7, ఏప్రిల్ 2020, మంగళవారం

మాండూక్యోపనిషత్తు.



🕉🌞🌎🌙🌟🚩
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.7
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ

కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.


ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.


ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.


మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.


ఆగమ ప్రకరణం

మాండూక్యోపనిషత్తు.

ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరుగుతుంది, శంకరుల భాష్యముతో సహా.


శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.

ఒకటవ కారిక :

బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //

రెండవ కారిక :   దక్షిణాక్షి ముఖే విశ్వ  :  మనస్యాన్తశ్చ తైజస :  /
                        ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత :  //

విశ్వుడు కుడికంటి  ద్వారమున,  తైజసుడు మనస్సులోనూ,  ప్రాజ్ఞుడు  హృదయ ఆకాశములో వ్యవహరిస్తున్నారు.  ఈ విధంగా ఆత్మ ఒక్కటే అయివుండి,  అందులో మూడు విధములుగా ఈ మూడు అవస్థలు స్థానీయములై వున్నవి.


విశ్వుడు, కుడికన్ను ద్వారమై వుండగా, (  అనగా పందొమ్మిది ద్వారములలో కుడికంటికి    ప్రాధాన్యత నిచ్చి,)   స్థూల విషయములను చూసేవాడిగా విశ్వుడనే నామంతో కార్యక్రమములు నిర్వర్తిస్తూ వుంటాడు, అని చెప్పబడింది.   ఇతడిని ఇంధుడు అని కూడా అంటారు. ఇంధుడు అనగా, కాంతిగుణము కలిగిన వైశ్వానరుడు.  సూర్యమండల అంతర్గతుడు.  విరాట్ సూర్యఅంతర్గతుడు కాబట్టి, విరాట్ విశ్వులు  ఒక్కరే ! 


ఇక్కడ కేవలము కుడికంటికే విశ్వుడు ద్రష్టయై వుంటే, సమష్టి శరీరమైన సూక్హ్మ   తత్వంలో, క్షేత్రజ్ఞుడు,  వ్యష్టి దేహములోని జీవుడు మరియొకడై వుండవలెను కదా అనే సందేహం రావచ్చు.    దానికి సమాధానము, జీవునికీ పరమాత్మకూ అభేదమని ఇప్పటికే ప్రతిపాదించి ఉన్నందున,  వ్యష్టి సమష్టి దేహములకు వ్యత్యాసము లేదని తెలియు చున్నది.   ఎందుకంటే, సూర్యుని ప్రకాశం , జీవుని దృష్టీ ఒక్కటే. 


అన్ని ఇంద్రియములలో, ఒకే విశేషమున్నా, కుడికంటితో మనం దృశ్యములను చూడడడం అసంకల్పితం.  అందువలన కుడికంటికి ప్రాధాన్యం.  కుడికంటికి ఎడమ కంటికంటే దర్శనశక్తి ఎక్కువ.  మిగిలిన జ్ఞానేంద్రియాలు, విషయములు వాటివద్దకు వచ్చినప్పుడే వాటితో అనుసంధానం అవుతునాయి. అయితే, నేత్రము,  ప్రయత్న బలంతో దూరప్రదేశాలను చూసి, గ్రహించి, తిరిగి స్వస్థానమునకు వచ్చి, మనస్సుకు తెలియజేస్తుంది.   అందువలననే,  కారికలోనేత్రమునకు, అందునా కుడినేత్రమునకు విశ్వుని స్థానము కల్పించబడింది.


సూర్య దీపకాంతులలో విశ్వుడు ఒక రూపాన్ని చూసి, కళ్ళుమూసుకుని, ఆ రూపాన్నే స్మరిస్తూ, మనస్సులో స్థిరపరుచుకుంటాడు.  అదే వాసనారూపంలో, స్వప్నంలో, మనస్సు యొక్క తేజస్సు వలన ప్రకాశమై అభివ్యక్తం అవుతుంది.   అందువలననే, తైజసుడు, విశ్వుని రూపమే.  జాగ్రత్తులో కళ్ళుమూసుకుని ఆలోచించే వానిస్థితి, స్వప్నములో దృశ్యములను చూసే స్థితి అందుకనే ఒకటిగా వుంటుంది.    కాబట్టి తైజసుని మనస్యంతుడని  వర్ణించడం అయింది.


హృదయమనే ఆకాశంలో, ఆలోచనలను, సంకల్పములను నేను నాది అనే అభిమానాన్ని, మూటగట్టుకుని,  కదలక, మెదలక వుంటే, విశ్వుడే ప్రాజ్ఞుడై, ఏకీభూతుడై, ఘనీభవించిన మనోవ్యాపారుడు అవుతున్నాడు.  అది ఎలాగంటే,  సుషుప్తిలో మనోవ్యాపారములు ఏమీ లేనందున, మాత్రమే.  


అనగా, మనోవ్యాపారములవలన విశ్వుడనీ,  అట్టి విశ్వుడి అంతర వాసనలందు మనోవ్యాపారముల వలన తైజసుడనీ,  మనోవ్యాపార సూన్యత వలన ప్రాజ్ఞుడనీ తెలియబడుతున్నాడు.


దర్శనము, స్మరణము ఈ రెండూ మనస్సు యొక్క స్పందనలు.  ఈ రెండూ  లేనిచో,  హృదయములో, విశేషణా రహితముగా విశ్వునకు, నివాసము కలుగుతున్నది.  నిశ్చలంగా, నిర్వికారంగా వుంటున్నాడు, జాగ్రదవస్థలోనే.   ఈవిధంగా,  విశ్వునికీ విరాట్ కీ, ప్రాజ్ఞునికీ, ఈశ్వరునికి సంబంధము నెలకొల్పబడింది. 


ఇక తైజస హిరణ్యగర్భుల విషయంలో, అభేదం ఎలాంటిది అంటే,  మనోమయ పురుషుడే హిరణ్యగర్భుడు.   తైజసుడు మనోవాసనలందే,  కేవలం స్వప్నంలోనే వ్యష్టి తత్వంలో ఉంటున్నాడు.  వ్యష్టి సమ
ష్టి తత్త్వం  సమన్వయ సిద్ధి వలన వీరిద్దరికీ అభేదము.


ఇక  దర్శన స్పర్శ రహితమైన విశ్వుడు ప్రాణాత్మతో,  చేరినప్పుడు,  ప్రాణుడు అవ్యాకృతుడు అయివుంటాడని చెప్పివున్నారు.   అయితే,  ' దేహములో, గాఢనిద్ర యందు ఉచ్వాస  నిశ్వాసలు చేయుట, గురకలు పెట్టుట  ప్రక్కన వున్నవారికి తెలుస్తూ వుంటుంది కదా,   అప్పుడు అవ్యాకృతుడు ఎలా అవుతున్నాడు ? '  అనే సందేహానికి,  భాష్యం లో సమాధానం చెబుతున్నారు, ఆదిశంకరులు.

🕉🌞🌙🌎🌟🚩

🕉🌞🌎🌙🌟🚩
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.8
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ

కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.

ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచ…
ఓం నమః శివాయ:



ఓం నమః శివాయ:
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.10
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ

కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.

ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.

ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.

మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.


ఆగమ ప్రకరణం

మాండూక్యోపనిషత్తు.

ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరుగుతుంది, శంకరుల భాష్యముతో సహా.

శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.

ఒకటవ కారిక :

బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //

రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //

మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //

నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //

అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //

ఆరవ కారిక :  ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //

ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా :  /
                     స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా  // 

సృష్టిని గురించి విచారణ చేసే వారిలో రెండు వాదనలు వున్నాయి.  కొంతమంది  సృష్టి అంతా భగవంతుని ఐశ్వర్యమని భగవంతుడు తన ప్రభావము చూపించడానికి సృష్టి చేస్తున్నాడని వీరి వాదం.  మరికొందరు,  మాయావాదులు, సృష్టి స్వప్నము వంటి మాయతో సమానమని విశ్లేషిస్తున్నారు.  వీరి వాదనలో సృష్టి తాత్కాలిక గోచరమే కానీ సృష్టికి ఎలాంటి నిత్యతగానీ, సత్యతగానీ లేదని మాయవాదుల  అభిప్రాయం. 

దీనిపై ఆదిశంకరుల భాష్యం లోఏమి చెప్పారో  తెలుసుకుందాం.


విభూతిఅంటే విస్తారమైన ఈశ్వరసృష్టి అనీ,  ఆ సృష్టి సత్యమని కొంతమంది భావిస్తూ వుంటారు.  ఈశ్వరుడంటే అందరినీ ఏలేవాడు, తన వైభవాన్ని ప్రదర్శించడానికి సృష్టి రూపంలో విస్తారముగా దేవతలను, భూతములను, జీవులను సృష్టించి వారి పూజలు, సేవలు అందుకుంటాడని ఈ వర్గము వాదము. 


కానీ పారమార్ధ చింతకులకు అనగా వేదాంతులకు, సృష్టి యందు ఆదరము వుండదు.  బ్రహ్మజ్ఞానము మీద దృష్టి వున్నవారు, సృష్టి మీద యెలాంటి అభిమానమూ పెంచుకోరు.  ద్వైతులు జగత్తు సత్యమనీ, అద్వైతులు జగత్తు మిధ్య అనీ చెబుతారు.  ఈ విషయంలో వేదాంతపరంగా శ్రుతులు ఏమి చెబుతున్నాయి ?


గారడీవాడు,  తన నైపుణ్యంతో, త్రాటినిఆకాశంలో ఎగరవేసి, దానిని కర్రగా భావించి, ఆయుధము తీసుకుని దానిమీదకు పాకుతాడు.  పైకెక్కి యుద్ధం చేసినట్లు గోచరిస్తాడు.  ముక్కలు ముక్కలై కిందపడి, మళ్ళీ అత్కుక్కుంటాడు.  ఈ వినోదం చూసేవారు, గారడీవాడిని  బాగా ప్రశంసిస్తారు.  కానీ వాడుచేసే గారడీమీద ఆదరము ప్రదర్శింపరు.  ఎందుకనీ ?  అది అంతా గారడీ అని చూసేవారందరికీ ముందుగానే తెలుసు కాబట్టి.   అంటే ఏమిటీ ?  ప్రేక్షకులు గారడీకన్నా,  గారడీవానికే ఎక్కువ ఆదరం కలిపిస్తారు. కాబట్టి, గారడీ చర్యలను మెచ్చుకునేవారు,  సృష్టి చింతకులు.  గారడీవాడిని స్తుతించే వారు, పారమార్ధ చింతకులని భావము.


అదే విధంగా,  గారడీవాడు త్రాటిని పైకి విసరడం ఎగబ్రాకడం అనేది ఎలా చూస్తున్నామో,  పట్టనట్లు ఎలా వుంటున్నామో,  అదే ' తురీయతత్వము '  అనే పేరు గల పారమార్ధ తత్వము.   తురీయుడు జాగ్రత్ స్వప్న నిద్రావస్థలను దాటి తన యదార్ధస్థితి తెలుసుకుని అందులో ఉండిపోవడం అనేది,  గారడీవాడు, త్రాటి యందు ఎగబ్రాకి,  తిరిగి తన నిజరూపం లోకి రావడంతో పోల్చవచ్చు. 


ఒక అవస్థలో ఉండే అహం, మరొక అవస్థలో ఉండదని గమనిస్తూనే వున్నాము.  కానీ ఈమూడు అవస్థలలోని అనుభవాలు, మనకే కలుగుతున్నాయి. 

దీనికి కారణం జ్ఞాపకం అని చెప్పుకోవచ్చు.  కానీ ఆ అవస్థ దాటి వేరొక అవస్థలో వున్నప్పుడు ఆ జ్ఞాపకం వుండే అవకాశం సామాన్యంగా వుండదుకదా !  కాబట్టి, మూడు అవస్థలలో ఎల్లవేళలా సాక్షిగా ఒక కర్త వుంటేగానీ అది సాధ్యంకాదు.


అలా అవస్థలు మారినప్పుడు వాటితోబాటు మారకుండా, వుండే ఆ నిత్యుడూ, అవికారుడూ, అయిన సాక్షి నిజమైన ఆత్మ, లేదా తురీయం.   ఈ ఆత్మే,  అన్ని వికారాలకూ వెనుక వున్న పరమతత్త్వం.  కాబట్తి తురీయస్థితి పైనే ముక్తి గోరేవారికి ఆదరం వుంటుంది.   నిష్ప్రయోజనమైన జాగ్రత్ స్వప్న సుషుప్తులయందు వీరికి ఆదరం వుండదు. 



 ఎనిమిదవ కారిక :  ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా :  /
                              కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా :  //

సృష్టిచింతకులలోనే,  సృష్టి విషయంలో మరికొందరి ఆలోచనలను ( ద్వైత, విశిష్టాద్వైత వాదనలను )  ఉదహరిస్తున్నారు.  


సృష్టి పరమేశ్వరుని యొక్క ఇచ్ఛమాత్రమే అనీ , భగవదిచ్ఛచే ప్రాప్టించిన జగత్తు భగవంతునివలె సత్యమని వీరి వాదము.  ఇక కాలమే సత్యమని వాదించే జ్యోతిష్కులు భూతములు- జన్మాదులు,  కాలము మహిమ వలన కలిగినట్లు భావిస్తారు.


ఈశ్వరుడు సత్యసంకలుపుడు అగుటవలన అనగా కేవలము అతని సంకల్పములకు  వెంటనే క్రియారూపము దాల్చే శక్తి వుండడం వలన,  కుమ్మరి కుండలను చేసినట్లు ఈశ్వర సృష్టి జరుగుతున్నదని ఈశ్వరవాదులు భావిస్తారు.   


ఇక కాలమే సత్యమని చెప్పే జ్యోతిష్కులు,  కాలము వలన సృష్టి జరుగుతున్నదని చెబుతారు.  వసంతములో చెట్టు చిగురించడం, శిశిరంలో ఆకులు రాలిపోవడం, ఎలాగో, అలాగే కాలానుగుణంగా జన్మ, వృద్ధి, క్షీణత, నాశనములు,  కాలమే సృష్టిస్తుందని వీరి వాదం.  


తొమ్మిదవ కారిక :  భోగార్ధం సృష్టి రిత్యంతే   క్రీడార్థమితి చాపరే  /
                             దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?

' సృష్టి ఎలాగో అలా ఉండవచ్చు గాక !  దాని వలన ఈశ్వరునికి ఏమి ప్రయోజనం?  ' అనేదానికి రెండు విధములైన వాదనలు ఈశ్వర వాదు
లు చెబుతున్నారు. 


కొందరు సృష్టి ఈశ్వరుని భోగార్ధమనీ, కొందరు సృష్టి ఈశ్వరుని క్రీడార్థమనీ, తలుస్తుంటారు.   దీనిపైనా జగద్గురువులు చెప్పిన భాష్యమేమిటో చూద్దాం

🕉🌞🌙🌎🌟🚩

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి