5, జనవరి 2015, సోమవారం

205.Family comedy story (Prema-Pelli)

Om Sri Ram                         Om Sri Ram                    Om Sri Ram
                                                                   
 ప్రేమ -పెళ్ళి 
అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతూ శ్రీ మతి శ్రీదేవి, అప్పుడే మీరు వచ్చారా, మీరు వచ్చాక నాకు ఫోన్ చేయక పోయారా, నేను వెంటనే వచ్చేదాన్నిగా,  నేను వచ్చి టి .వి పెట్టాను బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వరరావుగారు తిరుమల తిరుపతిలో వేంకటేశ్వర వైభవం గురించి చెపుతున్నారు, ఆయన ఉపన్యాసాలను, ఎన్నిసార్లు విన్నా, ఇంకా వినాలని పిస్తుంది.  అంత  అద్భుత గ్రాహక శక్తి మరిఎవ్వరికి ఉండదని నా ఉద్దేశ్యం, నేను పోగుడుతున్నానని కాదు ఆయన చెప్పిన ప్రతి అక్షరము అక్షర సూక్తిగా లోకంలో స్థిరంగా ఉండి  పోగలదని నా విశ్వాసం, వీరికి ఖచ్చితంగా పద్మశ్రీ  బిరుదు కూడ ఇచ్చి ప్రభుత్వమువారు సత్కరించాలి.  మంచిని మంచిగా చెప్పుమన్నారు, మంచిని పదిమంది కి పనికొచ్చి, ఆచరించే విధముగా చెప్పమన్నారు, మంచిని అనుకరించిటం  కష్ట తరమైనా చేడుమాత్రం అనుకరించుటకు ప్రయత్నించ వద్దన్నరు.


ఎమీలేదే కాస్త నిన్ను ఉడికిస్తే నవ్వు వస్తుంది, నవ్వు కుంటేనే కదా కాపురం,  నవ్వలేని జీవితం వ్యర్ధం, అవునండి మీరు మమ్మల్ని ఎన్నైనా అనవచ్చు, అది మీకు నవ్వు పుట్టించవచ్చు, నేనేదన్న అడిగాననుకో అదుగో నామీద కోపం గా అంటున్నావు వెంటనే అంటారు. ఎందుకె అంటావు నాకు నీవు, నీకునేను  ఉంటేనే జీవితమ్ సాఫల్యం అవుతుందని   చాగంటి కోటేశ్వర రావుగారు చేపుతుంటారే.

ప్రతి ఒక్కరికి ఒక మనసుంటుంది, మనసులో కొన్ని ఆలోచనలు పుట్టు కొస్తాయి, అవి కార్యరూపంలోకి రావాలంటే కొన్ని రోజులు పట్టవచ్చు, కాని సంకల్పం మాత్రం వదల కూడదు, నష్టం  వచ్చినచోటే ప్రయత్నించు, లాభం రాకమానదు, నడుస్తూ ఉంటె దారి తెలయక మానదు, ఆలోచిస్తే భార్య చేసిన సేవ గుర్తుకు రాక మానదు, కోపం తగ్గించుకుంటే భర్త చేసిన మేలు మరవలేదు అదే లోక తీరు. 


జంతువులు  బ్రతుకుతున్నాయి, చెట్లు బ్రతుకుతున్నాయి, జీవించడం  అనే మాట ఒక్క మానవులకు మాత్రమే వర్తిస్తుంది "భార్య " ఎన్నో వడుదుడుకులు ఎదుర్కొని, చిన్నప్పుడు ఆకతాయిగా తిరిగిన, పెద్దమనిషిగా మారినా తరవాత కొంటె కుఱ్ఱాళ్లు  వేదింపులు తిరస్కరించిన, పెల్లయిన తర్వాత భర్త ఇంకా సుఖం కావాలి అన్న, హాయిగా సహకరిస్తున్న, స్త్రీలు వేదింపులకు గురై భాదపడుతున్నారు, ఒక వృక్షంగా ఎదిగి శాకోపశాఖలుగా విస్తరించి, పూలు, కాయలు, అందించినా, నీడను అందించినా, మానవులకు ఆశ చావక పూలు , కాయలు కోసి, కొమ్మలతో ఇల్లు కట్టుకొని, కాండముతో దర్వాజాలు చేసుకొని సంతోష పడతారు, బీజమైన వేళ్ళను వదలి వెళ్లి పోతున్నారు, ప్రస్తుతము స్త్రీ పరిస్తితి అంతకన్నా దిగజారి పోతున్నదంటే భాధగా ఉన్నది.


ఏమిటో మీరు  చెపుతున్నారు, కాస్త మంచినీరు త్రాగండి ముందు, మంచి కాఫీ పట్టుకొస్తాను తీరుబాటుగా అప్పుడు మిగతా కధ చెప్పవచ్చు అని లోపలకి వెళ్ళింది శ్రీ దేవి.    .  . 

కాఫీ బాగుందే, ఎ దేశం పోయిన  కాఫీ మాత్రం మరిచిపోను, కాఫీ మరవద్దు, నన్ను మరవద్దు, ఇదిగో ఊరికినె కూర్చుంటే పిచ్చి ఆలోచనలు  వస్తాయి, అలా నడుచుకుంటూ వెళ్లి కూరలు పాలపాకెట్టు తీసుకొస్తె పాయసం  చేస్తాను,మీకిష్టమైన కూర చేసిపెడతాను,
ఓ అట్లాగె  ఆ పై కార్యక్రమము కూడానా,  ఓ అలాగే అని నాలుక కరుచుకొని ముందు మీరు వెళ్ళిరండి అని చెప్పి లోపలకు వెళ్ళింది.             
తలుపెసుకో అంటూ బయటకు నడిచాడు రామకృష్ణ . 
అక్కయ్యగారు, బావగారు అంటూ చక్రవర్తి పిలవటం, కాసేపు కూర్చొమని చెప్పటం, కాఫీ అందించటం, ఒక పది నిముషాలల్లో  కూర్చొని పాపరు చదవండి అని  అనటం జరిగిపోయింది. 
ఏమిటన్నయ్యగారు, చాలా నీరసంగా, దిగులుగా కనిపిస్తున్నారు ఆరోగ్యం  బాగోలేదా అని అడిగింది, అందరుబాగున్నారు నా   మనసే బాగోలేదు, చిన్న నాటి స్నేహితుడు కదా  కష్టాలు చెప్పుకొని మనస్సుని శాంత పరుచుకోవాలని వచ్చాను. 

అరుగో మీ మాటల్లోనే వచ్చారు అన్నది . 

ఇన్నేళ్ళకు నేను గుర్తుకు వచ్చానా 'నీకు' అన్నాడు నవ్వుతూ రామకృష్ణ , అది కాదురా ,
అది, ఇదికాదు మనం చదువుకొనేటప్పుడు నీవు  ఎలా ఉన్నావు మరి ఇప్పుడు ఎలా వున్నావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో  అన్న మాటలకు 
నిజమేరా, చదువుకొనేటప్పుడు చదువు తప్ప వేరే ఆలోచనలు  వచ్చేవి కాదు, ఇప్పుడు భార్య పిల్లలు అనేది  భంధం ఉన్నదికదా. 
నీ కోక్కడి కేనా పెళ్ళైన ప్రతిఒక్కరికి ఉంటుంది. నేను ఇప్పుడు నీతొ మాట్లాడలేను, వాదించలేను, నలుగురిలో నేను తలెత్తి తిరగ లేక పోతున్నాను అన్నాడు చక్రవర్తి. 

ఏమైంది అసలు విషయం చెప్పు, చేతనైనంత సహాయము చేస్తా
అయినా నీవేమి చేయగలవు మా బంగారము మంచిది కానప్పుడు, ఏమిటిరా ఆమాటలు వెనుకటికి ఎవరో చల్లకు వచ్చి ముంత  దాచు కున్నాడుట అట్లా ఉంది నీ పరిస్తితి. 

నీకు మా అమ్మాయి తెలుసు కదరా, అవును మొన్న కనిపించినప్పుడు చెప్పావుకదరా ఉద్యోగము చేస్తున్నది అన్నావు. 

అవును అది నా కొంప ముంచింది, ఏమి చేసిందిరా అంత  తప్పు పని. 

ఎవరినో ప్రమించాను అని లేచిపోయింది అని కల్లవేమ్బడి నీళ్ళు  కార్చాడు, ముందు కళ్ళు తుడుచుకో, నీ కూతుర్ని తప్పు పడతావెందుకు, అంతా  నీలొ తప్పు పెట్టుకొని. 
నేను ఏమి తప్పు చేసానురా, చదివించాను , ఉద్యోగము ఇప్పించాను అది తప్పా . 
అవి తప్పు కాదు అది నీ భాద్యత, మరి నేను చేసిన తప్పు ఏమిటి . 
నీలొ స్వార్ధ పెరిగిన్ది. నీకూతుర్ని, కొడుకుని చదివించావు, కూతుర్ని పెళ్లి చేయక ఉద్యోగము చేయమన్నావు , జీతమ్ తెస్తుమ్దికదా మంచి సంభందం  తెద్దమనుకున్నావు, కొంత డబ్బు దాచావు, కొడుకు వచ్చి నాన్న నేను అమెరికా వెళ్లి చదువుకుంటానంటే దాచిన డబ్బుతో పాటు కొంత అప్పు చేసి అమెరికాకు పంపించావు. 

అవును నేను చేసిన దానిలో తప్పేముంది అందరిలాగా నేను కొడుకు కోసం అప్పు చేసి మరీ చదివిస్తున్నాను కదా. 

మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అంటే అంత  నీకు తొందరెందుకమ్మ, అని చేతిలో డబ్బులు లేవు.  పెళ్ళంటే డబ్బులు కావాలికదా, ఇప్పడిదాక  నాజీతం  దాచానని చెప్పావు కదా నాన్న, అవునుచెప్పను ఇప్పుడు అన్నయ్య  అమెరికా వెళుతుంటె అవితీసి అన్నయ్యను అమెరికాకు పంపించాను, ఏదన్న లోను దొరికితే, మంచి వరుడు దొరికితే, అప్పుడు ఆలోచించుదాం, కొన్నాళ్లు  ఉద్యోగం చేయిఅన్నావు. 

అవునా 
అవును 
ఇక నాన్న నాకు పెళ్లి ఎటు చేయలేడని భావించింది, తనను ప్రేమించిన వాడ్ని, ప్రేమించిన వాడి వద్ద సుఖము ఉంటుందనని భావించి దేవుని సన్నిధిలో సాంప్రదాయకముగా పెళ్లి చేసుకొని, నీకు ఉత్తరము వ్రాసి మరి వెళ్ళింది ఆవిషయం  నీకు చెప్పాలను కున్నది. 

ఈ విషయం నీకెట్లా తెలుసనీ అడుగుతవేమో, మీ అమ్మాయే  నా దగ్గరకు వచ్చి నేను ఒకరిని ప్రేమేమ్చాను అంకుల్, నేను పెళ్లి చేసుకుంటాను, అని అన్నది. 

అప్పుడు నీ వెమొ దగ్గరండి పెళ్లి చేసి ఉంటావు, మమ్మల్ని పిచివాల్లను చేసి వెళ్లి పోయింది అన్నాడు చక్రవర్తి కోపంతో.

నేను మీ అమ్మాయి పెళ్లి చేయలేదు, నాకు పెళ్లి ఎప్పుడు అయిందో కుడా తెలియదు. 

మరి అమ్మాయికి నీవేమి చెప్పావురా 
నేను ఒక్క మాటే చెప్పను " మాతృత్వం అనేది ఒక అమృతం " అది కలియుగంలో పెళ్ళికి ముడి  పడి ఉన్నది. నీ ఆత్మ సాక్షిగా ఏది మంచిదో  అదే చేయమన్నాను, నలుగుర్లో అవమానపడకుండా, తల్లి తండ్రులను భాద పెట్టకుండా చదువుకున్నదానావు ఆలోచించి పెళ్లి చేసుకోమన్నాను.  ముందు మీ అమ్మ నాన్నకు చప్పు, వాళ్ళ అభిప్రాయం తెలుకో ,అప్పుడు నీ నిర్ణయం వారికీ  ధైర్యముగా చెప్పు అన్నాను . 
మరి ఎమన్నది. 
మీకు చెప్పి  ధైర్యముగా ముందు అడుగు వేస్తానన్నది. 
మరి నాకు ఏమి చెప్పలేదే, ఒక్క సారి ఆలోచించు అన్నాడు రామకృష్ణ. 
నేను ఎప్పుడు అభద్ధమాడను, నిజం చెపుతున్నాను నాకు ఎప్పుడు చెప్పలేదు అన్నడు గట్టిగా . 
అదికూడా  నేనే చెపుతాను విను ఒక రోజు మీ అమ్మాయి నీ దగ్గరకొచ్చి నేనోకరిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని అడిగింది. ఒక్క సారేమిటి రెండు మూడు సార్లు అన్నది, అవును అప్పుడు నేను కోపగించు కున్నాను. 
నీవు కోపగించుకోలేదు, అన్నయ్య  అప్పు తీరలేదు, నీ పెళ్లి ఇప్పుడే చేయలేనని చెప్పావు. 
అవును అని నిదానంగా తలూపాడు  చక్రవర్తి .
అవును అప్పుడు మానాన్న ఎటూ పెళ్లి చేయలేడు  అని భావించి నీ భార్యకు చెప్పి మరీ పెళ్లి చేసుకున్నది. దానిలో తప్పు ఎక్కడా కనిపించలేదు, అందులో మీ అబ్బాయి అమెరికాలో వేరొక కులస్తుని పెళ్లి చేసుకున్నట్లు  తెలుసు  కున్నది,  అన్నయ్య  నాకు పెళ్ళి   చేయలేడని, ఎవరి స్వార్ధ వారు చూసు కున్నారు, మరి నా సుఖం నేను చూసుకోవద్దా అనుకున్నట్లున్నది. 
నీవు ఒక్కసారి మనసును స్థిమిత పరుచుకో అన్నాడు రామ కృష్ణ. 
అన్నయగారు నేను చెప్పాననుకోకండి ఎవయసులో చేసేవి ఆవయస్సు లో చేస్తే బాగుంటుంది, అందరు సంతోషంగా  ఉండ గలుగుతారు. 
అన్నయగారు మీరు, మీ శ్రీమతి, కూతురు, అల్లుడు, కొడుకు, కొడలతో అందరు కలసి మా యింటికి భోజనానికి  రావాలి, మా దీవెనలు కూడా   తీ సుకుంటే బావుంటుంది, పంతాలకు పోయి భందాలు తెన్చుకోకండి. 

ఆ దేవుడాడిస్తున్న చదరంగంలో మనమందరం పావులమే, మాయలో చిక్కి ఉన్నాము, భారమంతా ఆదేవుడు చూసు కుంటాడు, అన్ని చూసి మంచివాడని పెల్లిచేసిన ఆడపిల్ల కష్టపడ కుండా ఉంటున్నదా, అందరు కష్ట పడుతున్నారు. 
నా తప్పు తెలుసుకున్నాను రామ కృష్ణ, నా మనస్సు కుదుట పడింది, ఇప్పుడే పోయి అందరిని పిలుచుకొని వచ్చి మీ ఇల్లు కిష్కింద కాండ చేస్తా 
అన్న మాటలకు అందరు నవ్వు కున్నారు          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి