22, నవంబర్ 2019, శుక్రవారం


ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన గొప్ప ఆరోగ్య సూత్రాలు.. తప్పకుండా చదివి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని మా ఆశ...

సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు

ఆయుర్వేదం అనేది ఒక పురాతన జీవ విజ్ఞాన శాస్త్రం, ఇది సరైన ఆహారం మరియు జీవనశైలి ద్వారా ఆరోగ్య పరిరక్షణ , వ్యాధుల నివారణ మరియు వివిధ చికిత్సా పద్ధతులద్వారా వ్యాధుల చికిత్స చేయడానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ విధంగా ఆయుర్వేదం యొక్క మూలభూత సిద్ధాంతాలైన "స్వస్థస్య స్వాస్థ్య రక్షణమ్" అనగా ఆరోగ్యవంతుని ఆరోగ్య పరిరక్షణ మరియు “ఆతురస్య వికార ప్రశమనం" అనగా వ్యాధి పీడితునియొక్క వ్యాధి తగ్గించడం అనే వానిని ప్రసాదిస్తుంది. ఆరోగ్యప్రదమైన జీవితాన్ని పొందడానికి ఆయుర్వేదాన్ననుసరించి క్రింద పేర్కొన్న ఆహార మరియు జీవనశైలికి సంబంధించిన వానిని పాటించాలి.

1). ఉదయం నిద్రలేవడం (ప్రాతరుత్థానము):
ఉదయం సూర్యోదయానికి రెండు ఘంటల ముందుగా (బ్రాహ్మ ముహూర్తములో) నిద్ర లేవాలి. ఈ సమయం రోజులో అత్యంత స్వచ్ఛమైన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో శరీరం మంచి విశ్రాంతిని పొంది ఉంటుంది మరియు మనస్సు అప్రమత్తంగా, ఏకాగ్రతతో, ప్రశాంతంగా ఉంటుంది.
నిషేధం - అజీర్ణం మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్నపుడు ఉదయం నిద్రలేవడం మంచిది కాదు.

2). ఉదయం నీరు త్రాగడం (ఉషఃపానము) :
ఉదయం నిద్ర లేచిన తరువాత, చేతులు మరియు కాళ్ళు కడగి, రాగిపాత్రలో లేదా మట్టి పాత్రలో ఉంచిన సాదా నీరు లేదా గోరు-వెచ్చని నీరు నాలుగు దోసిళ్ళు/అంజలుల (ఒక అంజలి = 192 ml) ప్రమాణంలో త్రాగవలెను.
ఉపయోగాలు - ఉదయాన్నే క్రమపద్ధతిలో నీటిని సేవించే అలవాటువల్ల ప్రేవుల యొక్క కదలికలు వాటి సహజ దిశలో సక్రమంగా జరుగుతాయి మరియు మల, మూత్రములు సాఫీగా బయటకు వెడలుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది మరియు జీర్ణకోశ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. దీనివల్ల వృద్ధాప్య లక్షణాలు పిన్నవయస్సులోనే రాకుండా అరికట్టబడతాయి.

3). మల-మూత్ర విసర్జన :
 ఉదయాన్నే , మల-మూత్రాలను విసర్జించే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఉపయోగాలు- క్రమ పద్దతిలో మల, మూత్ర విసర్జన వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. మల, మూత్రాలను బలవంతంగా ఆపే వివిధ రకాల వ్యాధులు కలుగుతాయి.

4). దంతములు మరియు నాలుక శుభ్రపరచుకోవడము (దంతధావనము/జిహ్వా నిర్లేఖనము):
 మల,మూత్ర విసర్జన తరువాత కాళ్ళు, చేతులు శుభ్రంచేసుకొని తరువాత దంతములను శుభ్రం చేయడానికి వగరు, కారం, చేదు రసం కల జిల్లేడు (అర్క), వేప (నింబ), మర్రి (న్యగ్రోధ), చండ్ర (ఖదిర), కానుగ (కరంజ) మొదలైన వాటి కొమ్మ పుల్లలను వాడవలెను. దంతధావనము చేసిన తరువాత అర్ధచంద్రాకారంలో ఉన్న టంగ్ స్క్రాపర్ తో నాలుక గీయవలెను. త్రిఫలా (కరక్కాయ/ హరీతకీ, తానికాయ/విభీతకీ, ఉసిరి/ఆమలకీ), త్రికటు(శుంఠి, మిరియాలు/ మరిచ మరియు పిప్పళ్ళు) పొడి మొదలైన వానికి తేనె చేర్చి కూడా పళ్ళు శుభ్రం చేసుకోవచ్చు.
ఉపయోగాలు - దంతాలు క్రమం తప్పకుండా శుభ్రపరచడం వల్ల దంతాలపైన పేరిన మురికిని తొలగిస్తుంది మరియు ఆహారసేవనపై ఆసక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది.
* పళ్ళు మరియు నాలుకను శుభ్రపర్చిన తరువాత, నీటిలో ఉప్పును కలిపి పుక్కిలి పట్టడాం లేదా చిగుళ్ళను రుద్దడం ద్వారా చిగుళ్ళు, నోరు మరియు గొంతు ఆరోగ్యంగా ఉంటాయి.

5). నస్యకర్మ :
ప్రతి ఉదయం, 3-5 చుక్కల నువ్వుల నూనె, నెయ్యి లేదా అణుతైలము వంటి ఔషధ సిద్ద తైలమును ముక్కు పుటల్లో వేయాలి.
ఉపయోగాలు- ప్రతిరోజు క్రమం తప్పకుండా నస్యకర్మ చేయుటవల్ల నేత్రములు, చెవులు, ముక్కు, తల మరియు భుజములకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందు. చర్మం పై మడతలు పడుత, బట్టతల, తల నెరియుట మొదలైనవి నివారిస్తుంది. దీనివల్ల తలనొప్పి, పక్షవాతము, సైనసైటిస్, మానసిక వికారలు, స్పాండిలైటిస్ మరియు చర్మ వికారాలు మొదలైన వ్యాధులు తగ్గుతాయి, బడలిక దూరమవుతుంది, చూపు మెరుగవుతుంది మరియు దంత దార్డ్యము పెరుగుతుంది.
నిషేధం - నస్య కర్మ, విష ప్రభావం ఉన్నపుడు, అజీర్ణం, శ్వాసకోశ వ్యాధులతో బాధ పడేవారిలో, మరియు గర్బిణీ
స్త్రీలలో నస్యకర్మ చేయకూడదు.

6). గండూష ధారణం :
ఔషధాల ముద్దతో కలిపిన గోరివెచ్చటి లేదా చల్లటి నీరు / నువ్వుల నూనె / నెయ్యి / చల్లని పాలు / తేనె / తేనెతో కలపబడిన నీటిని కళ్ళనుండి, ముక్కు నుండి నీరు వెలువడేవరకు నోటిలో పుక్కిట పట్టవలెను లేదా ఇక్కడ పేర్కొన్న పదార్దములను నియమిత సమయం వరకు పుక్కిలించి ఉమ్మివేయవలెను.
ఉపయోగాలు- గండూషము వలని జ్ఞానేంద్రియముల పటుత్వం పెరుగుతుంది, చర్మంపై ముడుతలు తొలగి పోతాయి, వెంట్రుకలు తెల్లబడుట ఆలస్యం అవుతుంది, ముఖముపై, కళ్ళ క్రింద నల్లటి చారలు తొలగిపోతాయి. చర్మంయొక్క గరుకుతనం నివారింపబడుతుంది, అధిక లాలాస్రావం తొలగిపోతుంది, ముఖంపై పొడిదనం (శుశ్కత్వం), ముడుతలు, ఆతురత, చలించే దంతాలు, నోటి సంబంధమైన వ్యాధులు, అరుచి, గొంతులో గరగర మొదలైన వ్యాధులు తగ్గించడానికి లాభదాయకంగా ఉంటుంది.

7). నూనెతో మర్దన (అభ్యంగము) :
పైన పేర్కొన్న ప్రక్రియ పూర్తయిన తరువాత, మొత్తం శరీరాన్ని మరియు ప్రత్యేకంగా తల, చెవులు మరియు పాదాలను నువ్వుల నూనె / ఆవాల నూనె / కొబ్బరి నూనె లేదా ఔషధాలతో తయారు చేసిన నూనెలతో మర్దన (మాలిష్) చేయవలెను.
ఉపయోగాలు- అభ్యంగము వలన చర్మము, మాంసము, కండరములయొక్క మృదుత్వము, కోమలత్వము పెరుగుతాయి, కీళ్ళు సడలకుండా ఉంటాయి, రక్త సంచారము పెరుగుతుంది, తల మరియు నుదురుభాగం దృఢంగా తయారవుతాయి మరియు వెంట్రుకలు నల్లగా, పొడుగ్గా మరియు వెంట్రుకల మూలాలనుండి దృఢంగా తయారవుతాయి. చక్కగా నిద్ర పట్టడానికి సహాయ పడుతుంది, వినికిడి శక్తి పెరుగుతుంది మరియు ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడుతుంది.
* ప్రత్యేకంగా రాత్రి సమయంలో పాదాభ్యంగం చేయడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది, అలసట తొలగిపోతుంది, పాదాల యొక్క కారిన్యం నుండి ఉపశమనం కలుగుతుంది.

8).వ్యాయామము :
 ఆరోగ్యంగా ఉండడానికి ప్రత్యేకంగా వసంత ఋతువులో మరియు చలికాలంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నుదుటిపై మరియు చంకలలో చెమట వచ్చేవరకు మరియు నోటిలో తడి ఆరిపోతున్నట్లుగా అనిపించేవరకు వ్యాయామము చేయాలి.
ఉపయోగాలు- వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, వ్యక్తి యొక్క అంతర్గత శక్తి బలపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్రమబద్ధంగా నడక అలవాటు చేసుకొన్నట్లయితే జ్ఞాపక-శక్తి పెరుగుతుంది, జీర్ణ-శక్తి మరియు ఇంద్రియ పటుత్వం పెరుగుతుంది.
జాగ్రత్తలు- దగ్గు, టీ.బీ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు, ఎండకాలంలో, అధిక ఉష్ణోగ్రత ఉన్నపుడు, వర్షాకాలంలో వ్యాయామము యొక్క పద్ధతులను జాగ్రత్తగా ఎంచుకోవాలి.

9). వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించుకోవడము (క్షౌర కర్మ) : గడ్డం గీచుకోవడం, తల వెంట్రుకలు, గోళ్ళు మొదలైన వానిని క్రమం తప్పకుండా ఐదు రోజులకు ఒకసారి కత్తిరించుకోవాలి.
ఉపయోగాలు- క్షౌర కర్మ ద్వారా శరీరంలో తేలికదనం, ఉత్సాహం పెరుగుతాయి.

10). ఔషధ ద్రవ్యాలతో కూడిన పొడితో నలుగుపెట్టుకోవడము (ఉద్వర్తన) :
వ్యాయామము తరువాత శరీరము మరియు వెంట్రుకల పై వ్యతిరేక దిశలో ఔషధాల పొడితో మర్ధించాలి.
ఉపయోగాలు- ఉద్వర్తన చేయడం వలన, చర్మాన్ని శుభ్రం చేయడానికి, శరీర అవయవాలు గట్టిపడడానికి, చర్మం యొక్క రంగు మెరుగుపడడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్వర్తన, దురద వంటి చర్మ సంబంధమైన వ్యాధులు యొక్క చికిత్స చేయడం లో కూడా లాభదాయకంగా ఉంటుంది.

11). స్నానము :
ఔషధయుక్తమైన పొడితో మర్దన చేసిన పిమ్మట సమ శీతోష్ణమైన అనగా చాలా వేడి లేదా చాలా చల్లగా లేనటువంటి నీటితో స్నానం చేయాలి.
ఉపయోగాలు-స్నానం వల్ల శరీరం యొక్క మలినాలు తొలగిపోతాయి, చెమట, దురద మొదలైనవి తొలగిపోతాయి, దప్పిక, అలసట వంటి బాధలు తొలగిపోతాయి. దీనివల్ల ఆకలి, వయస్సు, సాహసం మరియు శారీరిక శక్తి పెరుగుతాయి. వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల బలం పెరుగుతుంది, కానీ వేడి నీటిని తలపైన పోయకూడదు, ఎందుకంటే దీనివల్ల కళ్ళకు ఎల్లప్పుడు చాలా హాని కలుగుతుంది.
నిషేధం - మూతివంకరపోవడం (అర్ధిత వాతం), కంటిజబ్బులు, నోరు, ముక్కు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, సైనసైటిస్, అజీర్ణం, విరేచనాలు మొదలైన వానితో బాధపడే వ్యక్తులు స్నానం చేయకూడదు. అదేవిధంగా భోజనం చేసిన వెంటనే స్నానము చేయకూడదు.

12). ధ్యానము -
ప్రతిరోజూ కొద్ది సమయం పాటు ప్రశాంతత మరియు స్వచ్చమైన పరిసరాలలో కూర్చొని ధ్యానం చేయాలి. ఆత్మపరిశీలన చేసుకొనే ప్రయత్నం చేయాలి. ధ్యానం మన దైనందిన జీవనంలో ప్రముఖమైన స్థానం కలిగి ఉంది. ధ్యానం చేయడం వల్ల, వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడానికి ఎంతో వీలు ఉపయుక్తంగా ఉంటుంది.

13). ఆహారాన్ని సేవించే విధానము
ఆహార సేవన నియమాలు
.A) ఆహారసేవన, వ్యక్తి నివసించే ప్రదేశము, కాలము, ఋతువు/ వాతావరణ పరిస్థితులు మరియు వ్యక్తిగత అలవాట్లననుసరించి చేయవలసి ఉంటుంది.
B). ఆహారంలో ఆరు రుచులు అనగా- తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు మొదలైన వానితో కూడి మరియు జీర్ణ-శక్తిననుసరించి సరియైన ప్రమాణములో మరియు సమతుల్యమైన పోషక తత్త్వాలతో కూడి ఉండవలెను. తినే ఆహారం చాలా వేడిగా లేదా చల్లగా ఉండకూడదు.
C). ఆహారాన్ని చక్కని, శుభ్రమైన పాత్రలలో ఉంచి, శాంతియుతమైన మరియు సౌకర్యవంతమైన సరైన స్థలంలో కూర్చొని విశ్రాంతిగా భోజనం తీసుకోవాలి.
D) .ఆహారం పదార్థాలలో ఉన్న కఠిన పదార్థాలను సరిగ్గా నమిలి తినాలి.
E). ఆహారాన్ని చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా తినకూడదు. మాట్లాడటం, నవ్వుట లేదా టెలివిజన్ చూస్తున్నప్పుడు ఆహారం తీసుకోవద్దు.
F). ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు వ్యాధి నిరోధకతను పెంపొందించడానికి ప్రతి రోజూ క్రమం తప్పకుండా పోషక ఆహారం తీసుకోవాలి.
G). భోజనం ప్రారంభంలో తీపి రుచికల పదార్థాలు (పండ్లు మొదలైనవి), మధ్యలో పులుపు, ఉప్పు రుచికల పదార్థాలు, చివరగా చేదు, కారం, వగరు రుచులు కల తినుబండారాలను తీసుకోవాలి. రాత్రి సమయంలో పెరుగు తినకూడదు.
H). ఆహారాన్ని తీసుకునే ముందు మరియు ఆహారాన్ని తీసుకున్న తరువాత కనీసం 15 నిముషాల పాటు నీరు త్రాగకూడదు. భోజనం చేసే సమయంలో నీరు అవసరమైతే అది కొద్ది పరిమాణంలో తీసుకోవచ్చు.
I). కొద్దిగా చమురుతో కూడిన భోజనం తినడం ద్వారా జీర్ణక్రియ సులభతరమవుతుంది మరియు పోషకాంశాలు చక్కగా శరీరంలో ఇముడుతాయి. చమురు పదార్థాలు తీసుకునేటప్పుడు అధిక మాత్రలో తీసుకోకుండా జాగ్రత్త పడాలి.
J). రాత్రి భోజనం యొక్క ప్రమాణం మధ్యాహ్న భోజనంలో తీసుకునే పరిమాణం కన్నా తక్కువగా తేలికగా జీర్ణమయ్యేదిగా ఉండాలి. రాత్రి భోజనాన్ని నిద్రకుపక్రమించేందుకు మూడు గంటల ముందుగా సేవించాలి. రాత్రి భోజనం చేసిన తరువాత ప్రతి రోజూ వంద అడుగులు నడవాలి, తరువాత ఎడమవైపుకు తిరిగు పడుకోవాలి.
K). పరస్పర వ్యతిరేక గుణాలు కలిగిన ఆహార పదార్ధాలను ఉదా. పాలు+చేపలు, ఉడకని+ఉడికిన పదార్థాలను తిన కూడదు. ఇంతేకాకుండా ఉప్పు, పాలు; వేడి చేసిన తేనె; సమపాళ్ళలో తేనె, నెయ్యి తినకూడదు. పిండి వంటలతోపాటు మరియు ఆలుగడ్డ మొదలైన వానితో ఫలాలను తినకూడదు.
L). తిన్న వెంటనే మానసికంగా మరియు శారీరికంగా శ్రమ కలిగించే క్లిష్టమైన పనులను చేయకూడదు. భోజనం సరిగ్గా జీర్ణమవడానికి సహకరించేలా కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం శ్రేయస్కరం.

14). నిద్ర :
రాత్రి 6-7 ఘంటల పాటు నిద్ర పోవాలి, అదే సమయంలో పిల్లలు, వృద్ధులు అధిక సమయం పాటు నిద్ర పోవాలి.

ప్రత్యేకంగా వసంత ఋతువులో మధ్యాహ్నం పూట నిద్ర పోకూడదు మరియు రాత్రి సమయంలో అధిక సమయం పాటు పడుకోకూడదు. ఏదైనా ప్రత్యేక పరిస్థితులలో ఎవరైనా రాత్రి సమయం మేలుకొని ఉండవలసి వస్తే ఆ వ్యక్తి పగలు కొద్ది సమయం పాటు పడుకోవచ్చు.

అధిక ఉష్ణోగ్రత, వర్షం మరియు శరదృతువులలో పగలు నిద్ర పోవచ్చు, కానీ చలికాలం పగలు నిద్ర పోవడం వల్ల జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి.

రాత్రి పడుకునే ముందు, తల, అరచేతులు మరియు అరికాళ్ళపై సున్నితంగా మర్దన చేసుకోవలెను.
15). నైతిక నియమాలు :
A). ప్రతి వ్యక్తి అందరికీ సుఖ శాంతులను ప్రసాదించడానికి ప్రయత్నం చేయాలి మరియు ఇరుగు పొరుగు వారికి, మన శ్రేయస్సు కోరేవారితో సద్భావనతో మెలగడానికి ప్రయత్నించాలి. వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకొనే వారితో దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి.
B). శారీరిక, మానసిక మరియు మౌఖిక పాపములను అనగా దొంగతనం చేయడం, అబద్ధం చెప్పడం, అసూయ, అహంకారము, దుఃఖము మరియు దురాలోచనలు మొదలైనవానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.
C). ప్రతి వ్యక్తి బుద్ధిమంతులను, సుశిక్షుతులను మరియు వృద్ధులను గౌరవించాలి.
D). అసంబద్ధమైన పనులను చేయకూడదు.
E). ప్రతి వ్యక్తి తన చర్యలను ధర్మం, అర్థం, కామం, మొదలైన పురుషార్థాలకు అనుగుణంగా ప్రణాళికా బద్దంగా మలచుకోవాలి.
F). ఎవరు కూడా ఏదో ఒక పదార్థానికి లేదా వస్తువుకు బానిస కాకూడదు మరియు మద్యపానం, ధూమపానం మొదలైన దుర్వ్యసనాలకు దూరంగా ఉండవలెను.
G). ఎల్లప్పుడూ వినయపూర్వకంగా, నిజాయితీతో, మర్యాదపూర్వకమైన స్వరంతో మాట్లాడవలెను.
H). ఎల్లప్పుడూ మన బాధ్యతలను బేరీజు వేసుకొని, మానసిక, ఆత్మిక మరియు ఆంతరిక స్థితిని విశ్లేషణ చేసుకోవాలి.
I). ప్రతి వ్యక్తి భగవంతుని పట్ల / సర్వోచ్చ శక్తి పట్ల విశ్వాసాన్ని సమర్పణ భావనను కలిగి ఉండాలి.
J). సమాజానికి ఆమోదయోగ్యం కాని, ఏ విధమైన చెడు సహవాసాలతో పాల్గొనకూడదు.
K). ఇతరుల పొరపాట్లను క్షమించి, వారి తప్పులకు సరిదిద్దుకునేందుకు సరియైన దిశా నిర్దేశం చేసేందుకు ప్రయత్నించాలి.
L). ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించాలి.

పై నియమాల్ని ఎవరైతే తప్పకుండా పాటిస్తారో వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావు..

✍️మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం మాతో నడవాలి అనుకునే మిత్రులు మాతో ఏకీభవించి ఒక కామెంట్ పెట్టగలరు. దానికి మా సమాధానం కూడా ఇవ్వబడును. 🙏

💐💐మీ సేవలకై మా సిబ్బంది 24×7 సిద్ధంగా వుంటారు..
మా ఫోన్ : 6304579630
వాట్సాప్ : 9705569901
 సమస్య ఏదైనా సరే ఒకసారి మాతో చెప్పండి. మీకు మా సలహాలు నచ్చి మా మందులను తీసుకోవాలి అనిపిస్తే తీసుకుని వాడండి.. ఆ తర్వాత మీకే తెలుస్తుంది. ఒకవేళ మా వద్ద మందులు తీసుకోవడం మీకు ఇష్టం లేకపోయినా మేము ఇచ్చే విలువైన సలహాలను తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..🙏🙏

--(())--


శివ

 శతకం:
1.ప్రభుం ప్రాణ నాథం, విభుం విశ్వ నాథం,
జగన్నాథ న్నాథం, సదానంద భాజం;
భవద్భవ్య భుతేశ్వరం భూతనాథం,
శివం శంకరం శంభు మీశాన మీడే.

2.గళే రుండమాలం, తనౌ సర్పజాలం,
మహాకాల కాలం, గణేసాది పాలం;
జటాజూటగంగోత్త రం గైర్వి శిష్యం,
శివం శంకరం శంభు మీశాన మీడే.

3.ముదామాకరం మండనం మండయంతం,
మహామండలం భస్మభుశాధరం తం;
అనాదిం హ్యపారం మహామోహమారం,
శివం శంకరం శంభు మీశాన మీడే.

4.వటాధోనివాసం మహాట్టాట్టహాసం,
మహాపాపనాశం సదా సుప్రకాశం;
గిరీశం, గణేశం, సురేశం, మహేశం,
శివం శంకరం శంభు మీశాన మీడే.

5.గిరీంద్రాత్మజా సంగృహీతార్ధ దేహం,
గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహం;
పరబ్రహ్మ బ్రహ్మాదిబిల్ల్వద్యమానం,
శివం శంకరం శంభు మీశాన మీడే.

6.కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం,
పదామ్భోజ నమ్రాయ కామం దధానం;
బలీవర్ధయానం సురాణం ప్రథానం,
శివం శంకరం శంభు మీశాన మీడే.

7.శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం,
త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రమ్;
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం,
శివం శంకరం శంభు మీశాన మీడే.

8.హరం సర్పహారం చితాభూవిహారం,
భవం వేదసారం సదా నిర్వికారం;
శ్మశానే వసంతం మనోజం దహంతం,
శివం శంకరం శంభు మీశాన మీడే.

9.స్వయం యః ప్రభాతే నరశ్శూలపాణే,
పఠేత్ స్తోత్రరత్నం త్రిహప్రాప్యరత్నం;
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం,
విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి.

||శ్రీ శివాష్టక స్తోత్రం సంపూర్ణం||


 --(())--

కనకధార స్తోత్రం .....
( చాల శక్తివంతమైనది.)
ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి.
శ్రీ శంకర భవత్పాదులు ఒకరోజు భిక్షకు వెళ్ళినపుడు కడు బీదరాలైన ఒక అవ్వ స్వామికి భిక్ష ఇవ్వడానికి తనవద్ద యేమిలేకపోయేసరికి బాధతో,
ఇల్లంతా వెతికితే ఒక ఉసిరిగకాయ మాత్రమే ఆమెకి దొరికింది.
"స్వామి నా దగ్గర బిక్ష ఇవ్వడానికి ఈ ఉసిరి మాత్రమే ఉంది " అని గురువుకి సమర్పించింది. ఆమె భక్తికి ఆచార్యుల హృదయం ద్రవించి,
ఆమె దారిద్ర్యాన్ని తొలగించడానికి లక్ష్మీదేవిని స్తుతించారు.
లక్ష్మీదేవి ప్రసన్నయై,
స్వామి కోరినట్లు,
ఆ ముసలమ్మ ఇంట కనకవర్షం కురిపించింది. ఆ స్తోత్రమే కనకధారస్తోత్రం.
ఈ స్తోత్రమును పఠించినవారికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై సర్వాభీష్ట సిద్ధి కలుగచేస్తుంది.
1. అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం
అఙ్గీకృతాఖిల విభూతి రపాఙ్గలీలా
మాఙ్గళ్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః
భావం :- మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి శ్రీహరి శరీరము నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటిచూపు నాకు శుభములను ప్రసాదించుగాక
2. ముగ్ధాముహు ర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశో ర్మధుకరీవ మహోత్పలేయ
సా నే శ్రియం దిశతు సాగర సంభవాయః
భావం :- పెద్ద నల్లకలువపైనుండు ఆడుతుమ్మెదవలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాత అయిన యా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక
3. ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
ఆనందకంద మనిమేష మనఙ్గ తంత్రం
ఆకేకర స్థిత కనీనిక పష్మ నేత్రం
భూత్యై భవే న్మమ భుజఙ్గ శయాఙ్గనాయాః
భావం :- నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, ఱెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, ఱెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగును గాక.
4. భాహ్వంతరే మధుజిథ శ్రితకౌస్తుభే య
హారావలీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాః
భావం :- భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయ అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక
5. కాలాంబుదాలి లలితోరసి కైటభారేః
ధారా ధరే స్ఫురతి యా తటిఙ్గ నేవ
మాతు స్సమస్త జగతాం మహనీయ మూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః
భావం :- కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక
6. ప్రాప్తం పదం ప్రధమతః ఖలు యత్ప్రభావాత్
మాఙ్గల్యభాజి మధుమాధిని మన్మధేన
మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్ధం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః
భావం :- ఏ క్రీగంటి ప్రభావమున మన్మధుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ధి కన్య అగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షము నాయందు ప్రసరించునుగాక
7. విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం
ఆనందహేతు రధికం మధువిధ్విషోపి
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం
ఇందీ వరోదర సహోదర మిందిరాయాః
భావం :- సమస్త దేవేంద్ర పదవి నీయగలదియు, మురవైరియగు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము కొంచెము నాపై నిలిచియుండును గాక
8. ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ధ్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్క్రవిష్తరయ
భావం :- పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్ధ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక
9. దద్యాద్దయానుపవనో ద్రవిణాంభుధారా
అస్మిన్నకించిన విహఞ్గశిశౌ విషణ్ణే
దుష్కరమ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః
భావం :- శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయావాయు ప్రేరితమై, నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడ ననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక
10. గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాఙ్కభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయ
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై
భావం :- వాగ్దేవత అనియు, గరుడధ్వజ సుందరి అనియు, శాకంభరి అనియు, శశిశేఖర వల్లభా అనియు పేరు పొందినదియు, సృష్టి, స్థితి, లయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషి అగు లక్ష్మీదేవికి నమస్కారము.
11. శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్త్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై
భావం :- పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.
12. నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై
భావం :- పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని వల్లభయును అగు లక్ష్మీదేవికి నమస్కారము
13. నమోస్తు హేమాంభుజ పీఠికాయై
నమోస్తు భూమణ్డల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్ఙ్ఙాయుధ వల్లభాయై
భావం :- బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయిక అయినదియును, దేవతలలో దయయే ముఖముగా గలదియును, విష్ణువునకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము.
14. నమోస్తు దేవ్యై భృగు నందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై
భావం :- భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణు వక్షస్థల వాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము
15. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై
భావం :- తామరపువ్వు వంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము
16. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యోతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే
భావం :- పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదను కల్గించునవి, సకలేంద్రియములకును సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగ గలవి, పాపములను నశింపచేయునవి, ఓ తల్లీ అవి ఎల్లపుడును నన్ను అనుగ్రహించుగాక
17. యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్ధ సంపదః
సంతనోతి వచనాఞ్గ మానసై
త్వాం మురారి హృదయేశ్వరీం భజే
భావం :- ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్ధ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరి యగు లక్ష్మీదేవిని మనోవాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును
18. సరసిజనిలయే సరోజ హస్తే
ధవళతమాం శుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోఙ్ఞే
త్రిభువనభూతి కరి ప్రసీద మహ్యం
భావం :- కమలములవంటి కన్నులు గల ఓ తల్లీ, చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ, విష్ణుప్రియా, మనోఙ్ఞురాలా, ముల్లోకములకును సంపదను ప్రసాదించు మాతా, నన్ననుగ్రహింపుము
19. దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాఙ్ఞీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాధ గృహిణీ మమృతాబ్ధి పుత్రీం
భావం :- దిగ్గజములు కనకకుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, విశ్వప్రభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను.
20. కమలే కమలాక్ష వల్లభేత్వం
కరుణాపూర తరఙ్ఞితై రపాఙ్ఞైః
అవలోకయ మా మకిఞ్చనానాం
ప్రధమం పాత్రమ కృత్రిమందయాయాః
భావం :- శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రధముడను, నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను నీ కరుణాకటాక్షముతో చూడుము.
21. స్తువంతి యే స్తుతిభిరమాభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాగినో
భవంతి తే భువి బుధ భావితాశయాః
భావం :- ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు
విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నరు.
22. సువర్ణ ధారాస్తోత్రం య చ్చఙ్కరాచార్య నిర్మితం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమోభవేత్
భావం :- శ్రీ శంకరాచార్యులచే రచించబడిన కనకధారాస్తోత్రమును ప్రతిరోజు, త్రికాలములందు పఠించువారు కుబేరునితో సమానుడగును.
వివరణ : ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా, భక్తి ముఖ్యం. భక్తి లేని పారాయణం, చిల్లులు పడిన కుండలోపోసిన నీళ్ళవలె వృధా అవుతుంది. సర్వం మహాలక్ష్మీ ఆధీనం. ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు ఇహ పర సుఖ జీవనులై ఉంటారు. కామక్రోధాధులైన అరిషడ్వర్గమే మహా శత్రువులు. వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతఃకరణులవుతారు. భగవదనుగ్రహపాత్రులవుతారు. అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది. అంతఃశత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో స్తుతించి, పూజించాలి. త్రిలోకాధిపతియగు ఇంద్రుడు గావించిన ఈ దివ్య శ్తోత్రాన్ని మహర్షులు మనకు అనుగ్రహించారు.
!! లోకా సమస్తా సుఖినో భవంతు ... !!

నచ్చింది

ఉద్యోగం పురుషలక్షణం

అంటే నేడు మనం చేస్తున్న ఉద్యోగంతో అన్వయించుకుని కేవలం పురుషులకనో లేక ఉద్యోగం మాత్రమే అని మాత్రం అర్ధం కాదు. ఈ సామెత పూర్తిగా
“ అశ్వస్య లక్షణం వేగం – మదో మాతంగ లక్షణం/
చాతుర్యం లక్షణం స్త్రీణాం – ‘ ఉద్యోగం పురుష లక్షణం”//

గుర్రానికి వేగం లక్షణం, ఏనుగుకు మదం స్రవించడం, చతురతో ఉండడం స్త్రీ లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం అంటే ప్రయత్నం చెయ్యడం. ప్రయత్నం చెయ్యకపోతే ఏ పనైనా ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అనుకున్న లక్ష్యం చేరాలంటే సరైన ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం చెయ్యని వాడు ఎందుకూ కొరగాడు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఉత్ + యోగం , ఉత్తమమైన మోక్షం సాధించడం పురుషుడు ( జీవుని ) లక్ష్యం.

ఇదే విషయం ఆది శంకరులు ప్రశ్నోత్తరమాలిక లో  "కో వైరీ ? యస్తు అనుద్యోగః " అని అన్నారు. అంటే ఏ పని చెయ్యకుండా సోమరిలా కూర్చునే బద్ధకమే అతడికి ప్రధాన శత్రువు అని చెప్పాడు.
ఈ విషయాన్నే మన అన్నమయ్య ఒక అద్భుతమైన కీర్తన ద్వారా మనకు మరొకలా బోధించారు. " మహి ఉద్యోగి కావాలె మనుజుడైనవాడు, సహాజియై ఉంట  ఏమి సాధించ లేడు ". ఈ గొప్ప సందేశం మన అందరికీ నేటికీ కూడా ఎంతో అద్భుతమైన బోధ. ప్రయత్నం చెయ్యకుండా ఏదో అద్భుతం జరిగిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. ఎప్పుడూ తప్పక ప్రయత్నం చేస్తూ ఉండాలి.  సహజీగా సోమరితనంతో కూర్చుంటే పాడయి పోతావురా అని చెబుతున్నాడు.

ఇది కొంతసేపు లౌకికంగా ఆలోచిద్దాం నేటి కాలంలో. మనకు సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది, కర్మ, యోగం ఉండాలి అని చెప్పడం పలాయన వాదం. మనకు రాసి పెట్టి ఉంటే జరుగుతుంది కాబట్టి సమయం కోసం వేచి చూడాలి అని చెప్పడం పరమ ప్రమాదం. అవకాశాలు వాటి అంతట అవి రావు. వాటిని మనం కల్పించుకోవాలి. వచ్చినవాటిని అందిపుచ్చుకోవాలి. అప్పుడే నీకు విజయం దక్కుతుంది. ఇప్పుడు మరొక విషయం కూడా చెప్పుకోవాలి. ఒకడికి ఒక ఉద్యోగం వచ్చింది అనుకుందాం. హమ్మయ్య నాకు వచ్చింది ఇక నేను మరే  ప్రయత్నం చెయ్యక్కర్లేదు అనుకునే  నేడు ఎందరో పింక్ స్లిప్స్ అని, ఉద్యోగ భద్రత గురించి భయపడుతున్నారు. దానికి కారణం పరమ సోమరితనం. ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకోకపోతే ఈ పోటీ ప్రపంచంలో ఎందుకూ పనికిమాలిన దద్దమ్మలం అయిపోతాము. నిన్న మనం నేర్చుకున్నది నేటికీ సరిపోవడం లేదు, రేపటికి అస్సలు అక్కరకు రాదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ అప్డేట్ అవ్వకపోతే అచ్యుతుడు కూడా కాపాడలేడు. ఈ రోజు నేను ఏమి కొత్తది నేర్చుకున్నాను, ఏమి ప్రయత్నం చేసాము అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి. లేకపోతే "You  will  become  dispensable  in  no  time " .  కాబట్టి నేటి యువతకు కూడా తప్పక అన్వయించే విషయం "ఉద్యోగం పురుష లక్షణం " .

ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే ఎన్నాళ్ళు ఈ చక్రంలో కొట్టుకోవాలి. దాటాలి అంటే ఏ పని చెయ్యకుండా దేవుడా దేవుడా అనుకోవడం కాదు, ఆయన చెప్పిన కర్మ  భాగం తప్పక పాటించాలి. నీకు అప్పజెప్పిన కర్మలు సక్రమంగా నిర్వహిస్తున్నావా అని చూసుకో. సంధ్యావందనం అయినా చేస్తున్నామా ?  ఇంకా భక్తి సూత్రాలు పాటిస్తున్నామా ? గురువులు చెప్పిన విషయాలు నెమరు వేసుకుంటున్నామా? మన వాఙ్మయం గురించి తెలుసుకుంటున్నామా? మనకు భిక్షగా  లభించిన పురాణ, ఇతిహాసాలు, శంకరులు విరచించిన ఒక్క శ్లోకమైనా చదువుతున్నామా? ఉన్నతి కోసం ఏమి  పాటుపడుతున్నాం? ఎవరికైనా సహాయం చేస్తున్నామా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థి లా ఏమి నేర్చుకుంటున్నాం, వీటిని అమలు చేస్తున్నామా లేదా అని తర్కించుకోవాలి, మన ప్రయత్నం ఉండాలి. అప్పుడే మనకు ఉన్నతి సాధ్యం, కాదంటారా?

మానవుడు ఎప్పుడూ ప్రయత్న శీలుడై ఉండాలి. ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనం ఇంకా యవ్వనంలో ఉన్నట్టు లేదంటే మీరు వయసు రీత్యా యవ్వనంలో ఉన్నా వృద్ధులే. నిత్య యవ్వన వంతులు  ఎవరయ్యా అంటే ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవడం లో నిమగ్నమై ప్రయత్నం చేస్తున్నవాడు. అందుకే దేవతలు నిత్య యవ్వనవంతులు. మనం దైవత్వానికి చేరడానికి సులభమైన దారి ఎప్పుడూ సాధనలో ప్రయత్నం చెయ్యడమే. అటువంటి ఉత్  యోగం పొందేలా సదా మనల్ని ఆ వేంకటేశుడు ఆశీర్వదించాలని ప్రార్ధిస్తూ

!! ఓం నమో వేంకటేశాయ  !!
!! సర్వమ్  శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

*తీర్చలేని రుణం*

వీరబలుడు అనే యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ, ‘అమ్మా! ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో. దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది’ అన్నాడు.
తల్లి నవ్వి ఊరుకుంది. కానీ, వీరబలుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో- తల్లి ‘బిడ్డా, నా రుణం తీర్చుకోవాలీ అనుకుంటే ఈ డబ్బు అవసరం లేదు, ఒకరోజు రాత్రిపూట నా వద్ద పడుకో చాలు’ అంది.
వీరబలుడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు. అతనికి నిద్ర రాగానే తల్లి లేపి ‘నాయనా, దప్పికవుతోంది, నీళ్ళు తాగించు’ అంది.
వీరబలుడు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు.
రెండు గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్ళుపడి పక్క తడిసిపోవడం చూసి ‘ఏమిటమ్మా ఇది’ అన్నాడు. ‘పొరపాటు అయిపోయింది నాయనా’ అంది తల్లి. వీరబలుడు మౌనంగా పడుకున్నాడు.
అతడికి కాస్త నిద్రపట్టగానే తల్లి మళ్ళీ లేపి ‘బిడ్డా! దప్పిక అవుతోంది, నీళ్ళు ఇవ్వు’ అంది. ‘ఇప్పుడే కదా నీళ్ళు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా... పత్తి గింజలు ఏమైనా తిన్నావా?’ అంటూ చిరాగ్గా లేచి నీళ్ళు ఇచ్చాడు.
తల్లి మొదటి మాదిరిగానే ఒకటి రెండు గుటకలు వేసి నీటిని పక్కమీద ఒలకబోసింది. వీరబలుడు కోపంతో ‘అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు... కళ్ళు కనిపించట్లేదా’ అన్నాడు. ‘నాయనా! చీకటిగా ఉండటంతో గ్లాసు చేతినుండి జారిపోయింది’ అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న వీరబలుడు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో వీరబలుడు కోపం పట్టలేకపోయాడు. ‘అమ్మా! ఏమిటి... దప్పిక దప్పిక అని నా దుంప తెంచుతున్నావు. నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా’ అంటూ నీళ్ళు తీసుకువచ్చి ‘ఇదిగో తాగి చావు’ అన్నాడు.
తల్లి ఎప్పటిలాగానే ఓ గుక్క తాగి మిగిలిన నీళ్ళతో పక్కను తడిపేసింది. వీరబలుడు ఇక సహించలేక ‘బుద్ధుందా లేదా... ఇలా వేధించడానికేనా నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు? ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి? చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లు ఉంది... అందుకే ఇలా చంపుకు తింటున్నావు’ అంటూ ఆగ్రహంతో కేకలేశాడు. అప్పుడు తల్లి ‘వీరా! చాలించు. అరుపులు ఆపు. నా రుణం తీర్చుకుంటానన్నావు, తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి, నిరంతర సేవ చేసినా మాతృ రుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా... నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజూ పక్కమీదే మల మూత్రాదులు చేసేవాడివి.
నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి, నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్కబట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకుని నిన్ను పొడిగా ఉన్నవైపు పడుకోబెట్టి నిద్రబుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాలపాటు- నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకూ నేను ప్రతిరోజూ అలానే- ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు ఒకటి రెండుసార్లు నీళ్ళతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే వీరంగం వేస్తున్నావు’ అంది తల్లి.
వీరబలుడు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని ‘అమ్మా! నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకూ కష్టానికీ సహనానికీ బదులు తీర్చుకోవడమన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు. నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు’ అన్నాడు.
--(())--


ఇందాక అలా పనుండి పాట్నా లో ఉన్న వేదపాఠశాల కాంపౌండ్ లో ఉన్న SBI కి వెళ్లాను. లింకు ఫెయిల్ అవడంతో అలా బయటపడి వేదం వల్లె వేస్తున్న పిల్లల్ని గమనిస్తూ అక్కడ ఉన్న గురువుగారైన సదానంద్ ద్వివేది గారిని "ఎందుకండీ ఇలా బట్టి వేయిస్తున్నారు, చేతికి పుస్తకం ఇస్తే చూసి జాగ్రత్తగా చదువుతారు కదా అని అడిగా..

దానికి ఆయనిచ్చిన సమాధానం..

"నలంద, తక్షశిల,విక్రమశిల విశ్వవిద్యాలయాలలో ఉన్న అమూల్యమైన గ్రంధాలను భక్తియార్ ఖిల్జీ అనే ఉన్మాదుడైన మహమ్మదీయ రాజు కాలంలో కాల్చివేయ్యబడ్డాయి - తరువాతి కాలంలో మళ్ళి ఆ వేదం విద్యనూ గ్రంధాలను తిరిగి రాయడానికి ప్రయత్నం చేసిన ఎంతో మంది భారతీయ విద్యావేత్తలను అత్యంత క్రూరంగా హింసించి చంపేయ్యడం జరిగింది!
ఇది ముందే గమనించిన  మనవిద్యావేత్తలు  వేదాన్ని ఏనాటినుండే కంఠస్తం చెయ్యడం అలాగే మరికొంత మందికి కంఠోపాఠం గా నేర్పడం మొదలు పెట్టారు - అలా చాలా వరకు వేదాధ్యయనం ముఖత గానే కొనసాగింది అందువల్లే వేదాన్ని కంఠస్థం చెయ్యడం అలవాటుగా మారింది
4 వేదాలు నోటికి వచ్చిన వాడిని చతుర్వేది అని
3 వేదాలు వచ్చినవాడిని త్రివేది అని
2 వేదాలు వచ్చిన వాడిని ద్వివేది అని
1 వేదం నేర్చినవాడిని ఉపాధ్యాయ అని
శాస్త్రాలు తెలిసినవాడిని శాస్త్రి అని
మిశ్రమంగా కొన్ని విషయాలు నేర్చుకున్న వాడిని మిశ్రా అని
శాస్త్రీయ కర్మ విధి విధానాలను నేర్చిన వాడిని శర్మ అని ఇలా రకరకాలుగా విభజించి నేర్పించడం జరిగింది!"
"మరి.. ఇప్పుడు రాయచ్చు కదండీ..ఇప్పుడు మనం స్వతంత్రులం కదా?" అన్నాను.
ఆయన నవ్వేసి.."ఎవరు చెప్పారు మనం స్వతంత్రులమని? గత 65 ఏళ్లుగా గమనిస్తున్నాను.. ఒక్కడంటే ఒక్క  మంత్రి లేదా ప్రభుత్వ అధికారి ఈ వేదాలను తిరిగి రాయించడం మిద దృష్టి పెట్టనేలేదు! - ఇప్పటికీ మనం బానిస రాజుల పాలనలోనే ఉన్నాం - హిందుమత గ్రంధాలను అవహేళన చేస్తూనే ఇతర మత గ్రంధాలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం లేదా ఇతరులకు ఇంకా భయపడుతూనే ఉన్నాం!" అన్నారు.

ఆయన మాటల్లో నిజం ఉందనిపించింది నాకు! మీరేమంటారు?

(ఈ టపా..జాతీయ వాదుల సమాలోచన అనే గ్రూపు నుండి సేకరించింది)
హనుమంతు వెంకట రమణ మూర్తి
టెక్కలి,విశాఖపట్నం (బతుకు తెరువు కోసం)

--(())--
శివపురాణం -2 వ  భాగం:
పరమశివుని లీలా మూర్తులలో పదమూడవ మూర్తి హరిహరమూర్తి. అనగా ఆయన శరీరంలో సగభాగమును శ్రీమహావిష్ణువు స్వీకరించారు. అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకొని శరీరంలో సగాభాగామును స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు. 'నీవు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధభాగమును పొందావో ఆ ఉపాయమును నాకు చెప్పవలసినది' అని పార్వతీ దేవి నారాయణుణ్ణి ప్రార్థన చేస్తే, శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టోత్తర శతనామ స్తోత్రము. ఈ శివాష్టోత్తర శత నామ స్తోత్రమును ఆధారము చేసుకొని పార్వతీ దేవి శంకరుని శరీరంలో అర్థ భాగమును పొందింది. అది పదునాల్గవ స్వరూపము. దానిని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. మనుష్య జన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక శివాష్టోత్తర శతనామ స్తోత్రమును ప్రదోష వేళలో చదవడం ఇహమునందు సమస్తమయిన కోరికలను తీరుస్తుంది. పరలోక సుఖమును, భగవంతుని అనుగ్రహమును మనయందు ప్రసరింపజేస్తుంది.

‘శివో మహేశ్వరః’ అని పిలుస్తారు. ‘మహేశ్వరః’ అనబడే నామము చిత్రమయిన నామము. మంత్రపుష్పం చెప్పినప్పుడు

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్!
బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం!!

అని చెపుతాము. సర్వమంగళములకు కారణం అయినవాడు, సర్వ జగన్నిమాయకుడు, సృష్టిస్థితిలయలు చేసేవాడు తానొక్కడే అయివుండి, కాని సృష్టి చేసినప్పుడు ఒకడిగా, స్థితి కారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, మూడుగా కనపడుతూ ఆయన అనుగ్రహము చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయన మహేశ్వరుడు. ఆయనే మూడుగా కనపడే ఒక్కడి. అందుకే పోతనగారు భాగవతంలో ఒకచోట ఒకమాట అంటారు –

మూడు మూర్తులకును మూడు రూపములకు మ�
--(())++



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి