9, మే 2020, శనివారం

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత– శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత– శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

పార్వత్యువాచ :–

మన్త్రాణాం పరమం మన్త్రం గుహ్యానాం గుహ్యమేవ చ |

బ్రూహి మే నారసింహస్య తత్త్వం మన్త్రస్య దుర్లభమ్ ||


శంకర ఉవాచ :–

1)వృత్తోత్ఫుల్లవిశాలాక్షం విపక్షక్షయదీక్షితం |

నినాదత్రస్తవిశ్వాణ్డం విష్ణుముగ్రం నమామ్యహమ్ ||


2) సర్వైరవధ్యతాం ప్రాప్తం సబలౌఘం దితేస్సుతం |

నఖాగ్రైశ్శకలీచక్రేయస్తం వీరం నమామ్యహమ్ ||


3) పాదావష్టబ్ధపాతాళం మూర్ధాఽఽవిష్టత్రివిష్టపం |

భుజప్రవిష్టాష్టదిశం మహావిష్ణుం నమామ్యహమ్ ||


4) జ్యోతీంష్యర్కేన్దు నక్షత్రజ్వలనాదీన్యనుక్రమాత్ |

జ్వలన్తి తేజసా యస్య తం జ్వలన్తం నమామ్యహమ్ ||


5) సర్వేన్ద్రియైరపి వినా సర్వం సర్వత్ర సర్వదా |

జానాతి యో నమామ్యాద్యం తమహం సర్వతోముఖమ్ ||


6) నరవత్సింహవచ్చైవ రూపం యస్య మహాత్మనః |

మహాసటం మహాదంష్ట్రం తం నృసింహం నమామ్యహమ్ ||


7) యన్నామస్మరణాద్భీతా భూతవేతాళరాక్షసాః |


రోగాద్యాశ్చ ప్రణశ్యన్తి భీషణం తం నమామ్యహమ్ ||


8) సర్వేఽపి యం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే |

శ్రియా చ భద్రయా జుష్టో యస్తం భద్రం నమామ్యహమ్ ||


9) సాక్షాత్స్వకాలే సమ్ప్రాప్తం మృత్యుం శత్రుగణానపి |

భక్తానాం నాశయేద్యస్తు మృత్యుమృత్యుం నమామ్యహమ్ ||


10) నమస్కారాత్మకం యస్మై విధాయాత్మనివేదనం |

త్యక్తదుఃఖోఽఖిలాన్కామానశ్నుతే తం నమామ్యహమ్ ||



11) దాసభూతాస్స్వతస్సర్వే హ్యాత్మానః పరమాత్మనః |

అతోఽహమపి తే దాస ఇతి మత్వా నమామ్యహమ్ ||


శంకరేణాదరాత్ప్రోక్తం పదానాం తత్త్వముత్తమం |

త్రిసన్ధ్యం యో జపేత్తస్య విద్యాఽఽయుశ్శ్రీశ్చ వర్ధతే ||


ఇతి శ్రీ శంకరకృత శ్రీనృసింహమంత్రరాజపదస్తోత్రమ్ ||

🕉🌞🌏🌙🌟🚩


ఓం శ్రీ గురుభ్యో నమః .ఓం శ్రీ మాత్రే నమః.
  శ్లో// యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ /
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే//
(ఎవరిని స్మరించినంత మాత్రాన మనము జన్మ, జరా, విపత్తి, మరణాలనే సంసార బంధాలనుండి విముక్తులమవుతామో, సర్వ సమర్ధుడైన ఆ మహావిష్ణువునకు నమస్కారము)

చతుర్విధ పురుషార్ధములు సాధించగలిగే మనుష్య జన్మ వచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు." ఈశ్వరుని యందు భక్తి" ఉండాలి.భక్తి ఉంటే ఏ జన్మ అయినా ఫరవాలేదు,అని శ్రీ శంకర భగవత్పాదులవారుచెప్పిన విషయాన్నే,"శ్రీ ధూర్జటి మహాకవి" ఈ విధంగా చెబుతున్నారు:
" ఏ వేదంబు పఠించె లూత, భుజగంబే శాస్త్రముల్ జూచె దా/
నే విద్యాభ్యసనం బొనర్చె కరి, చెంచేమంత్ర మూహించె బో/
ధావిర్భావనిదానముల్ చదువులయ్యా! కావు! మీ పాద సం/
సేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా//
(శ్రీకాళహస్తీశ్వరా! నీవు, సాలె పురుగునకు    (లూత),మోక్షం ఇచ్చావు.
పాముకు (భుజగం),ఏనుగునకు(కరి), చెంచునకు(భక్తకన్నప్ప లేక తిన్నడు), మోక్షమును ఇచ్చావు.
సాలెపురుగు, ఏ వేదాలు వల్లించ లేదు.
పాము ఏ శాస్త్రావలోకనము చెయ్యలేదు.
ఏనుగు ఏ విద్యలు అభ్యసించ లేదు.
చెంచు ఏ మంత్ర జపము చెయ్యలేదు.
కేవలము వారికి నీయందు ఉన్న భక్తి వల్ల మోక్షమును ఇచ్చావు.
కాబట్టి వేదపఠనము,శాస్త్రములు చడవడము, అరవైనాలుగు విద్యలు నేర్చుకోవడము, మంత్రాలు జపించడము, మోక్షాన్ని ఇవ్వలేవు. మీ పాదపద్మముల యందు భక్తి మాత్రమే సమస్త జీవులకు ముక్తిని ఇస్తుంది)
శ్లో// అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే/
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం//
(ఏ జనులు మనస్సులో వేరే ఆలోచనలు లేకుండా, నన్నే స్మరిస్తూ ఆరాధిస్తున్నారో, నిత్యమూ నాయందు ఏకాగ్రచిత్తంతో ఉన్న ఆటువంటి వారి యోగ క్షేమములను నేనే వహిస్తాను),
అని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో చెప్పారు.

సర్వోత్తమమైన ఆ భక్తి మార్గాన్ని ఆశ్రయించి మనం జన్మసాఫల్యం పొందుదాం.
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే.
[10:11, 09/05/2020] +91 90009 72611:
ఓం శ్రీ గురుభ్యో నమః.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి