ఇంకెప్పుడు అలా చేయను ".  చూడు బాబు అగ్ని హోత్రుని మనం పూజించాలి, కూడుకు, కాటికి ఉపయోగించేది, ఆరోగ్యానికి మోక్షమార్గానికి ఉపయోగ పడేది. నేను చెప్పే మాటలు జాగర్తగా విను అని ఈ శ్లోకం చదివి వినిపించాడు.                       

శ్లో === నాగ్నిం ముఖే నొపధమే న్నగ్నాం నేక్షేత చ స్త్రీ యమ్ | 
నమేధ్యం ప్రక్షిపే డ గ్నౌ నా చ పాదౌ ప్రతాపయేట్ || 

భావము
 === నిప్పును నోటితో ఉదరాదు. దిగంబర స్త్రీని చూడరాదు. అపరిశుభ్ర వస్తువును అగ్నిలో పడవేయరాదు. పాదములను నిప్పు పై ఉంచి కాచుకోనరాదు.
--((**))--


ప్రాంజలి ప్రభ (చిన్న కధ -౩)
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ 

ఆశ్రమంలో గురువుగారు శిష్యులకు ధర్మ భోధ చేస్తున్నారు, అక్కడకు ఒక స్త్రీ వచ్చి నమస్కరించి మాబాబు నేను ఎంత  చెప్పినా నామాట వినుటలేదు, మీరు మార్చే ఉపాయం చెప్పండి అని అడిగింది. అమ్మా రేపు వచ్చి కలవు, మీ సమస్యకు పరిష్కారం నేను చెప్పగలను అన్నాడు, అదే విధముగా రోజు రావడం, ఇదే మాట  వినడం అలవాటు అయినది. ఒక రోజు గురువు గారు ఆ స్త్రీని, ఆ బాబుని పిలిచి, "అమ్మ మాట వినాలి అదే నీకు ఆరోగ్యదాయకం అన్నాడు", అట్లాగే గురువుగారు అన్నాడు బాబు, కాని ఆ స్త్రీకి కోపం వచ్చింది ఈ మాట చెప్పటానికి ఇన్ని సార్లు తిప్పించాలా అన్నది. చూడమ్మా నేను కూడా మీ పిల్లవాని అలవాట్లు ఉన్న వాడ్ని " మట్టి గడ్డలు నలిపె వాడ్ని, గడ్డి పరకలు తెంపేవాడ్ని, గోళ్ళు కోరికే వాడ్ని, నిందలు చెప్పువాడ్ని, శుభ్రత, పరిశుద్దత లేనివాడ్ని"           
అవి మార్చు కోవటానికి నాకు ఇంత సమయం పట్టింది. కుండలోని మజ్జిగను ఎక్కువ సేపు చిలికితె    గాని వెన్న పుట్టదు, తేనెటీగలు ఎక్కువసేపు కష్టపడితేగాని తేన తుట్టె రాదు,  ఓర్పుతో మంచి మాటలు చేపితె కాని బుద్ధి మారదు, అతి ప్రేమ చూపిన, భయం తో మార్చాలని ప్రయత్నించిన పిల్లల మారారు, వారిది కల్లాకపటం లేని మనసు వారి ముందు మీ ప్రవర్తన మార్చుకుంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అంటూ ఈ శ్లోకం తెలియపరిచారు           

శ్లో === లోష్టమర్ధీ తృణ చ్చెదీ నఖఖాదీ చ యోనరః |
సవినాశం వ్రాజత్యాషు సూచకో శుచిరేవ చ ||

భావము === మట్టి గడ్డలు నలిపెవాడు , గడ్డి పరకలు తెంపేవాడు, గోళ్ళు కోరికే వాడు, నిందలు చెప్పువాడు, శుభ్రత, పరిశుద్దత లేనివాడు శీఘ్రమ్గా నశించి పోవుదురు.

--((**))--

ప్రాంజలి ప్రభ (చిన్న కధ- 2)

ఒక ఊరిలో ఒక మనిషి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని సుష్టిగా భోజనం చేసి తిన్నది అరగకా క్రింద పడి దొర్లు తున్నాడు. ఆసమయాన ఆ దేశపు రాజు చూసి ఏమిటండి మీరు చేసే పని అడిగారు. యోగములో ముఖ్యమైనది, ఆరోగ్యానికి మేలైనది అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాను అన్నాడు. మరి యితడు రోగం తో మూలుగు తున్నా పట్టించుకో రెందుకు అని అడిగాడు, రోగం ఉపవాసం ఉంటె కొంతవరకు ఉపశమనం, నేలమీద పడీ దొర్లితే మరికొంత ఉపశమనం అన్నాడు. ఈ మనషి మాటలు అర్ధం కాక అక్కడ ఉన్న సెలయేరు వద్దకు వెళ్ళాడు. అక్కడ అందరూ వివస్త్రలుగా స్నానం చేస్తున్నారు ఇదెక్కడ సోధ్యము. ఒక్క సారి ఆలోచించాడు "స్నానం చేయుటవలన అని గ్రహించాడు"  ఈ విధముగా ఉండుట మంచిది కాదు అని భావించి వెంటనే రాజు శాసనంగా ఈ పద్యము వ్రాసి చాటింపు వేసాడు.          

శ్లో === నా స్నాన మా చారు ద్భుక్తా నాతురోన మహానిశి | 
నవాసోర్వి జనాజశ్రం ణా విజ్ఞాతే జలాశయే ||

భావము === భోజనము చేసిన తర్వాతను, రోగ గ్రస్తుడైనపుదును అర్ధరాత్రి వేళయందు నగ్నంగాను తెలియని మడుగు లోనూ, స్నానము చేయుట మంచిది కాదు.

--((**))-- 

ప్రాంజలి ప్రభ ( చిన్న కధ)  
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఒక ఊరిలోఒక రాజుకున్నాడు అతడు పరమ దుర్మార్గుడు, వారికి భయపడి ఆందరూ సేవలు చేస్తున్నారు, ఆ రాజ్యంలో ఈ విధముగా ఉన్నప్పుడు ఒక ముని వచ్చాడు అతడు రాజు వద్దకు పోయి నేను మీకు వస్త్రము ఇస్తున్నాను ఇది కట్టు కుంటే మీరు స్వర్గాన్ని చూడ గలుగుతారు అన్నాడు, రాజు అసలే మూర్ఖుడు అట్లా జరగక పోతే మీ తల తీసేస్తాను జాగర్త అన్నాడు. 
వెంటనే బట్టలు విప్పేసాడు రాజు మీరు తెచ్చింది మీరే కట్టండి అన్నాడు. రాజు చుట్టు తిరిగి
చేతులు కదిలించి ఇక పూర్తి ఆయనది అన్నాడు.
 అంతే అక్కడున్న వారందు కళ్ళు మూసుకున్నారు. 
ఏమిటి వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు ఎందుకు మీరు సర్గంలో ఉన్నట్లు తెలిసి ఈ ర్శ్యతో  కళ్ళు మూసుకున్నారు. 
వెంటనే కళ్ళు తెరవండి అన్నాడు రాజు.  
అందరూ ఏడవటం మొదలు పెట్టారు ఏమైంది ఏడుస్తున్నారు.
 మీరు స్వర్గంలో సుఖంగా ఉన్నారని ఏడుస్తున్నారు.
ఏడవకండి ఆపండి అన్నాడు, అక్కడే ఉండి నవ్వు తున్నారు         
అక్కడవున్న ఒక శునకము రాజు మీదకు దూకింది అంతే సర్గం చేరాడు.                     
అందుకే పెద్దలు చెప్పారు భయపడి ఏ పని చేసిన ఫలితము ఉండదు, ధైర్యముగా ఉండి నిజం నిర్భయముగా చెప్పినప్పుడే జీవితము సమంగా జరిగిపోతుంది.    
ఈ రాజు దొంగలద్వారా వాటా పొంది, ధర్మాలు చేయక, ఎంతమందో స్త్రీలను హింసించాడు  అతను చేసిన పాపములు శునకము రూపములో వచ్చి బలిచేసుకున్నది. 
   
మన పూర్వికులు మనకు తెలియపరిచారు అని వచ్చిన సన్యాసి ఈ విధముగా తెలియపరిచాడు 
 శ్లో = వైరిణం నోపసేవేత సహాయం చైవ వైరిణః | 
ఆధార్మికం తస్కరం చ పరస్యైవ చ యోషితమ్ || 

భావము === శత్రువును, వారికి సహాయపడువానిని, ధర్మము చేయని వారిని, దొంగలను, పరస్త్రీ లను, సేవింప రాదు.


--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి