13, ఆగస్టు 2015, గురువారం

ప్రాంజలి ప్రభ - 7 స్వాతంత్త్ర్య దినోత్సవం (15-08-2015)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - 7
స్వాతంత్త్ర్య దినోత్సవం  

సర్వేజనాసుఖినోభవంతు 

దాస్య సృంఖలాల నుంచి - కాంతి పథం వైపు పయనించిన రోజు 
పరపీడన పాలన నుంచి - ప్రజాసామ్యం ఉదయించిన రోజు
 అమరవీరుల త్యాగఫలం నుంచి - ఉద్భవించిన రోజు 
అహింసాయుధముగా ఎంచి - గాంధి మహాత్ముడు సాధించిన రోజు 

విదేశీ వస్తు భాహిష్కరణ - సహాయనిరాకరణ 
ఉప్పు సత్యాగ్రహం వలణ - క్విట్ ఇండియా ఉద్యమాల వలణ 
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు- ఆనందం వచ్చిన రోజు 
ఎర్రకోటపై త్రివర్ణ పతాకం -రేపరేపలాడిన రోజు 

మూడు రంగుల జండ - ముచ్చటగా ఎగిరింది 
కాషాయం - ఎల్లరలో త్యాగాన్ని నింపుతుంది 
తెలుపు - ఎల్లరులో ప్రేమను నింపుతుంది 
ఆకుపచ్చ - ఎల్లరలో మానవత్వం నింపుతుంది 
అశోక చక్రం - ధర్మానికి సౌర్యానికి నిలయమైనది 
అవినీతిపరులను ఎదిరిద్దాం - స్వేచ్చ సమాజాన్ని ఏర్పరుచుకుందాం
స్వతంత్రానికి అర్ధం చాటుదాం - 
కలసికట్టుగా భారతమాతను గౌరవించుదాం 

                                      

1INDEPENDENCE DAY  (స్వాతంత్ర దినోత్సవం)

మన దేశానికి ఉన్న ఘనమైన చరిత్ర ఆధ్యాత్మిక సంపద  "వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఉపపురాణాలు, రామాయణము, మహాభారతము వెలసి ఉన్న ఈ దేశం " శివాజి, రాణాప్రతాప్, పల్నాటి బ్రహ్మనాయుడు, అక్బర్   పరిపాలించిన దేశం, బుద్దుని భొదలు, ఏ సు ప్రబువు  ఆశయాలు, అనేక మతాలను ఆదరిస్తున్న దేశం, ఆది శంకరాచార్యులు, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ రాఘవేంద్రస్వామి,  వంటి  వారి ఆద్యాత్మిక వారసత్వం పొందిన దేశం, భాస్కరుడు, వరాహమిహురుడు వంటి గొప్ప శాస్త్ర వేక్తల  ఆవిష్కరణలు. భారత దేశాన్ని ఆధునీకరణ  చేయుటకు, ఎందఱో మహానుభావుల కృషి ఫలితముగా దేశం అభివృద్ధి చెందింది.
ఇంకా అభి వృద్ధి చెందాల్సిన పరిస్తితి ఉన్నది

స్వాతంత్ర్య దినోత్సవం--మన దేశానికీ పరుల పాలన/ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆగష్టు పదిహేను (August 15) భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం గా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారత దేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.

బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించి వారిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ని గురించి తెలియని వారంటూ ఉండరు. శాంతి ఆయుధాన్ని చేతబూని స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన జాతిపిత సత్యము, అహింసలను దేవతలుగా కొలిచారు.

ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్మా గాంధీ.. 
కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహము , అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న గాంధీజీని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకుందాం.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...!

                                               


దేశ  స్వాతంత్ర వేడుకలను (ఆగష్టు -15 - 2014)  డిల్లీలో ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసి ప్రజల నుద్దేసించి, ప్రధాని, రాష్ట్రపతి సందేశాలు అందిస్తారు. అదేవిధముగా హైదరాబాదులో, గోల్కొడ కోటపై   తెలంగాణ   గవర్నమెంటు జాతీయ పతాకము ఎగుర వేసి ముఖ్య మంత్రి .గవర్నర్ ప్రజలకు సందేశాలు ఇవ్వటం హర్షణీయం.

కులమతాల కతీతముగా అన్ని ప్రాంతాలలో, ముచ్చడైన మువ్వన్నెల జండాను ఎగరవేసి వందన సమర్పణ చేయుదురు. నేను భారత దేశాన్ని ప్రమిస్తున్నాను అంటూ పలు పట్టణాలలో జండాలు పట్టు  కొని ఊరెగడం, వింత వేషాలు వేసి జండాను అవమాన పరుస్తున్నారు కొందరు, కొందరు జండాలు ఎగురవేసి  పిల్లలకు పెద్దలకు స్వీట్సు పంచుకుంటూ సరదాగా కాలం కడుపుతారు.

ఎందఱో మహానుభావుల త్యాగ ఫలితముగా భారతదేశము  ఆవిర్భవిమ్చిమ్ది.

ఈ దేశాన్ని మనం పరిమళాలు వెదజల్లే పుష్పంలాగా, అమృతం పంచె  ఫలములాగా, ప్రతిఒక్కరి మనసు ప్రశాంతముగా ఉండేందుకు, దేశ సౌభాగ్యానికి ప్రతిఒక్కరు చేయవలసిన కొన్ని పనులు  ఇందు ఉదహరిస్తున్నాను.  దేశ పురోభివృద్ధికి అందరు పాటు పడాలనేది నా ఆకాంక్ష

ఒక్కక్క కుటుంబములో ఇద్దరు, ముగ్గురు పనిచేస్తూ, ధన సంపాదన పెంచుకుంటూ విలాస వంతమైన జీవితము గడుపుతున్నారు. ఆ విలాసాలు తగ్గిమ్చి కొంత ధనమును, నిరుపేదలను ,అనాధలను, ఆదు కున్నప్పుడే నిజమైన దేశ భక్తులు.

విద్య అనేది ప్రస్తుతము కొనుక్కొనే పద్దతిలో ఉన్నది. దీనికి ధనవంతుల  బిడ్డలను మత్రమే చదివిమ్చగలుగుతున్నారు, బీదవారు రెక్కలు ముక్కలు చేసుకొని, కష్ట పడ్డా  తమ బిడ్డలకు అన్నము పెట్టలేక పోతున్నారు, ఇక పిల్లలను ఎలా చదివిమ్చగలుగుతారు,

కొందరు విద్యావంతులు గ్రామాలకు  పోయి చదువులేని విద్యార్ధులను సేకరించి, వారికి ఉచిత విద్యను కల్పించి, వారి కల్లల్లో తలుక్కు మనే ఆనందాన్ని చూసే విధముగా చేసినవారే నిజమైన దేశ భక్తులు.

మన ఆరో గ్యానికి కాపాడుకోవటానికి పౌష్టిక ఆహారం ,వ్యాయామం, వ్యాధి గ్రస్తులమైతే తగిన మందులు వాడి రోగ విముక్తులవుతాము .

మనదీశంలో కోన్ని గ్రామాలల్లో ఇప్పటికి వేద్యానికి నోచుకోలేక వ్యాధి గ్రస్తులై మరణిస్తున్నారు. ఎ రోగము వచ్చిన లంఖనమే మందని మంచం మీదె ఉండి  పోతున్నారు.

కొందరు వైద్యులు కలసి కొన్ని గ్రామాలు దత్తత  తీసుకొని ప్రజలకు ఆరోగ్య పరిక్షలు చేసి వారికి తగిన మందులు ఇచ్చి సహాయ పడినవారే  నిజమైన దేశ భక్తులు.

మన ఇంటిని సుబ్రముగా ఉంచుకోనుటే కాదు, మన ప్రక్కవారి ఇంటిని కూడా  సుబ్రముగా ఉంచుటకు సహకరించాలి, మన వీధి పరిసుబ్రత మన అందరి ఆరోగ్యానికి మూలకారణం. దుర్ఘంధం మీద ఎంత అత్తరు చల్లిన వాసన పోనట్లు, దుర్ఘంధమనేది లేకుండా, దోమల బారి పడకుండా జాగర్త పడినవారు నిజమైన దేశ భక్తులు  

రెడ్ క్రాస్ వ్యవస్థ చాలా అద్వాన్నముగా ఉన్నది. వీరు కేవలము బ్లడ్ బ్యాంకులు గా ఉన్నాయి, దేశ ప్రజలకు అవసరానికి ఆదుకొనే విధముగా  పరిధిని పెంచాలి , కేవలము నెంబర్ షిప్ లు చేర్చుకొని సభ్యులను పెంచుతున్నారు కాని వారిని అన్ని విధాల ఉపయోగిమ్చుకున్నప్పుడే నిజమైన దేశ భక్తులవుతారు.
 

రక్షక భటులు చాల ఓర్పుగా పనిచేస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ చేయుటకు తీవ్ర కష్ట పడుతున్నారు, దొపిడిలు, దొంగతనాలు పెరుగుతున్నాయి, వాహనాలు వేగముగా నడుపుతున్నా పట్టిమ్చుకోవటములేదు,  లంచాలను ఆశించక ధర్మమార్గమున దేశానికి సేవ చేస్తారని  నాకు చాల నమ్మకమున్నది, దేశాన్ని పూర్తిగా రక్షించే భాద్యతలు రక్షక భటులపై ఉన్నది
భారతదేశ ప్రతిపౌరుడు "నేను నాదేశం కోసం పనిచేస్తున్నాను, నాదేశం సమృద్ధిగా ఉండాలి, సేవాతత్పరత, అంకితభావం, క్రమశిక్షణ, అలవరుచుకోవాలి.
ప్రతిఒక్కరు మనం పుట్టిన  మట్టిని సృసిమ్చి నమస్కరించి, మన కన్న తల్లి ఆశీర్వాదముతొ దేశసేవ  చేయాలన్నది నాభావన.
అందుకే అన్నారు కవులు "జననీ జన్మభూమి స్వర్గం కన్నా గొప్పదని .
ఇకమత్యమే మహాబలం అనే సూక్తి ప్రకారము కుటుంబమంతా శంఘీభావమ్తొ, ఒకే సంకల్పంతో ఉన్న కుటుంబాన్ని ఎవ్వరు వేరుచేయలేరు, అదేవిధముగా ప్రతిఒక్కరు కలసుకొని అధర్మాన్ని ఎదిరించి ధర్మాన్ని నిలబెట్టండి .దేవతలు ఏక మనస్సు కలవారగుట వల్లన హవిస్సులు పొందగలుగు తున్నారు,  అందుకే మానవులు వివిధ దేవతలను పూజిమ్చిన దేవతలందరూ ఒకే మనసు  కల్గి ఉండుట వలన అందరిని ఆదుకొన గలుగుతున్నారు. ఈ రోజు తిరుమల తిరుపతి పై సూర్య భగవానుడు చుట్టు వృత్తాకారముగను లోపల అనేక రంగులు కనిపించటం సుభసూచనమ్
"భారత మాత హృదయ సామ్రాజ్యాన్ని గెలుచుకోనేమ్దుకు  పోరాటం జరుపుతున్న వీర సైనికులం మనం, మనకు శక్తి ఉన్నంతవరకు ప్రజాసేవచేయుటయే ప్రధాన కర్తవ్యం అని ప్రతిఒక్కరు ప్రమాణము చేయాలని నా ఆకాంక్ష.                  





జాతీయ పతాకము ఎగురవేసి వందనం సమర్పించుదాం    
భరతమాత ముద్దు  బిడ్డలుగా జాతి గౌరవం కాపాడుదాం
కుల మతాలకు  అతీతంగా  కలసి   మెలసి బ్రతుకుదాం
దేశంకోసం త్యాగంచేసిన వారిని గుర్తు చేసుకొని జీవిన్చుదాం            


 గాలిలో, నీటిలో, ఉండే కాలుష్యాన్ని తోగిమ్చుదాం
ఆకలికి అలమటించే అనాధులను  ఆదు  కుందాం
ప్రతిఒక్కరము  దెశపురోభివృద్ధికి సహకరించుదాం 
అందరం నవ్వుతూ అందరిని  నవ్విస్తూ బ్రతికేద్దాం

భూమి పాదాలను నమస్కరించి భూమిని సాగు చేద్దాం
అందరి హృదయాలలో తృప్తిగా  ఆనందాన్ని నింపెద్దాం
య్యజ్ఞాలను చేసి మేఘాల ద్వారావర్షాలను కురిపిద్దాం
పాలబుగ్గల పసిపాలను నవ్వులతో,కేరింతలతో ఆడిద్దాం

జ్ఞాన సముద్రాన్ని నలుగురికి పంచేద్దాం
ప్రకృతి ఆనందాన్ని అందరకీ  పంచేద్దాం
అణచివేతపై ఓర్పుతో సమాధానం చెప్పేద్దాం
పిడికలుబిగించి దేశం కోసం నడుంకట్టి జీవిద్దాం

ఇంటర్నెట్ వెబ్ లో దేశం గురించి  తెలుసుకుందాం
మెల్సుగా, చాటగా, ప్రజల సమస్యలను పరిష్కరిద్దాం
పేస్ బుక్ లో సంగీతస్వరాల విని ఆనందిమ్చుదాం
టచ్ స్క్రీ న్ ద్వారా పిల్లలకు ఆటలుఆడించి సంతోష పెడదాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి