4, ఫిబ్రవరి 2014, మంగళవారం

111. Philos'ophy story -1/15 (Circle )

ప్రత్యక్షదైవమైన  సూర్యభగవానునికి నమస్కరించి నాకు తెలిసిన యుగ ధర్మాలను ఇందు పొందు పరుస్తున్నను,  తప్పులు దొర్లిన నాకు తెలియ పరిస్తే సరి దిద్దుకొని ధర్మాన్ని తెలియపరుస్తాను, ఎందరో మహానుభావులు అందరికి వందనాలు అర్పిస్తూ,  నా సంకల్పబలం నెర వేరాలని ఆ భగవంతుని  ప్రార్ధిస్తున్నాను, అందరి మనస్సు ప్రశాంతముగా ఉండాలని దేవుణ్ణి కోరుతున్నాను                                         

గురువుగారు ధర్మం గురించి ధర్మ భొధలు గురించి తెలియపరచండి అన్నారు శిష్యులు
శిష్యులు అడిగినదానికి సావధానముగా వినండి, కొన్ని పిట్ట కధలతో ధర్మ భొధను మీకు తెలియపరుస్తా.   

ధర్మచక్రం  నింగి పై నిరంతరం పరిబ్రమిస్తూ ఉంటుంది. ప్రక్రుతిలో సూర్య చంద్రులు ఉన్నంతకాలం  కాలాను గునంగా, ఋతువులు   మాదిరిగా, మనుష్యుల జీవితాలలో సుఖ:దుఖాలు, పాపా పుణ్యాలు, రాగ ద్వేషాలతో  ధర్మ చక్రం నడిపిస్తుంది.    

జ్ఞామెది, అజ్ఞాన మేది, అనేది తెలుసు కోవటము లోనే సగము జీవితము వ్యర్ధమై పోతుంది.
సుఖాలకోసం, కోరికలు తీర్చు కోవటం  కోసం సగములో సగము  జీవితము నిద్రలో మినిగి పోతుంది.


       " అజ్ఞానము అవివేకముతో
     అవివేకము అభిమానముతో
     అభిమానము క్రోధముతో
     క్రోధము కర్మతో
     కర్మ జన్మతో
     జన్మ దు:ఖముతొ కూడి  యున్నవని
     తెలుసుకోవటమే ధర్మం "
మానవులు జీవితకాలములొ ధనము కోసం, పిల్లల సుఖం కోసం ధర్మం తప్పకుండా నడుచుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. కాని కొందరు.   
    
" పుణ్య ఫలమును కావాలని ఆసింతురు, కానీ పుణ్యకార్యము చేయుటకు పూనుకొరు,
       పాప ఫలము అక్కరలేదని అందురు కాని పాపా కార్యము చేయుటకు పూను కొందురు."
     
కొన్ని ధర్మ సూక్ష్మాలు తెలియపరుస్తున్నాను, " గుణం, స్త్రీ తత్త్వం, కరుణ, సంకల్పం గురించి "    
కులం కన్నా గుణమే  ప్రధానం, ధర్మాన్ని ఆచరించడం, సత్యాన్ని పలకడం, పరుల హితాన్ని కోరడం అందరికి ఉండవలసిన గుణాల ధర్మం.



స్త్రీలు అత్యున్నత సత్యాలను భోధించే వారనీ, పురుషులు సాటిగా ఆదరణ పొందారనీ వెదాలూ, ఉపనిషత్తులు  చాటి చెపుతున్నాయి, అదే స్త్రీ ధర్మం.

దేశాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ఎక్కడ  గొప్పతనం ఉన్నా,అక్కడ శిరస్సు వంచి ప్రణమిల్లమని భగవత్గీతలో ఒక  ధర్మం.

జీవితంలో విజయాలను పొందడానికి ప్రతిభ కన్నా, అవకాశాల కన్నా గురితప్పని ఏకాగ్రత, లయ తప్పని దీక్ష తరగని ఓర్పు అవసరమనేది కలియుగ ధర్మం.  

                                                                              

మన పూర్వీకుల వ్రాసిన కథను మీకు వివరిసున్నాను. పూర్వం  వింధ్య పర్వత ప్రాంతలో చిదానందుడు అను ఆధ్యాత్మిక  గురువు " ప్రక్రుతి ఆశ్రమము " నందు శిష్యులకు విద్య నేర్పేవాడు. అక్కడ కొండ జాతికి చెందిన  శుచి కేతుడనే బాలుడు, శిష్యులకు, గురువుగారికి సేవలు చేస్తూ ఉండేవాడు. పర్వత ప్రాంతాలలో ప్రయాణించే బాట సారులకు నిండు మనసుతో నీరు, ఫలాలు అందించేవాడు.  గురువుగారు చెప్పెవన్ని కూడా  పనులు చెస్తూ వినేవాడు.  రాత్రి పూట  ఏరోజుకారోజు విన్నది మరలా గుర్తుకు తెచ్చుకొనేవాడు. శిష్యులు హేళన చేసినా పట్టించు  కొనెవాడు కాడు, తెల్లవారుజామున లేచి అందరికి నీరు తోడి, ఆశ్రమము సుబ్రమ్ చేసి దేవుని పూజకు పూలు, పండ్లు, ఏర్పాటు చేసేవాడు.

ఆదేసపు రాజు గురుకుల విద్యార్ధులను పరీక్షీమ్చి భాహుమతి ఇవ్వగలరని, ఆశ్రమ గ్రురువులకు తమ వ్విధ్యార్ధులను పంపమని, కోరగా,  రాజుగారి అహ్వానాన్ని గొరవిస్తు చిదానన్దుదు తన శిష్యులను పాల్గొనమని మీ విద్యానైపున్యమును అందరిముందు ప్రదర్శించి ఆశ్రమ ప్రతిష్టను నిలు పండి. మీతోపాటు శుచి కేతును కూడా తిసుకొని వెళ్ళండి.  అని ఆజ్ఞాపించారు గురువుగారు.

రాజకొలువులో  ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్నవారిని మేధావులను శిష్యులందరు చూసి భయపడసాగారు.  అందరిని ప్రశ్నిస్తూ చిదానన్దుని శిష్యులను కూడా ప్రశ్నించాడు.  

" చిరంజీవులారా నేను భగవంతుని ప్రేమిస్తున్నాను, మీకు సమ్మత మెనా "
 

శిష్యులందరు సమ్మతమెనట్లు తలఉపారు. కాని ద్వారముదగ్గర ఉన్న శుచికేతు మాత్రము " ప్రభూ మీరు భగవంతుని ప్రేమిస్తే చాలదు. ఆ భగవంతుడు మీమ్మల్ని ప్రెమిమ్చె టట్లు నడుచుకోవాలని జవాబు చెప్పాడు.
 

ఇంతకూ మీరెవరు అని రాజు అడుగగా నేను చిదానన్దుని శిష్యుడ్ని అని తెలియపరిచాడు.
ఐతే నాధర్మ సందేహాలకు నివే చెప్పాలి అది నీకు సమ్మతమెనా చెప్పలేకపోతే నీకు శిక్ష పడుతుంది.
 

మీ సమాధానాలు నేను చెప్పటం లేదు,  మాగురువుగారు చెప్పినట్లు  భావించండి అన్న మాటలకు శభ అంత ఆశ్చర్యముగా చూస్తున్నారు.
రాజు " భగవంతుడు నన్ను  ప్రేమిమ్చేతట్లు ఎలా నడుచుకోవాలి నీవె చెప్పు అని ప్రశ్నించాడు "

"ఇతరులబాగు కోరటంద్వారా, సర్వజీవుల యందు, దయ,  ప్రేమ కలిగి వుండటం ద్వారా,  తోటి మానవులతో సోదర భావం కలిగి జీవిమ్చడం ద్వారా, భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. కష్టాల సమయములో కాకుండా నిరంతరం దేవునిని ప్రార్ధిమ్చుతూ ఉండడం ద్వారా భగవంతుని ప్రేమ పొందుతారు మీరు అన్నాడు".
రాజు " ఈ ప్రపంచములో దేనినైనా సాధించాలంటే మార్గ  మేది  ?    
" శాంతం ప్రభు "
 
శాంతము గోప్పతన్నాని మనం చెప్పలేము, మరి శాంతము మనిషికి ఎలా వస్తుంది?
శాంతము కష్టాలకు గల మూల కారణములను తొలగిస్తే వస్తుంది అన్నాడు.
 
లోకములోకెల్ల శత్రువులెవరు ?
అందరిలో జీవాత్మ భావాన్ని కూలదొసె గురువే శత్రువు.
 
లోకములో కెల్ల మిత్రులెవరు ?    
అందర్నీ సమానముగా చూసె గురువే లోకంలో కెల్లా మిత్రుడు.

లోకములూకేల్ల  దాత  లెవరు ?
క్షణకాలంలో  కెల్లా  బ్రహ్మపదాన్ని  ప్రసాదించే  గురువే లోకాంలోకెల్లా  దాత.
రాజు చిరంజీవి భగవన్తునిమీద, గురువు మీద నీకున్న  నమ్మకమును తెలియపరిచినావు.
నేను ఇచ్చే బహుమతి స్వీకరిమ్చు అని రాజు భహుమతి అందించాడు, ఈ భాహుమతి నా గురువుగారికి చెందవలసినది, నేను తీసుకోవటం సమమ్జసముకాదు అన్న మాటలకు రాజు  గురువుగారితో  పాటు శిష్యులందరికీ సన్మానించారు. విద్యాలయ పరువు ప్రతిష్టను కాపాడినవానిని హేళన చేయకండి తెలుసుకోండి ప్రత్యక్షముగా నేను విద్యనేర్పక పోఇనా పరోక్షముగా సహకరిమ్చానని  నాకు సంతోషముగా ఉన్నది. ధర్మాన్ని బ్రతికిమ్చినన్దుకు సంతోషముగా ఉన్నది అన్నాడు గురువు.
ధర్మ ప్రభోదాలు, ఆద్యాత్మిక విషయాలు, ధర్మమార్గాన ప్రతి ఒక్కరు నడవాలంటే స్తిరభావమ్ కలిగి, అర్ధం చేసుకొని, పూర్వీకులు ఋషులు, వేదాలలో వివరించిన ధర్మ సూక్తులు, మనస్సుకు మనొనిబ్బరమ్గా మనుగడ సాగిస్తూ ప్రతిఒక్కరు  ధర్మ ప్రచారం చియాలని, మానవులకు జీవనాధారము కలిగించే జీవ నాడిగా మారాలని నా ఆకాంక్ష. 
           

                                                                              
              
                 



1 కామెంట్‌: