22, ఫిబ్రవరి 2026, ఆదివారం

 దేవీ.. శ్రీదేవీ.. నవశతి (అనుష్టన్ చందస్సు వృత్తమాల)




889.. కామరరూపం.. మ ర భ న త గ గ.. యతి.. 8

వర్ణింపన్ సాధ్యమున్ సేవల గతియు నిక్కంబు నీకై 

బూర్ణంబౌ కార్యమున్ సోముని వలన సర్వంబు నీకే 

పూర్ణానందమ్ముగన్ యీపుడమిననె శక్తైన నీవే 

నిర్ణేకంబున్ విధీ మా నేపములనునె మాన్నిoతు దేవీ

భవం 

నీ సేవామహిమను పూర్తిగా వర్ణించడం సాధ్యం కాదు; మా శరణాగతి నిశ్చయంగా నీకే అంకితం.

జరిగే ప్రతి కార్యమూ చివరికి నీ కృపవల్లే ఫలిస్తుంది; అన్నీ నీ అధీనమే.ఈ భూమిలో పూర్ణానంద స్వరూపిణిగావెలుగుతున్న శక్తి నీవే.మా తప్పులను విధిగా గ్రహించి క్షమించుము దేవీ.


890.. శ్రీమతి.. ర త య స జ గ గ.. యతి.. 12

కాలమున్ బత్కంత సుధర్మంబుసకాల కామ్య మేలే 

జ్వాలగన్ జీవమ్ము జయమ్మున్ సు ప్రజా భవమ్ము యేలే 

మూలమున్ స్వార్ధమ్ము సహా యమ్మగు ముత్య మౌను గౌరీ 

జాలియున్ జూపే మనసంతావిధిజాడ్యమౌను దేవీ

భవం 

జీవితం జ్వాలలాగా ఉత్సాహంతో వెలిగితే విజయం, సంతానం, ప్రజాహితం కలుగుతాయి.స్వార్థమే మూలమైతే సహాయం కూడా క్షీణిస్తుంది; కానీ నిస్వార్థ హృదయం ముత్యంలా విలువైనది — ఓ గౌరీ!దయతో నిండిన మనసే ఉన్నతమైనది; లేకపోతే విధి జాడ్యంగా మారుతుంది — ఓ దేవీ!ధర్మం, నిస్వార్థం, దయ — ఇవే జీవిత విజయానికి మూలాలు.

891.. తారక.. స న జ జ న గ గ..యతి.. 11

మనసేగతిగను సేవ సమాన సుఖము పొందా 

క్షణమే స్థితిగను నేస్తము క్షా మకళలు తీర్చే 

ధనమేబలమగునిత్యముదారిజపముగానే 

ప్రణయమ్ముసుఖముగాసుప్రభాత జయము దేవీ

భవం 

మనసు సేవామార్గంలో నడిస్తే నిజమైన సుఖం లభిస్తుంది.స్నేహం క్షణంలోనే మన లోపాలను, క్షామాలను తీర్చగలదు.ధనం శాశ్వత బలం కాదు; నిత్యజపమే అసలైన ఆధారం.దేవిపై ప్రేమతో జీవితం ప్రతి ఉదయం విజయప్రభాతంలా వికసిస్తుంది..


892.. జాగ్రత్.. స న జ న భ గ గ.. యతి.. 11

పదముల్ విడువక నిన్ భరవశులై యజియిoపన్ 

కథలన్ తెలుపుచు కాలపుకళ జూపుచు సేవల్ 

మదినెంచగలుగు శక్తి సమ యశస్సగుటేలే 

విధియాటలగుటె విద్యల విలువేస్థితి దేవీ

సరళ భావం:

నీ నామపదాలను విడువక భక్తులు భరవశులై నిన్నే యజ్ఞరూపంగా సేవిస్తారు.కాలగమనంలోని కథలను వివరిస్తూ సేవల ద్వారా నీ మహిమను తెలియజేస్తారు.మనస్సు నిలిపి ఆచరించే శక్తియే నిజమైన యశస్సుకు కారణం.విధి ఆటల మధ్య విద్యల విలువను గ్రహించునట్లు అనుగ్రహించు దేవీ!

893.. అతి శాయినీ.. స స త భ జ గ గ.. యతి.. 10

 సరిజూచుట నీదేనమ్మ సఖ్యత మనస్సు దేవీ 

చిరునేస్తము నీవేనమ్మ చిత్తముయు నిమ్ము దేవీ 

తరుణాసకలమ్మున్ విద్య తన్మయమునీది దేవీ 

కరుణా కుసుమమ్మున్ శక్తి కామ్యమగుముక్తి దేవీ

సరళ భావం:

ఓ దేవీ! నా మనసును సరిదిద్దేది నీవే; నిజమైన సఖ్యత నీతోనే ఉంటుంది.చిరస్నేహితురాలైన నీవే నా చిత్తాన్ని కాపాడి నిలుపు.యౌవన సహజ విద్యలు అన్నీ నీలోనే తన్మయమవుతాయి.నీ కరుణా కుసుమమే శక్తిగా వికసించి, కోరుకున్న ముక్తిని ప్రసాదిస్తుంది..

894..సలేఖ.. న న మ న న గ గ యతి.. 10

తలకొని కొలుతున్ నిన్ నిత్యము మరువక దేవీ 

పలుకుల కళ పాఠ్యమ్మున్ పదనిసలగు దేవీ 

వలపుల పిలుపేజీవమ్ వయసు కళలు దేవీ 

మలుపుల వల యూహల్లే మనసు గలుగు దేవీ

సరళ భావం:

ఓ దేవీ! నిన్ను తలచుకొని నిత్యం కొలుస్తూ ఎప్పుడూ మరవకుండునట్లు అనుగ్రహించు.నా మాటలు, పాఠ్యాలు సుస్వరూపంగా ఉండునట్లు కాపాడు.

ప్రేమపిలుపులతో జీవితం కళలతో నిండునట్లు చేయు.జీవిత మలుపులలో ఊహలు కలవరపడినా, మనసు స్థిరంగా నిలిచునట్లు దయచేయు.

895..శరమాల.. భ భ భ భ స గ .. యతి .. 7 

చాచితి హస్తము జ్ఞానపు బిక్షగ దయ జూపూ

వేచితి నీకృప విద్యల మాటున కళ జూపూ 

చూచితి తృప్తిగ సూత్రపు మాయలగుట తల్లీ

గాచెద నిత్యము గ్రాహ్యపు బట్టియు మది దేవీ

సరళ భావం:

ఓ దేవీ! జ్ఞానభిక్ష కోసం నేను చేతులు చాచి నీ దయ కోరుతున్నాను.నీ కృపవల్లే విద్యా–కళల అంతర్మూలార్థం వెల్లడవుతుంది.సూత్రముల వెనుక దాగిన మాయలను గ్రహించి తృప్తి పొందుతున్నాను, తల్లీ.గ్రహించదగిన సత్యాన్ని నిత్యం కాపాడుతూ నా మనసును నీలోనే నిలుపుతున్నాను.

896..మాయావలయం .. మ భ స భ స గ.. యతి ..10  

మాయాలో కంబుయు కదిలే మార్గము గనలేమో

సాయంబున్ యన్నది మెదిలే సాక్షిని గనలేమో 

ధ్యేయంబున్ నిత్యము జరిగే దీక్షలు గనలేమో 

మాయాతీతాశరణమునిమ్మా స్థిరమున దేవీ

సరళ భావం:

ఈ మాయలోకంలో కదులుతున్న మార్గం స్పష్టంగా కనిపించదు.సహాయమని అనిపించేది కూడా నిజమైన సాక్షిగా అనిపించదు.నిత్యధ్యేయంగా చేపట్టే దీక్షల ఫలితం కూడా అనిశ్చితమే.అందుకే మాయకు అతీతమైన నీ శరణాగతినే స్థిరంగా ప్రసాదించు దేవీ!

897..సృతశిఖ ..త య స భ స గ .. యతి ..10 

సేవాభవమాయల్ భరితం శీఘ్రము మనసౌనే 

భావమ్మగు సేవాచరితం భాద్యత విధిగానే 

నీవేసహకారమ్ముగనే నిత్యము వచియింతున్ 

భావించితి నీపూజలుగా బంధము గనెదేవీ:

సరళ భావం:

సేవాభావంతో నిండిన మనసు త్వరగా పవిత్రమవుతుంది.సేవాచరిత్రే జీవన బాధ్యతగా విధిగా మారుతుంది.నీ సహకారం ఉండగా నేను నిత్యం నీ సన్నిధిలోనే ఉంటాను.నీ పూజలను భావించినపుడే బంధములు తొలగిపోతాయి, దేవీ!

898..అర్కశేషా   .. ర జ ర జ గ గ .. యతి .. 8 

**కానిదేదియన్నదో కళా ప్రభావమౌనే ** 

**రానిదన్నదేదియో రణమ్ముగమ్య మౌనే **

**మానుకున్నతీరు ప్రేమజూపురక్తి నౌనే **           

**సానుకూలమౌనులే సమమ్ముభక్తి దేవీ**

సరళ భావం:

ఏది లేదనుకున్నదీ నీ కళాప్రభావంతో సుసాధ్యమవుతుంది.ఏది రాదనుకున్నదీ ప్రయత్నరూప రణంలో సాధ్యమవుతుంది.మనసు నియంత్రించి ప్రేమను చూపినపుడే నిజమైన అనురక్తి పుడుతుంది.సానుకూలమైన మౌనచిత్తంతో సమభక్తి కలిగినవారిని దేవి అనుగ్రహిస్తుంది.


899..గోవృషస్థలితగతీ .. మ త య న గ గ ..యతి ..5 

అజ్ఞానమ్మున్ యాస యనంతమ్ముమనసౌనే   

విజ్ఞానంబున్ విద్య  వివాదమ్ము వయ సౌనే      

ప్రజ్ఞానంబున్ పాఠ్య  ప్రవేశంబు దయ గానే     

రాజ్ణీ నీపై రాగము చెప్పా గవిత దేవీ 

సరళ భావం:

అజ్ఞానం వల్ల మనసు అయోమయంతో అల్లాడుతుంది. విజ్ఞానం కలిగినపుడు విద్య గురించి వాదప్రవణత కలుగుతుంది. కానీ ప్రజ్ఞానం కలిగినపుడు పాఠ్యార్థంలో లోతైన ప్రవేశం దయవల్లనే సిద్ధిస్తుంది. ఓ రాజ్ఞీ! నీపై నా ప్రేమను కవిత్వరూపంలో వ్యక్తం చేస్తున్నాను, దేవీ!

ఇది తాత్వికంగా జ్ఞానత్రయం (అజ్ఞానం–విజ్ఞానం–ప్రజ్ఞానం) యొక్క అంతరాన్ని స్పష్టంగా చూపిస్తుంది.


900..పవనః .. (భ  స  స  జ  గ గ .. యతి .. 8 )

లోకభవసమేఖ్య లయా ఘ్రమున్ సహాయమ్ 

ఏగమకముగమ్యయే సమాఖ్యగానున్ 

మోక్షమనుసుదీర్ఘ మొక్కులన్ని తీర్చే 

స్వీకరసమయం వసియించు శీఘ్ర దేవీ

సరళ భావం:

సంసారరూపమైన లోకజీవనంలో కలిగే భవబంధాలను లయపరచి, అజ్ఞానాంధకారాన్ని తొలగించి సహాయపడే దేవి ఆమె. ఏకాగ్రభక్తితో సులభంగా గ్రహించదగిన పరమ స్వరూపిణి. మోక్షాన్ని ప్రసాదించి, భక్తుల దీర్ఘకాల ప్రార్థనలను నెరవేర్చు దయామయి.సరైన సమయములో శీఘ్రంగా ప్రత్యక్షమై కృప చూపే తల్లియే ఆమె.ఇది ముద్రణలో సంక్షిప్తంగా, స్పష్టంగా, భావపూర్ణంగా నిలుస్తుంది.

***

14, జనవరి 2026, బుధవారం

ఆనందమఠ్

 

[08/01, 07:01] Mallapragada Ramakrishna: *ఆనందమఠ్ -1* 

*వందేమాతరం* 

ఇప్పటికి 130 సంవత్సరాల క్రితం 1875 లో “వందేమాతరం" గేయం బెంగాలీ భాషలో రచింపబడింది. వందేమాతరం పద నముదాయానికి "భూమాత" కు అభివాదం చేయడం లేక స్తుతించడం అని అర్థం.

వందేమాతరం - అమ్మా ! నీకు వందనం అనే ఈ రెండు పదాల కలయిక యాధృచ్ఛికం కాదు. రాజకీయపు ఎత్తుగడ కూడా కాదు. శ్రావ్యతకై కూర్చిన పద్యపాదం అంతకంటే కాదు. అది మాతృభూమితో అవిభాజ్య బంధాన్ని సుస్థిరం చేస్తున్న  గౌరవాస్పదమైన సమాసం. దేశభక్తికి నమ్మకమైన ప్రతిజ్ఞ.

*సుషుప్తావస్థనుండి చేతనావస్థకు:*

ఐదు సంవత్సరాల పాటు సుషుప్తావస్థలో వున్న వందేమాతరం గేయం 1880-82 సంవత్సరాల మధ్య కాలంలో వంగదర్శన్ అనే మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన "ఆనందమఠం" నవలతో చేతనావస్థకు చేరి అక్కడ ఆనందమఠంలో దీపశిఖగా నిలిచి భారతదేశ దాస్యశృంఖ లాలను బ్రద్దలు కొట్టే బలాన్ని భారతీయులకి ఇచ్చిన మహా మంత్రంగా రూపొందింది.
📖

అది 1770 వ సంవత్సరం. అప్పటికి రెండేళ్ళుగా వంగదేశాన్ని (బెంగాల్) కరువు కాటకాలు పట్టి పీడిస్తున్నవి. 1768 వ సంవత్సరంలో పంటలు బాగా పండక పోవటంతో ధాన్యం ధర విపరీతంగా పెరిగిపోయింది. సామాన్య ప్రజలు నానా యిక్కట్లకూ గురికాసాగారు. కాని, నవాబు మాత్రం గోళ్ళూడకొట్టి పన్నులు వసూలు చేశాడు.

1769 వ సంవత్సరంలో తొలకరిన మంచి వర్షాలు పడినై. ప్రజల ఆనందాని కంతు లేదు. హఠాత్తుగా ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వర్షాభావం కలిగింది. ఎదిగివచ్చిన పైర్లు భూమి బెట్టతీయటంతో నిలువునా ఎండిపోయినై ఎక్కడైనా కొంచెం చెదురు మదురుగా దాన్యం పండితే దాన్ని సైనికుల కోసం నవాబు ఉద్యోగులు కొనివేశారు.

ఆ తరువాత భయంకరమైన కాటకం ప్రారంభమైంది. 1770 వ సంవత్సరంలో అసలు వర్షాలే పడలేదు. కాయకష్టం చేసి బతికే బీదాబిక్కీ బిచ్చమెత్తసాగారు కాని, వారికి బిచ్చం పెట్టే నాధుడు లేడు. అంతో యింతో భూవసతి వున్న రైతులే, తమ పశుగణాన్నీ, వ్యవసాయ పరికరాలనూ అమ్మి కొన్నాళ్ళపాటు అర్ధాకలితో బతికి, యిక చేసేదిలేక అడవిలో దొరికే దుంపలూ ఆకలములూ తినసాగారు. అవీ దొరకనిదశ రాగానే, చావసిద్ధంగా వున్న కుక్కల్నీ, పిల్లుల్ని పట్టుకుని తినసాగారు. కొందరు ఒక సోలెడుగింజలకు తమ పిల్లల్ని బానిసలుగా అమ్మేశారు.

ఈ భయంకర వాతావరణంలో అంటు రోగాలు చెలరేగినై. విషజ్వరం, కలరా, క్షయ, మసూచికలతో జనులు దిక్కులేని చావుల కు గురికాసాగారు. ఏ కొంపలోనైనా ఒకరికి కలరాగాని, మసూచిగాని సోకిందో ఆ వెంటనే రోగిని అక్కడే వదిలి బంధుగణం దూరంగా ఏ అడవికో పారిపోసాగారు. వంగదేశంలోని ప్రతి గ్రామం, పల్లెకూడా యిలాంటి దుర్భర దారుణ పరిస్థితుల్లో చిక్కి ప్రజలు నరకయాతనలు అనుభవిస్తున్నారు.
📖

అది నడివేసవి. మిట్టమధ్యాహ్నంవేళ సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. పద చిహ్న మనే గ్రామంలోని వీధులూ, ఇళ్ళూ ఆ వేడికి పొగలూ, సెగలూ వెలార్చుతున్నవి. గ్రామం మధ్య ఒకే ఒక రెండంతస్తుల మేడ వున్నది. తక్కిన వన్నీ పూరి ఇళ్ళు. ఆ మేడకూ, ఆ గ్రామం చుట్టూ వున్న ఎక్కువ భాగం భూములకూ యజమాని మహేంద్ర సింహుడు. మహేంద్రసింహుడంతటి ధనికుడు ఆ చుట్టుపక్కల గ్రామాలలోకూడా మరెవ్వరూ లేరు.

కరువుధాటికి తట్టుకోలేక పదచిహ్న గ్రామస్తు లందరూ ఏనాడో గ్రామం విడిచి తలా ఒక దిక్కుకూ పారిపోయారు. పోగా, గ్రామంలో వున్న ఆ మేడలో మిగిలినది మహేంద్ర సింహుడూ, ఆయన భార్య కళ్యాణీ, వారి సంతానం రెండేళ్ళ శిశువు సుకుమారీ మాత్రమే.

మహేంద్రుడూ, అతడి భార్యా ఉపవాసాల తో సగం అయారు. సుకుమారికి పాలిచ్చే ఆవు మేత లేక చావ సిద్ధంగా వున్నది. ఈ దుర్భర పరిస్టితుల్లో తామిక ఆ గ్రామంలో వుండటం క్షేమం కాదని ఆ భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు.

కళ్యాణి దుఃఖాన్ని దిగమ్రింగి గోశాల వెళ్లి ఆవుపాలు తెచ్చి వాటిని వేడిచేసి బిడ్డకు పట్టింది. ఆవుకు మేతవేసి వచ్చింది.  ఇంట్లోకి వచ్చిన భార్యను చూచి "ఇలా ఎంతకాలం సాగుతుంది"? అని ప్రశ్నించాడు.

"ఇక ఎక్కువకాలం సాగదు, సాగినంత కాలం సాగించాను. ఇక బిడ్డను తీసుకొని మీరు పట్టణం వెళ్లిపోండి" అని అన్నది కళ్యాణి.

“నేను పట్టణం వెళ్లాలనుకుంటే యీ శ్రమంతా దేనికి ? పద ! ముగ్గురం వెళ్లిపోదాం, వెంటనే బయలుదేరు.” అన్నాడు మహేంద్ర.

ఇరువురి మధ్య కొద్దిసేపు చర్చ, తర్కం జరిగింది.

కళ్యాణి “పట్టణం వెళితే లాభం ఏమైనా వుంటుందా?” అంది.

మహేంద్ర “ఏమో ! అక్కడ ఎలా వుందో తెలియదు. ప్రాణరక్షణ ఉందో లేదో చెప్పలేను”.అన్నాడు.

కళ్యాణి “ముర్షిదాబాదు, కాసింబజార్, లేక కలకత్తా వెళితే మన ప్రాణాలకు రక్షణ లభిస్తుందేమో ! యీ ప్రదేశం వదిలి వెళ్లడం మంచిదేమోనని అనిపిస్తున్నది.” అంది.

మహేంద్ర “దొంగలు పడి యీ ఇంట్లో మన ధనమంతా ఎత్తుకుపోతారేమో !” అన్నాడు.

కళ్యాణి “ఎత్తుకుపోతే పోనీయండి. దొంగతనం చేయడానికి వచ్చే దొంగల్ని మనిద్దరం అపగలమా ! ప్రాణాలు వుంటే గదా డబ్బూ దస్కం ? ప్రాణాలేపోతే డబ్బు వల్ల ఏం ప్రయోజనం ? పదండి మూటముల్లె కట్టుకొని బయలుదేరుదాం. బ్రతికివుంటే తిరిగివద్దాం. అప్పుడు డబ్బును, ఆస్తిని అనుభవిద్దాం.”

మర్నాడు ఉదయం మహేంద్రుడు కొంతధనం మూటగట్టుకుని, ఇంటికి తాళాలు వేసి భార్యా బిడ్డతో రాజధాని నగరానికి ప్రయాణ మయ్యాడు. అతడు ఇంటి ప్రాంగణం దాటి వీధిలోకి వస్తూనే ఆగి వెన్నంటివస్తున్న భార్యతో “మనం రాజధాని పట్టణం చేరే లోపల కొండలూ, అడవులూ కూడా దాటవలసి వుంటుంది. రోజులు బాగాలేవు. ఎక్కడ చూసినా దారిదోపిడిగాళ్లు విచ్చల విడిగా తిరుగుతున్నట్టు రోజూ వార్తలు వింటున్నాం. ఎందుకైనా మంచిది, తుపాకీ తెస్తాను." అంటూ తిరిగి ఇంటిలోకి వెళ్లి, తుపాకీ, కొన్ని తూటాలూ తీసుకుని బయటికి వచ్చాడు.

కళ్యాణి కూడా భర్తను అనుసరించి ఇంటి ముఖద్వారం దగ్గిరకు వెళ్లి, అతడు బైటికి వచ్చి, తలుపులకు తాళం వేయబోయేంత లో, "ఆగండి, ఆత్మరక్షణకు ఉపయోగించే అస్త్రం నేను తెచ్చుకుంటాను," అంటూ లోపలికి వెళ్లి, ఒక చిన్న విషపు భరిణను భద్రంగా పమిట చెంగుకు కట్టుకుని బయటికి వచ్చింది.

జ్యేష్ఠమాసపు మండు టెండలో పడి మహేంద్రసింహుడు రాజధాని పట్టణం కేసి ప్రయాణమయ్యాడు. దారిలో వారికి తగిలిన చెరువులూ, గుంటలూ అన్నీ ఎండిపోయి వున్నవి. దాహబాధకు ఓర్చలేనప్పుడు ఎక్కడైనా చెరువులో కొద్దిగా మిగిలి వున్న మురికినీటినే తాగి దాహశాంతి చేసుకుంటూ చీకటి పడేవేళకు వారొక మజిలీ చేరారు. అది ఒక చిన్న సత్రము ఆ సత్రంలో మనుషు లెవరూ లేరు.

చుట్టుప్రక్కల వున్న ఇళ్ళల్లో గృహస్థులున్న సూచన లేమీ కనిపించలేదు. మహేంద్రుడు తన భార్యనూ, బిడ్డనూ సత్రం లోపల ఒక గదిలో కూర్చోపెట్టి, అక్కడ గోడకు ఆనించి వున్న, కుండపిడతల్లోనుంచి ఒక పిడత తీసుకుని, "సుకుమారికి ఎక్కడైనా పాలు దొరికే అవకాశం వున్నదేమో చూస్తాను. నువ్వు ఒంటరితనాని కేమీ భయపడకు.
నేనిప్పుడే తిరిగివస్తాను. ఆ శ్రీకృష్ణుని దయ వల్ల ఈ ఇళ్ళల్లో పాడిఆవు వున్నవాళ్ళెవ రైనా వుండవచ్చు." అంటూ సత్రంలోనుంచి వీధిలోకి వెళ్లాడు.

క్రమంగా చీకటి కమ్ముకుంటున్న సత్రం లోపలి మూలగదిలో కళ్యాణి, తన బిడ్డను ఒడిలో పరుండబెట్టుకుని బిక్కుబిక్కు మంటూ కూచున్నది. పావుగంట గడిచింది. మహేంద్రుడు తిరిగివస్తున్న జాడలేదు. దూరంగా వున్న శ్మశానంలో నుంచి కుక్కలూ నక్కలూ వికృతంగా అరిచే అరుపులు గట్టిగా వినవస్తున్నవి.
💪
*సశేషం*
ప్రాంజలి ప్రభ
. సేకరణ
[10/01 *ఆనందమఠ్ - 2* 
🛕

రచన : బంకిం చంద్ర చటోపాధ్యాయ

క్రమంగా చీకటి కమ్ముకుంటున్న సత్రం లోపలి మూలగదిలో కళ్యాణి, తన బిడ్డను ఒడిలో పరుండ బెట్టుకుని బిక్కుబిక్కు మంటూ కూచున్నది. పావుగంట గడిచింది. మహేంద్రుడు తిరిగివస్తున్న జాడలేదు. దూరంగా వున్న శ్మశానంలో నుంచి కుక్కలూ నక్కలూ వికృతంగా అరిచే అరుపులు వినవస్తున్నవి.

ఉన్నట్టుండి కల్యాణి కూచున్న చోటుకు కొంచెం పక్కగా వున్న ఒక తలుపు కిర్రు మన్నది. ఉలిక్కిపడి కల్యాణి అటుకేసి చూసింది. నల్లని నీడలా, ఎండి వడిలి పోయిన ప్రేతంలా ఒక ఆకారం, కొంచెంగా తెరుచుకున్న తలుపును ఆసరాగా పట్టుకుని ఆమెకేసే చూస్తున్నది.

కల్యాణి బిడ్డను భుజంమీదికి ఎత్తుకుని గదిలోనుంచి బయటికి పారిపోయేందుకు
లేవబోయింది. కాని భయంవల్ల ఆమె కాళ్ళు గజగజలాడిపోతున్నవి. లేచేందుకు ఆమె వృధాప్రయత్నం చేసి నిస్పృహగా కూలబడిపోయింది.

తలుపు నానుకుని నిలబడిన నల్లని ఆకారం వెనుదిరిగి చేయి పూపింది. ఆ వెంటనే ఒకటి... రెండు అంతులేనన్ని వికృత మానవాకారాలు నిశ్శబ్దంగా గదిలోకి ప్రవేశించి, కళ్యాణిని చుట్టుముట్టినై. కళ్యాణి కుమార్తెను గట్టిగా హృదయానికి హత్తుకుని పెద్దగా అరవబోయింది. కాని ఆమె గొంతు పెగలలేదు. ఇంతలో ఒక ప్రేతమూర్తి ఆమె కేసి చేయి వూపుతూ, తన వెంట వున్న జీర్ణ రూపాల కేదో సంజ్ఞ చేసింది. ఆపై కళ్యాణికి స్పృహ తప్పింది.

మరుక్షణం ఆ వికృతాకారాలు కళ్యాణినీ, సుకుమారినీ చేతుల్లోకి ఎత్తుకుని, పొలాలూ గుట్టలూ దాటి, ఒకానొక భయంకర అరణ్యం లోకి ప్రవేశించాయి.

కొద్దిసేపటికి మట్టి పాత్రలో పాలునింపుకొని మహేంద్ర అక్కడికి వచ్చాడు, కంగారుపడి అంతటా కలియ జూచాడు. అక్కడ ఎవ్వరూలేరు. బిడ్డను, భార్యను పేరుబెట్టి పిలిచాడు. అరిచాడు. కేకలు పెట్టాడు, కాని సమాధానం దొరకలేదు. భార్యాబిడ్డలు కనబడలేదు. ఏమైపోయారో తెలియదు.
📖

అరణ్యమంతా అంధకారమయంగా వున్నది. కళ్యాణినీ, ఆమె కుమార్తె సుకుమారినీ ఎత్తుకునిపోయిన ముఠా ఆ చీకట్లో నిశ్శబ్దం గా వారిద్దరినీ కొంతదూరం మోసుకుపోయి, సమతలంగా వున్న ఒక ప్రాంతాన కిందికి దించింది. ఆ వెంటనే చెట్లచాటు నుంచీ, పొదలమాటు నుంచీ బిలబిలమంటూ మరికొన్ని కంకాళమూర్తులు బయటికి వచ్చి, వారిని చుట్టుముట్టినై. అలా కళ్యాణిని అపహరించి తీసుకుపోయినవాళ్ళు, ఆ
కొత్తవాళ్ళను అటకాయిస్తూ, "గుప్పెడు బియ్యంగాని, జొన్నలుగాని యివ్వండి. ఈ ఇద్దరి వంటిమీద వున్న నగలన్నీ మీ కిచ్చేస్తాం." అన్నారు.

ఆ మాటలకు కొత్తగా వచ్చిన జీర్ణ దేహులు వికటంగా నవ్వుతూ, "బంగారం, వెండీ ఎవడిక్కావాలి మీరేమైనా గ్రామాన్నుంచి ధాన్యం తెచ్నారేమో అని వచ్చాం. ఎక్కడ దాచారు ?" అంటూ వాళ్ళమీద కలియబడ్డారు.

ఆ గుద్దులాటలో ఒకడు కీచుమంటూ అరిచి కిందపడి ప్రాణాలు వదిలాడు. తమలో ఒకడు ఆవిధంగా చావటం చూస్తూనే ఆ వికృతరూపులు పోట్లాట మాని, చచ్చిన వాడికేసి ఆశ్చర్యంగా చూడసాగారు. అప్పుడు వాళల్లో ఒకడు, "అలా చూస్తూ వూరుకుంటారేం ? మనం యింతకాలంగా నక్కల్నీ, కుక్కల్ని తిని ప్రాణాలు నిలబెట్టు కున్నాం. ఇప్పుడు అవి దొరకటంలేదు. ఎలానూ చచ్చాడు గనక, వీణ్ణి కాల్చుకు తిందాం." అన్నాడు.

ఆ వెంటనే చకుముకిరాయి కొట్టి నిప్పు చేసి, దానిమీద ఎండుటాకులూ, పుల్లలూ  వేసి కొందురు మంట చేయసాగారు. కొందరు తినటాని కేదో దొరికిందన్ని సంతోషంలో కీచుమంటూ గంతులు వేయసాగారు.

నిప్పు బాగా రాజి మంట లేవగానే ఇద్దరు ముగ్గురు శవాన్ని సమీపించి కాళ్ళూ, భుజాలూ పట్టుకుని దాన్ని మంటకేసి లాగసాగారు. అంతలో ఒకడు పెద్దగా అరుస్తూ ముందుకు వచ్చి, "మనం మనిషి మాంసమే తినదలిస్తే, ఈ ఎండి వడిలిన శవాన్నెందుకు తినాలి ? మనం పట్టుకొచ్చిన ఆడమనిషీ, ఆ చిన్నపిల్లా సంగతే మరిచి పోయారా ? వాళ్ళను గొంతు పిసికి, యీ మంటల్లో పేల్చండి. అందరం తృప్తిగా తినవచ్చు," అన్నాడు.

అప్పటివరకూ కళ్యాణినీ, ఆమె శిశువునూ మరిచిపోయి, తగువులూ, తైతక్కల్లో కాలం గడిపిన నికృష్ణపుమూక అంతా ఒక్కసారిగా, కళ్యాణినీ ఆమె బిడ్డనూ పడవేసిన చెట్టుకేసి తిరిగి, "ఎత్తుకురండి, మంటల్లో పడవేసి కాల్చండి. అంటూ బయలుదేరారు, కాని కళ్యాణి అప్పటికే సుకుమారితో అడవి లోపలికి పారిపోయింది.

"ఆ ఆడదీ, పిల్లా తప్పించుకుపోయారు. అడవిలో ఎంతో దూరం పోయివుండరు. నలుగురూ నాలుగు వైపులకూ పరిగెత్తి, వెతకండి" అంటూ ఇద్దరుముగ్గురు పెద్దగా అరిచారు. ఆ వెంటనే మూక మూకంతా అన్నిదిక్కులకూ పరిగెత్తింది.
📖

కళ్యాణి తన బిడ్డను గుండెలకు గట్టిగా హత్తుకుని, చీకటిలో దారీతెన్నూ కనిపించని అరణ్యంలో పరిగెత్తసాగింది. ఆమె వుద్దేశం తనను పట్టితెచ్చిన దుష్టులనుంచి సాధ్య మైనంత దూరం పారిపోవటం. వాళ్లు తన కోసం అడవి గాలిస్తున్నారన్న సూచనగా వాళ్ళ కేకలు ఆమెకు వినిపిస్తున్నవి.

కళ్యాణి లేని ఓపిక తెచ్చుకుని మరింత వడిగా అరణ్యంలోకి పరిగెత్తసాగింది. ఆమె పాదాలకు చెట్ల మోడులూ, ముళ్ళూ గుచ్చుకుని గాయాలయినై. శరీరాన్ని అడవి లతలూ, కొమ్మలూ తాకి బాధపెట్టసాగినై. అయినా ఆమె మొండిగా పరిగెత్తుతూనే వున్నది. క్రమంగా ఆమెకు తనను వెతికి పట్టుకోచూస్తున్న ఆ దుష్టుల కేకలూ, అరుపు లు దూరం కాసాగినై. ఆసరికి ఆమె బాగా అలిసిపోయింది. ఇక పరిగెత్తే శక్తిగాని, ఆఖరుకు నడిచే ఓపికగాని లేక ఆమె ఒక చెట్టుకింద సొమ్మసిల్లి పడిపోయింది.

ఒక అరగంట కాలం గడిచింది. చంద్రుడు అడవిచెట్లశిఖరాలని తెల్లగా మెరిపిస్తున్నా డు. చెట్లు అంత దట్టంగా లేని ప్రాంతాల చంద్రకిరణాలు నేలను తాకి గడ్డీ గాద రను ప్రకాశవంతం చేస్తున్నది. కళ్యాణి తన కుమార్తెతో పాటు చెట్టుకింద నిశ్చేతనంగా
పడి వున్నది. ఆమెపై చల్లని చంద్రకిరణాలు ప్రసరిస్తున్నవి.

ఉన్నట్టుండి కళ్యాణి కొద్దిగా కదిలింది. అర్ధచైతన్యావస్థలో వున్న ఆమెకు మృదు మధుర స్వరంలో ఒక పాట వినిపించసాగింది.
📖

హరే మురారే మధుకైటభారే గోపాల గోవింద ముకుంద శౌరే హరే మురారే మధుకైటభారే

కళ్యాణి కళ్ళు తెరిచింది. దగ్గిరలో ఎక్కడా మనిషి వున్న జాడలేదు. కాని తనకు పాట అంతకంతకూ బిగ్గరగా, స్పష్టంగా వినబడు తున్నది. కళ్యాణి ఆశ్చర్య సంభ్రమాలతో లేచి కూర్చోబోయింది. కాని ఆకలిదప్పుల వలనా, నరమాంసభక్షకులనుంచి తప్పించు కు పారిపోయే ప్రయత్నంలో పడ్డ ప్రయస వల్లా, ఆమె లేచేందుకు శక్తిహీనురాలు అయింది.

కల్యాణి ఆ పాట వస్తున్నవైపుకు తలతిప్పి చూస్తూ, నిశ్చేతనంగా వుండిపోయింది. హఠాత్తుగా గుబురుచెట్ల చాటునుంచి, చంద్రకాంతిలో తెల్లగా మెరిసిపోతూ, కాషాయాంబరాలు ధరించిన ఋషిలాంటి ఆజానుబాహు డొకడు ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. కళ్యాణి లేచి అతడికి ప్రణామం చేయబోయి, నీరసంగా ప్రక్కకు ఒరిగిపోయింది.

కళ్యాణికి తిరిగి స్పృహ కలిగి కళ్ళు తెరిచి చూసేసరికి, అరణ్యంలోనే ఒక విశాలమైన ప్రదేశంలో చలువ రాళ్లతో నిర్మించబడిన ఒక పెద్ద మఠంలో వుంది. పురాతత్వవేత్తలు దాన్ని చూచి పూర్వకాలంలో అది బౌద్దుల విహారంగా వుండేదని, ఆ తరువాత అదే హిందువుల మఠం అయిందని చెబుతారు. అందు విశాలమైన ప్రదేశంలో గల రెండతస్థు ల పెద్దభవనం వుంది. దానిలో అనేక దేవ మందిరాలు, ఎదురుగా నాట్యమందిరం వున్నాయి. చుట్టూ శిలాకుడ్యాలున్నాయి.
ఆ ప్రదేశాన్ని దట్టమైన అరణ్యం, పెద్ద పెద్ద చెట్లు ఆవరించియుండటం వల్ల అంత పెద్ద భవనం, అంత పెద్దమఠం పూర్తిగా ఎవ్వరికీ కనపడటంలేదు. అతి ప్రాచీనమైన కట్టడం కావడంవల్ల అక్కడక్కడా గోడలు బీటలు వారి వున్నాయి. పగలు పరిశీలించి చూస్తే ఆ భవనానికి ఈమధ్యనే మరమ్మత్తు చేసినట్లు అనిపిస్తుంది. దుర్భేద్యమైన ఆ అడవిలో మనుష్యులెవ్వరూ వుండేవారు కాదేమో అనిపిస్తుంది. ఆమె ఆ భవనమందలి  ఒకానొక దేవీ మందిరంలో ఒక పెద్ద గదిలో ఉన్నది. ఆ గది లాంటి మందిరం లో పెద్ద కొయ్య, అఖండ జ్యోతిగా కాలుతూ వుంది.
బౌద్ధం క్రమంగా క్షీణించిన తరవాత, ఆ విహారం అడవి చెట్లచేత ఆక్రమించబడి, జనబాహుళ్యానికి, ఆ కీకారణ్యం మధ్య అలాంటి కట్టడం వున్నదన్న సంగతే తెలియకుండాపోయింది.

కళ్యాణి ఆశ్చర్యంగా తన పరిసరాలను పరికిస్తున్నంతలో, అడవిలో దొంగల బారి నుండి, ఆమెను కాపాడిన తాపసి ఆమె దగ్గరకు వచ్చి, "అమ్మా, నీ కొచ్చివ భయం ఏమీలేదు. ఇది దేవతామందిరం. ఆకలి దప్పులతో శోషిల్లి వున్నావు. అవిగో, అక్కడ ఒక పాత్రలో పాలున్నవి. అవి నీకూ, నీ బిడ్డకు ఆకలి తీర్చగలవు. సంకోచించక తాగండి." అన్నాడు.

కళ్యాణికి యీ మాటలతో ప్రాణం లేచివచ్చి నట్టయింది. ఆమె లేని వోపిక తెచ్చుకుని లేచి నిలబడి, చీరచెంగును కంఠానికి చుట్టుకుని, ఆ తాపసికి నమస్కరించింది. ఆయన ఆమెను 'దీర్ఘ సుమంగళీభవ' అని దీవించి, అక్కడే పాలతో వున్న ఒక మట్టి పాత్రను తెచ్చి ఆమె ముందుపెట్టాడు.

కళ్యాణి ఆ పాత్రలోవున్న పాలను తన బిడ్డ సుకుమారికి కొంచెం తాగించి, మిగిలిన వాటిని దూరంగా పెట్టింది. తాపసి ఆమెకేసి ప్రశ్నార్ధకంగా చూస్తూ. ''అమ్మా ఆ మిగిలిన పాలు తాగకుండా దూరంగా పెట్టావేం?" అని అడిగాడు.

కళ్యాణి ఆ తాపసికి మరొకసారి తలవంచి నమస్కరిస్తూ, "స్వామీ, నన్ను క్షమించి ఆ పాలు తాగమని ఆజ్ఞాపించకండి. నేను మానసికంగా చాలా వ్యధపడుతున్నాను," అన్నది.

"అలా అయితే, ఆ సంగతేదో చెప్పు. నా చేతనైన సహాయం చెయ్యగలను. నేను అరణ్యవాసంలో కాలంగడిపే బ్రహ్మచారిని, సన్యాసిని. నువ్వు నా కుమార్తె లాంటి దానివి." అన్నాడు తాపసి.

కళ్యాణి కన్నులలో ఆశ్రువులు కదులుతుండ గా, గద్గదస్వరంతో, "స్వామీ, మీరు దైవ సమానులు, నేను నా భర్త నుండి కొందరు దుష్టుల కారణంగా యీ అరణ్యం లోకి చేరటం జరిగింది. నా భర్త జాడలు తెలియ కుండా, ఆయన భుజించారో లేదో కూడా తెలుసుకోకుండా, నేనెలా ఈ పాలు తాగగలను?" అన్నది.

తాపసి కళ్యాణిని ప్రశ్నించి ఆమె సత్రంలో నుంచి, ఎలా అపహరించబడిందో మొత్తం తెలుసుకున్నాడు. ఆమె తన భర్త పేరు చెప్పగూడదు గనక ఆమె నివసించే గ్రామం, అక్కడ భర్త అంతస్థూ విచారించి, ఆఖరుకు "నువ్వు మహేంద్ర సింహుని పత్నివా?" అనడిగాడు.

కళ్యాణి అవునన్నట్టు తల వూపింది. ఆ వెంటనే తాపసి, దేవీమందిరం నుంచి బయటికి పోతూ. "అమ్మా, నువ్విక్కడ నిర్భయంగా వుండవచ్చు. నేను నీ భర్తను వెతికేందుకు వెళుతున్నాను." అని చెప్పాడు.

ఆ వెంటనే తాపసి మఠం వదిలి అరణ్యం
లోకి ప్రవేశించాడు.
🪔
*సశేషం*
*ఆనందమఠ్ - 3* 
🛕

రచన : బంకిం చంద్ర చటోపాధ్యాయ

తాపసి మఠం వదిలి అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆప్పటికి రాత్రి రెండవ జాము జరుగుతున్నది. చంద్రుడు ఆకాశంమధ్య దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. ఆకాశా న్నంటే మహావృక్షాలతో, వాటి నల్లుకుని వున్న అడవితీగలతో చుట్టబడి వున్నందు వల్ల మఠం వున్న ప్రదేశం మాత్రం నల్లని కారుచీకటిముసుగుతో కప్పబడివున్నది.

తాపసి అరణ్యంలో కొంతదూరం నడిచి ఒక చిన్న పర్వతప్రాంతాన్ని చేరాడు. ఆ పర్వతాన్ని ఆనుకునే, ముర్షీదాబాదు నుంచి కలకత్తాకు పోయే రాజమార్గం వున్నది. తాపసి కొండమీదికి ఎక్కి చుట్టూ ఓమారు కలయచూచి, తృప్తిగా తలాడించి, కిందికి దిగివచ్చాడు. రాజమార్గానికి ఆనుకుని ఒక చోట మరింతదట్టమైన చెట్లగుంపు వున్నది. తాపసి సూటిగా అక్కడి కెళ్లాడు.

ఆయుధాలు ధరించివున్న దాదాపు రెండు వందలమంది యోధులు చెట్లకింద కూచుని వున్నారు. అంతా నిశ్శబ్దం. అక్కడ ఎవరూ మాటాడటంలేదు. తాపసి, ఆ యోధుల్లో ప్రతిఒక్కరినీ పరిశీలనగా చూస్తూ ముందుకు సాగి, ఒకచోట ఆగి ఒక యోధుణ్ణి పరీక్షగా చూసి, సంజ్ఞచేశాడు. వెంటనే నవయవ్వను డైన ఒక యువకుడు లేచినిలబడి తాపసి వెనుకగా బయలుదేరాడు. ఇద్దరూ చెట్ల గుంపులోనుంచి బయటికి వచ్చి రాజ మార్గం పక్కగా నిలబడ్డారు.

తాపసి రాజమార్గంకేసి ఓ క్షణకాలం చూసి, తరవాత తన వెంటవచ్చిన యువకుడితో..

"భవానంద్! మహేద్రసింహుడేమైందీ నీ కేమన్నా తెలుసా?" అని అడిగాడు.

"మహేంద్రసింహుడు నేటి ఉదయం, భార్యనూ, బిడ్డనూ వెంటబెట్టుకుని, పద చిహ్న గ్రామం వదిలి, రాజధానికేసి బయలు దేరాడు. కాని, సంధ్యాసమయంలో అతడు బసచేసిన సత్రంలో.........."

భవానందుడీలా చెపుతూండగానే, తాపసి అతడి మాటలకు అడ్డుతగిలి. "సత్రంలో ఆ దుండగం చేసినవాళ్ళెవరో కనుక్కున్నావా?" అని ప్రశ్నించాడు.

"ఆ దుండగానికి కారకులు ఆ గ్రామం రైతులే. వాళ్ళు ఆకలితో నకనకలాడుతూ దాపులనే వున్న అరణ్యంలో కాలం వెళ్ళ బుచ్చుతున్నారు. వాళ్ళు దొంగలుగా మారి పోయారు. అయినా, యీ కాటకపు రోజుల్లో దొంగ కానివాడెవడు. మేమూ యీ రోజు కొత్వాలుతాలూకు రెండు బస్తాల బియ్యం దారి అటకాయించి పట్టుకుని వైష్ణవుల తృప్తి కి కైంకర్యం చేశాం." అన్నాడు భవానందుడు.

ఆ మాటలకు తావసి చిరునవ్వు నవ్వి. "మహేంద్రుడి భార్యనూ, బిడ్డ, దొంగల బారి నుంచి నేనే రక్షించాను. వాళ్ళిప్పుడు మఠం లో వున్నారు. నీవు వెంటనే బయలుదేరి వెళ్ళి, ఆ మహేంద్రసింహుణ్ణి వెతికి తేవాలి. ఇక్కడి నాయకత్వ బాధ్యత జీవానందుడు నిర్వహిస్తాడు." అన్నాడు.
📖

సత్రంలో భార్యనూ, బిడ్డనూ వదిలి పాలకోసం గ్రామంలోకి వెళ్ళిన మహేంద్రుడు ఒక గంట కాలం తరవాత- పిడతతో పాలు తీసుకుని అక్కడికి తిరిగివచ్చాడు. కాని అతడికి భార్యా బిడ్డా కనిపించలేదు. అతడు వారికోసం సత్రం గదులన్నీ వెతికాడు. గొంతెత్తి బిగ్గరగా పిలిచాదు. అంతా వ్యర్థం.

మహేంద్రుడు ఇక ఆ ప్రాంతాల కాలయాపన చేయటం వ్యర్ధమని గ్రహించాడు. పట్టణానికి పోయి, అక్కడి ప్రభుత్యోద్యోగుల సాయంతో తన భార్యా బిడ్డలను వెతకటం ఒక్కటే మార్గమని నిశ్చయించుకున్నాడు. అతడు తుపాకిని భుజాన పెట్టుకుని రాజమార్గం మీద కొంతదూరం ప్రయాణించేసరికి అతడికి ఎదురుగా కొన్ని ఎడ్లబళ్ళూ, వాటిని కాసలా కాస్తూ, కొందరు ఇంగ్లీషు కంపెనీవాళ్ళ సిపాయిలూ ఎదురైయ్యారు.

1770 నాటికి వంగదేశంమీద ఆంగ్లేయులకు పూర్తి శాసనాధికారంలేదు. వాళ్ళకు అప్పట్లో పన్నులు వసూలు చేసే దివానీగిరిమాత్రమే ఉండేది. శాసనాధికారం, పరిపాలనా బాధ్యత అంతా నవాబు మీర్జాఫర్ చేతిలో వుండేది. అతను తాగుబోతు, విషయ లోలుడు మీదుమిక్కిలి విశ్వాసఘాతకుడు.

నవాబు మీర్జాఫర్ అసమర్థుడవటం ఆంగ్లేయులకు బాగా ఉపకరించింది. వాళ్ళు యిష్టమొచ్చినచోటు యిష్టమొచ్చినంత పన్నువసూలు చేసేవాళ్ళు. మీర్జాఫర్ వాళ్ళు పెట్టమన్నచోట రసీదుపైన సంతకాలు పెట్టేవాడు. బెంగాలీలు పన్నుల భారంతో కృంగిపోతుండేవాళ్ళు. కాని వాళ్ళ మొర వినే నాథుడే లేడు.

వంగదేశం యావత్తూ కరువుకాటకాలతో సర్వనాశనం అయిపోతున్న దశలో కూడా, ఇంగ్లీషువాళ్లు నియమించిన కలెక్టర్లు ప్రజల గూబలు పిండి పన్నులు వసూలు చేస్తూనే వున్నారు. తిండిలేక మరణించే వేలాది జనుల దురవస్థను వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. తాము పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బంతా పెట్టెల్లో పెట్టి, ఎడ్లబళ్ళమీద ఎక్కించి, సిపాయిల కాపలాతో కలకత్తాకు పంపేవాళ్ళు.
📖

ఇలాంటి సిపాయిల దండొకటి రాజమార్గం మీద మహేంద్రుడి కెదురైంది. చంద్రకాంతిలో బళ్ళకు వెనకా ముందూ తుపాకులు ధరించి నడుస్తున్న సిపాయిలను చూస్తూనే,
మహేంద్రుడు మార్గం దిగి, పక్కనే వున్న చెట్ల లోకి పోయేందుకు ప్రయత్నించాడు. ఎందుకంటే, ఆ రోజుల్లో దారిదోపుడులు తరచుగా జరుగుతూండేవి. సిపాయిలు తనను దోపిడిగాడుగా భావించి పట్టుకోవచ్చు.

మహేంద్రుడు రాజమార్గం నుంచి పక్కకు దిగి చెట్లకేసి కొంచెం దూరం నడిచేంతలో, దండు లో నుంచి యిద్దరు సిపాయిలు విడివడి, "దొంగ! దొంగ!" అంటూ పరిగెత్తుకుంటూవచ్చి అతణ్ణి పట్టుకున్నారు. ఈ సమయంలో తుపాకీని వుపయోగించటమా మానటమా? అని మహేంద్రుడు తటపటాయించేంతలో, సిపాయిలు అతడి చేతినుంచి తుపాకీ ఊడ బెరుక్కుని, "నడూ, దొంగ వెధవా!" అంటూ మహేంద్రుణ్ణి రాజమార్గం మీదికి లాక్కు పోయారు.

దండుముందు ఏదో గలాటా జరుగుతున్న ట్టు విన్న హవల్దారు, దండుమధ్య నుంచి ముందుకు వచ్చి, "ఏమిటది? ఎందుకా గోల?" అంటూ సిపాయి లిద్దర్నీ కోపంగా ప్రశ్నించాడు.

"హవల్దార్ సాబ్!మేమీ దొంగను పట్టుకున్నాం చేతిలో తుపాకీ కూడా వున్నది. వీడు దొంగల నాయకుడై వుంటాడు. దొరగారి దగ్గిరకు తీసుకుపొమ్మన్నారా ?'' అని అడిగాడొక సిపాయి.

హవల్దారు, మహేంద్రుణ్ణి గుచ్చిగుచ్చి ఓమారు పరీక్షగా చూసి, తలాడిస్తూ "దొరగారు కాస్త జల్సాలో వున్నారు. ఇప్పు డాయన్ని పలకరించి లాభంలేదు. వీణ్ణి కాళ్ళూ చేతులూ కట్టి బండిమీద పడవెయ్యండి. తరువాత చూద్దాం." అన్నాడు.

సిపాయిలు మహేంద్రుణ్ణి కాళ్ళూచేతులూ కట్టి ఒక బండిమీద పడవేశారు. దండు ముందుకుసాగింది.

తాపసిచేత, ఆదేశం పొంది భవానందుడు హరికీర్తన గానం చేస్తూ మహేంద్ర, అతడి భార్యబిడ్డలు విడిపోయిన బస్తీకి వెళ్లాడు. అక్కడ మహేంద్రుని సమాచారం తెలుసు కోవచ్చునని భావించాడు.

ఆంగ్లేయులు యిప్పుడు నిర్మించినట్లు ఆ రోజుల్లో రోడ్లు లేవు. మరో నగరాన్నుండి కలకత్తా వెళ్లాలంటే ముగల్ పాదుషాలు నిర్మాణం చేయించిన మార్గాలనుండే వెళ్ల వలసివచ్చేది. మహేంద్ర కూడా పదచిహ్న గ్రామాన్నుండి నగరం వెళ్లడానికి దక్షిణదిశ నుండి ఉత్తరదిశకు పయనం చేశాడు.

భవానందుడు తాళ పర్వతాన్నుండి బయలుదేరి బస్తీకి దక్షిణదిశనుండి ఉత్తర దిశ వైపే వెళ్లాలి.

అలా రాజమార్గం వద్దకు చేరుకున్న  భవానందుడు మార్గానికి ఎగువ నున్న ఒక గుట్ట పక్కన వుండి జరిగిన యీ గందరగోళ మంతా విన్నాడు. అతడికి ఎవరో ఒక వ్యక్తి తుపాకీతో కూడా సిపాయీలకి దొరికిపోయా డని తప్ప, ఆ వ్యక్తి తను వెతుకుతున్న మహేంద్రసింహు డని తెలియలేదు.

ఇప్పుడేమి చేయటమా అని భవానందుడు ఆలోచిస్తున్నంతలో దండు అతణ్ణి సమీపించింది. మహేంద్రుణ్ణి పట్టుకున్న సిపాయీలలో ఒకడు భవానందుణ్ణి అంత దూరాన చూస్తూనే, "అడుగో. ఇంకొక దొంగ పట్టుకోండి!" అంటూ ముందుకు పరిగెత్తాడు.

భవానందుణ్ణి నలుగురైదుగురు సిపాయిలు చుట్టుముట్టారు. భవానందుడు ఏమీ తొణగకుండా, "మీ కేంకావాలి ? నన్నెందుకు చుట్టుముట్టారు ?" అని అడిగాడు.

"మా క్కావలసిందేమిటో చెపుతాం. ముందు హవల్దారువద్దకు పద దొంగవెధవా." అంటూ ఒక సిపాయి భవానందుడి చేయి పట్టుకుని ముందుకు లాగాడు.

"నేను దొంగలా వున్నానా? నా కాషాయ వస్త్రాలు చూశారా ? నేను ఈ ఆడవిలో తపస్సు చేసుకునే బ్రహ్మచారిని," అన్నాడు భవానందుడు.

భవానందుడిలా అనగానే సిపాయిలు బిగ్గరగా నవ్వుతూ, "దొంగతనాలు చేసేందు కు యిదొక దొంగవేషం, బ్రహ్మచారులూ, సన్యాసులే యీ రోజుల్లో మరింత పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నారు." అన్నాడు.

ఆ తరవాత వాళ్ళు భవానందుణ్ణి యీడ్చు కుంటూ హవల్దారు దగ్గరకి తీసుకువెళ్ళారు. ఇది ఒకందుకు మేలే కావచ్చనుకున్నాడు భవానందుడు. సిసాయలచేరలో యింతకు ముందు పట్టుకోబడ్డ వ్యక్తి ఎవరైనదీ తెలుసు కోవచ్చు, ఒకవేళ అతడు మహేంద్ర సింహు  డైతే మరీమంచిది.

అలా కాకపోతే ఏక్షణానయినా తను, యీ పనికిమాలిన సిపాయిల గుంపునుంచి తప్పించికుని పారిపోగలడు అని అనుకున్నాడు.
🔥
*సశేషం*
*ఆనందమఠ్ - 4* 
🛕

రచన : బంకిం చంద్ర చటోపాధ్యాయ

హవాల్దారు భవానందుణ్ణి చూసి కళ్ళెర్ర జేశాడు. "వీడు గజదొంగలా వున్నాడు. ఆ కాషాయగుడ్డలూ, కండలు దిరిగిన శరీరం చూస్తే. యీ కరువు రోజుల్లో దార్లు కొట్టుకు తినే ముఠాలకు వీడే నాయకుడులా కనిపిస్తున్నాడు. తెల్లవారి చూద్దాం. వీణ్ణి కూడా ఆ మొదటిదొంగ వున్న బండిమీదే, కాళ్ళూచేతులూ కట్టి పడవెయ్యండి." అన్నాడు.

భవానందుడి కాళ్ళూ చేతులూ తాళ్ళతో బాగా బిగకట్టబడి, మహేంద్రుడున్న బండి మీదికి చాపచుట్టలా విసిరివేయబడ్డాడు. మహేంద్రుడు బ్రహ్మచారివేషంలో వున్న యీ కొత్తదొంగను చూసి ఆశ్చర్యపడేంతలో, భవానందుడు చిన్నగొంతుతో, “మెల్లిగా మాట్లాడు. నువ్వు మహేంద్రసింహుడి వవునా ?" అని అడిగాడు.

మహేంద్రసింహుడు కొంచెం ఆశ్చర్యపడి, "అవును, నేను మహేంద్రసింహుణ్ణి. మీ రెలా గుర్తించారు ?'' అని ప్రశ్నించాడు.

"నేను నిన్ను గుర్తించలేదు. ఇంతకుముందు జరిగిన సంగతి సందర్భాలను బట్టి వూహించాను. సరే మంచిది. మన యిద్దరం కలిసి ఒక ముఖ్యప్రదేశానికి వెళ్ళవలసి వున్నది. ముందు నీ చేతి కట్లనూ, కాలి కట్లనూ తెంచుకో. ఆ బండిచక్రానికి ఆ కట్లున్న చోటు తాకించావంటే, రాపిడికి అవే తెగిపోతాయి.” అన్నాడు భవానందుడు.

భవానందుడు చెప్పినట్లే చేసి, మహేంద్రుడు తనను బంధించి వున్న తాళ్ళనుంచి ముక్తు డయాడు. ఈలోపల భవానందుడు కూడా తన కట్లను తెంచుకున్నాడు.

ఒకటిరెండు నిముషాల నిశ్శబ్దం తరవాత భవానందుడు తల ఎత్తి, సిపాయిలు సమీపిస్తున్న ఒక చిన్న కొండకేసి చూస్తూ. "మహేంద్రా! ఇక కొద్దిక్షణాల్లో నువ్వూ నేనూ స్వేచ్ఛ పొందబోతున్నాం. అంతేకాక, ఈ సిపాయిలు కరువు కాటకాలతో కృశించి పోతున్న బెంగాలీ రైతులనుంచి వసూలు చేసిన డబ్బూ దస్కమూ కూడా మనది కాబోతున్నది. కొంచెం హెచ్చరికగా వుండు.” అన్నాడు.

సిపాయిలదండు కొండను సమీపించేంతలో, ముందున్నవాళ్ళకు ఎదురుగా వున్న కొండ పాదంలోని ఒక పెద్ద రాతిమీద ఒకవ్యక్తి నింబడివుండటం కనిపించింది. ఆ వెంటనే ముందు నడుస్తున్న సిపాయిల్లో కొందరు, "అడుగో, మరొకదొంగ!'' అంటూ దండు విడిచి ఆ వ్యక్తి కేసి పరిగెత్తారు.

భవానందుడు బండిమీద నుంచి మోచేతుల మీద కొద్దిగా లేచి అటుకేసి చూడసాగాడు. సిపాయిలు ఒక దృఢకాయుడైన పొడవుగా కాషాయాంబరాలు ధరించివున్న యువకుణ్ణి హవల్దారు దగ్గిరకు లాక్కొచ్చారు. హవల్దారు కోపంగా చేయెత్తి, "దొంగ వెధవా ! అంటూ ఆ కాషాయవస్త్రధారిని ముఖంమీద గట్టిగా కొట్టబోయేంతలో, ఢాం అంటూ పిస్టర్ మోగింది. హవల్దారు ఒక చావుకేక పెట్టి వెనక్కు పడిపోయాడు. అదే అదనుగా భవానందుడు బండిమీది నుంచి దూకి, ఒక సిపాయి చేతినుంచి కత్తి లాక్కున్నాడు. మరుక్షణంలో రాజమార్గం పక్కనవున్న చెట్లగుంపులో కాషాయవస్త్రధారులై వున్న రెండువందలమంది ఆయుధధారులు 'హరే మురారే! హరే మురారే!" అంటూ వచ్చి సిపాయిలదండుమీద పడ్డారు.

హవల్దారు మరణించటం, ఖడ్గపాణులైన యోధులు హఠాత్తుగా వచ్చి మీదపడటం తో, ధనాన్ని కావలి కాస్తూ బండ్లవెంట నడిచే సిపాయిల్లో భీతీ, కలవరం ఏర్పడింది. ఇదంతా చూసిన సిపాయిల కమాండరు తెల్లదొర, గుర్రాన్ని వేగంగా పరిగెత్తిస్తూ, బళ్ళముందుకు వచ్చి "సిపాయిలంతా భయపడకుండా, యీ దొంగ వెధవల్ని ఎదిరించండి. మన తుపాకుల ముందు, వీళ్ళ కత్తు లేపాటి." అంటూ కేకలు పెట్టసాగాడు.

హవల్దారు పోయినా, ముఖ్య సేనాని ఇంగ్లీషుదొర బతికివుండటం, అతడన్నట్టు దొంగలచేతుల్లో కత్తులు తప్ప మరే ఆయుధం కనబడకపోవటంతో, సిపాయిలు కొంత ధైర్యం తెచ్చుకుని చతురస్రంగా నిలబడి, తమమీది కురికివస్తున్న ఆ కాషాయాంబరధారులపైకి తుపాకు లెత్తారు. కాని, అదే సమయంలో దాడి చేస్తున్న యోధుల్లో ఒకవ్యక్తి 'హరే మురారే!' అంటూ పెద్దగా నినాదం చేసి, గుర్రంమీద వున్న దొరను కత్తితో ఒక్కపోటు పొడిచాడు. దొర ఒక్క అరుపు అరిచి గుర్రం మీది నుండి తలకిందులుగా కింద పడిపోయాడు.

ఈ విధంగా తమ నాయకుడు దుర్మరణం పాలవగానే, సిపాయిలు లౌక్యం కోల్పోయి, ఎత్తిన తుపాకీలు దించి, వెనుదిరిగి రాజ మార్గం వెంట పారిపోసాగారు. కాషాయాంబ రధారులు, అలా పారిపోయేవారిలో దొరికినవారిని చంపి ఇంగ్లీషు వాళ్ళ ఖజానా అంతా వశపరుచుకున్నారు.

మొదటిసారి తుపాకీ పేల్చి హపల్దారును చంపిన యోధుడు తన అనుచరులకు బండ్లమీద వున్న ధనపు పెట్టెలను దించవల సిందిగా ఆజ్ఞ యిచ్చాడు. ఆ వెంటనే యోధులు పెట్టెలను దించి వాటిని మోసుకుంటూ అడవికేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో రక్తశిక్తమైన కత్తిని చేతబూని భవానందుడు ఆజ్ఙనిస్తున్న యోధుని ముందుకు వచ్చాడు. భవానందుడ్ని చూస్తూనే ఆ యోధుడు ఆతడి భుజం పట్టుకుని ఉత్సాహంగా వూపుతూ, "భవానంద్ సోదరా! మనం అనుకున్న దాని కంటె తేలిగ్గానే మ్లేచ్చుల మదం అణచాం, ఈ దోపిడీ ధనాన్ని మన రహస్య ప్రదేశానికి చేరుస్తాను. నీ ప్రయాణం ఎటు?" అని ప్రశ్నించాడు.

భవానందుడు ఆ ప్రశ్నకు వెంటనే జవాబివ్వ కుండా చుట్టూ కలయచూశాడు. అతడికి ఆ రాజమార్గం దిగువన ఒక చెట్టునీడలో ఒక ఆకారం కనిపించింది. భవానందుడు అతడె వరైనదీ గ్రహించినవాడిలా తల పంకించి, "జీవానంద్ సోదరా! నువ్వు, ముందు బయలుదేరు. నేను ఒకటి రెండు నిమిషాల్లో నిన్ను అనుసరిస్తాను." అంటూ ఆ ఆకారం నిలబడి వున్న చెట్టుకేసి బయలుదేరాడు.

వెన్నెలకాంతిలో గుబురుచెట్టు ఛాయలో కత్తి చేబూని నిలబడివున్న ఆ వ్యక్తి మహేంద్ర సింహుడు. అతడు కాషాయవస్త్రధారులైన యోధులు సిపాయీల మీద చేసిన పోరులో తటస్థంగా వుండిపోయాడు. ఇంగ్లీషువాళ్ళు బళ్ళమీద ఎక్కించుకుపోతున్న ధనం బెంగాలీ రైతుల్ని పీడంచి బలవంతంగా వసూలు చేసినదే కావచ్చు కాని, దానిని దోచుకునేందుకు వచ్చిన దొంగలకు తోడ్పడి తన హృదయా న్నెందుకు మలినం చేసుకోవాలి ? దొంగలకు సహాయపడేవాడు కూడా దొంగే అవుతాడు. ఇలా ఆలోచించి మహేంద్రుడు, ఒక సిపాయినుంచి కత్తి లాక్కుని కూడా, దూరంగా చూస్తూ నిలబడిపోయాడు.

భవానందుడు చకచక నడుస్తూ, మహేంద్రుణ్ణి సమీపించేంతలో అతడు కటు వుగా "మీ రేవరు ?" అని ప్రశ్నించాడు.

భవానందుడుకూడా అంత కంఠస్వరంతోనే, "నే నెవరో తెలుకోవలసిన అవసరం నీకేం
కలిగింది ?" అని మారు ప్రశ్న వేశాడు.

భవానందుడి కంఠస్వరంలోని కాఠిన్యత గమనిస్తూనే మహేంద్రుడు కొంచెంగా ఆశ్చర్యపడి, "మీ రెపరో తెలుసుకోవలసిన అవసరం నాకున్నది. ఇంతకుముందు మీరు నా కెంతో గొప్ప సహాయం చేశారు. నన్ను బంధవిముక్తుణ్ణి చేసిన మీకు కృతజ్ఞుణ్ణి." అన్నాడు.

ఆ మాటలకు భవానందుడు అవహేళనగా నవ్వుతూ. "అలాంటి కృతజ్ఞత మీకున్నట్లు రుజువేం కాలేదు. మీ జమీందార్లు ఎంత పిరికిపందలో యింతకుముందే గ్రహించాను. కత్తి చేతబట్టికూడా అలా స్థాణువులా నిలబడిపోవటం, నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది." అన్నాడు.

"నేను దొంగతనం చేసేవారికి సాయపడి పాపం ఎందుకుకట్టుకోవాలి ?" అన్నాడు మహేంద్రుడు.

భవానందుడు ఆ మాటలకు నవ్వి, "సరే, అలాంటి దొంగ నుంచే, నీవు కావాలను కుంటే మరింత సహాయం పొందగలవు. నా వెంట రాగలవా? నీ భార్యా, కుమార్తే వున్న చోటు చూపుతాను." అన్నాడు.

మహేంద్రు డీ మాటలకు ఎక్కడలేని ఆశ్చర్యం కనబరుస్తూ, "మీరు నా భార్యా, కుమార్తే వున్న చోటు చూపెడతారా.. ఆశ్చర్యంగా వుందే. వాళ్ళెక్కడున్నారో మీ కెలా తెలుసు ?" అన్నాడు.

"సరే, ఆశ్చర్యపడుతూ చెట్టుకిందే వుండదలిస్తే నా అభ్యంతరంలేదు. కాని, ఒకవేళ నీ భార్యనూ, బిడ్డనూ చూడదలిస్తే మాత్రం, నావెంట రా." అంటూ భవానందు డు అడవికేసి బయలుదేరాడు. మహేంద్ర సింహుడు మారుమాటాడకుండా అతణ్ణి అనుసరించాడు.
🔥
*సశేషం*
*ఆనందమఠ్ - 5* 
🛕

రచన : బంకిం చంద్ర చటోపాధ్యాయ

భవానందుడు ఆడవిలో ప్రవేశించి ఒక
కాలిబాట వెంట నడవసాగాడు. మహేంద్రుడి కతణ్ణి, తన భార్యాబిడ్డలను గురించి ఏవేవో ప్రశ్నలు చేయాలని కోర్కెగలిగింది కాని నిశ్శబ్దంగా తలవంచుకు నడుస్తున్న ఆ బ్రహ్మచారిని ప్రశ్నించే ధైర్యం అతడికి లేకపోయింది. ఉన్నట్టుండి భవానందుడు తలెత్తి చంద్రకాంతిలో మిలమిల మెరుస్తున్న వృక్ష శిఖరాగ్రాలకేసి ఓమారు చూసి గొంతెత్తి
పాడసాగాడు:

వందే మాతరమ్ సుజలాం సుఫలాం మలయజశీతలాం సస్య శ్యామలాం మాతరమ్.

మహేంద్రుడి కా పాట ఆశ్చర్యం కలిగింది. పేరూ వూరూ లేని యీ మాత ఎవరు ?
అనుకున్నాడతను. వెంటనే ఆతడు భవానందుణ్ణి, "బ్రహ్మచారీ! ఎవరీ మాత ?" అని ప్రశ్నించాడు. కాని, భవానందుడు ఏమీ జవాబివ్వక పాడుకుపోతున్నాడు.

శుభ్రజోత్స్నా పులకిత యామినీమ్ పుల్లకుసుమిత దృమదళ శోభినీమ్ సుహాసినీమ్ సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరమ్.

భవానందుడు అంతవరకు పాడగానే
మహేంద్రుడు చిరునవ్వు నవ్వుతూ, ''మీరు పాడే పాటలో కనిపించేది దేశం; తల్లి కాదు," అన్నాడు.

"అవును, దేశమే! మే మీ దేశమాతను తప్ప మరొకరిని ప్రేమించం. 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ' మేము జన్మభూమినే తల్లిగా భావిస్తాం. అది తప్ప మాకు యింకో తల్లి లేదు. తండ్రిలేడు, భార్య బిడ్డలు, ఇల్లు వాకిలి ఏమీలేదు." అన్నడు భవానందుడు గంభీరంగా..

"అయితే ఏదీ, ఆ పాట మరోసారి పాడండి!" అన్నాడు మహేంద్రుడు.

వందేమాతరమ్

సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరమ్

సుభ్రజ్యోత్స్నా పులకిత యామినీమ్
పుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్ సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరమ్
సప్తకోటి కంఠ కలకల నినాదకరాళే ద్విసప్తకోటి భుజై ధృత ఖరఖరవాలే అబలాకే నమాఎతవాలే
బహుబుధారిణీ సమామి తారిణీమ్
రిపు దళవారిణీమ్ మాతరమ్
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణాః శరీరే
బాహుతేతు మిమాశక్తి
హృది తుమి మాభక్తి
తోమరాయి ప్రతిమాగాడి మందిరే మందిరే
త్వంహి దుర్గాదశ ప్రహరణ ధారిణీ
కమలా కమల దళవిహారిణీ
వాణీ విద్యాదాయినీ నమామిత్వాం నమామి కమలా మమలా మతులాం సుజలాం సుఫలాం మాతరమ్
వందే మాతరమ్
శ్యామలాం సరళాం సుస్మితాం భూషితామ్
ధరణీం ధరణీం మాతరమ్.
📖

భావానందుడు యిలా పాడుతూ పాడుతూ దుఃఖంతో వివశుడైపోయాడు, మహేంద్రు డా పాటకు తన్మయుడై "మీరు అడవిలో తపస్సు చేసుకునే బ్రహ్మచారుల్లా నాకు కనిపించటం లేదు. నిజం చెప్పండి.
మీరెవరు?" అని అడిగాడు.

"మేము సంతానులం!" అన్నాడు భవానందుడు.

"సంతానులు! అంటే ఎవరి సంతానం?" అన్నాడు మహేంద్రుడు.

"దేశమాత సంతానం."

“మీరు దేశమాత సంతానమా!" అంటూ మహేంద్రుడు కొంచెం యీసడింపుగా అని, "అయితే దేశమాత మిమ్మల్ని దొంగతనాలు చేసి బ్రతకమన్న దన్నమాట. మీరేదో ఒక రోజున సిపాయీల ఫిరంగి మూతులకు కట్టబడి తునాతునియలు చేయబడతారు. రాజుగారి ధనం దోపిడీ చేసినవారెవరూ బతికి బయటపడలేదు." అన్నాడు.

"మేము దోచింది రాజధనం కాదు. పాలన చేయనివాడు రాజు కాదు. దేశంలో ప్రజలు తిన తిండిలేక, ఆకలములు తిని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూంటే, మనకు పాలకుణ్ణని చెప్పుకునే నవాబు మీర్జాఫర్ ఏంచేస్తున్నాడు? అతడి నౌకరీలో ఉన్న ముస్లిం సైనికులు గ్రామాలమీద పడి, దోపిడులు, మానభంగాలు చేస్తూంటే అతడు తెలిసే, ఆ కిరాతకృత్యాలను ఆపేందుకు ప్రయత్నం చేయడేం?" అని భవానందుడు క్రోధంవుట్టిపడే గొంతుతో ప్రశ్నించాడు.

మహేంద్రుడీ ప్రశ్నకు కలవరపడుతూ,
"నిజమే, ఈ ముస్లిం పరిపాలనలో ఇలాంటి రాక్షసకృత్యాలన్నీ జరుగుతున్నవి. కాని వాళ్ళను గద్దె దించటం ఎలా సాధ్యం? మీ కొద్దిమంది సంతానులచేత అదెలా సాధ్య మవుతుంది?" అన్నాడు.

"ప్లాసీయుద్ధంలో ఆంగ్లేయ సేన ఎంత ? నవాబు సేన ఎంత ?" అని ప్రశ్నించాడు భవానందుడు.

"ఆంగ్లేయులూ, మన బెంగాలీలం సమానమా?" అన్నాడు మహేంద్రుడు.

"సమాన మయేందుకే ప్రయత్నిస్తాం. ప్లాసీలో అంత చిన్న సేనతో ఆంగ్లేయులు ముస్లిం సేనావాహినిని ఎందువల్ల ఓడించగలిగారు? వాళ్ళకున్న ధైర్యసాహసాలే అందుక్కారణం. మహమ్మదీయుల్లో ఆవిలేవు. కాస్త శరీరం చెమట పట్టగానే యుద్ధ రంగం విడిచి పారిపోతారు. షర్బత్ ఎక్కడ దొరుకుతుందా అని తిరుగుతారు. వాళ్ళల్లో ధైర్యం లేదు, పట్టుదలా లేదు. ఒక ఫిరంగిగుండు ఒక స్థానంలోనే గాని పది స్థలాల్లో పడదు. అందువల్ల ఒక్క ఫిరింగిగుండు చూసి పదిమంది పారిపోనవసరం లేదు. మహమ్మదీయ సైనికుడు ఒక గుండు చూస్తే చాలు గుండెపగిలినంత పనై పారిపోతారు, ఆంగ్లేయ సైనికుడెన్ని గుండ్లను చూసినా యుద్ధరంగం వదిలి పారిపోడు," అన్నాడు భవానందుడు.

"మీ సంతానులకు, ఆంగ్ల సైనికుల కున్నంత గుండెధైర్యం వున్నదని నన్ను నమ్మమంటా రా?" అని ప్రశ్నించాడు మహేంద్రుడు.

"ప్రస్తుతం లేకపోవచ్చు. అలాంటి ధైర్య సాహసాలు చెట్టునుంచి రాలేవి కావు. అభ్యసించి అలవరచుకోవలసిన గుణం అది. మేం సన్యాసులం మా కార్యం పూర్తయే వరకూ, మేం మా భార్యా పిల్లల ముఖం చూడం. కావాలనుకుంటే నువ్వూ సంతానుడవు కావచ్చు" అన్నాడు భవానందుడు.

"భార్యా బిడ్డలను పరిత్యజించ నవసరం లేకపోతే, నేనూ ఓ సంతానుల వ్రతం స్వీకరిస్తాను." అన్నాడు మహేంద్రుడు.

"వారిని వదలనిదే నువ్వీ సంతానవ్రత గ్రహణం చేయలేవు." అంటూ వేగంగా నడవసాగాడు భవానందుడు.
🔥
*సశేషం*

*ఆనందమఠ్ - 6* 
🛕

రచన : బంకిం చంద్ర చటోపాధ్యాయ

భవానందుడు మహేంద్రుణ్ణి వెంటపెట్టుకుని ఆనందమఠం చేరేసరికి సూర్యోదయమైంది. వారిద్దరూ మఠంలోని పూజామందిరద్వారం సమీపించేంతలో  తాపసి - సత్యానంద స్వామి, అప్పుడే ప్రాతఃకాల పూజ ముగించి, జీవానందుడితో ఏదో మాట్లాడుతున్నాడు.

మహేంద్రుణ్ణి చూస్తూనే, సత్యానందస్వామి ముందుకు వచ్చి, భవానందుణ్ణి భుజం పట్టుకుని, పూజామందిరానికి పక్కనే ఉన్న మరొకగదిలోకి తీసుకుపోయి, కొద్దినిమిషాల తర్వాత తిరిగి పూజామందిరంలోకి వచ్చాడు. ఈసారి మహేంద్రుడు ముందుకు రెండడుగులు వేసి సత్యానందస్వామికి నమస్కరించాడు. సత్యానంద అతణ్ణి దీవించి “మహేంద్రసింహా ! నీ క్కలిగిన ఆపద మమ్మల్నందర్నీ కలత పరిచింది. నేనే నీ భార్యనూ, బిడ్డనూ అడవిలో దొంగలనుంచి కాపాడి, ఇక్కడికి తెచ్చాను. రా, వారున్న చోటుకు తీసుకుపోతాను," అంటూ బయలుదేరాడు.

సత్యానందస్వామి, మహేంద్రుణ్ణి వెంట పెట్టుకుని, చీకటిమయంగా వున్న నాలుగైదు గదుల్లోనుంచి నడిచి, కొంచెం వెలుగు వున్న ఒక పెద్ద గదిలో ప్రవేశించాడు. అక్కడ ఒక చతుర్భజమూర్తి విగ్రహం మహేంద్రుడికి కనిపించింది. శంఖచక్రగదాపద్మధారియై వక్షస్థలంమీద కౌస్తుభమణి ప్రకాశిస్తున్న ఆ విగ్రహాన్ని చూచి మహేంద్రుడు దిగ్భ్రామ చెందాడు. ఆ మూర్తి పాదపద్మాల ముందు మధుకైటభరక్కసుల శిరస్సులు మొండెం నుండి వేరై పడి వున్నవి.

"ఈ మూర్తిని చూశావా, మహేంద్రసింహా ?" అని అడిగాడు సత్యానందస్వామి. మహేంద్ర సింహుడు తల ఊపాడు.

"ఆ విష్ణుమూర్తి అంకమున వున్న దేవిని గుర్తించావా?" అన్నాడు సత్యానంద స్వామి.

"లేదు స్వామీ, ఎవరామె?" అని అడిగాడు మహేంద్రుడు.

"మాత! మన మందరమూ ఆమె సంతానమే. చెప్పు, వందేమాతరమ్" అని హెచ్చరించాడు సత్యానందుడు. మహేంద్రుడు తలవంచి వందేమాతరమ్ అన్నాడు.

సత్యానందుడు, మహేంద్రుణ్ణి మరొక గదిలోకి తీసుకుపోయాడు. అక్కడ అష్ట భుజాలో సమస్తాలంకారాలతో శోభిల్లుతున్న జగద్ధాత్రీమూర్తి మహేంద్రుడికి కనిపించింది.

"ఈమాత పేరేమిటి ?" అని అడిగాడు మహేంద్రుడు.

"సింహ, వ్యాఘ్ర, గజ, భల్లూకాది వన్య మృగాలను తన పాదాలతో నేలమట్టగించి, అక్కడ పద్మాసనం ప్రతిష్టించి కూర్చున్న సమస్థ ఐశ్వర్యస్వరూపిణి. ఈమెకు నమస్కరించు,” అని ఆజ్ఞాపించాడు సత్యానందుడు. మహేంద్రుడు నమస్కరించాడు.

సత్యానందస్వామి, మహేంద్రుణ్ణి మరొక గదిలోకి నడిపాడు. ఆ గది చీకటి వెలుగుల మయంగా వుంది. అక్కడ ప్రతిష్ఠితమైన భీకరకాళీమూర్తిని చూసి మహేంద్రుడు కొంచెం భయపడ్డాడు. సత్యానందుడు, మహేంద్రుని ముఖకవళికల్లో భయచిహ్నాల ను గ్రహించినవాడిలా ముఖం పెట్టి, "ఈమె కాళీమాత! నేడు దేశం సర్వనాశనమై వున్నది. అందువల్లనే కాళీమాత కంకాళ మాలలు ధరించివున్నది. ఆమె తన శివుణ్ణి పాదాలతో మర్దించుతున్నది. హా, మాతా !" అంటూ సత్యానందుడు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అతడిగొంతు రుద్దమైపోయింది.

"స్వామీ, ఆమె చేతుల్లో కత్తి, కపాలమూ ఏమిటి?" అని అడిగాడు మహేంద్రుడు భక్తి భయాలతో వణికిపోతూ.

“మేమంతా ఆమె సంతానమే. ఆమె తన చేతగల కత్తినే మాకు అనుగ్రహించింది. చెప్పు, వందేమాతరమ్ అన్నాడు సత్యానందస్వామి. 'వందేమాతరమ్' అంటూ మహేంద్రుడు కాశీమూర్తికి సాష్టాంగ నమస్కారం చేశాడు.

సత్యానందస్వామి ఆ గదిలోనుంచి బయటికి పోబోయేంతలో, మహేంద్రుడాయ నతో, "స్వామీ! ఒక్కమనవి. నన్ను నా భార్య నూ, పుత్రికనూ ఒక్కసారి చూడనివ్వండి. తరవాత వారిని పంపివేసి, నేనూ మీ సంతానుల వ్రతగ్రహణం చేసాను." అన్నాడు.
"నీ భార్యా పుత్రికలను ఎక్కడకు పంపుతావు?' అని సత్యానందు డడిగాడు.

ఆ పశ్న తలెత్తిన తరవాత గాని మహేంద్రుడికి, తన భార్యా పుత్రికలను పంపేందుకు ఎక్కడా చోటు లేదనే సంగతి స్ఫురణకు రాలేదు.

"పదచిహ్న గ్రామంలోని నా ఇంటిలో ఎవరూ లేరు. మహమ్మారి లాంటి యీ కరువు కాటకాల మధ్య ఆమె నెక్కడికి పంపినా, ఎవరాదరిస్తారు?" అన్నాడు మహేంద్రుడు దీనంగా.

సత్యానందస్వామి ఆ ప్రశ్నకు జవా బేమీ చెప్పకుండా తల వూపి వూరుకుని, "సరే, ఈ ద్వారం వెంట బయిటికి వెళ్ళు. అక్కడ ఆవరణలో నీ భార్యా, పుత్రికా వున్నారు." అంటూ మహేంద్రుడికి చెప్పి, మహేంద్రుడు బయటికి పోగానే, ఆ గదిలో వున్న ఒక రహస్య సొరంగం తెరచి, దాని మెట్లమీదుగా భూగృహంలోకి దిగిపోయాడు.

ఆ భూగృహంలో, జీవానందుడూ, భవానందుడూ రాత్రి దోచుకువచ్చిన ఆంగ్లేయుల ఖజానా పెట్టెలు బద్దలుకొట్టి, అందులో వున్న రూపాయలు రాసులుగా పోసి లెక్క పెడుతున్నారు. సత్యానందుడు వారితో మహేంద్రుడు తిరిగి మన దగ్గిరకు వస్తాడు. అతడివల్ల మన సంతానులకు గొప్ప మేలు జరుగుతుంది. ఇక్కడ మీ పని పూర్తికాగానే, అడవిలో భార్యా బిడ్డలతో పోయే మహేంద్రుడి వెంటనంటి వుండండి. ఆ సమయం రాగానే అతణ్ణి మన మఠం లోని విష్ణు మంటపానికి తీసుకురండి" అని చెప్పి, భగృహం నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు.
🔥
*సశేషం*

*ఆనందమఠ్ - 7*  

మహేంద్రుడు గదిలోనుంచి బయిటికి వస్తూనే, ఒక విశాలమైన మంటపంలో 

సుకుమారిని ఒడిలో పెట్టుకుని తలవంచుకు కూర్చున్న భార్యను చూశాడు. ఆమెను చూస్తూనే అతడికి దుఃఖం ఆగిందికాదు. కళ్యాణి అడుగుల చప్పుడు విని తల ఎత్తి భర్తకేసి చూస్తూనే, ఆనందం దుఃఖం ఒకేసారి హృదయాన్ని పెనగొనగా లేచి నిలబడి జలజల కన్నీళ్లు కార్చింది. భార్యాభర్త లిద్దరూ కొంతసేపు మాట్లాడలేక ఒకరి నొకరు చూసుకుంటూ మూగ బాధననుభవించారు. తరువాత కళ్యాణి సత్రంలో తన ఆపహరణ సంగతి చెప్పింది. మహేంద్రుడు తన అనుభవాలు చెప్పాడు.

ఈవిధంగా ఒక అరగంటకాలం గడిచింది. మహేంద్రుడు తన భార్యతో.

"ఇక మనం ప్రయాణమై పోవటమే మంచిది. ఈ పవిత్రస్థలం సంసార లంపటాలలో చిక్కుకుని అలమటించే మనలాంటి పామరులకు వాసస్థానంకాదు," అన్నాడు.

మహేంద్రుడు కూతురును చంక నెత్తుకుని ఆవరణలో నుంచి కదలబోయేంతలో అతడికి ఎదురుగా ఒక తిన్నెమీద రెండు టేకుఆకులలో భోజనపదార్థాలు కనిపించినై. అవి ఎప్పుడెవరక్కడ పెట్టారో తెలియదు. మహేద్రుడు వాటిని భార్యకు చూపించాడు.

“ఇవి మనకోసమే. ముందు మీరు తినండి." అన్నది కళ్యాణి, మహేంద్రుడు మారు మాటాడకుండా తిన్నెమీద కూర్చుని ఆకలి తీరేవరకు భుజించాడు. ఆ మిగిలిన పదార్ధాలని కళ్యాణి భుజించింది. అక్కడే పెట్టివున్న ఒక ముంతలోని పాలను ఆమె

సుకుమారికి తాగించింది. తరవాత వారు మఠం ఆవరణ దాటి అరణ్యంలోకి ప్రవేశించారు.

📖

పదచిహ్న గ్రామం ఎటువున్నదో మహేంద్రుడు తనకు తెలుసుననుకున్నాడు. ఒకసారి అర్యణంనుంచి బయటపడి, రాజమార్గం చేరితే ప్రయాణం సుఖంగా సాగుతుందని అతడు ఆశించాడు. అతడి ప్రయత్నం చీకటిపడేలోగా తన స్వగ్రామం చేరాలని.

కాని, మహేంద్రుడు ఆరణ్యంలో గంటకు పైగా ప్రయాణించినా, అతడికి దానిలోని ఆది అంతాలు తెలియరాలేదు. ఎంత దూరోం పోయినా మహారణ్యమే. దానిలో నుంచి బయటపడటం ఎలాగో అతడికి అర్ధంకాలేదు. పైగా అతడికి తన స్వగ్రామం వున్న దిక్కు కూడా తెలియకుండా పోయినట్టయింది.

అలాటి సంకట సమయంలో ఒక వైష్ణవ బ్రహ్మచారి అతడికి ఎదురయ్యాడు. అతడి పెదాలమీద చిరునవ్వు తాండవిస్తోంది. అతణ్ణి చూస్తూనే మహేంద్రుడికి ప్రాణం లేచివచ్చినట్టయింది.

"గోసాయీజీ- మీరీ ప్రాంతాలు బాగా తెలిసిన వారులా వున్నారు. మమ్మల్ని ఈ ఆరణ్యం దాటించి, రాజమార్గం చేర్చగలరా?” అన్నాడు మహేంద్రుడు.

గోసాయి మారు మాటాడకుండా వెనుదిరిగి బయలుదేరాడు. మహేంద్రుడు అతణ్ణి అనుసరించి నడిచాడు. ఓ పావుగంట తరవాత వాళ్ళు అరణ్యం దాటి ఒక కాలవ ఒడ్డుకు వచ్చారు. వారికి అల్లంతదూరంలో రాజమార్గం కనిపిస్తున్నది.

"అవసరం అనుకుంటే యిక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని, ఆ కనిపించే మార్గంవెంట తూర్పుగా వెళితే, నువ్వు పదచిహ్న గ్రామం చేరగలవు." అని చెప్పి గోసాయి తిరిగి అరణ్యంలోకి ప్రవేశించాడు.

మహేంద్రుడు భార్యతో, కుమార్తెతో కలిసి కాలవ ఒడ్డునే వున్న ఒక చెట్టుకింద కూచున్నాడు. ఒకటి రెండు నిమిషాలవరకూ ఎవరూ మాటాడలేదు. కళ్యాణి భర్త ముఖం కేసి చూసింది. అతడేదో దీర్ఘాలోచనలో వున్నట్టు కనిపించాడు.

మఠంలో కలుసుకున్నప్పటి నుండి నేను చూస్తూన్నాను, మీరేదో మనసులో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఆ సంగ తేమిటో నాకు చెప్పగూడదా?" అన్నది కళ్యాణి.

మహేంద్రుడా ప్రశ్నకు ఒక నిట్టూర్పు విడిచి, "నా మనసులో అంత పెద్ద బాధేమీ లేదు. సత్యానందస్వామి నన్ను సంతానధర్మం స్వీకరించమన్నారు. నేను నిరాకరించాను. ఆ విషయమే మనసులో మెదులుతున్నది. అంతకన్న మరేంలేదు.” అన్నాడు.

"అవును, మీరెందుకు సంతానధర్మం స్వీకరించగూడదు? రాత్రి నేనొక కల గన్నాను. ఆ కలలో మీరు కాషాయ వస్త్రాలు ధరించి, వందేమాతరమ్ అని నినాదాలు చేస్తూ, ఇతర సంతానులతో కలిసి మ్లేచ్ఛుల తో యుద్ధం చేయటం చూశాను,” అన్నది కళ్యాణి.

"అది కలే. వాస్తవం కాదు. సంతానధర్మం స్వీకరించివాడు భార్యా బిడ్డల ముఖం చూడగూడదు. ఆ సంగతి నీకు తెలియదా" అన్నాడు మహేంద్రుడు.

"ఆ నియమానికి అంగీకరించి, ఆ వ్రతం పూనండి. దేశమాత సేవకు నేనెందుకు అడ్డు వస్తాను, ఇదిగో, మీకు నా ఆటంకం తొలిగే మార్గం., ఇద్దరం ఏదో ఒకనాడు ఆ స్వర్గంలో కలుసుకుందాం." అంటూ కళ్యాణి తన చీర చెంగుకు కట్టుకున్న విషపుడబ్బాను ఊడదీసింది.

ఆ విషభరిణను చూస్తూనే మహేంద్రుడు నిలువెల్లా కంపించిపోయి, దానిని ఆమె చేతిలో నుంచి తీసుకోబోయాడు. అది జారి కిందబడింది.

"కళ్యాణీ, నువ్వంత సాహసాని కొడగట్టకు. కావాలంటే నిన్నూ, సుకుమారినీ ఎవరి యింటనైనా దిగవిడిచి, నేను ఈ సంతాను ల్లో కలవగలను. మాతకార్యం పూర్తవగానే తిరిగి నిన్ను కలుసుకోగలను." అన్నాడు మహేంద్రుడు.

కళ్యాణి ఏదో జవాబు చెప్పబోయేంతలో సుకుమారి కీచుమని అరిచింది. ఆ భార్యా భర్తలిద్దరూ ఒకేసారి కుమార్తెకేసి చూశారు. విషపుడబ్బా మూత వూడదీసి ఉన్నది. అందులో విషగుళిక లేదు. సుకుమారి బాధతో తన్నుకుంటున్నది.

కళ్యాణి పిచ్చిదానిలా ఒక్క కేక వేసి, సుకుమారి నోట్లో వేళ్ళుపెట్టి సగం కరిగి పోయిన విషగుళికను బయటికి తీసింది. ఆఖరికి సుకుమారి తన్నుకోవటం మాని, కళ్ళు తేలవేసి సొమ్మసిల్లి పడిపోయింది. కళ్యాణి కూతురును పైకెత్తి హృదయానికి హత్తుకుంటూ, “చూశారా, ఆ శ్రీకృష్ణుడే మీకు ధర్మమార్గం చూపించాడు. ఇక మా బంధం మిమ్మల్ని బాధించదు. స్వేచ్ఛగా దేశమాతను సేవించండి." అంటూ మిగిలి వున్న విషగుళికను చప్పున నోట్లో వేసుకుని మింగింది.

ఈ దృశ్యం చూసి మహేంద్రుడు నిశ్చేష్టుడై పోయాడు. అతడికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. అంతలో ఎక్కడినుంచో ఒక పాట వినబడసాగింది.

హరే మురారే మధుకైటభారే... 

గోపాల గోవింద ముకుంద శౌరే...

పాట వస్తున్న దిక్కుకేసి మహేంద్రుడు తల తిప్పాడు. కాని అక్కడ ఎవరూ లేరు. అతడు భార్యా పుత్రికలకేసి చూశాడు. ఇద్దరూ నేలమీద నిశ్చలంగా పడివున్నారు. మహేంద్రుడు పెద్దగా ఒక్క శోకం పెట్టి వారిమీద వాలిపోయాడు. అంతలో అతడి భుజాన్ని ఎవరో తాకినట్టయింది. వెంటనే మహేంద్రుడు తలఎత్తి చూశాడు. ఎదురుగా సత్యానందస్వామి.

సత్యానందస్వామిని చూస్తూనే మహేంద్రుడు లేచి కూచున్నాడు. అతడి కళ్ళ నుంచి అశ్రువులు ధారగా ప్రవహిస్తున్నవి. సత్యానందుడు అతడి భుజంమీద చేయి వేసి అనునయించాడు. మహేంద్రుడు కొంచెం ఉపశమనం పొంది లేచి నిలబడ బోయేంతలో ఇద్దరు సిపాయిలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో ఒకడు జమేదారు. అతడు మహేంద్రుడి మెడ పట్టుకుని గుంజుతూ, "రాత్రి బళ్ళను అటకాయించి ధనాన్ని దోచుకున్న ఆ కాషాయ సన్యాసుల్లో వీడూ తప్పక ఉండి వుంటాడు. మన కనుగప్పేందుకు ఆ దుస్తులు తీసివేసి, సామాన్యపౌరుడిలా వేషం ధరించాడు." అన్నాడు.

జమేదారు మెడ పట్టుకోగానే, మహేంద్రుడు కాలసర్పంలా బుసలుకొట్టుతూ అతడి కేసి చూశాడు. జమేదారు వెంటవున్న సిపాయి మహేంద్రుడి చేతులకు బేడీలు తీసి బిగించ బోయాడు. అది చూస్తూనే మహేంద్రుడు సిపాయిని లాగి ఒక తన్ను తన్నాడు. వాడు అరుస్తూ కిందపడిపోయాడు. జమేదారు ఉగ్రుడై మీదికి రాబోయేసరికి, మహేంద్రు డతన్ని నడుం పట్టుకుని దూరంగా విసిరివేశాడు.

జమేదారు కత్తి దూస్తూ పడ్డచోటునుంచి లేచి నిలబడబోయేంతలో అరణ్యంలో నుంచి అయిదుగురు సిపాయిలు పరిగెత్తుకుంటూ వచ్చి మహేంద్రుణ్ణి, సత్యానందుణ్ణి చుట్టు ముట్టారు. మహేంద్రుడు వాళ్ళమీద కలియబడబోయేంతలో సత్యానందస్వామి అతడి భుజం పట్టుకుని వారిస్తూ, 

"ఇది సమయం కాదు ఆగు" అన్నాడు ఆజ్ఞాపిస్తున్న కంఠంతో.

మహేంద్రుడి చేతులకు సంకెళ్లు తగిలించ బడినై. సత్యానందస్వామి క్కూడా ఒక సిపాయి, సంకెలలు వేయబోయేంతలో, వెంటనే జమేదారు అతణ్ణి వారిస్తూ, 

“ఆ వృద్ధుడి కెందుకు సంకెళ్లు? ఆయన చాలా సాత్వికుడిలా వున్నాడు. మనవెంట 

నగరానికి తీసుకుపోదాం." అంటూ మహేంద్రుడి కేసి కళ్ళెర్రచేసి చూస్తూ "ఈ బద్మాష్ మాత్రం పారిపోకుండా చూడండి. వీడికి ఉరి తప్పదు. బహూశా, ఈ వృద్ధ సన్యాసి క్షేమంగా విడుదల కావచ్చు.'” అన్నాడు.

సత్యానందుడూ, మహేంద్రుడూ సెలయేటి ఒడ్డున పడివున్న కళ్యాణీ, ఆమె పుత్రికల నిశ్చల శరీరాలకేసి ఓమారు చూసి, తల వంచుకుని సిపాయిల వెంట బైలుదేరారు. 

"నా భార్యా బిడ్డల శవాల క్కూడా దహన క్రియలు జరిపే శక్తి నాకు లేదు. ఆ శవాలను ఏ అడవిమృగాలో పీక్కుతింటాయేమో" అని అనుకున్నాడు మహేంద్రుడు.

📖

రాజమార్గం వెంట పట్టణంకేసి సిపాయిల వెంట కొంతదూరం నడిచిన తరవాత సత్యానందస్వామి జమేదారుతో, ''అయ్యా, నేను హరినామస్మరణ చేసుకోవచ్చునా ?'' అని అడిగాడు.

"నిరభ్యంతరంగా చేసుకోండి. నగరంలో కొత్వాలు తమను తప్పక విడుదల చేస్తాడు. ఈ బద్మాష్ కి మాత్రం తప్పక ఉరిశిక్ష పడి తీరుతుంది." అన్నాడు జమేదారు.

సత్యానందస్వామి గొంతెత్తి పాడసాగాడు.

ధీరసమీరే తటి నీతీరే వసతివనే వరనారీ నకురో దనుధర గమనవిలంబన మతివిధురా సుకుమారీ.

🔥

*సశేషం*


14, అక్టోబర్ 2025, మంగళవారం

 



*ఈ కథ కాదు? హృదయాక్షర ప్రాంజలి*


అసలే అంధకారం, ఉండి లేనట్లుగా అంతా కాంతిమయం, సకలం నిద్ర వస్తలో చిన్మయం, అక్కడక్కడ సునకాల విన్యాసం, శబ్దాల సమన్వయం, రక్షక భటుల అగమ్య గోచరం, చర్మాంకాలతో అనారోగ్య విధి విలాసం, గమ్యమే తెలియని పుట్టుకే తెలియని అనాధుదల ఆర్తనాదం,


మనసంతా మరుమల్లె పూచినట్టుగ  యెదిగే, తనువంతా తపమల్లె సూత్ర యున్నతి వెలుగే, గుణమంతా సుఖమివ్వ మూల మౌనము కలిగే, జనమంతా సహనమ్ముగానిద్ర మరిగే,అపురూపము కలగా కవ్వింతలో కళా మయం, ఉపవాసము తలపే ఉత్సాహమ్ముగా మనోమయం, నొపదేశము మలుపే నోర్తే సఖ్యత విస్మయం, అపవాదము మెరుపే ఆశ్చర్య గమ్య జీవితం.


ఎదురు చూడ కన్నులు అంతు చిక్కని కలలు, బెదురు లేనిబేలలు భీతి చెందెదడి కథలు, వెదురు బుట్ట మేళము వేగుచున్న వ్యధలు, సదరు భక్తి గానము సాగుతున్న రుదలు, కలవరింతలో కళా బెదురు లేని తెన్నులు, సలపరింతలో సదా శ్రమను చూపు కన్నులు, కలవ వింతలో కధా గమన మొప్పు

చన్నులు, పిలుపు యంతలో కదా సమము చేయు సొమ్ములు నిలకడ జీవితం.


 రచన మల్లాప్రగడ రామకృష్ణ 

 అభిప్రాయాలు తెలిపితే రాస్తాను  (రోజువారీ కథగా )

*ఈ కథ కాదు? హృదయాక్షర ప్రాంజలి* (02)


ఊహలలో నిమగ్నమ ఈ మనసుకు ఏమిటీ, స్నేహములో వినమ్ర త శుభముయె ఏమిటి, దే హము లో సమర్ధత సహనము ఏమిటీ, దాహములో శుభమ్ము గు ఏమిటీ కదిలించు జీవితం,  తలపులో చిగురిoచిన ఈ వింత వింతలోకము, మలుపులో సుగంధము యీ బంధ మోహ మైకము, పలుకులో శుభమ్మగు యీ కాంతి లీలలేయగు, తులువు లే గళమ్మగు యీ బ్రాంతి కాల వైనము తీరుగా జీవితం కదా మాష్టారు మీరేమంటారు


అసలు స్వర్గం అనగా?


 మంచి ఆరోగ్యం, మమతానురాగం, హృదయ వాశ్చల్యం, నెరవేర సంయోగం, 

దృఢకాయ శరీరం, యేపనైనాచేయగలనని విశ్వాసం, 

పాప రహితమైన జీవితం గడపడం, పరోపకరిగా పరమానంద భరితునిగా, 

స్వతంత్రంగా జీవించడం , అనగా స్వేచ్ఛగా సహాయ సహకారాలు అందిస్తూ, సర్వవేళలా జ్ఞాన భోధకుడుగా జీవిస్తూ, దేవుడుపైన నమ్మకం, కలిగేట్లు మాటలు వళ్ళిస్తూ, అంతా శివ సంకల్పం నేముమాత్రం నిమిత్తమాతృడను అనుకుంటూ, నిత్య o బ్రతికి బ్రతికించు ధ్యేయం తో ధైర్యము గా జీవించినట్లయితే అటువంటి వారికి నిత్యమూస్వర్గమే.


నింగినున్నదియె మేఘం నిను చూసియు జల్లులై, భంగి యన్నది యె మోహo విను కోతల పల్కులై, ఖంగు తిన్న మది వైనం నిధి నేస్తము నవ్వులై, రంగు లన్ని కల తీరు కరిగే విధి పువ్వులై, ఏదో కమ్మని పిలుపై చుక్కచక్కిలి గింతగా, ఏదో నమ్మని తలపే వక్కచెక్కలైనంతగా, ఏదో కమ్మనిపిలుపే దక్కుదిక్కులై నంతగా, ఏదో దమ్ముకు బలుపే ముక్కచెక్కలై నంతగా కదలికలే కాల నిర్ణయానికి లోబడి సంసారములో సరిగమలు కావా @@


తడిమి పరువశించిగాకురిసే యరవిందమై, మడుగు పలకరించగామెరిసే మెరుపమ్ముగై, అడుగు కలవరంపగా అలుపే హృదయమ్ము గై, ముడుపు తలపు యాసగా, చిరు గాలియె  చల్లగా మెల్లగా తాకి సాగుగా, పరవమ్ముయు మెల్లగా చల్లగా ఊగి సాగగా, అరునోదయ వేడిగా వేగమై  సాగి సాగగా, చిరుహాసము మెల్లగా చెల్లగా పాకి సాగగా కదిలే జీవితం లో అన్నీ నిజాలుకావు, అబద్దాలు ఆశలె కావు కదా అని నిద్రలో కలవరస్తుంది సంయుక్త.


ఇంకా వుంది.


*ఈ కథ కాదు? హృదయాక్షర ప్రాంజలి* (03)

మల్లా ప్రగడ రామకృష్ణ


చూడు సంయుక్త నీవు చదివినంత నేను చదవలేదు, కాని లోకమే నాకు నేర్పింది. నాభాధ యంతా నీమీదే మీ అన్నలు ఎవరి దారి వారు చూసుకున్నారు. నిన్నుకూడా ఒక ఇంటిదాన్ని చేస్తే నా మనస్సు కొంత ప్రశాంతత నా మాటలు నీకు భాదగా నున్నాయా లేదు లేదు చెప్పమ్మా 


ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం. ఇది ఒక వ్రతం లాంటిది. గొప్ప ధర్మం. శ్రేయస్కరం కూడా. కాని ఒక్కొక్కప్పుడు సత్యం కూడా కఠోరంగా ఉంటుంది. ఆది నువ్వు తెలుసుకోవాలి నీ ఉద్యోగధర్మం లో కొన్ని అవాంతరాలు వచ్చినా ధైర్యమే నీకు ఆయుధం అవ్వాలి ఎవ్వరూ తోడురారు.


నువ్వు కూడా నమ్మా 


అవునమ్మా వయసు ఉడికినవారు సలహాలు తప్ప ఏమిస్తారు అదిచాలమ్మా


అందుకే "నిజం నిప్పు లాంటిది" అంటారు. దాన్ని దాచలేము కూడా. నిజం చెపితే నిష్ఠూరం కూడా కలుగుతుంది. అవతలి వారి మనసు గాయపడవచ్చు. వారు బాధపడవచ్చు, అలాంటి సందర్భాలలో వారికది ప్రియభాషణం కాకపోవచ్చు.


అంచేత "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం".


సత్యాన్నే పలకాలి. ప్రియంగా పలకాలి. అప్రియమైన సత్యాన్ని పలకకుండా ఉండడమే మంచిది. అంటే నిజం చెపితే ఎవరికైనా ఏదైనా కీడు జరుగుతుందనుకున్నప్పుడు ఆ నిజం చెప్పవలసిన అవసరం లేనప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది.


 అలాగే ఒక అసత్యం చెపితే ఎవరికయినా ఏదయినా మేలు జరుగుతుందన్నప్పుడు అసత్యమాడినా పరవాలేదు. అదే ధర్మరాజు "అశ్వత్థామా హతః (కుంజరః)" అని ఆడిన అసత్యం.


అలాంటి సందర్భాలలో, సమయాలలో సత్యం చెప్పకపోవడమే కాకుండా అసత్యమాడినా దోషం అంటదనేది శుక్రనీతి. కాని అది ఎల్లవేళలా పనికి రాదు.


"స్మితవక్త్రో మితభాషీ, అపూర్వభాషీచ రాఘవః" అని శ్రీరామచంద్రుని అష్టోత్తర శతనామావళిలో కీర్తించడం జరిగింది.


అంటే శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడేవాడునూ, మితంగా భాషించేవాడునూ, అపూర్వంగా అంటే ఇంతకు ముందు ఎన్నడూ ఎవరూ ఎరుగని విధంగా మహోన్నతంగా భాషించేవాడునూ అని కొనియాడడం జరిగింది.


అందుకే అవతార పురుషుడై మానవులందరికీ మాటల్లోనూ, చేతల్లోనూ ఆదర్శప్రాయమైన మార్గాన్ని అవలంబించి చూపాడు.


అయితే ఈ వాక్కును నిగ్రహించుకోవడం ఎలా.. మనం మన మనసును నిగ్రహించుకుంటే వాక్కును నిగ్రహించుకోగలుగుతాము మనసు నిర్మలంగా, శుద్ధిగా ఉంటే వాక్కు కూడా నిర్మలంగా ఉంటుంది.


వాక్శుద్ధి కలుగుతుంది.


అటువంటి వాక్శుద్ధి కలవారు అన్నది జరిగి తీరుతుంది.


అమ్మా నీమాటను తప్పకుండా ఆచరిస్తాను 


ఇంకా వుంది


***


*ఈ కథ కాదు? హృదయాక్షర ప్రాంజలి* (04)

మల్లా ప్రగడ రామకృష్ణ


చూడు బిడ్డా నేను చెప్పేవన్నీ నాకు తెలుసనీ యనకు ఒక తల్లి పడే కష్టం ఆదేవుని సం కల్పమే అని నమ్ము అదే నీకు మార్గం 

ఒక చిన్న కధ చెపుతా వీను 


"ఒక చంటి బిడ్డ క్రింద పడుకుని హాయిగా నిద్రిస్తూవుంది. ఆ బిడ్డ

వైపు ఒక కండచీమ వెడుతున్నది. 

ఆ చీమ వెళ్ళడం చూసిన బిడ్డ తల్లి 

కండచీమని బిడ్డ వద్దకు వెళ్ళనీకుండా తీసి బయట పారవేస్తుంది. ఆ సమయంలో నిద్రిస్తున్న బిడ్డకు తనకు వచ్చిన ఆపద గురించి, ఆది తొలగిన 

విషయం గురించి తెలియదు. తల్లి పనికట్టుకొని చెప్పదు."


ఈ విధంగానే  దైవం ఎల్లవేళలా తన భక్తులను కాపాడుతుంది. 

ఈ విధంగానే భక్తులు తమకు  తెలియకుండానే కలిగే ఆపదలనుండి  భగవంతుని దయవలన, లీల వలన కాపాడబడి హాయిగా జీవిస్తున్నాము. 

నీ కర్ధ మైందా బిడ్డా 

హింసకు ప్రతిహింసకాదు అని తెలుసుకో అన్నది తల్లి 


ఆ మాటలకూ సంతోషంతో


🎵 పల్లవి


మా అమ్మ...

ఆది కాంతి వలె లేచె మాతృదేవతా రూపం మా అమ్మ

చీకటిని చీల్చి వెలుగై నిలిచె జీవన దీపం మా అమ్మ


చరణం – 1


వేకువలో మెలకువవేసి, పూటలకీ పండుగై,

తొలిపొద్దుని లేపి తేజమై పూసె మా అమ్మ.

పుల్ల పుడకల పొయ్యిలో ఆకలి తీర్చె కాంతి,

నిప్పురవ్వలలో సంతోషం రాసె మా అమ్మ.


చరణం – 2


ఇంటిని చక్కదిద్దె కర్తవ్యం రాణి,

తన ఒంటినే ధారపోసె త్యాగమూర్తి మా అమ్మ.

చెమట పూలతో నేలతల్లిని తడిపె మమత,

చల్లని నీడల స్నేహమై నిలిచె మా అమ్మ.


చరణం – 3


చీకటిని మింగిన రాత్రిలో ధైర్య దీపమై,

మన మనసుల్లో వెలుగునింపె మా అమ్మ.

నవ్వులో భరోసా, కన్నీటిలో కరుణ,

నిస్వార్థ ప్రేమకు రూపమై నిలిచె మా అమ్మ.


అంటూ పాడింది సంయుక్త 


ఇంకా వుంది


ఇది కథ కాదు? హృదయాక్షర ప్రాంజిలి (05)

 మల్లాప్రగడ రామకృష్ణ  


చూడు సంయుక్త కాలమనేది కనిపించకుండా కదిలిస్తుంది ఎలాంటి శక్తి లేకుండా కూడా మనసులో చేరి మభ్యపెడుతుంది కాలం వ్యక్తం చేసుకుంటూ నిజానికి కాలం మానవ జీవితాన్ని క్షణం కూడా నిలకడ లేక కత్తిరిస్తుంది. కాలమనే శక్తి ప్రకృతిని పలకరిస్తూ అందరికీ సహకరిస్తూ చేయూతనిస్తూ జీవితాన్ని సహకరిస్తూ బ్రతకలిస్తూ చావనిస్తూ నేనున్నానని గుర్తు చేస్తూ ఉంటుంది. మానవత్వం లో భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాయి కానీ మతంలో అనేక విధాలైనటువంటి సూత్రాలు ఉంటాయి కానీ కాలల్లో మాత్రమే ఏక సూత్రము దైవములో మాత్రమే ఉంటుందనేది నిర్ధారణంగా ఉన్నది  భగవద్గీతలో కూడా నేను కాలంగా ఉంటాను అన్నాడు భగవంతుడు పంచభూతాల్లో ఉంటాను అన్నాడు భగవంతుడు. కాలం ప్రగతి చూపే అంశం అధర్వణ వేదల్లో ఉన్నట్లుగా మన పూర్వీకులు మనకు తెలియపరిచారు.

ఎంత ధైర్యమున్నా ఆ అమ్మవారి కృప నీకు ఎల్లవేళలా ఉండాలి. నీవు కూడా ఆ అమ్మవారిని ధ్యాణించు ఎప్పుడు ఏమిజరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు.


*🌼🌿దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతోరోజూ పూజించు...

🌼అర్ధంతో దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి.🌼


దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ

దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ

దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ

దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా

దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ

దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత

దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని

దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ

దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ

దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ

దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ..

ఇవి దుర్గాదేవి 32 నామాలు.


🌼🌿32 నామాలకు అర్ధం:(ప్రతినామం తర్వాత నీకు వందనం. అనాలి)


1.దుర్గా: భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి 

2.దుర్గార్తిశమణీ: కష్టాలను శమింపచేసేతల్లి నీకు 

3.దుర్గాపద్వినివారిణీ: ఆపదలను నివారించే తల్లీ 

4.దుర్గమచ్ఛేదినీ: కష్టాలను ఛేదించే తల్లీ 

5.దుర్గసాధినీ: దుర్గమమైనది సాధించే తల్లీ 

6.దుర్గనాశినీ: కష్టాలను నాశనం చేసే తల్లీ 

7.దుర్గతోద్దారిణీ: దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లీ 

8.దుర్గనిహంత్రీ: మనదెగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లీ 

9.దుర్గమాపహ: కష్టాలను వినాశనం చేసే తల్లీ 

10.దుర్గమదేజ్ఞానదా: రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లీ

11.దుర్గదైత్యలోకదవానలా: కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లీ 

12.దుర్గమ: అమ్మను సాధించడానికి ఆశక్యమైన తల్లీ (తేలికగా దర్శనం ఇవ్వని తల్లి).

13.దుర్గమాలోక: చర్మచక్షువులు,పంచేంద్రియాలతో చూడలేని తల్లీ 

14.దుర్గమాత్మస్వరూపిణీ: మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లీ నీకు వందనం. అంటే మనలోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని, కళ్ళతో చూడలేని, తెలుసుకోలేని తల్లి స్వరూపంమని అర్ధం

15.దుర్గమార్గాప్రదా: రహస్య మార్గానికి త్రోవచూపేతల్లీ 

16.దుర్గమవిద్యా: రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లీ (శ్రీవిధ్యా స్వరూపం).

17.దుర్గమాశ్రిత: దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లీ  (శ్రీచక్రం).

18.దుర్గమజ్ఞానసంస్థాన: అలవికాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యంకాని జ్ఞానానికి తల్లీ .

19.దుర్గమధ్యానభాసిని: ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే తల్లీ.

20.దుర్గమోహ: ఆపదలను లాగేసే తల్లీ .

21.దుర్గమగ: కష్టాలను పరిష్కరించే తల్లీ .

22.దుర్గమార్థస్వరూపిణీ: ఈ పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని.. రెండోది దుర్గమమైన అర్ధాలుగల తల్లీ .

23.దుర్గమాసురసంహంత్రీ: దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లీ .

24.దుర్గమాయుధదారిణీ: దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లీ.

25.దుర్గమాంగీ: ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లీ .

26.దుర్గమత: కల్మషాలను దూరం చేసే తల్లీ .

27.దుర్గమ్య: సాధించడానికి శక్యం కానీ తల్లీ.

28.దుర్గమేశ్వరి: విఘ్నాలకు అధినాయకురాలైన తల్లీ .

29.దుర్గభీమా: భీషణమైన పరాక్రమం కల తల్లీ.

30.దుర్గభామా: దుర్గ అనే స్త్రీ రూపం లోని తల్లీ .

31.దుర్గభా: ప్రకాశం గల తల్లీ .

32.దుర్గదారిణీ: రహస్యాన్ని ఛేదించే తల్లీ


ఓం నమో దుర్గాయ నమః అంటూ ఈ 32నామాల దుర్గాదేవి వందనాలు ద్వాత్రింశన్నామావాళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి అనేది పురాణాల కథనం.. భక్తుల నమ్మకం..


🌼🌿శ్రీ మాత్రే నమః....అని జపo నిత్యం శాంతికి మూలం.


ఇంకా వుంది

ఇది కథ కాదు? హృదయాక్షర ప్రాంజిలి (06)

 మల్లాప్రగడ రామకృష్ణ  

అవునమ్మా నీ ఆలోచన చాలా సబబు, విచిత్రమైన జీవితంలో వింతైన సమయమిది... అనుకున్నవన్నీ జరగవు, జరిగేవన్నీ అనుకోను. ఏది ఏమైనా భవిష్యత్తు కన్నా వర్తమానమే మిన్న.  నేటి విద్యార్థులు భక్తి ధర్మం పక్కన పెడుతూ ఆత్మ పూర్ణతను కోల్పోవడం ఆకర్షణకు లోబడి అంతరాంతరాలు మరిచిపోయి అనుకోని విధంగా అదే గొప్పతనం అని ఉల్లాసపడటం, ఆకర్షణ లోబడటం విరక్తి లేకపోవడం, అహంకారకాంక్షలతో ధర్మభక్తి సౌభాగ్యం దెబ్బ తినటం నేటి విద్యా విధానం తోడ్పడటం అంతర్జాల మహత్యం అన్నట్టు  స్మా ర్ట్ ఫోన్లు ప్రభావం పడటం ఈ లోకంలో ఈ లోకం ఈ విధంగా మారనని ఎవరు చెప్పలేదు.

అకస్మాత్తుగా ఎన్నో సంఘటనలు జరిగి పోతుంటాయి. కొన్నింటిని మౌనంగా అంగీకరించక తప్పదు,

మరి కొన్నింటిని స్వీకరించడం అసాధ్యంగా అనిపిస్తుంది. పచ్చ నోటు ముందు పల్చనై పోతున్నాయి బంధాలు, ధనం ముందు  అవిరై పోతుంది గుణం, ఆస్తుల ముందు ఆవిరై పోతున్నాయి ఆప్యాయతలు, నేటి ప్రవర్తనలు అగమ్య గోచరణాలు, బీదవారుగా కనలేము గాని బీద వాక్కులు, స్వార్ధ పూరిత బంధాలను, నేడు దేశం నందు నిలబడి ఉన్నాయి.

కొందరిని ఎంతగా కోరుకున్నా చేరుకోలేం, మరికొందరు మనం కోరుకో కుండానే జీవితంలోకి వచ్చేస్తారు. ప్రకృతి ప్రభావముగా మనస్ఫూర్తిగా మారాలని అనుకున్నా వీలుపడదు, కానీ కాలమే మనల్ని మార్చివేస్తుంది, మారక తప్పని పరిస్థితిని సృష్టిస్తుంది. అదే వచ్చే ధర్మం, అదే ప్రవృ ర్తి ధర్మం అదే సంతృప్తి మార్గం.

కాలపు గమనాన్ని అనుసరించి జీవితం సాగిపోతుంది, అంతే!"  ఏమని చెప్పేదా ఈ లోకంలో  ఎవరికి ఎవరో ఈ లోకంలో అంటూ సంయుక్త తన తల్లితో పలికింది.

 తల్లి ఆదుర్దాగా అప్పుడే పెళ్లి కాకుండా ఇన్ని విషయాలు నేర్చుకున్నావా అందుకే అన్నారు గురువును మించిన శిష్యులు, తల్లిదండ్రులను మించిన బిడ్డలని 


 ఏంటమ్మా పొగుడుతున్నావా

 అమ్మో పిల్లలను తిట్టడమే......


యింకా వుంది

5, అక్టోబర్ 2025, ఆదివారం





వేగిరపడి యొకని వెంగెము దేనికి 

జాగిలము మనసగు జాత రేల

యోగి వేష మెవరు యోగ్యత యెట్లగు 

కాగితమ్ము లాగ కలలు కాగ

ఇదిగో వరుస భావ విశ్లేషణ:

👉 ఎవరో ఒకరిని చూసి అసూయతో వేగిరపడడం ఎందుకు?

జీవనపథంలో ప్రతి ఒక్కరికీ తన తపన, తన కర్మ, తన సమయం వేరు.

అసూయ మన చిత్తశాంతిని దోచుకుంటుంది.

👉 మనసు కుక్కవలె (జాగిలము) బంధాల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది;

పుట్టుకతో వచ్చిన ఈ చంచలత్వమే మనసు యొక్క స్వభావం.

దానిని శాంతపరచడం సాధనమనే సారాంశం.

👉 యోగి వేషం వేసుకోవడం వల్ల యోగ్యత రాదు;

యోగం బాహ్య ప్రదర్శన కాదు — అంతర ఏకాగ్రత, సద్విచారణ, దయభావం యోగానికి మూలం.

👉 కలలు కాగితంలా పలుచగా, ఊదితే ఎగిరిపోతాయి.

వాటిపై ఆరాధన వృథా;

యథార్థమూ శాశ్వతమూ అన్వేషించమనే గాఢమైన చింతన.

🌿



భావం బెక్కడ లేక వృత్తి నియమాపాయంబు జింతింప కెం
దేవర్తించి పదార్ధ వంచనలచే దీపించి మూర్జళి సం
భావింపే హనుమా ప్రణీత కృతి సామాన్యా కృతిం బూని పై
పై వన్నెల్ వచరింప దాని తిలకింపంబోరు ధీరోత్తముల్

వరుస భావ విశ్లేషణ:
👉 హనుముడు ఎప్పుడూ కేవలం నియమానుసారం ప్రవర్తించడు; భావమే అతని దారిదీపం.
భావరహిత నియమం ఆపాయమే అని తెలుసుకున్నాడు — కర్మయోగా వెనుక ఉన్న ఆత్మభావం ముఖ్యమని గ్రహించాడు.
👉 లంకలోకి ప్రవేశించి మాయమోహాల వంచనల మధ్య కూడా,
తన దేవభక్తి జ్యోతి వెలిగించాడు — అజ్ఞానాంధకారమును శాంతజ్యోతిగా మార్చాడు.
దానితోనే అతని చిత్తదీపం మూర్జలమై ప్రకాశించింది.
👉 హనుముడి కార్యం — సీతామాతను కనుగొనడం, రామదూత్యము — ఇది సాధారణ కార్యం కాదు.
అది భావసంపూర్ణ కృతి; ఆత్మభావం, దైవభక్తి, జ్ఞానశక్తి ఏకమై ప్రతిఫలించిన దివ్యసాధన.
👉 హనుముని ఈ కృతిలోని ఆత్మవెలుగును, తత్త్వప్రతిభను గ్రహించగలవారు ధీరోత్తములు మాత్రమే.
అంటే — యథార్థ భక్తుడే హనుముని కృత్యానికి తత్త్వార్ధం తెలుసుకోగలడు.
🌿


రాతిని నాతిగా మలుపు రాముని లీలలు కాలతీరుగన్

ఖ్యాతిగ సత్యమే పలుకు కాల సు వాక్కుసతీ వియోగమున్

జాతి గుణమ్ముగా హనుమ జాగిల మాదిరి రామ భక్తిగన్

రాతిరి తూర్పు కొండలభి రామము లయ్యెను సూర్యకాంతితో న్

👉 రాముని లీలలు కాలమనే నదీ ప్రవాహమును వంగించినంత శక్తివంతమైనవి.

రాతిలా స్థిరమైన కర్మఫలాన్నీ, నాతిలా మృదువైన ప్రేమతో మలచగల లీలాశక్తి రామునిది.

👉 రాముని వాక్కే సత్యం — సీతావియోగకాలంలో కూడ అది ధర్మపథాన్నే ప్రతిధ్వనించింది.

కాలమే సాక్షి; రాముని మాటలు కాలాన్నీ దాటిన ఖ్యాతిశాశ్వతతను కలిగించాయి.

👉 హనుముని భక్తి అతని స్వభావగుణం — జాతిగుణం వలె సహజమైనది.

జాగిలం తన యజమానుని పట్ల ఎంత అపారమైన విశ్వాసం చూపుతుందో,

అలాగే హనుముడు రామునిపై నిత్యజాగ్రత్త, నిష్ఠ, ప్రేమతో నిండిన చిత్తాన్ని కలిగివున్నాడు.

రాతిరి తూర్పు కొండలభి రామము లయ్యెను సూర్యకాంతితోన్

👉 —హనుముని రామస్మరణ చీకటిలో వెలుగులా విరాజిల్లింది.

రామనామమే అతనికి సూర్యకాంతి; అది ఆత్మానందాన్ని ప్రసరించింది.లంకలో

🌿


అస్పష్టమ్మగుసీతజాడ కలగన్ ఆనంద చంద్రా కళల్
సుస్పష్టమ్మగు మేఘరేఖలుగనున్ సూక్ష్మమ్ము నీడల్లెగన్
ప్రస్పష్టమ్మగు లంకవైభవముగన్ ప్రాభల్య మౌనమ్ముగన్
విస్పోష్టమ్మగు వాక్కు వల్లజపమున్ విశ్వాస మేమార్పుగన్

👉 సీతా జాడలు, రమ్యమైన ఆకృతి, శోభాకర కాంతి — ఇది హనుముని మనసులో స్పష్టముగా ఆనందంగా ప్రతిఫలిస్తుంది.“ఆనంద చంద్రా” అంటే సీతా శోభ ఆకాశమంతా ప్రకాశింపజేసే చంద్రుడు లాంటి అనుభూతి.
👉 మేఘరేఖలు, చిత్తములోని సూత్రమైన భావాలు —
హనుముని జ్ఞాన, స్పష్టతా దృక్పథం ద్వారా చూసినప్పుడు సులభంగా గ్రహింపబడతాయి.“సూక్ష్మమూ నీడల్లెగన్” → ప్రతి చిన్న దిక్కులోనూ ప్రతిఫలించే ఆత్మవేదన.
👉 లంక వైభవం, భౌతిక శక్తి, రాజశక్తి — ఇది హనుముని దృష్టిలో ప్రభల్యమైన మౌన శక్తిగా దర్శనమిస్తుంది.
అర్థం: లంక వైభవం చూసి ఆశ్చర్యపడటమే కాక, హనుముని ధ్యానం, మౌనము ద్వారా దాని ధర్మాత్మకతను గ్రహించడం.
👉 హనుముని వాక్కు శక్తి → వాక్ప్రవాహం, మంత్రశక్తి, భక్తి ప్రబలత.
వాక్కు వల్ల జపం, విశ్వాసం — ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని మరియు రామానురాగ భక్తిని ప్రబలంగా చూపిస్తుంది.
🌿


సుందరకాండ – హనుమ ఆలోచన (సీతా భక్తి తత్త్వం)

కేవల చంద్రకాంతిగను కృత్రిమ దేహము గాంచలేకయున్,
తావిరి పుట్టుపుత్తడగు, నాభావన తత్త్వరేఖల గాంచలేకయున్,
పావని పూర్వగాయములు సానలు, దీరిన మేఘరేఖలుల్,
గావున నట్టి సీతగనగానొనరింపగ, నేర్పు పెంపుమున్.

భావ వివరణ:
→ సహజ ప్రకాశం మాత్రమే నిజమైన విలువను కలిగివుంటుంది;కృతక దేహం ద్వారా అది పొందలేము.తావిరి పుట్టుపుత్తడగు, నాభావన తత్త్వరేఖల గాంచలేకయున్→ భూమి తల్లి (తావిరి) ద్వారా ఉద్భవించే జీవరసాలు,సీతా మాత (నాభావన) తత్త్వప్రవాహాలు హనుముని భక్తిని వెలికితీస్తాయి.పావని పూర్వగాయములు సానలు, దీరిన మేఘరేఖలుల్→ వాయు దేవుని శక్తి, ప్రకృతి ప్రవాహాలు, మేఘాల సూచనలు → ఆధ్యాత్మిక మార్గదర్శక శక్తులు.గావున నట్టి సీతగనగానొనరింపగ, నేర్పు పెంపుమున్→ సీతాగానం ద్వారా హనుముని ఆత్మ-ప్రవాహం శుద్ధి అవుతుంది, భక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రబోధమవుతుంది.
🌿


దవులు గొప్ప బీదయన పాశము నేస్తము పట్టు వేడగన్

 చదువుల సత్య సంపదయు సజ్జన సౌమ్యత సర్వ వేళలన్ 

 పొదుపుగ పల్కు పాఠమగు పూజ్యత లక్ష్యము దేశభక్తిగన్

 మది పులకించ జీవములు మానస తృప్తికి మార్గదర్శగన్


పదవులు, గౌరవం, మాన్యమైన బంధాలు మన జీవితాన్ని బలవంతంగా పట్టుకుని నిలబెడతాయి.

చదువులు, సత్యసంపద, జ్ఞానం మనసును సౌమ్యంగా, సజ్జనంగా మారుస్తాయి.

పొదుపు, పాఠాలు, పూజ్యమైన లక్ష్యాలు, దేశభక్తి మన వ్యక్తిత్వాన్ని బలోపేతం చేస్తాయి.

ఇవన్నీ మన హృదయాన్ని ఉల్లాసింపజేసి, మానసిక సంతృప్తికి మార్గదర్శకమవుతాయి.

******

ఆర్య భావములన్ని తెల్పగ యర్ధమంతయు యార్తిగా 

సౌర్యశక్తియు ధర్మ వాక్కుల సౌక్య సంపద స్ఫూర్తిగా 

ధైర్యలక్ష్యము యేకపత్నియు ధర్మ రాజ్యము హృద్యమై 

సూర్యకాంతి మహార్షి వాల్మికి సూత్రకావ్యము రామ సీ 

తార్య మారుతి నిష్ఠసిద్ధియు తత్వ రామ మనో హరం


వాల్మీకి జయంతి సందర్భంగా, రాసిన రామాయణం అన్ని ఆధ్యాత్మిక, ధార్మిక భావాలను స్పష్టంగా మనకు తెలియజేస్తుంది.

యీ పద్యం

ఇది సౌర్యశక్తి, ధర్మవాక్యాలు, జ్ఞాన సంపదలతో మనకు ప్రేరణగా నిలుస్తుంది.

రామాయణం ధైర్యాన్ని, ధర్మ రాజ్య స్థాపన లక్ష్యాన్ని హృదయానికి సంతోషకరంగా చూపిస్తుంది.

మహర్షి వాల్మీకి, సూర్యకాంతిలా ప్రకాశించే కవిత్వంతో రామాయణాన్ని రచించారు.

మారుతి (హనుమాన్) విధి-నిష్టతో రాముని తత్త్వాన్ని మనసులో నిలుపుతూ, ధైర్యాన్ని, నిశ్చయాన్ని పెంపొందిస్తాడు.

*-***

వందే సూర్య కళా ప్రభా సురుగురుం Left

జగత్కారణం

వందేచంద్ర కళా సుఖాల సుఖమం వందే గుణానాo పతిo

వందేతన్మయతల్లి తండ్రి గురువే వందే శుభం రక్షమo

వందేకాలమయం జనాశ్ర యముగా వందే ముకుంద ప్రియం

🔹 — సూర్యుని కాంతికళలలో ప్రతిఫలించే దివ్యప్రభను నమస్కరిస్తాను;

ఆ సూర్యస్వరూపుడే సురగురువు (దేవతల గురువు), జగత్కారణమైన పరబ్రహ్మ.

🔹— చంద్రముని మృదువైన కాంతి మనసుని సుఖింపజేస్తుంది;

ఆ సుఖస్వరూపుడైన గుణపతి (గుణాలాధిపతి)నూ వందనము చేస్తాను.

అంటే సౌరశక్తి జ్ఞానరూపం, చంద్రము ఆనందరూపం.

🔹— ఆ సూర్య–చంద్ర శక్తుల సమన్వయమే తల్లిదండ్రి, గురువు రూపమైన దైవత్వం;

వారే శుభప్రదులు, రక్షకులు — వారినే నమస్కరిస్తాను.

🔹— సమస్తం కాలమయమే; కాలమే మన జనాశ్రయం, దైవసంకేతం;

ఆ కాలతత్త్వంలో విరాజమానమైన ముకుందప్రియ లక్ష్మీశక్తినే నమస్కరిస్తాను.


🌼 


 పలుకులను చదవ గలగా

విలసితమగు దయ కరుణయె వినయమ్ముగనే

కళలు కథలగుటయే రా

తలనే తొలగింప మనకు ధన్యత గలుగున్ 

    

 

🔹 — మనిషి పలుకులు, మాటలు, భావప్రకటన — ఇవన్నీ ఆత్మస్వరూపానికి అద్దములు.

వాటిని లోతుగా “చదివి” (అర్థం చేసుకొని) చూసినప్పుడు, మన అంతరంగమును తెలుసుకోవచ్చు.

🔹— మాటల సారాంశం దయగానూ, కరుణగానూ వికసించినపుడే అది నిజమైన వినయం అవుతుంది.

మాటలలోని నిగ్రహం — హృదయపు మృదుత్వమే.

🔹— మన కళలు, సృష్టులు, కథలు అన్నీ ఆ వినయపూరిత హృదయాన్నుంచే పుడతాయి.

కళా–కథా రూపాలు దయ–కరుణలతో మిళితమైతేనే అవి జీవనశాస్త్రమవుతాయి.

🔹 — తల (అహంకారం, గర్వం) తొలగించినపుడే మనకు ధన్యత (సత్యానందం, విముక్తి) లభిస్తుంది.

అహంకారాన్ని విడిచిపెట్టి దయను ఆచరించడం — ఇదే జీవిత సాధన.

🌼 సారాంశం:

మాటలు సత్యహృదయం నుంచే పుట్టాలి;

వాటిలో దయ, కరుణఉండి వినయస్వరూపం అవ్వాలి

ఆ వినయమే కళలకు మూలం, అహంకార విముక్తి ధన్యతకు మార్గం.

****


చదువు జవరాలు సంపద చక్క గున్న
కవులు వాణీ పతులు గాను కాలమందు
ధర్మ చారిగా భోధన దక్షతగను
కొరివి చెట్టుకు నైనను తరముగాదు
🔹
— మనిషికి విద్య, జ్ఞానం, సంపద అన్నీ సమృద్ధిగా ఉన్నా కూడా,
ఆత్మబోధ లేకపోతే అవి అలంకారమాత్రమే.
🔹
— కాలములో ఎన్నో కవులు, వాగ్ములు, పండితులు వచ్చి పోయారు;
వారి వాక్చాతుర్యం కూడా కాలానుగుణమే — శాశ్వతం కాదు.
🔹
— ధర్మమార్గంలో నడుచుకొని, బోధనలో నైపుణ్యమున్నా —
అది కూడా పరిమితమైన మానవ కర్తవ్య పరిధిలోనే ఉంటుంది.చదువు జవరాలు సంపద చక్క గున్న 

కవులు వాణీ పతులు గాను కాలమందు 

ధర్మ చారిగా భోధన దక్షతగను 

కొరివి చెట్టుకు నైనను తరముగాదు 

🔹 

— మనిషికి విద్య, జ్ఞానం, సంపద అన్నీ సమృద్ధిగా ఉన్నా కూడా,

ఆత్మబోధ లేకపోతే అవి అలంకారమాత్రమే.

🔹

— కాలములో ఎన్నో కవులు, వాగ్ములు, పండితులు వచ్చి పోయారు;

వారి వాక్చాతుర్యం కూడా కాలానుగుణమే — శాశ్వతం కాదు.

🔹

— ధర్మమార్గంలో నడుచుకొని, బోధనలో నైపుణ్యమున్నా —

అది కూడా పరిమితమైన మానవ కర్తవ్య పరిధిలోనే ఉంటుంది.

🔹 

— ఆంతరిక వినయం లేకపోతే, ఆత్మసాక్షాత్కారం లేనపుడు

అన్ని శ్రమలూ “కొరివి చెట్టుకి కొంగ” ఎక్కినట్లే —

అనర్ధక ప్రయాస.

(అంటే, కొరివి చెట్టు పైకి ఎక్కిన పక్షి వలె, ఫలప్రాప్తి కాని యత్నం.)

🌼

గీత.. (6)


రూపరహితుడు నాతడు రూపయుతుడు

 నామరహితుడు మరియును నామియతడు

ప్రేమ భక్తుడు మనసున ప్రేమికుడుగు

వాడు కానది జగతిని భాసమగునె?           

🔹 

— ఆ పరమాత్మునికి స్వరూపం లేదు; అయినప్పటికీ సృష్టిలోని ప్రతి రూపములో ఆయనే వ్యక్తమవుతాడు.

నిరాకారుడే సాకారుడవుతాడు — నిష్కలమే సకలమవుతుంది.

🔹 

— నామములేని పరబ్రహ్మమే అనేక నామముల రూపముగా అనుభవింపబడుతుంది.

సత్యం నిరుపాధికమైనది, కానీ భక్తి దృష్టిలో అది “లక్ష్మీ”, “శివ”, “కృష్ణ” మొదలైన నామాలతో దర్శనమిస్తుంది.

🔹 

— ఆ రూపరహితుడే మనసులో ప్రేమరూపమై భక్తునిలో ప్రేమికుడుగా అవతరిస్తాడు.

అది ఆత్మానుభూతి; అక్కడ భక్తుడు, భగవంతుడు రెండూ ప్రేమలో ఏకమవుతాయి.

🔹 

— ఆయన లేనిది ఏది?

ఆయన తానే జగత్తుగా, జ్ఞానంగా, చైతన్యంగా వెలుగుచేస్తున్నాడు.

ఆ వెలుగు లేక జగత్‌ అనుభవమే ఉండదు.

🌼

"అష్టావక్ర గీత"


పద్యం:


అష్టావక్ర గీత


మనసున గోచరమ్మగుట మాట వివేక సృజన్య మూలమున్

తనువున కామయిoద్రియము తత్త్వము బంధము నిత్య ముక్తిగన్

మనమున బాహ్యయంతరము మార్గము జన్యుపరమ్ము శాంతిగన్

వినయ గుణమ్ము తీరుగను విద్యల వెల్లువ సర్వమేయగున్


మొత్తం భావార్థం:

మనస్సు యొక్క తాత్కాలికమైన విషయాలపై ఆశక్తి వివేకం లేనిదే కలుగుతుంది.

శరీరం, ఇంద్రియాలు మనకు బంధం కలిగిస్తాయి, కానీ తత్త్వ జ్ఞానం వలన ముక్తి పొందవచ్చు.

మనస్సు అంతర్ముఖమైతే, పరమశాంతిని అందుకుంటుంది.

విద్యకు గర్వం కాదు, వినయమే మౌలికత. వినయంతోనే విద్యకు సార్థకత.

*****

యీ మహామహుల్ మనసుగా యేక మగట

ముందు విందగు సంతృప్తి మూల మగుట

సహన సాహిత్యప్రియులు గా సమయ మగుట

ఒకరి కొకరు కలసి మాట నో ర్పు యగుట


1️⃣


> మహామహులైన జ్ఞానులు, సాహిత్యప్రియులు, మహానుభావులు — వీరి మనసులు యేకమవ్వాలి.

మనోఐక్యతే మహాత్మత్వానికి మూలం.

భిన్న భావాలు ఉన్నా, హృదయ సమన్వయమే నిజమైన మహిమ.


2️⃣


> ఏకముగా ఉండడం వల్ల ముందుగానే సంతృప్తి కలుగుతుంది.

సంతృప్తి — అంటే తృప్తి, శాంతి, సహకారం.

ఇది మనసుకు మూలాధారం; సమాజానికి ఆశ్రయం.



3️⃣


> సహనం, సాహిత్యప్రీతి — ఈ రెండూ కలిసి సమయస్ఫూర్తిగా ఉండాలి.

సాహిత్యం సహనాన్ని బోధిస్తుంది, సహనం సాహిత్యాన్నీ పరిపుష్టం చేస్తుంది.

ఇది సంస్కార సమయానికి శిల్పము.



4️⃣ 


> సత్సంగములో మాటల మార్పిడి సత్యసంధానముగా ఉండాలి.

కలసి మాట్లాడడం అంటే కేవలం సంభాషణ కాదు — మాటలలో మమకారాన్ని పంచుకోవడం.

పరస్పర గౌరవం మాటల ద్వారా వ్యక్తమవుతుంది.


*****

మాతృశ్రీ” శ్రేణికి సరిపోయే మణిరత్నం. 🌿


నేల ఋణము తీర్చ నిలకడ పుట్టుకే 

బ్రతుకు బ్రతుకు మధ్య బంధ మెట్టు 

పుట్టి గిట్టు టనకు పూజ్యమగునుగుట్టు 

పట్టు రట్టు కట్టు బెట్టు బొట్టు


1️⃣ 

పుట్టుకే మనిషి భూమాతకు, సృష్టికి ఋణపడి జన్మిస్తాడు.

ఆ ఋణాన్ని తీర్చడం — అదే జీవన ధర్మం, అదే నిలకడ.

జీవితం అనేది ఋణ పరిహారయాత్ర.

2️⃣ 

బ్రతుకులోని బ్రతుకు — అంటే ప్రతి క్షణ జీవనమూ ఒక బంధమే.

ఆ బంధమే మనిషిని ఎత్తుకెళ్లే మెట్టుగా కూడా మారుతుంది.

స్నేహం, కర్తవ్యము, ప్రేమ — ఇవన్నీ బంధాల రూపంలో ఉన్న పాఠాలు.

3️⃣ 

పుట్టి ఎదిగేంత వరకు మనిషి తెలుసుకోవలసిన గుట్టు — పూజ్యమయ జీవన రహస్యం.

అది శ్రమ, సేవ, సాత్వికతతో నిండిన మర్మము.

జీవితం పూజ్యమవుతుంది గుట్టు గ్రహించినప్పుడు మాత్రమే.

4.వ పాదం మాటల ధ్వన్యాత్మక సమన్వయంతో అద్భుతంగా ఉంది.

“పట్టు” — సంకల్పం,

“రట్టు” — ఆచరణ,

“కట్టు” — బంధం లేదా కట్టుబాటు,

“బెట్టు” — సాధన లేదా పోరాటం,

“బొట్టు” — ఫలితం, సమర్పణ, శుభసూచిక.

ఈ పంచపదాలు జీవనయాత్ర యొక్క ఐదు దశలను సూచిస్తాయి.

🌺


నానాజీవకళా జలా చలనమై నానంద పర్గేలె సు

మ్మానాదంబుగ శబ్దతత్త్వమగు టే మానంబు సౌఖ్యంబు గ 

మ్యానాట్యంబగుశాంతిమార్గముగనే మాయల్లె తీరమ్ముగన్ 

జ్ఞానా నందము పొంద తీరగుటయే కాలమ్ము వైనమ్ముగన్




🔹 — అనేక జీవరూపాలు, జల తరంగాల వలె నిరంతర చలనంలో ఉంటాయి.

అవి ఆ చలనంలోనే అనుభవరసాన్ని — నానా ఆనంద పర్గెలను — పొందుతాయి.

జీవితం అంటే స్రవంతి; ఆ చలనం సృష్టి రాగం.

🔹 — ఆ చలనమంతటిలో నినదించే నాదమే శబ్దతత్త్వం;

ఆ నాదమే మనసుకు సౌఖ్యమూ, మానసిక సమతా ప్రసాదమూ.

అంటే చైతన్య ప్రవాహమే శబ్దస్వరూపమైన సత్యం.

🔹 — ఈ చలనమే విశ్వనాట్యం;

అందులో శాంతిమార్గమే నిజమైన తీరము.

మాయా తరంగాలు శాంతి సముద్రంలో కలిసిపోతాయి.

🔹— చివరికి ఆ శాంతి, ఆ చైతన్యం మనసుని జ్ఞానానంద స్థితికి తీసుకువెళ్తుంది.

కాలము కూడా ఆ అనుభవానికి సేవకుడవుతాడు — సాక్షిగా నిలుస్తాడు.


🌼 సారాంశం:

జీవచలనము జలతరంగమువలె నడుస్తూ,

శబ్దతత్త్వంలో నాదముగా అనుభవమవుతూ

మాయను దాటి శాంతిమార్గంలో కలిసినపుడే

జ్ఞానానందమే పరమగమ్యం అవుతుంది.

*****

న్యస్తాక్షరి ******** అంశం : హనుమ సీతను చూసి వచ్చి తన వానర సేనకు చెప్పిన విషయాలు 01-11  .  రి ,    ( 1 వ లైన్ 11 వ అక్షరం రి 02-  2  .  సి  , 03-13  . మి ,   04-20 .  మో ... ==


పద్యం

చూసితి సీత దేవిగను భూరిత లక్ష్మము లంకనాశనం

వాసిగ రావణా కళలు వాక్కుల తీరున బాధలే యగున్

రాశిగ కొంతయుద్ధమును రక్షణ మిన్నగ నేనుచేసితిన్

పాశము రామభక్తిగను పావని పూజలు కాలమేనమో


అది అద్భుతమైన ఆలోచన! 🌸

ఇప్పుడు ఆ దృక్కోణంలో — హనుమంతుడు సీతను దర్శించి లంక నుండి తిరిగి వచ్చి వానరసేనతో చెప్పిన మాటలుగా 

 (హనుమంతుని స్వరంలో)👇🏻


వానరు లారా! నేను సీతా దేవిని చూశాను!

ఆమె రూపంలో భూరి లక్ష్మీ తేజస్సు ప్రకాశిస్తుంది.

ఆ తేజమే లంకనాశనానికి సంకేతం.

రామవీర్యం ఆమెలో దివ్యస్ఫురణగా ఉంది.

రావణుడు మాయామంత్రాలతో, మధురవాక్కులతో ఆమెను వశపరచాలనుకున్నాడు,

కాని ఆ ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి — అతనికి బాధలే మిగిలాయి.

ధర్మాన్ని బంధించలేము, మాయకు సత్యం లొంగదు.

లంకలోని రాక్షసులతో నేను కొంత యుద్ధం చేసాను,

కానీ రాముని కృప లేక నేనేమి చేయగలిగేవాన్ని?

ఆ ప్రభు స్మరణే నా రక్షణ — ఆ ప్రభావమే నా బలం.

రామభక్తి పాశముతోనే ఈ కార్యం సాధ్యమైంది.

ఆ పూజ పావనమైంది; కాలమే ఆ రామకార్యానికి సేవకుడయ్యాడు.

నా శక్తి కాదది, రామభక్తి విభూతి!

🌺
🔹
— ఆంతరిక వినయం లేకపోతే, ఆత్మసాక్షాత్కారం లేనపుడు
అన్ని శ్రమలూ “కొరివి చెట్టుకి కొంగ” ఎక్కినట్లే —
అనర్ధక ప్రయాస.
(అంటే, కొరివి చెట్టు పైకి ఎక్కిన పక్షి వలె, ఫలప్రాప్తి కాని యత్నం.)
🌼
గీత.. (6)

రూపరహితుడు నాతడు రూపయుతుడు
నామరహితుడు మరియును నామియతడు
ప్రేమ భక్తుడు మనసున ప్రేమికుడుగు
వాడు కానది జగతిని భాసమగునె?          
🔹
— ఆ పరమాత్మునికి స్వరూపం లేదు; అయినప్పటికీ సృష్టిలోని ప్రతి రూపములో ఆయనే వ్యక్తమవుతాడు.
నిరాకారుడే సాకారుడవుతాడు — నిష్కలమే సకలమవుతుంది.
🔹
— నామములేని పరబ్రహ్మమే అనేక నామముల రూపముగా అనుభవింపబడుతుంది.
సత్యం నిరుపాధికమైనది, కానీ భక్తి దృష్టిలో అది “లక్ష్మీ”, “శివ”, “కృష్ణ” మొదలైన నామాలతో దర్శనమిస్తుంది.
🔹
— ఆ రూపరహితుడే మనసులో ప్రేమరూపమై భక్తునిలో ప్రేమికుడుగా అవతరిస్తాడు.
అది ఆత్మానుభూతి; అక్కడ భక్తుడు, భగవంతుడు రెండూ ప్రేమలో ఏకమవుతాయి.
🔹
— ఆయన లేనిది ఏది?
ఆయన తానే జగత్తుగా, జ్ఞానంగా, చైతన్యంగా వెలుగుచేస్తున్నాడు.
ఆ వెలుగు లేక జగత్‌ అనుభవమే ఉండదు.
🌼
"అష్టావక్ర గీత"

పద్యం:

అష్టావక్ర గీత

మనసున గోచరమ్మగుట మాట వివేక సృజన్య మూలమున్
తనువున కామయిoద్రియము తత్త్వము బంధము నిత్య ముక్తిగన్
మనమున బాహ్యయంతరము మార్గము జన్యుపరమ్ము శాంతిగన్
వినయ గుణమ్ము తీరుగను విద్యల వెల్లువ సర్వమేయగున్

మొత్తం భావార్థం:
మనస్సు యొక్క తాత్కాలికమైన విషయాలపై ఆశక్తి వివేకం లేనిదే కలుగుతుంది.
శరీరం, ఇంద్రియాలు మనకు బంధం కలిగిస్తాయి, కానీ తత్త్వ జ్ఞానం వలన ముక్తి పొందవచ్చు.
మనస్సు అంతర్ముఖమైతే, పరమశాంతిని అందుకుంటుంది.
విద్యకు గర్వం కాదు, వినయమే మౌలికత. వినయంతోనే విద్యకు సార్థకత.
*****
యీ మహామహుల్ మనసుగా యేక మగట
ముందు విందగు సంతృప్తి మూల మగుట
సహన సాహిత్యప్రియులు గా సమయ మగుట
ఒకరి కొకరు కలసి మాట నో ర్పు యగుట

1️⃣

> మహామహులైన జ్ఞానులు, సాహిత్యప్రియులు, మహానుభావులు — వీరి మనసులు యేకమవ్వాలి.

మనోఐక్యతే మహాత్మత్వానికి మూలం.
భిన్న భావాలు ఉన్నా, హృదయ సమన్వయమే నిజమైన మహిమ.

2️⃣

> ఏకముగా ఉండడం వల్ల ముందుగానే సంతృప్తి కలుగుతుంది.

సంతృప్తి — అంటే తృప్తి, శాంతి, సహకారం.
ఇది మనసుకు మూలాధారం; సమాజానికి ఆశ్రయం.

3️⃣

> సహనం, సాహిత్యప్రీతి — ఈ రెండూ కలిసి సమయస్ఫూర్తిగా ఉండాలి.

సాహిత్యం సహనాన్ని బోధిస్తుంది, సహనం సాహిత్యాన్నీ పరిపుష్టం చేస్తుంది.
ఇది సంస్కార సమయానికి శిల్పము.

4️⃣

> సత్సంగములో మాటల మార్పిడి సత్యసంధానముగా ఉండాలి.

కలసి మాట్లాడడం అంటే కేవలం సంభాషణ కాదు — మాటలలో మమకారాన్ని పంచుకోవడం.
పరస్పర గౌరవం మాటల ద్వారా వ్యక్తమవుతుంది.

*****
మాతృశ్రీ” శ్రేణికి సరిపోయే మణిరత్నం. 🌿

నేల ఋణము తీర్చ నిలకడ పుట్టుకే
బ్రతుకు బ్రతుకు మధ్య బంధ మెట్టు
పుట్టి గిట్టు టనకు పూజ్యమగునుగుట్టు
పట్టు రట్టు కట్టు బెట్టు బొట్టు

1️⃣
పుట్టుకే మనిషి భూమాతకు, సృష్టికి ఋణపడి జన్మిస్తాడు.
ఆ ఋణాన్ని తీర్చడం — అదే జీవన ధర్మం, అదే నిలకడ.
జీవితం అనేది ఋణ పరిహారయాత్ర.
2️⃣
బ్రతుకులోని బ్రతుకు — అంటే ప్రతి క్షణ జీవనమూ ఒక బంధమే.
ఆ బంధమే మనిషిని ఎత్తుకెళ్లే మెట్టుగా కూడా మారుతుంది.
స్నేహం, కర్తవ్యము, ప్రేమ — ఇవన్నీ బంధాల రూపంలో ఉన్న పాఠాలు.
3️⃣
పుట్టి ఎదిగేంత వరకు మనిషి తెలుసుకోవలసిన గుట్టు — పూజ్యమయ జీవన రహస్యం.
అది శ్రమ, సేవ, సాత్వికతతో నిండిన మర్మము.
జీవితం పూజ్యమవుతుంది గుట్టు గ్రహించినప్పుడు మాత్రమే.
4.వ పాదం మాటల ధ్వన్యాత్మక సమన్వయంతో అద్భుతంగా ఉంది.
“పట్టు” — సంకల్పం,
“రట్టు” — ఆచరణ,
“కట్టు” — బంధం లేదా కట్టుబాటు,
“బెట్టు” — సాధన లేదా పోరాటం,
“బొట్టు” — ఫలితం, సమర్పణ, శుభసూచిక.
ఈ పంచపదాలు జీవనయాత్ర యొక్క ఐదు దశలను సూచిస్తాయి.
🌺
న్యస్తాక్షరి  ******** అంశం : హనుమ సీతను చూసి వచ్చి తన వానర సేనకు చెప్పిన విషయాలు   01-11  .  రి ,    ( 1 వ లైన్ 11 వ అక్షరం    రి  02-  2  .  సి  , 03-13  . మి ,    04-20 .  మో ...  ==

పద్యం
చూసితి సీత దేవిగను భూరిత లక్ష్మము లంకనాశనం
వాసిగ రావణా కళలు వాక్కుల తీరున బాధలే యగున్
రాశిగ కొంతయుద్ధమును రక్షణ మిన్నగ నేనుచేసితిన్
పాశము రామభక్తిగను పావని పూజలు కాలమేనమో

అది అద్భుతమైన ఆలోచన! 🌸
ఇప్పుడు ఆ దృక్కోణంలో — హనుమంతుడు సీతను దర్శించి లంక నుండి తిరిగి వచ్చి వానరసేనతో చెప్పిన మాటలుగా
(హనుమంతుని స్వరంలో)👇🏻

వానరు లారా! నేను సీతా దేవిని చూశాను!
ఆమె రూపంలో భూరి లక్ష్మీ తేజస్సు ప్రకాశిస్తుంది.
ఆ తేజమే లంకనాశనానికి సంకేతం.
రామవీర్యం ఆమెలో దివ్యస్ఫురణగా ఉంది.
రావణుడు మాయామంత్రాలతో, మధురవాక్కులతో ఆమెను వశపరచాలనుకున్నాడు,
కాని ఆ ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి — అతనికి బాధలే మిగిలాయి.
ధర్మాన్ని బంధించలేము, మాయకు సత్యం లొంగదు.
లంకలోని రాక్షసులతో నేను కొంత యుద్ధం చేసాను,
కానీ రాముని కృప లేక నేనేమి చేయగలిగేవాన్ని?
ఆ ప్రభు స్మరణే నా రక్షణ — ఆ ప్రభావమే నా బలం.
రామభక్తి పాశముతోనే ఈ కార్యం సాధ్యమైంది.
ఆ పూజ పావనమైంది; కాలమే ఆ రామకార్యానికి సేవకుడయ్యాడు.
నా శక్తి కాదది, రామభక్తి విభూతి!
🌺

 “చిత్త ధర్మచక్రం”

చాకచక్యపు పలుకులు చలన రీతి

బుద్ధి తత్త్వము కదలగా పూజ్య పలుకు

మంచి యన్న మాటలు తీరు మాయలె యగు

కాకి చిరకాల మున్న నే కార్యమగును


🔹— చాకచక్యముగలవారి మాటలు చలనశీలమైనవి;

వాటి లోతు మారిపోతూ ఉంటుంది — అవి స్థిరసత్యం కాదని సూచన.

అంటే కపటచాతుర్యం మాటలలో ప్రతిఫలిస్తుంది.

🔹 — బుద్ధి తత్త్వం (సత్యజ్ఞానం) కదిలిపోతే,

అంటే విలువలు, ధర్మం చెదిలితే —

పూజ్యమైన పలుకులు (మాటలు, బోధనలు) కూడా బలహీనమవుతాయి.

నిజమైన బుద్ధి లేని మాట పూజ్యముకాదు.

🔹 — “మంచి మాటలు” అని అనిపించినా,

అవి లోలోపల మాయగా మారతాయి —

అనుకరణతో కూడిన నాటకప్రాయమైన సౌమ్యత.

బాహ్య మాధుర్యం లోపలి అబద్ధాన్ని దాచుతుంది.

🔹— కానీ ఇంతమందరిలోనూ నిజమైన కర్తవ్యనిరతుడు,

సహనముతో ఉన్నవాడే —

కాలాంతరాన ఫలాన్ని పొందుతాడు.

కాకి (సహనము, స్థిరత్వము) దీర్ఘకాలమునే ఫలాన్ని ఇస్తుంది.

🌼

ఓంకారమ్ముననె స్థితాత్మ గుణమున్ – నానాత్మ లీలారసం
సoఖ్యా మోహముగమ్య జీవనముగా – మార్గమ్ముగా మాళ్ళధం
భోక్తార్చన్న విభూతియు మంగళముగన్ – భాసించ నిత్యార్థధం
కైంకర్యమ్మగు సామరూప్యముగనున్  సాధించు సద్గోపధం

పద్య భావార్థం:

➡️ పరమాత్మ (ఓంకారస్వరూపుడు) లోనే స్థితమైన ఆత్మగుణం — అనగా జ్ఞానం, ఆనందం, చైతన్యం మొదలైన గుణాల ద్వారా నానా జీవరాశుల లీలారసాన్ని ప్రదర్శిస్తాడు.
➡️ ఈ జగత్తు సఖ్యమోహరూపమైన మాయలోనూ, ఆయనే జీవనానికి మార్గముగా నిలిచే మహా ధనం — మాళ్ళధుడు (విష్ణువు).
➡️ భక్తులు ఆయనను ఆరాధించగా, ఆయన విభూతి, కాంతి, మంగళమూర్తి స్వరూపం నిత్యసత్యంగా ప్రస్ఫుటమవుతుంది.

➡️ చివరగా, సద్గోపుడు (భక్తుడు) ఆయన సేవా స్వరూపమైన సామీప్య, సారూప్య, సాయుజ్యములు పొందటమే పరమపదసాధన.

భారతి ధర్మ తత్త్వం

చం. బ్రతుకు ధరాతలమ్మగుట భారతి బంధనసత్య భాద్యతన్
మెతుకుకు ధర్మదారులగు మెప్పుకు మేలుకు విద్య లక్ష్యమున్
గతుకు మనస్సుకామ్యమున గమ్యము శాంతి య శాంతి ప్రశ్నగన్
చితపు లీలలే భవిత చేరువ కాలము తోడు నీడగన్
🔹
— జీవితం ఈ భూమిపై ఒక బాధ్యతగా, ధర్మసత్యముగా ఏర్పడిన భారతి (జ్ఞానశక్తి) యొక్క బంధముగా ఉంది.
అంటే జీవితం భౌతికం కాదు — అది జ్ఞానభారతిగా ఉన్న దైవబంధనం.
🔹
— మన మేలుకి (ఉన్నతికి) విద్యే మార్గం;
ధర్మదారులు (ధర్మమార్గాన నడిచే వారు) మాత్రమే మెతుకులైన (సూక్ష్మమైన) సత్యాన్ని గ్రహిస్తారు.
విద్య యొక్క లక్ష్యం ధర్మానుసరణం.
🔹
— మనసుకు అనేక ఆకాంక్షలున్నా,
అవి సాంతం అయ్యే గమ్యం శాంతి మాత్రమే.
శాంతి అంటే ప్రశ్నలకతీత స్థితి — చిత్త సమత్వం.
🔹
— చిత్తము చేసే లీలలే భవిష్యత్తుగా (భవితగా) రూపాంతరం చెందుతాయి;
కాలము వాటి నీడగా కదిలిపోతుంది.
అంటే భవితవ్యమూ మనసు లీలలే; కాలం కేవలం దానికి తోడుగా ఉంటుంది.
🌼

పద్యం:

ప్రణవాశ్చల్యము పన్యసింపఫల ప్రాబల్యమ్ము క్రీడార్ధమున్
గుణదీక్షాత్పర విశ్వబంధపరమున్ సూక్ష్మమ్ము శఖ్యార్థిగన్
గణధర్మమ్ముగు పద్మజామయముగన్ గమ్యమ్ము విశ్వాసమున్
రుణకేళీమయ రేయిగాపవలు సారూప్యమ్ము దేహమ్ముగన్
---

పదక్రమంగా వివరణ:

1. ప్రణవ ఆశ్చల్యము – “ఓం” (ప్రణవ) యొక్క చలించని స్థితి (అశ్చల్యము), అంటే పరమాత్మ తత్వం, స్థిరమైనదైన ఆధ్యాత్మిక స్థితి.


2. పన్యసింప ఫల ప్రాబల్యమ్ము క్రీడార్థమున్ – పన్యసింపు = ఆవిష్కరణ; ఫలప్రాబల్యము = ఫలితాల ప్రభావం; ఈ ప్రపంచం తాను సృష్టించిన లీలా, క్రీడార్థంగా సృష్టించబడినదని భావన.


3. గుణదీక్షాత్పర విశ్వబంధపరమున్ – మూడు గుణాల (సత్త్వ, రజస్, తమస్) లోనిది కాకపోవడం; విశ్వబంధానికి పరమమైనది; అంటే మాయలో నిత్యం ఆగిపోని పరమాత్మ తత్వం.


4. సూక్ష్మమ్ము శఖ్యార్థిగన్ – సూక్ష్మతత్వం (ఇంద్రియాలకు అందని పరమసత్యం), శఖ్యార్థిగన్ = మిత్రత్వాన్ని కోరే సాదకులకు మాత్రమే గ్రహించగలిగినది.


5. గణధర్మమ్ముగు పద్మజామయముగన్ – గణధర్మము = గణనీయమైన లక్షణం; పద్మజా = లక్ష్మి (విష్ణుపత్ని); అమయం = స్వభావం; లక్ష్మిదేవి స్వభావంగా గల విశేషగుణాలుగల పరమాత్మ తత్వం.


6. గమ్యమ్ము విశ్వాసమున్ – విశ్వాసముతో చేరవలసిన గమ్యం.


7. రుణకేళీమయ రేయిగాపవలు – రుణ (బంధం), కేళీ (లీలా), మాయగా ఏర్పడిన రాత్రి (అజ్ఞానం), ఆ పాపాల నుండి విముక్తి.


8. సారూప్యమ్ము దేహమ్ముగన్ – సారూప్యం = పరమాత్మతో సమానత్వం; దేహంగా (శరీరధారణగా) కనబడే పరమసత్యాన్ని సూచిస్తుంది.

మొత్తం అర్థం:

ఈ పద్యం ఒక తాత్విక భావనను ప్రతిబింబిస్తుంది. పరమాత్మ యొక్క స్థితిని, సృష్టిని, తన లీలా వల్ల వచ్చిన బంధాలను, వాటినుంచి విముక్తిని, చివరకు భక్తుడు పొందే సారూప్య స్థితిని ఈ పద్యంలో వర్ణించబడింది. ఇది శంకరభాష్య శైలికి దగ్గరగా ఉంటుంది. ఈ పద్యంలో "ఓం" యొక్క స్థిరత్వం, మాయా లీలా, గుణాల పాలన, సద్గుణాలు, భక్తి ద్వారా పొందే పరమగమ్యం వంటి తత్త్వాలు చాలా లోతుగా ఉన్నాయి.
*****