23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

భగవద్గీత - 8 వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగం

అక్షర పరబ్రహ్మ యోగం - అంతర్గత సూక్తులు (8/60 




51  నిరంతరం పరమాత్ముని ధ్యానిస్తూ ఉన్నవానికి స్థానం ఎటువంటిది?, ఫలితము ఏమిటో ? 




52 . మరణం అనేది ముగింపు కాదు, ఒక దేహాన్ని వదలి మరొక దేహానికి చేరటం, అనగా పాత బట్టను వదలి కొత్త బట్ట కట్టుకున్నట్లు 




53 నిర్మలమైన, నిశ్చలమైన మనస్సును రాగద్వేషాలకు, పాపపు వాసనలకు, విషయ వ్యామోహాలకు చిక్కకుండా దైవాన్ని ప్రార్ధించాలి.




54 . పగ్గంతో గుర్రాన్ని అదుపులో తెచ్చినట్లు, భక్తి అనే పగ్గంతో మనస్సు అనే గుర్రాన్ని  అదుపులో పెట్టుకోవాలి.        . 




55 . ప్రేమనే భక్తి అంటారు కానీ అది పవిత్ర మైన భక్తి కాదు. ఎందుకంటే భార్య యందు ఉండే ప్రేమను మొహం అంటారు, బిడ్డలపై ఉండే ప్రేమను వాత్సల్యం అంటారు   భగవంతునిపై, గురువుపై ఉండే ప్రేమనే ప్రేమ అంటారు. 




56 గురువుగారు విద్యనేర్పుతుణ్నప్పుడు అనుకోని విధముగా అనారోగ్యునిగా మారితే తక్షణమే శస్త్ర చికిత్స చేసినవాడే నిజమైన ప్రేమ కలవాడు. 




57 .యోగబలం కూడా ఉండాలి, అనగా  భృ మధ్యంలో  ప్రాణశక్తిని ధారాన చేసి నిలబడటమే. అనగా ముక్కులో సంచరించే ప్రాణవాయువును నిరోధించి, కనుబొమల మధ్య ప్రదేశమున నిలబెట్టడం. 




58 . దేహంలో ఉన్న పింగళనాడులు,వీటిలో ఉన్న ప్రాణశక్తి మూలాధార చక్రం, సాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం,అనాహత చక్రం, విసుద్ధ చక్రాలను దాటుకుంటూ ఆజ్ఞాచక్రం చేరిన ప్రాణ శక్తిని యోగం ద్వారా నిలబెట్టాలి. 




59  ఆజ్ఞా చక్ర సమీపములో సప్త కోశాలు ఉన్నాయి, భోధిని, నాద,అర్ద్,చంద్రికా,మహానాడు, కళా చంద్రికా, ఉన్మనీ చేరి పరమపురుషుని చేరుకుంటాడు.




60 . యోగులు కాని వారు కర్మకు బద్ధులై, కన్ను, ముక్కు, నోరు, చెవి, మొదలైన అదో మార్గాల ద్వారా ప్రణాలు వదలి మరో శరీరంలో చేరుతారు.  




61. వేద విదులైనవారు పరబ్రహ్మాన్ని అక్షరం అని చెబు తున్నారు, అంటే అక్షరం నాశనం లేనిది. 




62. ప్రపంచంలోని అన్నీ ప్రాణులు, పదార్దాలు అన్నీ  క్షరమే, క్షనికమైనవి అని గ్రహించగలరు. 




63. ఆత్మ విద్యను మొదట" ఓం" అనే అక్షరాన్ని దిద్దిస్తారు   ఆ తర్వాత నమ:శివాయ: అని దిద్దిస్తారు ఇదే అక్షర బ్రహ్మం. 




64. ప్రాపంచక విషయ వస్తువుల పట్ల, భోగాలపట్ల రాగాన్ని ఆసక్తిని వదలి వేయాలి. 




65. స్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అనేవి ఎందుకూ పనికిరావు. ప్రాతిభంధకాలును, అజ్ఞానా న్ని తొలగించు కొన్నప్పుడే పరమాత్మ అనుభూతి పెరుగు తంది.            




66. సోమరిపోతుకు ఆధ్యాత్మిక రంగంలో స్థానంలేదు. దృడ దీక్ష తో, పట్టుదలతో ప్రయత్నిమ్చిన వారికే ముక్తి- మోక్షం 




67. బ్రహ్మ చర్యం అంటే సాధారణ ఆర్ధం " వీర్య రక్షణం, సుఖ భోగాళ వైపు పోకుండా ఉండటం "




68. భగవంతుని యందు శ్రవణ, మనన, నిదిధ్యాసలతో బాటుగా జపము, ధ్యానము,ఆత్మ విచారణ, సాక్షి భావన, నిర్వకల్ప సమాధి సాధనాలే బ్రహ్మ చర్యం అంటారు.




69. ఓంకారో పాసన ఎలాచేయాలో, పరబ్రహ్మాన్ని అందు కునే సాధన లేమిటో తెలుసుకొని జీవించగలరు. 




7౦. ఇంద్రియాలను స్వాధీనములో ఉంచుకొని, మనస్సు హృదయాన్ని ఏకం చేసి, యోగ నిష్ట అవలంబించి, ప్రా ణమును సిరస్సు నందు ఉంచి, "ఓం " అనే 

ప్రణవాక్షరాన్ని ఉచ్చరిస్తూ దేహాన్ని వదలి ప్రయాణి౦చుట. 





71. మోక్షం అంటే అమ్మ పెట్టె తిండి కాదు, నాన్న ఇచ్చే ధైర్యముకాదు, డబ్బుతో కొనే వస్తువు కాదు. కానీ దేవుడు నన్ను మరవని వాన్ని నేను మారాను అన్నాడు. 




72. పడవ దిక్సూచి తూర్పు చూపించినట్లు, ఏ పని చేసిన చిత్తము పరమాత్ముని వైపే ఉంచాలి. 




73. పతివ్రత స్త్రీ ప్రేమ భర్త పై ఉంచినట్లు, పూజారి దక్షణ పై ప్రేమ ఉంచినట్లు, వ్యాపారి లాభంపే ప్రేమ ఉంచి నట్లు,    మానవులమై ఏపని చేసిన ప్రేమ దేవునిపై ఉంచాలి. 




74. కష్టం వచ్చినప్పుడు దేవున్ని తలచటం కాదు, సుఖంలో కూడా దేవుణ్ణి తలవాలి అప్పుడే మోక్షం ఉంటుంది.




75.  నేను జపం చేస్తున్నాను నే భావన లేకుండా దేవుని ధ్యానంలో ఉండి పరధ్యాస లేకుడా ఉండాలి. 




76. నన్ను చేరుకున్న ఉన్నతోన్నత మహానుభావులు మోక్షము పొంది, కష్టాలు పొందే పునర్జన్మ ఉండదు. 




77. పాపం చేస్తే సే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం, జ్ఞానం పొందితే మోక్షం అని భగవంతుడే తెలియపరిచాడు.  




78. బాల్యం, యవ్వనం, వృద్దాప్యం అనేవి మానవజన్మలో ఉంటాయి, అనుభవిస్తూనే దైవాన్ని ధ్యానించాలి. 




79. 7 ఊర్ధలోకాలకు వెళ్లి సుఖాలు, 7 అధోలోకాలకు వెళ్లి నరకాలు చేసిన పుణ్య పాపాలవల్ల అనుభవిస్తారు. 




80. నేను చేసేవాన్ని కాదు, అనుభవించే వాన్ని కాదు,

 నిరంతరము ఆత్మగా, సాక్షిగా ఉంటూ నిశ్చయజ్ఞానముతో    దైవాన్ని ప్రార్ధించే వాడ్ని అనుకోవాలి.   
81 .  ఆనందం తాండవిస్తూ ఉంటె కాలం తెలియదు అంటే యుగ మొక క్షణం, దుఖం వెంబడిస్తూ ఉంటె కాలం నిదానం అంటే క్షణ మొక యుగం. 





82. బ్రహ్మ పగలు 1000 యుగములు కలదానిగాను, రాత్రి 1000 యుగాలు కలదానిగాను ఎవరు తెలుసు కుంటారో వారే అహో రాత్రములు ఎరిగినవారు. 




83. కృత, త్రేతా, ద్వాపర,కలియుగములు అను 4 కాల ప్రమాణమునకు దివ్య యుగమని పేరు. 




84. సంవత్సర కాలమానము దేవతలకు ఒక దినము, 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల, 360 సంవత్స రములు దేవతలకు ఒక దివ్య సంవత్సరము. ఇట్లే 12000 సంవత్సరములు ఒక దివ్య యుగము. 




85. భక్తి శ్రద్ధలతో నిరంతరము  భగవంతుని తలుస్తూ ఉండుట బుద్ధిమంతులు లక్షణం. 




86.  నిద్రలో మనము సంసార  లయమై పోయి మళ్ళీ జగత్ లో ఎలావస్తున్నామో,  బ్రహ్మ సృష్టి కూడా మళ్ళీ వ్యక్త మవుతుంది.    




87. ప్రాణులు ప్రళయంలో అవ్యక్తులై, కల్పంలో వేరువేరు దేహాలలో వ్యక్త మవుతారు. 




88. మనోబుద్ధులు, ఆశలు, ఆశయాలు, సంకల్పాలు మారుతాయి కానీ సీసాలు రంగు మారినా దానిలో ఉండే పాలు రంగు మారదు. 




89. మానవ జన్మలో మనిషిగా ఏ కర్మలు చేస్తున్నాడో, బుద్దిగా ఏమి ఆలోచిస్తున్నాడో, మనస్సులో ఏమి భావిస్తున్నాడో ఆ వాసనలు వెంబడిస్తాయి మరోజన్మకు .




90. ఆకలైనంత వరకే అన్నం తినగలుగుతాము , అట్లే కర్మ బంధాలు ఉన్నంత వరకే ప్రాణులు రావటం- పోవటం   జరుగుతుంది , అదే బ్రహ్మ సృష్టి, అందుకే భగవానుడు నిరంతరం భగవద్ ధ్యానంలో ఉంటే జననం అనేది ఉండదు .        

                             
91. మనం సుఖంగా ఉన్నా మంటే పూర్వం చేసిన పుణ్యం, దు:ఖంగా ఉన్నామంటే పూర్వం చేసిన పాపం, ఏది ఏమైనా ఈజన్మలో చేసిన పుణ్యం మరోజన్మ లేకుండా చేస్తుంది. 





92. ఈ జగతి అంటా మాయను కప్పి యుంటుంది. కానీ పరమాత్మ పారమార్ధిక సత్యం, ఇది త్రికాలాలో ఉంటుంది. 




93.  పరమాత్మముకు ఏ ఆశ్రయము అవసరంలేదు, స్వర్వత్రా ఇంద్రియ గోచరమై ఉంటుంది. 




94. మాయ అనేది అజ్ణానమ్ ఉన్నంత వరకే, అజ్ఞానం నశిస్తే అన్ని మాయం. 




95. సర్వభూతాలు నశించినా ఈ పరమాత్మ - అక్షర పరబ్రహ్మం నశించేది కాదు. సర్వలోకాలు, ఉన్న లేకున్నా ఇది ఉంటుంది. 




96. ఒక స్కూల్లో లెక్కల మాష్టర్ నల్లబల్లపై లెక్కలు చెపుతాడు, తర్వాత సైన్సు మాష్టర్ వచ్చి చిత్రం గీసి వివరిస్తాడు. నా తుడిచినా నల్ల బల్ల అట్లాగే ఉంటుంది. 




97. కష్టాలు నష్టాలు వచ్చిన మీ మీద పరమాత్మ దృష్టి ఎప్పటికీ మారదు. మీరు పరమాత్మను మరువకుండా చూసుకోవాలి . 




98. పునర్ జన్మ వద్దనుకున్నవారు, జన్మ రాహిత్యం సఫలం కావాలను కున్నవారు ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. 




99. పరమాత్మే పరం ధామం, ఆ పరమాత్మే మన స్వస్థానం, అక్కడకు చెరీతే జన్మ అనేది లేదు. 




100. ఈ 14 లోకాలు బ్రహ్మాండం అంతా పరమాత్మలోనే ఉన్నది. ఆ పరమాత్మ చైతన్యమే మన జీవితం.       


111. అలలన్నీ సముద్రములో ఉన్నట్లుగా, ఆభరణాలన్ని బంగారంలో ఉన్నట్లుగా, స్వప్నలోకమంతా మేలుకున్న వాని మనసులో ఉన్నట్లుగా, ప్రాణులతో కూడిన బ్రహ్మాండ మంతా పరమాత్మలో ఉన్నది. 





112. పాలలో వెన్నలాగా, నువ్వుల్లో నూనెలగా మనుష్యుల్లో అంతర్గతంగా పరమాత్ముడే ఉన్నాడు . 




113. నిరంతర పరామత్మ చింతన వల్లనే దానివలన జ్ఞాన విచారణా శక్తి లభించి మోక్షం కలుగుతుది. 




114. ఋషులు, మహర్షులు, మహాత్ములు చెప్పిన బోధలను   గ్రహించి ఆచరించుటే నిజమైన జీవితం. 




115. జ్ఞానులు, ఆత్మజ్ఞానులు, జీవన్ముక్తులు జ్ఞాన విచారణ ద్వారా/వివరణ తెలియపరిచేవారు నరరూపములో ఉన్న నారాయణులు. 




116.  సమస్తకర్మలు జ్ఞానాగ్నిలో దగ్దమవుతాయి, వీరికి విధి నిషేధాలు ఉండవు, వారు చెప్పేది వేదం, వారు నడిచింది శాస్త్రం, వారు మునిగిందే గంగ, వారు ఉన్నదే కాశి. 





117. సగుణ బ్రహ్మొపాసన, ఓంకారోపాసన చేస్తూ, నిత్య నైతిక కర్మలు చేస్తూ, ఫలాపేక్ష, సంగభావం లేకుండా జీవభావంతో ఉన్నవారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. 





118. దానధర్మాలు, యజ్ఞయాగాదులు, పరోపకారాలు, పూజాపురస్కారులు చేసేవారు ఫలాపేక్షతో చేస్తే పితృ లోకానికి చేరు కుంటారు. 





119. పితృలోకంలో సుఖం తర్వాత మరలా జన్మ ఎత్తేందు కు భూలోకానికి వస్తారు.





120. కొందరికి కడుపే కైలాసం, పరోపకారం, దయ, కరుణ అంటే ఏమిటో వీరికి తెలియదు, వీరు నర రూపంలో ఉండే మృగాలు వీరు చనిపోగానే ఇక్కడే మారో దేహాన్ని పట్టు కుంటారు . 

                                           
121. జ్ఞానాన్ని బట్టి, చేసిన కృషిని బట్టి, సంస్కారాలు కోరికలు అభిరుచులు, ఉంటాయి.

122. కాలం అనగా అంత్యకాలం అనే ఒక అర్ధం ఉన్నది, మరియొకటి మార్గం అని కూడా ఉన్నది. ఉన్న మార్గాన్ని తెలుసుకొని మనిషి ఎదగాలి అని తెలియపరిచారు. 





123. మొదటి మార్గం అగ్ని, వెలుగు అందించి దహించే గుణము ఉన్నది, మనలో ఉన్న వేడిని తగ్గిన్చుకొని, చల్లని తెల్లని మంచులా వెలుగు అందించాలి. 





124. అగ్ని అంటే అగ్ని అభిమాన దేవత, పగలు అనే పగలు అభిమాన దేవత, శుక్లపక్షం అనే శుక్లపక్ష అభిమాన దేవత, ఉత్తరాలయిన అంటే ఉత్తరాయణ దేవత, సహకరిస్తూ, ప్రాణాన్ని బ్రహ్మలోకానికి ముందు చేరుస్తారు, ఈ దేవతలు ఒక చోట నుండి మరియొక చోటుకు ప్రాణాల్ని మారుస్తారు. 

125. ప్రాధాని వస్తున్నారంటే వార్త అంచలంచలుగా అధికారులు ఏం చేయాలో అలోచించి మరీ చేస్తారు,  అట్లాగే చేసిన ఖ్ర్మలు బట్టి దేవతలు సహకరిస్తారు.

126. ఆత్మజ్ఞానమ్ కోసం ప్రయత్ని౦చే వారు, త్యాగశీలు రైనవారు సర్వసుఖాలు అనుభవించి మరలా పుడతారు, కారణం ఫలాపేక్షతో చేసినారు గనుక. 

127.  జీవుడు మరలా మేఘమండలములోని వర్షపు బిందువుని అంటి పెట్టుకొని ఉంటాడు. వర్షముద్వారా భూమికి చేరి విత్తనంలో చేరుతాడు. 

128. ఏ దంపతులు ఆ వరి కంకులను వండు కొని తింటారో.   పురుషుడే భుజించిన దానిలో జీవుడు చేరి, వీర్యముగా మారి స్త్రీ గర్భంలో చేరుట యే వారి కర్మాను సారం పుట్టుక జరుగుతుంది. 

129. స్త్రీ గర్భంలో 9 నెలలు ఉండి వివిధ దశలలో శరీరము ఏర్పడి శిశువుగా జన్మించటం  జరుగుతుంది.              .               


130. దైవఘటన వళ్ళ ఏ అన్నం ఎవరి ప్రాప్తియో వారికే చేరుతుంది. ఏ స్త్రీ పురుషులు భార్య భర్తలు అవుతారో ఎవ్వరు గమనించలేరు. 


అక్షర పరబ్రహ్మ యోగం - అంతర్గత సూక్తులు 
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ 



131. నోటిదగ్గర పెట్టుకున్న ముద్ద నోటిలోకి పోతుందో లేదో తెలుసుకో లేరు, పెళ్లైన మాత్రాన పిల్లలు పుడతారని నమ్మకము లేదు, కన్న పిల్లలే తల్లి తండ్రులను ఆదుకుంటారని నమ్మకము లేదు. 


132. రాష్ట్ర విభజన జరుగుతుందని ఎవరికీ తెలియదు, నేను డిప్యూటీ డైరక్టరుగా (ఇంచార్జి) చేసి  మరలా 58 సంవత్సరాలు నిండి, మరలా మోడల్ స్కూల్ అకౌంట్స్  ఆఫీసర్ గా రావటము కూడా దైవ సంకల్పమే అను కుంటున్నాను.

133. సాధకున్నీ చేసే లక్ష్యాన్ని బట్టి ఒకటి శుక్లగతియని, మరొక దానిని కృష్ణ గతి యని అన్నారు. కృష్ణ  అనగా నలుపు చీకటి, శుక్లమ్ అనగా తెలుపు అదే వెలుగు. అందుకే నేను ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుతాను.   

134. వెలుగుతో సాధకున్నీ ఉన్నత స్థానానికి చేరుస్తుంది. చీకటిలో సంసారం జనన మరణ చక్రములో ఇరికిస్తుంది. 

        

135. మొదటిది ముక్తిని కలిగించే మార్గం, రెండవది రెండవది భందములో ఇరికించే మార్గం రెండుమార్గాలలో ప్రయాణించటమే మానవ జీవితం. 


136. కేవలము భవబంధాలను తెంచుకొని వెలుగుని ఆరాధించి ముక్తి పొందిన వారికి పునర్ జన్మ ఉండదు. సీకటిలో భవబంధాలలో చిక్కి ధర్మశాస్రాలను బోధించినవారు, న్యాయ మార్గాన నడిచిన వారు,  సత్యాన్ని అనుకరించిన వారు  సత్య లోకానికి చేరుకోగలరు.        

               
137. మంచి చేదు, చీకటి వెలుగు, విషం అమృతం మీకు అందుబాటులో ఉంచారు  మరువకుండా నావు సాధకుడుగా నిత్య ప్రయత్నంలో నీవు దేనిలో సుఖము ఉన్నదో దాన్ని గ్రహించు లేదా మాయ నిన్ను కప్పి వేస్తుంది .

138. ఓంకారోపాసన, సగుణోపాసన, నిరంతరం పరమాత్మ స్మారణ దీనికి చదువుగాని, అంగబలం కానీ, అర్ధ బలము కానీ గొప్ప తెలివి అవసరము లేదు. 

139.    శాస్త్రం పట్ల, గురువు పట్ల విశ్వాసం అత్యున్న స్థానం పొందాలని పట్టుదల ఉంటె చాలు . 

140. సమయాన్ని బట్టి, అవకాశము బట్టి, దాన్ధధర్మాలు చేయాలి. అపార్ధం చేసుకోకుండా స్వార్ధం విడనాడి త్యాగం తో తనకున్నదానిలో పరమాత్ముని తలుస్తూ ఇతరులకు సహాయపడుటయే నిజమైన మోక్ష మార్గం అని గమనించగలరు. 

ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అర్ధభావాన్నిధ్యానిస్తూ, జీవుడికి ఆధారమైన పరమాత్మను ధ్యానిస్తూ ,  వదలిన యోగి అక్షరుడైన పరబ్రహ్మాన్ని చేరుకొనే ఉపాయాన్ని తెలిపిన  
అక్షర పరబ్రహ్మ యోగ నామ ఆశ్డమోధ్యాయః సమాప్తము       
ఎందరో మహానుభావులు అందరికి వందనములు, ఆ పరమాత్ముని  కృపకు  ప్రతి ఒక్కరు పాత్రులే 
          
                                     . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి