1, ఫిబ్రవరి 2018, గురువారం

భగవద్గీత - 8 వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగం

  మీ సందేశం పంపబడలేదు ఎందుకంటే ఇది ఫేస్బుక్లోని ఇతర వ్యక్తులు అసంబద్ధం అని నివేదించిన కంటెంట్ను కలిగి ఉంది. 15-02-2018
అన్నారు ఎందుకు నా కష్టర్జితాన్ని ప్రజల ముందు ఉంచకూడదా దయచేసి నా రచనలకు అనుమతి ఇవ్వండి. నావి తప్పుగా ఎమన్నా పొందు పరిచితే తొలగించండి.
6 సంవస్చరాల నుండి భగవద్ గీతను వ్ద్రాసున్న ఎందుకు తొలగించాలని అనుకుంటున్నారు ఒక రచయతగా అడుగుతున్నా , ఇప్పడికి ఇది 5 వసారి
ప్రాంజలి ప్రభగా మీకిష్టం లేకపోతె మీరేం చేయాలోచేప్పండి నాకు గ్రూపులు లేవు
ఆ ప్రాంజలి ప్రభను అనుమతించండి
అసబ్యకరమైనవి, నావి కానివి తొలగించండి
నాకు నా రచనలకు అనుమతివ్వకుండా ఆపుట ఎందుకు , నాకు సమదానము చెప్పగలరు
ఇట్లు మీ మల్లా ప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభను ఆదరించేవారికి క్షమాపణలు తెలుగుపుతున్నాను
తెలుగును బ్రతికించండి, ఆత్మగౌరవం మన జనం హక్కు

ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:
 
భగవద్గీత - 8 వ అధ్యాయము 
అక్షర పరబ్రహ్మ యోగం - అంతర్గత సూక్తులు (8/10) 

1. ప్రాపంచిక  వ్యామోహంలో చిక్కిన వారికి దూరంగా, గురువు, తల్లి తండ్రుల అనుగ్రహము ఉన్నవారికి దగ్గరగా భగవంతుడు ఉంటాడు ఎందుకు?.

2. అసత్యాన్ని సత్యమని, అనిత్యాన్ని నిత్యమని, అనాత్మను ఆత్మని పొరబడుతున్నాడు, కలవరి స్తున్నాడు, అజ్ఞానము కమ్ముకున్న నిద్రలో మునిగి పోతున్నాడు. మానవుడు ఎందుకు? 

3. కలియుగంలో  తప్పించు కొనుటకు పరిగెడుతున్నాడు, గోతిలో పడి, బుసలు కొట్టే సర్పానికి చిక్కి, భయంతో వణికి పోతున్నాడు ఎందుకు?.  
    
4.పురాణాలలో ప్రకృతిని బ్రహ్మ అంటారు, వేదాన్ని బ్రహ్మ అంటారు, విధాతను బ్రహ్మ అంటారు, ప్రణవాన్ని బ్రహ్మ అంటారు, యజ్ఞాన్ని బ్రహ్మ అంటారు. అసలు బ్రహ్మ గుర్తించి తెలుసు కోవాలని తాపత్రయంతో బ్రతుకుతాడు ఎందుకు?   

5. ఆది +ఆత్మ = ఆధ్యాత్మ, ఆత్మకన్నా అధికమైనదా ? ఆత్మ అంటే దేహము అని కూడా కదా? దేహం కన్నా అధికమైన ఇంద్రియాలు, మనస్సు, బుద్ది ఇవి అన్నీ ఆధ్యాత్మమ్ కాదా? ఆధ్యాత్మమ్, ఉపాధికి సంబంధించిందా, చైతన్యానికి సంబంధించిందా , మరి ఆధ్యాత్మిక ఎందుకు ?

6. కర్మ అంటే నిత్య, నైమిత్తిక,  కామ్య, నిషిద్ధ, ప్రాయశ్చిత్త మేనా, లేదా యజ్ఞ  యాగాదులు, దానధర్మాలు, పూజా పురస్కారాలా, మరివీటినే   పనులే అంటారు, మరికొందరు భగవంతుని సృష్టి అన్నారు,  అసలు అర్ధం ఏమిటి ?
     
7. పంచ భూతాలు ఆదిభూతాల్లా మరొకటి ఏదైనా ఆది భూతము ఉన్నదా ?

8. నాలుగు వేదాలకు అది దైవాలు ఉన్నారు, ఒక్కొక్క ఇంద్రియానికి  ఒక్కొక్క ఆది దేవత  ఉన్నది, జగత్ అంతా దేవతల  మయ మైనది, అసలు అది దైవం అంటే ఎవరు ? 

9. ఆదియజ్ఞు డెవరు ?  కర్మలు చేసే వాడా, చూస్తూ ఉండే వాడా, మనలోపల ఉండే వాడా, వెలుపల ఉండే వాడా, దూరంగా ఉండే వాడా, దగ్గరగా ఉండే వాడా ? 

10. అంత్యకాళం లో  పరమాత్ముని స్మరించే మార్గం, దర్శనం చేసుకొనే మార్గం, ఎవరికైనా సాధ్యమవుతుందా అనే  ప్రశ్నలతో మనస్సు చికాకు పరుస్తుంది ఎందుకు ? 

పై ప్రశ్నలకు జవాబులు రేపటి భగవద్ గీత లో చదవండి, భగవంతుడు తెలిపినవే తెలుపుటకు ప్రయత్నిస్తాను. 

11. స్తూల ప్రపంచానికి ఆది దేవత విరాట్పురుషుడు అతడికి స్థూల ప్రపంచం. స్తూల దేహం గురించే తెలుస్తుంది.  

12. సూక్ష్మ ప్రపంచానికి ఆది దేవత, హిరణ్య గర్భుడు సూక్ష్మ దేహం గురించే తెలుస్తుంది. 

13. స్థూల, సూక్ష్మ, ప్రపంచాలకు అధి దేవత పురుషోత్తముడు, అతడే పూర్ణ పురుషుడు, సర్వజ్ఞుడు. 

14. "బ్రహ్మ అనగా అక్షరం " సృష్టింప బడనిది కనుక నశింపు లేనిది, అన్ని కాలములలో ఉండేది, కనుక పరమాత్మే అక్షర బ్రహ్మ. 

15. దృశ్యమాన ప్రపంచానికి మూలమై, ఆధారమై, కారణమై, ఉన్న స్థిరమైన ఆత్మ, తత్వమే,  బ్రహ్మం. 

16. దేహ మనో బుద్దులను ప్రకాశింప  చేస్తున్నది, చైతన్య రూప ఆత్మయే బ్రహ్మము యొక్క లక్షణం. 

17. భూ తన్మాత్ర, జల తన్మాత్ర, అగ్ని తన్మాత్ర, వాయు తన్మాత్ర, ఆకాశ తన్మాత్ర అన్నీ లయమే పరమాత్మా, పంచ తన్మాత్రలకు పరమాత్మే బ్రహ్మ. 

18.     తెలివిగలవారు, తెలివి తక్కువ వారు, పెద్ద వారు, చిన్నవారు, ఆడవారు, మొగవారు అందరు ఒకచోట చేరినప్పుడు ఒకగురువు అడిగిన ప్రశ్న "మీలో ఇప్పుడు ఎవరు చనిపోతారు" అని అడుగగా అందరు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. 

19. పనివుందని ఒకరు, పొయ్యే రోజు వస్తే అందరూ  పొయ్యే వారమని అనేవారు ఒకరు, ఇలా చెపుతూ పోతూ ఒక్కరు అక్కడ ఉండలేదు. ఎందుకంటే చావు అంటే  అందరికి భయమే. ఎవ్వరూ స్వశ్చముగా ఆహ్వానించ కూడదు అదేనీతి. 

20.  భగవంతుని స్వభావమైన సత్ అనే లక్షణం, ఎప్పుడూ ఉండాలని కోరిక, అదే ఆత్మ స్వభావం, భగవంతుని స్వ భావం, అదే జీవికి ఆధ్యాత్మికం. 



21. విత్తనం తన స్వరూపాన్ని త్యాగంచేసి వృక్ష మవుతుంది. 

22. పరమాత్మ తన స్వరూపాన్ని త్యాగం చేసి బహు రూపాల ప్రాణ కోటిని సృష్టించింది 

23. ప్రవాహంలా జగన్నాధ చక్రం సాగుతూనే ఉంటుంది. ఈశ్వరుని సంకల్ప రూపమే కర్మ. 

24. ఇంద్రియాలు, ఆలోచనలు, కోపములు, ఉద్రేకాలు, 
తలంపులు, వాసనలు, కర్మ ఫలాలు పుట్టి నశించేవి వీటిని ఆది భూతాలంటారు. 

25. జన్మ జరా మరణముల నుండి విముక్తి పొందినవారు ఆదిభూతాలకు చిక్కనివారు. 

26. పురుషుడే ఆది దైవము అంటున్నాడు భగవానుడు ఇతడే విశ్వ రూపుడు, సర్వదేవతా మయుడు. 

27.   ఆది యజ్నుడంటే ఫలభోక్త. మహేశ్వరుడు. మనదేహం లో ఉన్న పరమాత్మను మనం గ్రహించ లేక పోతున్నాము.             

28. అంత్య కాలంలో ఎవరు నన్నే తలుస్తూ  కళేబరాన్ని వదిలి ప్రయానిస్తారో అతడు నాభావాన్ని పొందుతాడు. 

29.    మనలో కోరికలు తీరేవరకు నేను నేనే, అనుకుంటూ దేహాన్ని వదలి కర్మ ఫలం అనుసరించి మరోదేహం చేరుతాం. 

30. మనం నిత్యం భగవంతుని ధ్యానం లోనే ఉండాలి, భీష్ముడు ములుకుల ఆంప శయ్యపై ఉండి, శాంతి పర్వం చెప్పగలిగాడు, శాంతాకారం భుజగ సయణం అన్నారు పడుకున్నది పాము పడగ నిత్య ద్యానం పరమాత్మునికి తప్పలేదు.      

31.మరణించే ప్రతి ఒక్కడు భగవత్ స్మరణ, భగవత్ భక్తి తో జన్మ సార్ధకం చేసు కుంటే నాలో ఐక్యమవుతారు అని చెప్పారు భగవంతుడు. 

32. ఈరోజు వచ్చే వార్త రేపటికి పనికిరాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్న గీత మరచి క్షణికావేశం తెప్పిచ్చే పేపరు చుట్టూ ఉంటారు ఎందుకు?
           
33. రాత్రి నిద్రపోయే ముందు తెల్లవారు జామున ఇది చేద్దామను కుంటే ఖచ్చితంగా మెలుకు వస్తుంది. సంకల్ప సిద్ధి పొంద గలుగుతారు. 

34. అదే విధముగా ప్రతి రోజూ కొన్ని మంచి విషయాలు నేర్చు కుంటూ ఉంటే అవసరానికి ఉపయోగ పడతాయి.

35. నిరంతరం నీవు దేనిని స్మరిస్తూ ఉంటావో ఆభావమే నీలో సంస్కారముగా మిగిలిపోతుంది . 
   
36. భ్రమరం కీటకాన్ని తెచ్చి మట్టి గూటిలో పెడుతుంది, దానికి చిన్న రంద్రం చేస్తుంది దాని చుట్టూ జుంకారం చేస్తూ తిరుగుతుంది. బయటకు రాలేక లోపల కీటకం తిరిగి తిరిగి భ్రమరంగా మారుతుంది. 

37. మహాదేవుని స్మరిస్తూ స్మరిస్తూ నందీశ్వరుడు ఆజన్మలోనే శివుని పొందినట్లు శివపురాణం చెపుతున్నది. 

38. జీవుడు తన వైనవి తెచ్చు కొనేది కర్మము-ధర్మము మాత్రమే,  మరణం మంగళ ప్రదం చేసుకోవాలి . 

39. కుంతి   పరమ భక్తురాలు జీవిత మంతా కృష్ణుని పార్ధిస్తూనే ఉంది. కనుక కుంతీ కుమారా అనిపించు కోవడం మంచిదని భగవంతుడే తెలియపరిచాడు. 

40. అందుకే తల్లిని బట్టి బిడ్డలకు సంస్కారము, తండ్రిని బట్టి ధైర్యము, విశ్వాసము, ఓర్పు నేర్పు ఉంటుందని భగవంతుడే తెలియపరిచాడు.            

41. గోపికలు కామంతో, శిసుపాలుడు, హిరణ్యకశిపుడు, శత్రుత్వంతో, కంసుడు భయంతో, యాదవులు బాంధ  వ్యంతో,  పాండవులు ప్రేమతో, మానవులు భక్తితో భగవంతుని ధ్యానించి జీవితాన్ని ధన్య పరుచు కుంటున్నారు. 

42. హృదయ క్షేత్రంలో కర్తవ్య కర్మలు నింతరం వెంబడి స్తూ ఉన్నప్పుడు శాంతి కలుగుటకు భగవంతిడ్ని ధ్యానించాలి. 

43. వ్యాపారి పోటీ సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కొవాలో ఆలోచిస్తాడు, డాక్టర్ ప్రాణాన్ని ఎలా బ్రతికించాలో ఆలోచిస్తాడు, కాముకుడు ఎప్పుడు ప్రేమను పొందాలని ప్రయత్నిస్తాడు.   

44. పనికి పని, స్మరణకు స్మరణ చేస్తూవుంటే మన:శాంతి  కల్పిస్తానని భగవంతుడే తెలియ పరిచాడు. 

45. దేవునికి పూలు పండ్లు, నీవికాదు, చెట్టుని గిల్లి తెచ్చినవి, సమర్పించుటే కాదు, నీకున్న  మనోబుద్దులు వదిలించు కోవాలి. 

46. నీవు ఉద్యోగం చేస్తున్నంత వరకు కార్యదక్షుడవై ఉండాలి, దేవుని సేవా కార్యక్రమములో పాల్గొని ప్రజల్ని కాపాడాలి . 

47. మనస్సు అభ్యాసమనే ఉపాయాన్ని ఆశ్రయించాలి, చిత్తం ఇతర విషయాలపై పోకుండా పరమాత్మ గురించి చింతించాలి. 

48. అభ్యాసము వల్లనే భారత దేశానికి పతకాలు తెస్తున్నారు, అభ్యాసము వల్లనే పరోక్ష సైనికులను ఎదుర్కొంటున్నారు, అభ్యాసము వల్లనే రక్షక దళాలు ప్రజలకు రక్షణ కల్పిసున్నారు. అట్లే అభ్యాసంతో కొలవండి. 

49. మనస్సు  వ్యామోహాలకు చిక్క కుండా, నిర్నీత సమయాన్ని కేటాయించుకొని అభ్యాసముతో భగవంతుని ప్రార్ధించాలి. 

50. గురువు యొక్క ఉపదేశా ననుసరించి పరధ్యాస చెంద కుండా, భగవత్ స్మరణ అలవాటుగా మార్చు కుంటే మరణం ముందు కూడా ప్రార్ధించగలుగుతారు.   

51. సూర్యుని చుట్టు గృహాలు, గ్రహాలు చుట్టూ ఉపగ్రహాలు తిరిగినట్లు, అంత రిక్షంలో సమస్త గ్రహాలు ఆధారం  లేకుండా ఉన్నట్లు,  భగవంతుడు మనలో ఉంటాడు. 

52. ఒక మనిషి గుమ్మడి తీగ క్రింద కూర్చొని దేవుడికి బుర్రలేదు,  అంటూ          ఎందు కంటే పెద్ద మర్రి చెట్టుకు చిన్న పండు, చిన్న తీగకు పెద్ద పండు అనగా ఒక ఎలుక గుమ్మడి  కొరికింది, అది జారి తలపై పడింది అంతే. 

53. మనల్ని ఎవరు చూడటం  లేదని అనుకోవటం తప్పు, మనకన్నా ముందు నుంచి ఉన్నవాడు ముసలివాడు కాదు, సర్వజ్ఞుడు.  మనమే దేవుని లీలలు తెలుసుకో లేని  ముసలివాళ్ళం.  

54. దేహేంద్ర మనోబుద్దులు వికసించిన అదుపులో ఉంచుకొన్న అది కుడా దేవుని ప్రతిభ అని గమనించాలి. 

55. ఆకాశానికి శబ్ద గుణం ఉన్నది కానీ కనిపించదు, అట్లాగే మనలో అనేక గుణాలు ఉన్నాయి అవి ఎప్పుడు ప్రభావితము ఆవుతాయో భగవంతునికి తప్ప ఎవ్వరికీ తెలియదు. 

56. దేహానికి భూమి ఆధారం, భూమికి జాలం ఆధారం, జలానికి అగ్ని ఆధారం, అగ్నికి వాయువు ఆధారం, వాయువుకు ఆకాశం ఆధారం, ఆకాశానికి పరమాత్ముడే ఆధారం. 

57. ప్రతి వస్తువుకు ఒక గుణం, రూపం, పదార్ధం ఉంటుంది అది మనస్సు ద్వారా గుర్తించ గలం. మనస్సును ఏర్పరిచింది భగవంతుడని గ్రహించాలి. 

58. మనసుతో కలిగి ఉన్న ఆత్మ రూపం మంచి చెడు, పుణ్యం పాపం, కీర్తి , అపకీర్తి , ధర్మం, అధర్మం, సార్ధం నిస్వార్ధం హెచ్చరిస్తూ తెలియ పరుస్తుంది అదే భగవంతుని లీల. 

59. పరమాత్మకు రంగు లేదు కానీ ఆదిత్య వర్ణుడు అంటారు.  సకల ప్రాణులలో వెలుగుని నింపేవాడు. 

60. సూర్యుడు చీకటిని చూపలేడు, కానీ పరమాత్మ చీకటిని అజ్ఞానాన్నీ చూపగలడు భగవంతుడు చీకట్లకు అతీత మైనవాడు. ప్రార్ధించితే వెలుగులు నింపువాడు.            
        
 నాకు డైరెక్టుగా నా బ్లాగుల్లో వ్రాసినవి పేస్ బుక్కు వారు అనుమతించుటలేదు. అనుకున్న ప్రకారముగా 5 రోజులు ఆగాను ఫలితము కనిపించలేదు. ఆ భగవంతుడే అధికారుల మనస్సు  మార్చగలరని ఊహిస్తున్నాను. (నా 11 బ్లాగుల్లో ఉన్నవి మీకు అందించుటకు వప్పుకోవటం లేదు,) అయినా  నేను కొత్తవి  పేస్ బుక్కులో పెట్టలేను), భగవద్ గీత సూక్తులు ఇక రోజు పోస్టు చేస్తాను. చదివి మీ  చెప్పఁగలరు.        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి