9, ఏప్రిల్ 2023, ఆదివారం


నాలో నీవు .. నీలో నేను కథానిక.. (1 ) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

అంబరానన మేఘ మాలలు ఆద మర్వక వేగమై, సంబరమ్ముగ వాన జల్లులు సాక్షి వెల్లువ ఎక్కువై, చుంబ నమ్ముల చల్ల దారియు చూప గల్గిన, పంబ రేగిన వర్షపాతము పాడు చేసెడి బుద్ధిగా, అలా సాగేను రంగులు మార్చు కుంటూ మేఘాలు గగన మందు విహారము చేయగా గాలి తోడైనది. 

ఉదయ వేళన సాగు కామ్యము ఉజ్వలమ్మగు, దారి తెన్నులు తెలియక, జనులు ఆహారము లేక, ఉప్పెనలా వచ్చి పడుతున్న, వరద ధాటికి తట్టు కోలేక భయం గుప్పెట్టిన చిక్కి హా హా కారాలు చేయగా , వింజామరములు వీచి నట్లుగా, చెట్లు కొమ్మలు గాలిలో ఎగురుతూ స్వారీ చేయు చుండెను,   అదే సమయాన న్యాయవాది (జైలర్) రామారావు, ప్రాంజలి ప్రభ సేవా సంఘ అధ్యక్షుడు హనుమంతుడు (అందరిదృష్టిలో ఆపద్భా0ధవుడు నిత్యా రామ నామము   రాగ సేవ తత్పరుడు)  తోటలో చిక్కగా ఒక చెట్టు నీడన చేరగా చెట్టు కొమ్మ విరిగి పడే సమయాన హనుమంతుడు అడ్డుకొని రక్షణ దిశగా ఇద్దరు ప్రక్కన ఉన్న భవన సముదాయమును చేరిరి. 

మనసు కొలనులోన మనసును కనలేను, తామర పత్రము థలుకు బెలుకు లా ఆదుకున్న వాడివి, తపము, జపము  తోనున్న నాకు రక్షగా నీ లక్ష్యము నిర్వహించావు,    తీర్చలేను నీ ఋణమును, పలుకు లన్ని వాన చినుకుల మధ్య కలసి పోయి, బ్రతుకు తెరువు అంటూ కదలిక 

మధ్యన, కీలక మగుటయే, వర్షమునకు చిక్కి,  పెదవుల మధువులు హృదయ స్పందన హాయి గొలుపు నట్లు నీతోడు  భావన ప్రేమయే భాగ్యరేఖ అన్నాడు రామారావు. 

సన్నజాజి థలుకు సమయ మందు,  సన్నాయి రాగము సరపడ నీయని, కనలేని కష్టము కామ్య మిదియు, తన్మయ మిది, తాపము తారుమారు,  తత్వముయిది సృష్టి మలుపు, సంతృప్తి జీవితం వాన వళ్ళ కొద్ధి ఆటంకమే అన్నారు హనుమంతరావు 

                                                                                            ఇంకా వుంది..(2 )

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

*నాలో నీవు .. నీలో నేను కధానిక.. (2 ) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

మేలి ముసుగులో మేలిమి బంగారం, కలువ పువ్వులా వికసించింది సూర్య బింబము, తీవ్రమైన కాంతి కిరణాలు తెల్లటి మంచుని కరిగించి, సౌందర్యం కనులెత్తి చూసి కొంటెగా నవ్వింది    

గుండెల్లో కళలు నింపే వెలుతురులో ప్రేమ గంట మ్రోగించిందిలా కల కల లాడుతూ పచ్చతోరణమై  నిలిచింది, కోయల కూత ఆరంభమైనది   

కొండ వాగులు గలగల పారుచు నవ్వులే నవ్వులు, నిండు జలములు నిలిచిపోక కదలిక సాగుతున్నది, పుష్పరాజము సంతసమ్ముగా కదలికలు చూపుచున్నది.  

గుసగుసగా  ముసిముసిగా నవ్వుల పువ్వుల వనితలు శృతి గా లయగా అల్లరిగా  పల్లవి గా, ఆశగా శ్వాసగా గీతా లాపము మొదలైనది. కాంతి, శాంతి మంత్రము మాయచూపి చిత్త మంతా చిత్తు చేసి, మోహ మాయలో ముంచేసి, ఏమి తెలియనిదానిలా కదిలింది  

తోటలో యదావిధిగా నడవ  కుండా  పరిగెత్తుతూ వయసు కూడా గుర్తించకనే హనుమంతరావు, అక్కడ వున్నా కొందరితో కలసి పాడు తుంటున్నాడు, అప్పుడే రామారావు వస్తూనే చూస్తున్నాడు, అక్కడ ఉన్న అంబేత్కర్ విగ్రహము వద్దకు చేరారు అందరు పుష్పమాలలవుట్ అలంకరించారు కొందరు. తప్పెట వాయిస్తూ భావాలు తెలిపారు నినాదాలతో మారుమోగింది  స్థానిక మంత్రుల కోలాహలం ఏర్పడింది రక్షక భటుల వలయం అక్కడ అందరికి రక్షణగా యున్నది. ఒకతను మైకు పట్టుకొని పద్యం పడుతున్నాడు అంబేత్కర్ గురించి  

  

ఉ.యోధుడు ధర్మరక్షకుడు యోగ్యత వెల్గులు పంచు ధీరుడే

సాధువు దీక్ష కంకణుడు సాధన శోధన బీద విద్య కో

రే ధవుడే మనో నియమ రాజ్యపు రక్షణ దీక్ష సహాయ మూ

ర్తీ దయ విశ్వ విద్య యను దీనుల సేవల లక్ష్యమేనుగా

అప్పుడే అవేశము ఆపుకోలేక హనుమంతుడు అంబేత్కర్ గురించి గజల్  వినిపించాడు             

నావెనుకే ఉంటివనే యోచనలే అంబేత్కర్ 

నీఊపిరి సోకినదను భావనయే అంబేత్కర్ 

నిలువెత్తున వెంటాడుతు నను వదలదు నీ రూపం 

దూరమాయె మనసులోని వేదనలే  అంబేత్కర్ 

ఏ చోటను నీవున్నా మాలో నీ రూపమ్ము    

హృదయ వీణ తంత్రి మీటు రాగములే అంబేత్కర్ 

రాజ్యాంగం నేతగా మామేలు  యినుమడించె 

ప్రేమరాగ సుధలొలుకగ సంతసమే అంబేత్కర్ 

నిండుగున్న పున్నమిలో  వెన్నెలొలుకు చంద్రునిగా 

నీదు చెలిమి వలన కలిగె సంబరమే అంబేత్కర్ 

నా కన్నుల లోగిలిలో హరివిల్లుల వర్ణాలే 

నిను వరించి నిలువరించు సయ్యాటలే అంబేత్కర్ 

మనోరథపు వేగానికి కళ్ళెమేసె అంబేత్కర్ 

మనస్సాక్షి కోరుకున్న పరిణయమే అంబేత్కర్ 

......

అందరు ఆనందంగా కరతళ ధ్వనులు మారుమ్రోగినాయ 

                                                                   ఇంకా వుంది .. (త్రీ)                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

.....

*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (3 ) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    


ఆసంబరాలకు కొందరు స్త్రీలు ఆ పార్కుకు చేరినారు, వారి గురించి కవిత్వ పాఠము ఇలా సాగింది.
     
ఒకవైపు పురుషుల కోలాహలం, మరోవైపు స్త్రీలు అందమైన దుస్తులలో వికసించే పువ్వుల్లా కనబడెను,   కన్నుల్లో రవ్వ కలత రేపుతుంటే, మమతల్లో మానవతా కధలు చెప్పు తుంటే, కంకణాల జల్లు జిహ్వ రేపుతుంటే, జడకుప్పులు పిరుదులపై కదులుతుంటే, వయసుడికిన యవ్వనాల కమ్ముచుంటే, చిరునవ్వు చెక్కిలి గిలిగింత కెంపులై కళలు తిప్పుతుంటే, చెప్పలేని చణుకేదో నను రువ్వు తుంటే, సిగ్గుల సింధూరం సిగన సితారలై మల్లె మాలలుంటే, సన్నజాజి సక్కిలి సుర సుర మంటుంటే, కనక మణిహారం కులుకు కంఠ కోకిల కుహు కుహూ రాగమే కూస్తుంటే,
తరువులన్ని కదలి వచ్చి ఆహా ఓహో అని ఆనంద పడుతుంటే, దరహాస దర్పణ ధగ ధగసెగలై మకర మాణిక్యాల రత్నాల వెలుగులే చిమ్ముతుంటే, దక్షిణ దిక్కు దివ్య తేజమై మెరుస్తుంటే, ఉత్తరదిక్కు వారు ఉర్రుతలు ముగించే విధముగా జతకలపాలని ఆలోచనల పర్వము పెనఁవేయుచుంటే,  శీర్షాసన సిరిమల్లి సిగ్గు మొగ్గలే శరమై సింహబల సిన్నోడిని కాటేస్తుంటే, మనసు మనసు కలుపుకొని ఆనంద పారవశ్యం అధునాతనంగా సాగుతుంటే  
అధర మధువుల మర్మ సుధలే అల్లిబిల్లి అంతరంగ ఆకలై వాటేస్తుంటే అక్కడ చేరిన ఆడవారి హావ భావాల విన్యాసమునకు అందరూ పరవశంలో ముని తేలుతున్నారు  

అక్కడ కోపంలో ఒకరికొకరు పోట్లాడుకుంటున్నారు అప్పుడు 
 
పలుకులో పద పేద బీదయు పాలు పంచుట ఏలనో
మలుపులో మద చేష్ట భీకర మానసమ్ముగ ఏలనో
తలపులో తడి వేడి చూపుట తాప బుద్దియు ఏలనో
కొలువులో మది నాడి తెల్పియు కోప నష్టము తెల్సుకో
.......
అక్కడ ఒకనికి లంచము ఇస్తూ మాటలు బట్టి 
 
లంచమే కల లాయె భత్కున లాస్యమైనను ఏలనో
కంచమే తిన బుద్ధి నీకును కాల తీర్పుగ ఏలనో
మంచమే మది శాంతి కోరుట మాయ జోలికి ఏలనో
పంచ ముఖ్యముగాను ధర్మము పాంచ జణ్యము తెల్సుకో
.......
భర్య భర్తలమధ్య సంఘర్షణలు 

ముడిపడే సతి బాధ తీర్చుము మూడు లేదను టేలనో
తడిక బుద్ధిగ అడ్డుచెప్పుట తప్పు వెత్కుట నేలనో
నడవ తోడును చూడకుండియు నాట్య మాడుట ఏలనో
ఒడిన చేరియు దృష్టి నుంచియు ఓర్పు చూపుట తెల్సుకో
.......
అక్కడ కొందరి మాటలు బట్టి 

చెట్టు చాటున నక్కి దోచుట చెడ్డ బుద్దియు ఏలనో
పుట్ట చేసిన చీమలుండవు గూడు పాముకు ఏలనో
గుట్ట ధాన్యము దోచు సంపద గుర్తు బత్కుగ ఏలనో
మెట్ట పళ్ళము జీవ తత్త్వము మోక్షమార్గము తెల్సుకో
........
భార్యను పక్కన బెట్టుకొని వేరేదానికోసం పరిగెత్తడం 

మక్కువైనను త్రాగు డేలను మచ్చరమ్ముయు ఏలనో
చక్కచుక్కని చెక్కెరే సతి చెడ్డ దారిగ ఏలనో
పక్కపక్కన జేరియున్నను పాడు బుద్దులు ఏలనో
చిక్కు తీర్చిమనస్సుపంచెడి నీదు పత్నియు ఏలుకో
......
అక్కడ ఉన్న వారు సంబరమ్ముగా పాడుకుంటూ కలి వెళ్లి పొయ్యారు, అప్పుడే జన్మంతా  నాతోడుగా  ఉండమని నాలో నీవని నీలో నేనని అంటూ రామారావు హనుమంతరావు ని ఆలింగనం చేసుకున్నాడు ఆసమయాన. 

                                                                   ఇంకా వుంది .. (4)                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

****

*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (4) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

నేను  ఒక ప్రత్యేక తరానికి చెందిన వాన్ని. మన చెలిమి వల్ల అనుభవాలు  మరొక్కసారి గుర్తు చేసుకుందాం, చల్లగా కూర్చో చెపుతాను అంటూ రామారావు 

చాలా సాధారణ స్థాయి బళ్ళో అనగా తెలుగు భాషలో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

నేను చదువు తప్ప నేను చూడలేదు వేరెవ్వరిని, కన్ను మిన్ను కాన రాక శక్తి ని దుర్విని యోగము చేయలేదు,  విశ్వాస ముంచి కష్ట పడ్డాను, ఒక్కోసారి కొత్తగా మలిచిన రెక్కల సిద్ది,  ఒక్కోసారి ఆకాశం మది నడవాలని బుద్ధి,  ఒక్కోసారి ఆశయా లన్ని బతకాలని సిద్ది, ఒక్కోసారి మనోభవము కధలల్లెడి బుద్ధి.

విధి వాంఛలే ప్రాణ  నమ్మకమ్మని, చిరు హాసమే కాల నిర్ణయమ్మని, మది భావమే సేవ లక్షణమ్మని నమ్మిన వాడిని. నడిచే దారిలో నవరత్నాలు వున్నా చూడలేదు, తలచే ప్రతి నిముషము చదువుపై తన్మయ భావముండేది, కర్తవ్యమేధర్మమని తలంచేవాడిని.  

ఆంగ్ల  మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 

సీ:: నువ్వుల హృదయము నవనీత మయము గా మారియు ప్రేరణతో ను ఉండు

నవ్వుల వల్లనే ఆరోగ్య మంతయు మార్పులు చేర్పులు జరుగు చుండు

సంభాషణల మధ్య జరిగే టి విషయము విన్నను నవ్వులు వచ్చి తీరు

వింత వేషము చూసి మనసును ఉంచక వేంటనే తెల్పి యు నవ్వు చుండు


ఆ:: చెప్పి నంత మాట నవ్వులు విరజిమ్మి, హాయి బతుకు వెల్ల బుచ్చు చుండు

చెప్ప లేని మాట విన్న ను చెప్పుతూ, హాస్య మంత కుమ్మరించి ఉండే

నీలినింగి నిగలలో నక్షత్ర, రవ్వవై శ్వాస రమ్యతయగు, శ్వేత హంస యగుట స్వేచ్ఛ బ్రతుకు,అలా నవ్వుకుంటూ సాగింది ఆనాటి కధ    

                                                                   ఇంకా వుంది .. (5)                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

****

ఉంటి లోకమందె గాని యీ లోకమన్న బ్రీతి నాకు లేదు, లోకమందు నడచి వెళ్లితినే గాని వస్తు వేది కొనెడి వాంఛ లేదు. మనసుతో నేను ప్రయాణము చేసిన రోజులెన్నో చెప్పినా చెప్పకపోయినా నామనసు వెతుకుతూ వుంటుంది, బ్రతికి బ్రతుకున రుచి చూసి,  బ్రతికిం చాలనియే, యుంటినీ, కొంచె మైనను గూడ విశ్రాంతి ఎరుగను, ఎల్లరకు నైన వాడనే సహాయ స్పృహ గలిగిన వాడిని, శూన్యహస్తములతోనె, గోడపై గనబడు వట్టి నీడ నేను, అయినా నిదానముగా  విలువలను పెంచితిని, ఎవ్వరికి కంటకమ్మును మాత్రము కాను నేను

శ్లో.యుక్తి యుక్తం వచోగ్రాహ్యం     బాలాదపి సుభాషితమ్ ,

    వచనం తత్తు నగ్రాహ్యం     అయుక్తం తు బృహస్పతేః.

తా.లోకము మెచ్చునట్టి మాటను, బాలుడు చెప్పినను గ్రహింపవలెను. లోకములో సరిపడని మాటలను  బృహస్పతి చెప్పినను గ్రహింపరాదు.

 హనుమంతా నీకుచెపుతున్నాను ఇది కధ కాదు అనుభవాల సారము, ఈ కధ ఎటు ముసుస్తుం దో, ఎలా మార్పు వస్తుందో నాకే తెలియదు, నేను నిమిత్త మాత్రుడిని అంట కాలమే నడిపిస్తుంది నన్ను నిన్ను రామారావు హనూమన్తరావుకు తనఅనుభవ పాఠాలు చెప్పు కుంటున్నాడు  

అప్పుడే హనుమంతుడు అవునండి కాలం మనతోనే ప్రారంభం కాలేదు. మన ముందు ఎందరో గొప్పగా బతికారు. ఎక్కడికక్కడ ఎలా అడ్డంకుల్ని అధిగమించి వెళ్ళాలో జీవించి మనకు ఒక దారి చూపించారు. ధైర్యం ఉంది. భయం లేదు.. అలా ముందుకు వెళ్ళి పోదాం మన బుద్ధికుశలతతో  అక్కడ మనకు ఎదురయ్యే ఆటంకాలను, అవరోధాలను పరిష్కరించి,  మార్గాన్ని ఎలా సుగమం చేసుకున్నా మంటే రాబోయే తరాలకు మనము కూడా ఆదర్శాలమవుతా కదా రామారావు.

  అవును మానవజాతి మొత్తం తరించిపోవడానికి ఆ దారి ఒక్కటి చాలు, కథలున్నాయి. గాధలున్నాయి. కావ్యాలున్నాయి. ప్రబంధాలున్నాయి. పురాణాలున్నాయి. శతకాలున్నాయి. నీతులున్నాయి. ధర్మాలున్నాయి. మనిషి ఎలా బతకాలో, ఇతరులను ఎలా బతికించాలో తెలిపే ధర్మసూక్ష్మాలున్నాయి. మన ఊపిరి మాతృ దేశ,మాతృభూమి, మాతృభాష    వారసత్వాన్నే మన సంపదగా అందుకోవాలి.

అపూర్వ: కోపి కోషోsయం  .. విద్యతే తవ భారతి ౹ 

వ్యయతో వృద్ధిమాయాతి ...  క్షయమాయాతి సంచయాత్ ౹౹

       దేవి విద్యాభారతి నీ ఈ జ్ఞాన కోసము అపూర్వమైనది.దీన్ని ఉపయోగించినంతగా అభివృద్ధి అవుతోనే ఉంటుంది.అలాగే,సంగ్రహించినంతా క్షీణిస్తుంది

                                                                                                           ఇంకా వుంది..5  

*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (6) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

ఆతోటలో ఎందరో మహానుహవులు విశ్రాంతి తీసుకుంటున్నారు, వారిలో ఒక సన్యాసి మంచి మంచి విషయాలు చెపుతూ గంతులేస్తూపడుతున్నాడు, రక్షకభటులు ఆపుదామని వచ్చారు, అక్కడ వున్నా జనులు వాక్ స్వాతంత్రయాన్నీ హరించకండి అనగా ప్రేక్షలకుగా చూస్తూవున్నారు వారు .  పిల్లలు పెద్దలు చూస్తున్నారు, అక్కడికి రామారావు హనుమంతుచేరారు. చెప్పే విషయాలు వింటున్నారు.    

మారాలి మారాలి ఈలోకం, దేహం రాచపుండుగా మారినా గుర్తించరు, ప్రజాహంతకులు కళ్ళ ముందు తిరుగుతున్నా పాటించుకోరు, నేరసామ్రాజ్యాన్నిఎన్నుకున్నారు, దివాణం సొమ్ము కాజేసిన పట్టించుకోలేరు, చెదలకు మందు, చెడు ఆలోచనకుమందు, మంచికి పొందు,              

దుర్మార్గుల చిందు, మరి ఘోరంగా మారుతుతున్నది, రోగం లేనివారికి రాగం, ఉన్నవాడికి ధనం పిండుకొనే రోగం, మనుష్యులకు సగం మందులని ఆరోగ్యం పాడుచేసే లోకం,      సన్మార్గుల పొందు, మనల్ని రక్షించడంలో దేవుడు లేక ప్రకృతి అలక్ష్యం చేయదు.  ప్రకృతో దేవుడో ఎవరైతేనేం ధర్మసంస్థాపన జరగటం ఖాయం, అధికారం కాలసర్పం, అహంకారం కారు మేఘం, మోసం వినాశనచక్రం, కుట్ర , హత్య, నమ్మకద్రోహాలు,  మనిషిని వెంటాడే వేటకుక్కలు. కక్షలకు శిక్షలు తప్పవు. 

మనిషంటేనే ప్రేమరూపంలో ఉన్నదైవం, ప్రేమలేని మనిషి బతికున్నశవం, నటించే ప్రతివాడూ నేరస్తుడే, కాలపరీక్షలో శిక్షార్హుడే, మనిషిని ఈ భూగోళంపై ఏ దుష్టశక్తులు అడ్డుకోలేవు, అందరికీ ఆనందం పంచే ఆత్మను ఏ అణుబాంబులు ధ్వంసం చేయలేవు, బాధించే జాతి నాశనమై పోతుంది, బోధించే జ్ఞానజ్యోతి బ్రహ్మాండాన్ని వెలిగిస్తుంది.

వినరా వినరా నరుడా లోక లీలలు, లోకమంతా స్వార్ధపరులుగా మారిరే, నటన సూత్రధారి ఆటలు కనరా, నవరంధ్రాలు ఆటల వేటలైన తీరు మార్చి మోక్షం ఎప్పుడురా   

మందహాసమే,  మధుర గానమా ఏ తీరునా , 

నందనందనా,  నవ కవిత్వమా ఏ వ్రాతనా 

ముందురమ్ము కాపురుష భంజితా ఏ లాభమా, 

ఎందు నీవెగా, హృదయ రంజితా ఓ దేవ దేవా 

వినరా వినరా నరుడా లోక లీలలు, లోకమంతా స్వార్ధపరులుగా మారిరే. నటన సూత్రధారి ఆటలు కనరా, నవరంధ్రాలు ఆటల వేటలైన తీరు మార్చి మోక్షం ఎప్పుడురా   

పూలమాలలే, పులకరింపుగా చుపించావే 

ఈల పాటలే , యెపుడు హాయిగా కల్పించావే  

తాళ వృత్తమై, తనరు చిత్తమే చదివించావే  

నీలమోహనా, నెనరు ముత్తెమే ఓ దేవ దేవా

వినరా వినరా నరుడా లోక లీలలు, లోకమంతా స్వార్ధపారులుగా మారిరే, నటన సూత్రధారి ఆటలు కనరా, నవరంధ్రాలు ఆటల వేటలైన తీరు మార్చి మోక్షం ఎప్పుడురా   

చుక్క చుక్కగా, సుమదళమ్ములై వికసించెనులే   

యక్కజమ్ముగా, నవని సొమ్ములై తరిలించునులే 

దిక్కుదిక్కులందెలి హిమమ్ములే మరిగించునులే 

యెక్కడుంటివో, యిచట నిమ్ములే ఓ దేవ దేవా

వినరా వినరా నరుడా లోక లీలలు, లోకమంతా స్వార్ధపారులుగా మారిరే, నటన సూత్రధారి ఆటలు కనరా, నవరంధ్రాలు ఆటల వేటలైన తీరు మార్చి మోక్షం ఎప్పుడురా   

కొందరికి పాట అర్ధమయ్యే, కొందరికి పిచ్చి పాటలుగా అనుకున్నారు ఏది ఏమైనా గౌరవించటం తగ్గిపోయింది అప్పుడే రామారావు తన జేబులోంచి 500 రూపాయలు నోటు ఇవ్వగా సన్యాసి నాకు వద్దండి మీచేతులతో నాకు భోజనం పెట్టించండి నాకు అదే తృప్తిగా ఉంటుంది, నా దేవ దేవుని పాడుకొనుటకు ఓపికవస్తుంది, నాకు ఏరోజుకారోజు ఆహారం అందిస్తున్నాడు ఆ పరమాత్ముడు ఈ రోజు మీ వంతు, హనుమ ఈయన బాగా చదివిన వాడిలాగున్నాడు కదా, పదా ముందు వీరికి భోజనం పెటిద్దాం మంచి భోజన సాలయందు మరలా రేపు అనేది నున్నది కదా, అవునవును పదా పదా అంటూ బయలుదేరారు ముగ్గురు   

                                                                   ఇంకా వుంది .. (7)                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

****

*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (7) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

  ఆ వచ్చిన సన్యాసి  ఆతోటలో వున్నా గణపతి విగ్రహం వద్దకుచేరి ఐ విధముగా ప్రార్ధన చేసాడు 

శ్రీ గణపతి అథర్వ శీర్షము 

త్వంగుణత్రయాతీతః । త్వం అవస్థాత్రయాతీతః ।

త్వం దేహత్రయాతీతః । త్వం కాలత్రయాతీతః ।

త్వం మూలాధారస్థితోఽసి నిత్యం । త్వం శక్తిత్రయాత్మకః ।

త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం । త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం 

సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువఃస్వరోం

తే.గీ. మాలిక

మూడు గుణములు మించిన మూర్తి వగుచు, మూడ వస్థలు మించిన మూర్తి వగుచు 

మూడు దేహముల్ మించిన మూర్తి వగుచు, మూడు కాలముల్ మించిన మూర్తి వగుచు

మూలమందున స్థితుడగు మూర్తి వగుచు, మూడు శక్తుల మూలపు మూర్తి వగుచు

మునులు నిత్యము ధ్యానించు మూర్తి వగుచు, బ్రహ్మ విష్ణు రుద్రుల పరబ్రహ్మ వగుచు

ఇంద్రు డగ్నియు వాయువు నినుడు శశియు, నగుచు సర్వత్ర వ్యాపించి నట్టి విఘ్న 

పతివి నిను ముందు  ప్రార్థింతు వరము లీయ, ఆ పరబ్రహ్మ పరమాత్మ  వగుచు బ్రోవు

అప్పుడే రామారావు హనుమంతు నమస్కారం పెట్టుతూ నిల్చున్నారు, అప్పుడే మీరు నాకోసం ఆహారం అంటున్నారు నేను ఎక్కడా భోంచెయ్య నండి, అందుబాటులో దొరికిన ఫలాలు తిని గాలి నీరు ద్వారా సంచారి జీవిగా కాల గడుపుతున్నాను. మీ సహృదయాంకి వందనాలు,మీరు నాకు ఏమన్న ఆహారము పెట్ట దలుచు కుంటే మైక్ శ్రమ వద్దు ఆ కనబడుతున్న అరటి పండు కొనిపెట్టండి చాలు ఈ జానెడు పొట్టకు 

ఆమాటలకు హనుమంతుడు ఆ బండిలో వున్న పళ్ళని కొని బట్ ముందు పెట్టాడు, భలేవాడివయ్యా అట్లయితే అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడదాకా మోసుకురా అంటూ నడుచుకుంటూ బయలుదేరారు ముందుకు. 

ముగ్గురు కలసి అక్కడ ఉన్న వారికీ మూడు పళ్ళు మిగిల్చి మొత్తం పంచారు వారు. 

వెంటనే బైరాగి మీరిద్దరూ ఈ పండు తీసుకోండి ఈ పండు నాకు చాలు అంటూ గబగబా తినేస్తూ మీరు తినండి అంటూ గంతులేస్తున్నాడు బైరాగి 

వీళ్లకు అర్ధం కాలేదు ఆ ఒకపండు తిన్నాక ఎక్కడలేని బలం వచ్చింది అందరిలో 

                                                                  ...                                              ఇంకా వుంది .. (8)                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

****

*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (8) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

       గురువుగారు మీరు మాకు ఉపదేశం ఇవ్వండి మేము మీ శిష్యులు అవుతాము అన్నాడు హనుమంతుడు, 

స్వేచ్ఛ హరించే శక్తి లేదు నాకు, నాకు ఇల్లూ వాకిలి లేదు, ఇక మీరెందుకు మీ సంసారాలను వదలి నాకు సేవలనవసరం, ఇది కలియుగం మీ లాంటి వారు ఈ దేశానికి అవసరం, నా లాంటివారు భక్తిని పంచటం, పెంచటం ఈ జన్మకు చాలు అలా కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ చెట్టుదగ్గ చేరి పీఠముపై కూర్చున్నాడు బైరాగి, క్రింద రాళ్లపై కూర్చున్నారు ఇద్దరు, చెప్పేవి వింటున్నారు.            

శ్లో𝕝𝕝 ప్రభూతం కార్యమల్పం వా  యన్నరః కర్తు మిచ్ఛతి |

సర్వారమ్భేణ తత్కార్యం సింహా దేకం ప్రచక్షతే ||

తా𝕝𝕝 మనుష్యుడు తాను చేయదలచిన పని పెద్దదికాని చిన్నదికాని దానిని పూర్తిచేయుటకు సర్వశక్తి నుపయోగించి యన్నివిధముల ప్రయత్నము చేయవలెను. ఈ విషయము సింహమునుండి నేర్చుకొనవలెను.

పరమాత్మ శక్తి యొక్క సర్వవ్యాప్త స్వభావం కారణంగా, ఒక వ్యక్తికి కనిపించే ప్రతి వస్తువు దైవికంగా మారుతుంది. ఇది స్వచ్ఛమైన జ్ఞానం యొక్క ప్రాథమిక వివరణ. చైతన్యం యొక్క స్వచ్ఛత రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ‘నేను అది కూడా’ అని అనిపిస్తుంది. ఇది రెండవ దశ అయిన 'నేను అది' నుండి గణనీయంగా భిన్నంగా ఉంటుంది. మొదటి దశలో, వ్యక్తిగత గుర్తింపు పూర్తిగా కరిగిపోదు, రెండవ దశలో వ్యక్తిగత ఉనికి ఉండదు.

జీవితం అష్ట దొంతరల ఆట, జీవి భావాల ఆశ కళ ఆట,  ముదిరిందా పలుకు పైమాట, కుదిరిందా బ్రతుకు సైయ్యాట, బలిమి వేషము మత్తుల ఆట, కలిమి లేముల జిత్తుల పుట,గోళం తిరుగుటలో ఓ ఆట, కాలం చెడుగుడులో ఓ బాట, గీతము మది నిధాన పోపు లాట, జీవన విధి విధాన  తోపులాట, లాంతర్ వెల్గుల్ కిటికి ఆట, జంతర్ మంతర్ సుడుల బాట.

కనివిని తెల్పనిది కొమ్మ లాట, దిన దిన సూచికల బొమ్మలాట, చుక్కల నొక్కులలో దమ్ము లాట, దిక్కుల పిక్కలలో కుమ్ము లాట, చెడుగుడు మడుగు చేతు లాట, అడుగడుగు గొడుగు మూతలాట, నిక్షేప కారకుల మది ధీరత్వాల కోట, అక్షేపణావధుల విధివీరంగాల కోట, నిషన్న నటనాల నిర్మల జీవాలాట, విషన్న వదనాల విప్లవ గీతాలాట, సంత ధర్మాల ధరణి మనసున ఆట, వింత వర్ణాల వికసిత విరుల తోట, మనసు మంజరి సిరు ఝరుల వేట, అణువు ఆటలు మురిపముల వేట, సంద్ర అల మలుపు వలల సమ్మెట, చంద్ర కళలు తలపు వల సొమ్మెట 

దుర్జనః ప్రియవాదీతి .. నైతద్విశ్వాస కారణం ౹

మధుతిష్ఠతి జిహ్వాగ్రే ..  హృదయేతు హాలాహలమ్ ౹౹

         దుర్జనుడు మధురంగా మాట్లాడ వచ్చు.అయినా ఆ మాత్రముచే వానిని విశ్వ సింప రాదు. వానికి నాలుక చివరన తేనెయూ, మనసులో హాలాహలమైన విషము ఉండును. అది గుర్తుంచుకోండి మీరు అన్నాడు బైరాగి.                         ఇంకా వుంది .. (9)                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

****

*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (9) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

అసలు దేవుడే  ఉన్నాడని మనసుకు శాంతి నిచ్చేవాడని, కర్తవై దీక్షకు తోడుతుంటాడని మనుష్యులను  నమ్మి అనుసరించి ఆచరించు వారే నిజ భక్తులు, మొక్కుకున్న ప్రతివారూ కాలేరు నిజ భక్తులు, కలియుగధర్మాలు కదులుతున్నాయి, స్వార్ధ, నిస్వార్ధాలు, పుణ్యపాపాలు, మంచి చెడులు, వెంటాడుతూ  చిత్తశుద్ధి లేని పూజలు వ్యర్ధము, కర్మాను సారమే పూజా ఫలము.

సర్చరిత్రము, జ్ఞాన విజ్ఞానము, సద్బొధలు వారికి వినపడవు, పరమాత్మతత్వమును, దివ్య లీలలు గ్రహించ లేరు                         

మనిషి కన్నా విలువైనది మనస్సు దీనికి బుద్ది తోడైతే మరోరకం అనగా ఎండలో కొబ్బరిబొండం (మనసు ) నీరు త్రాగాలి అనేది (బుద్ది ),  ఆవేశం కన్నా విలువైనది ఆలోచన వయసుని బట్టి మాటలు ఆలోచన (బాధ వద్దు బాధ పెట్టవద్దు ), కోపం కన్నా విలువైనది జాలి నిగ్రహించుకొని (విని ఆచరణ జాలి ), స్వార్ధం కన్నా విలువైనది త్యాగం నీవంతు సహాయమే (ఫలితం ఆశించకుండా).

*యత్ర వేదధ్వని శ్రాంతం  న చ గోభిరలంకృతమ్

యన్నబాలైః పరివృతం  శ్మశానమివ తద్గృహమ్!! 

తా𝕝𝕝 ఏ ఇంట్లో వేదధ్వని వినబడదో, ఏ ఇల్లు అవులతో అలంకరించబడదో, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉండరో ఆ ఇల్లు శ్మశానము వంటిది అని అత్రిస్మృతి హెచ్చరించింది.....

నమ్మకం ఒక బలం అది నీవు పోగొట్టుకున్న రోజున ఏ బంధం నీకు తోడు రాదు .(అనగా నవ్వుకు కూడా ఆపణమ్మకం అనకండి ),  మనం ఎంత ఎత్తుకి  ఎదిగినా మనం సాధారణంగా గడిపిన  జీవితాన్ని మర్చి పోకూడదు (తల్లితండ్రులను మరచి నడమత్రసిరి తో వేంపర్లాడవద్దు).  గతంలో మనతో కలిసి బ్రతికిన  వారినీ మనకు సహాయం  చేసిన  వారిని మనకు తోడుగా  నిలిచిన వారినీ ఎప్పుడూ  మర్చి పోకూడదు. (చెలిమిని నమ్మినవాడు ఎప్పటికి చెడిపోడు)

*రూప యౌవనసంపన్నా:   విశాలకుల సంభవా:

     విద్యాహీనా: న శోభన్తే   నిర్గంధా ఇవ కింశుకాః

       అపురూపమైన రూప లావణ్యాలతో ఉన్నా,యౌవనములో ఉన్నా,మంచి వంశములో పుట్టినా,విద్యావిహీనులై ఉంటే మాత్రం ఏ విధముగా శోభించరు.చదువు లేనివారిని ఎవరూ గౌరవించరు.మోదుగు పువ్వువలె రాణించరు.

భయం ఓటమికి చిరునామా, అనారోగ్యానికి నిజరానా, పట్టుదల విజయానికి చిరునామా, సఖ్యతకు విలునామా, మన లక్ష్యం ఉన్నత మైనది అయినప్పుడు మనసులో భయం వీడి పట్టుదలతో ముందుకు సాగితే విజయం మనదే అవుతుంది రేపటి వెలుతురు చూడాలంటే నేటి చీకటిని భరించాలి.  రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి.

   ఇంకా వుంది .. ( 10  )                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

****
ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (10) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ
సన్యాసి మరలా అందరినుద్దేశించి పలులివి.
తల్లితండ్రులకు పిల్లలపై అమిత ప్రేమ, వుంటుంది, పాఠశాలలో చేర్చగానే 

" మా అబ్బాయి/ అమ్మాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నారు . కొంతకాలం అక్కడ అంతా వాళ్ళకి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది.

అందుకే వాళ్ళతో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.

ఈ ఆలోచనలు, మీరు తెలివితేటలు పిల్లలకు  సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు, మంచి క్రమ శిక్షణ సాయపడవచ్చు.

ఆ సాహసాల  కథలు, సత్యమైన యుద్ధాలూ,రాజనీతి విషాదాలూ, కుటుంబ దుఃఖాలూ  అనుభవంలోకిరావచ్చు. అలాంటి జీవితంలో వాళ్ళకి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అందుచేత, దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా? అని మీరు అడిగినా మందలో మజ్జిగపల్చన అనే విధంగా చదువు అబ్బుతుంది, గురువులతో పాటు తల్లితండ్రులు శ్రద్దతీసుకున్న అందరికీ మంచిది
అని చెపుతున్నాడు సన్యాసి 

పిల్లలకు మీరు 
.ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి.

జరుగుతున్న కాలమార్పులు పిల్లలకు తెలపండి 
అందరు మనుషులూ న్యాయంగా ఉండరనీ, అందరూ సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి.

లోక రాజకీయ నీతిని 
.ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ  జిత్తులమారి రాజకీయ నేత ఉండే చోటే అంకితభావంతో పనిచేసే నేత కూడా ఉంటాడనీ చెప్పండి.

పిల్లలకు కష్టంగురించి, సంపాదగురించి విశదీకరించండి

.అప్పనంగా దొరికిన ₹100 కన్నా సొంతంగా సంపాదించుకున్న ₹10  ఎక్కువ విలువైనవని నేర్పండి.

స్కూల్లో మోసం  చేసి గెలవటం కన్నా తక్కువ మార్కులలో నిజాయితీ, నమ్మకము, ఎక్కువ మార్కులకోసం కృషి చేయగలనని నమ్మకం గౌరవంగా ఉంటుందని నేర్పండి.

ఆట పాటలలో, గెలుపు ఓటములు సహజమని తెలపండి

 ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్ఠలు ఉండవచ్చనీ, గెలుపులో నిరాశ ఉండవచ్చనీ నేర్పండి.

.ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం,.. నేర్పండి.

బుద్ధులను బట్టి నడవడిక తెలపండి

.అందరితో మృదువుగా ప్రవర్తించమనీ, కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమనీ నేర్పండి.

ఈర్ష్య, ద్వేషాలు, చెడులు , కులాలు మతాలు పిల్లల దృష్టి లో తేకండి 

.అసూయకు పిల్లల్ని దూరంగా ఉంచగలిగితే బావుంటుంది. చప్పుడు చెయ్యకుండా నవ్వటం నేర్పండి.

సంఘటన ప్రభావాలు పిల్లలపై చూపకండి 
.వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి. కన్నీళ్ళు కార్చటం అవమానమేమీ కాదని నేర్పండి.

*. పుస్తకాల చదువు మనోబలాన్ని ఇస్తాయని తెలపండి 

.అందరు చెప్పేదీ వినమనీ, సత్యమనే జల్లెడతో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమనీ చెప్పండి.

. తన ప్రతిభనీ, మేధస్సునీ ఎక్కువ ధర చెల్లించేవారికే అమ్మమని చెప్పండి కానీ తన హృదయానికీ, ఆత్మకీ వెల నిర్ణయించద్దని నేర్పించండి.

. అసహనం ప్రదర్శించే ధైర్యాన్నీ, ధైర్యంగా ఉండేందుకు ఓర్పునీ కలిగి ఉండనివ్వండి.

.ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం పిల్లలకు నేర్పండి,అప్పుడే మానవాళి మీదా పిల్లలకు ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదనీ నేర్పించండి.

అలా పిల్లల గురించి సన్యాసి తెలియపరిచారు. ఆ తరువాత చల్లని నిమ్మ కాయరసం అక్కడ ఉన్న వారందరికీ హనుమ అందించాడు సర్వేజనా సుఖినోభవంతు అంటూ విశ్రాంతికి లేచారు అందరూ

  ఇంకా వుంది... (11)
ఈ కథపై మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు.
మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
****
ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (11) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ

తోటలో గాలులు ఎక్కువగా పెరుగుతున్నాయి, చెట్ల మధ్య కిరణాలు తొంగి చూస్తున్నాయి, చల్లటి నీరు అందరికీ అందిస్తున్న ఎండ తీవ్రత బాగా నుండుటవలన
నిదానంగా వచ్చినవారికందరికి భానుని కిరణ ప్రభావాల గురించి సన్యాసి  వివరంగా తెలియ పరచటం మొదల పెట్టారు.

ఇప్పుడే 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. మే మాసంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది మనందరికి. దేశంలోని అన్ని రాష్ట్రాలలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు
, గురువులు, వైద్యులు సూచిస్తున్నారు. కళ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోవడం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరిగితే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి  సత్వర వైద్యం అందించాలి.

ప్రాథమిక చికిత్స

● వడదెబ్బ తగిలిన వ్య క్తిని వెంటనే నీడకు తీ సుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి. వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి.

● ఫ్యాను గాలి లేదా చల్ల ని గాలి తగిలేలా ఉంచాలి.

● ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబోండాం లేదా చిటికెడు ఉప్పు, చక్కెర కలిపిన నిమ్మరసం, గ్లూకోజ్‌ ద్రావణం లేదా ఓరల్‌ రీ హైడ్రేషన్‌ ద్రావణం (ఓఆర్‌ఎస్‌) తాగించవచ్చు.

● ఫ్యాను గాలి లేదా చల్ల ని గాలి తగిలేలా ఉంచాలి.

● ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబోండాం లేదా చిటికెడు ఉప్పు, చక్కెర కలిపిన నిమ్మరసం, గ్లూకోజ్‌ ద్రావణం లేదా ఓరల్‌ రీ హైడ్రేషన్‌ ద్రావణం (ఓఆర్‌ఎస్‌) తాగించవచ్చు.

● వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో దగ్గరలో వున్న డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.

తేలికపాటి ఆహారం ఉత్తమం
వేసవిలో సాధ్యమైనంత వరకు నూనెతో తయారు చేసిన పదార్థాలు, వేపుళ్లు, చిప్స్‌, జంక్‌ఫుడ్‌ వంటి వాటి జోలికి 
వెళ్లకపోవడం ఉత్తమం. తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలను బయటకు పంపించవద్దు. వేసవి వేడిని తట్టుకునేందుకు నూనెలేని, తేలికపాటి ఆహారాన్ని పిల్ల లకు అందించాలి.   డీఫ్రిజ్‌లో ఉంచిన వాటిని వెంటనే తినడం, తాగడం వంటివి చేయవద్దు. సాధారణ ఉష్ణోగ్రత కంటే కొంచెం చల్లగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. బాగా చల్లగా ఉన్న నీరు తాగడం వల్ల తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి .

నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారం మేలు..
● నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీరదోస, పుచ్చ కాయ, తాటి ముంజలు, బీరకాయలు, పొట్లకాయలు వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. 

వడదెబ్బ అంటే..
ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైతే శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడడాన్ని వడదెబ్బ అంటారు. వేడి వాతావరణం లేదా చురుకై న పనులతో కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది.  అధిక ఉష్ణోగ్రతలతో శరీర ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తుంది.

ఈ వేసవిలో నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారం మేలు..
● నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీరదోస, బ్ కర్బూజ, తాటి ముంజలు, బీరకాయలు, పొట్లకాయలు వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీని వల్ల కడుపు నిండినట్లుగా ఉండి, డైట్‌ కంట్రోల్‌ అవుతుంది.

● శీతల పానీయాలు, అధికంగా షుగర్‌ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి.

● వేసవిలో ఆకలి తక్కువగానూ దాహం ఎక్కువగానూ ఉంటుంది. జీర్ణక్రియలోనూ తేడాలు వస్తుంటాయి. డైట్‌ పాటిస్తూ కాలానికి అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండి బరువును నియంత్రించవచ్చు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి.

వడ దెబ్బ బారిన పడకుండా ఉండాలంటే...
● వేసవిలో డీహైడ్రేషన్‌ అధికంగా ఉండటం వాళ్ల రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి.

● ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడలో ఉండేందుకు ప్రయత్నించండి.

● గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు ఉన్నవారి శరీరాలకు అధిక సూర్యరశ్మి ప్రభావించి శరీరం త్వరగా డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో వ్యాధి తీవ్రతలు అధికంగా ఉంటాయి.

● ఆల్కహాల్‌, సిగరేట్‌, కార్బోనేటెడ్‌ వంటి ద్రావకాలకు దూరంగా ఉండాలి.

● ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్‌గ్లాసెస్‌, తలకు టోపీ వంటివి ధరించాలి.

● వేసవిలో ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటికి వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవాలి.
 
● వేడి వాతావరణంలో శారీరక శ్రమ చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 5 నిమి షాలు నీడలో ఉండేలా చూసుకోవాలి.

చేయకూడని పనులు
● మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో బయట ఎక్కువగా తిరగరాదు.

● రోడ్లపై విక్రయించే చల్లని రంగు పానీయాలు తాగవద్దు.

● రోడ్లపై అమ్మే కలుషిత ఆహారం తినవద్దు. ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రమే తినడం మంచిది.

● ఆహారంలో మాంసాహారం తగ్గించి తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.

 జాగ్రత్తలు 
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అత్యవసరమైతే తలకు టోపీ ధరించి వెళ్లాలి. కొబ్బరి నీరు, ఉప్పు, చక్కెర, నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఐవి ఫ్లూయిడ్స్‌ను అందుబాటులో ఉంచాలి.  నవజాత శిశువులను పల్చటి గుడ్డతో సగం వరకు కప్పి ఉంచాలి. ఇంట్లోనే ఉండే పిల్లలకు వేడి తగలకుండా
 జాగ్రత్తలు తీసుకోవాలి.

వేసవిలో రోజుకు ఎనిమిది లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తాగాలి. తెల్లని కాటన్‌ దుస్తులను మాత్రమే ధరించాలి. బీపీ, షుగర్‌, గుండెజబ్బులు ఉన్న వారు ఎండలో ప్రయాణం చేయడం మంచిదికాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలంటే తలకు టోపీ, తల పాగా ధరించాలి. వడదెబ్బకు గురైనట్లు గుర్తించిన వెంటనే సమీపంలోని వైద్యుని వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించాలి.

 సర్వే జనా సుఖినోభవంతు అంటూ ముగించారు.

ఇంకా వుంది  (12)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
........

ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (12) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ

సన్యాసి యధాప్రకారముగా అక్కడ తోటలో వున్న వారందరు వింటున్నారు   

అమితశ్రమ పనికిరాదు - జపం చేయడంలోకాని, ధ్యానం చేయడంలో గాని శక్తినంతా వెచ్చించడం, మితిమీరిన శ్రమే అవుతుంది. పై నుండి దివ్యానుభూతులను అవిచ్ఛిన్నంగా పొందగలిగే ఘట్టాలలో తప్ప, ధ్యానమందెంతో ఆరితేరిన వారు సైతం అట్టి శ్రమకు తట్టుకొనడం కష్టం. 

మన బాధ్యతని మన మీద వేసుకోవడం వల్ల స్వేచ్ఛ వస్తుంది. బాధ్యత సృజనాత్మకతని తీసుకువస్తుంది. దాని వల్ల నీ పరిసరాల నుండి నువ్వు విముక్తుడవుతావు.  

ఉత్పలస్యారవిందస్య మత్స్యాస్య కుముదస్య చ ౹

 ఏకయోనిప్రసూతానాం  తేషాo రూపః పృథక్ పృథక్ ౹

      ఒకే నీటిలో పుట్టినా నీల తామర పువ్వు,తెల్ల తామర పువ్వు,చేపలు వీటి రూపాలలో వేరే వేరేగా ఉంటాయి.

చిత్తస్థాయి - సత్వర సాధనకు ముఖ్యంగా చిత్తస్థాయి కావాలి. ఫలితాల కొరకు వేగిపడడం, మితిమీరి శ్రమ చేయడం తగదు. అనుభూతులు పొందగల యోగ్యతను పెంపొందించు కోడానికి చిత్తానికి వ్యవధి యివ్వాలి. లోపలి నుండి కవిత్వం, సంగీతం పుట్టుకు వచ్చినంత సహజంగా ఆ అనుభూతుల నతడు పొందవలసి వుంటుంది.  

భగవంతుడు చాలా అందంగా ఉన్నాడని, భక్తుడు-యోగి ఇంకేమీ చూడకూడదనుకుంటాడు. అందమైన వస్తువులను చూడాలనే అతని కోరిక భగవంతుని దర్శనంతో పూర్తిగా తీరుతుంది. భౌతిక ప్రపంచంలో మనం అందాన్ని చూడాలనుకుంటున్నాము, కానీ కోరిక ఎప్పుడూ సంతృప్తి చెందదు. భౌతిక కలుషితం కారణంగా, భౌతిక ప్రపంచంలో మనం అనుభవించే అన్ని ప్రవృత్తులు ఎప్పుడూ సంతృప్తి చెందవు. కానీ మన కోరికలు చూడటం, వినడం, స్పర్శించడం మొదలైనవాటిని భగవంతుని తృప్తి కోసం ఉపయోగించినప్పుడు, అవి అత్యున్నతమైన పరిపూర్ణత స్థాయిలో ఉంటాయి.

*నాస్తి మాతృ సమం దైవం నాస్తి పితృ సమో గురుః। 

నాస్తి మాతృ సమో బంధు ర్జంతూనా మస్తి భూతలే।।

తల్లితో సమానురాలైన దేవత లేదు. తండ్రితో సమానుడైన గురువు లేడు.ఇంకా చెప్పాలంటే.... తల్లితో సమానమైన హితులు బంధువులు లేరు గాక లేరు.

ఇంకా వుంది  (14)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
........

ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (13) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ

        సన్యాసి తెలియపరిచారు నా బాల్యం అందరిలాగా సాగింది, మానాన్నగారికి కోపం తెప్పిచ్చాను అప్పుడే నన్ను తీసికెళ్ళి ఆశ్రమంలో పడేసాడు అప్పటి నుండి వేదాంత విషయాలు తెలుసుకొని ప్రజలకు తెలియపరుస్తూ కాల యాపన చెతున్నాను. 

    దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* 

పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. కట్టెల పొయ్యిలో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 

దాదాపు అందరం దుంపల బడిలోనో, ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  

ఆ రోజుల్లో  చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే. మాథమెటిక్ లో చేరితే చదివేవారులేక ఫిజిక్సు మెయిన్ చదివి పాసయినాను నేను.   

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్  ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

చాణిక్య చంద్రగుప్త సినిమా నాచదువు మలుపు తిప్పింది, ఆరాధన సినమా నాకు ప్రేమ నేర్పింది, పెత్తందార్ల సినిమా నా వాచ్ పోగొట్టింది, ఇలా చెప్పుకుంటూ పొతే నందమూరి రామారావు సినిమాలే ఎక్కువగా చూసేవాణ్ణి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో సైకిల్ పోగొట్టుకున్నాను, ఇలా న జీవితం సనసముగా మారింది మా తల్లితండ్రులు చనిపోయిన తర్వాత నా దారే మార్చుకొని కష్టపడ్డాను, అప్పుడే నాకు తోడు ఆ పరమాత్ముని కధలు చెప్పుకుంటూ కదులుతున్నాను.       ఇలా ఎన్నో మరెన్నో మల్లి కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం 

ఇంకా వుంది  (14)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
***
ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (14) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ

ఇది పరివర్తన, అంతర్గత పరివర్తన యొక్క రసవాదం. అంగీకరించి, క్షణంతో కదలండి. మీరు నిజంగా కదిలితే, మీపై మత్తు ఉండదు. మీరు నిజంగా కోపంలోకి వెళితే, మీరు దానితో పూర్తి అవుతారు, ఎందుకంటే మీరు దానిలోకి వెళ్ళినప్పుడు అది సంపూర్ణంగా పూర్తయింది. ఆపై మీరు దాని నుండి బయటపడ్డారు, దాని నుండి పూర్తిగా బయటపడ్డారు, నిష్కళంకంగా. సమాజం ద్వారా భ్రష్టు పట్టని చిన్న పిల్లాడిని గమనించండి.

*వనేsపి సింహాః మృగమాంస భక్షిణో బుభుక్షితాః నైవ తృణం చరన్తి|
ఏవం కులీనాః వ్యసనాభిభూతాః న నీచ కర్మాణి సమాచరన్తి ||

తా𝕝𝕝 "ఆకలిగొన్న సింహాలు మృగమాంసాన్నే భక్షిస్తాయి తప్ప గడ్డిని ఆరగించవు..... అలాగే సజ్జనులకు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వారు నీచకర్మలు ఆచరించరు "..... 

పిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడో చూడు. అతను ఆడుతూ మరియు నవ్వుతున్న మరుసటి క్షణం - కోపం ఇక ఉండదు. ఒక క్షణం ముందు అతను కోపంగా ఉన్నాడని మీరు నమ్మలేరు. ఇప్పుడు అతను చాలా ప్రేమగా ఉన్నాడు, చాలా పువ్వులా ఉన్నాడు. ఒక క్షణం ముందు అతను ఒక జ్వాలగా ఉన్నాడు! జీవించడానికి ఇదే మార్గం. మీరు, పూర్తిగా ఉండాలి. అప్పుడు ఏ క్షణం నుండి మత్తు మిగిలి ఉండదు. మీరు ఎల్లప్పుడూ తాజాగా మరియు యవ్వనంగా ఉంటారు మరియు గతం మీపై భారం కాదు. దీనినే నేను ఆధ్యాత్మిక జీవితం అంటాను. ఆధ్యాత్మికం అంటే క్రమశిక్షణతో కూడిన జీవితం కాదు. ఇది సహజమైన జీవితం.

*యావదస్పలితం తావత్సుఖం యాతి సమే పథి ౹
  స్పలితే చ సముత్పన్నే విషమం చ పదే పదే ౹౹
 
     మనిషి ఎక్కడిదాకా ఒక్కసారి కూడా తడబాటు లేకుండా  నడవగలడో అక్కడిదాకా సుఖంగా సమమైన దారిలో నడుస్తాడు.ఒకసారి భయపడితే చాలు ముందు మళ్ళీ మళ్ళీ అడుగు అడుగుకు దారి ఎంతో కష్టంగా మారుతుంది.

ఉదాహరణకు బ్రహ్మర్షి యగు వశిష్ఠుడు అట్టి స్వస్తిమతి. విశ్వామిత్రుడు చేయు విన్యాసములను అతడు చిరునవ్వుతో దర్శించెను గాని ప్రతిస్పందించ లేదు. అట్లే పట్టాభిషేక సమయమున రాముడు వనవాసముల కేగుచున్నప్పుడు కూడా అడ్డుపడలేదు. విపత్కర పరిస్థితులలో కూడ అతడు చలించలేదు. తన నూరుగురు కుమారులను విశ్వామిత్రుడు సంహరించినపుడు చలింపక స్థిరమతియై యుండెను. స్వస్తికి శ్రీమాతయే మూలము. ఆమెయే గురువు. ఆమె చైతన్యమే బ్రహ్మర్షుల యందు మరియు క్రూర మృగముల యందు కూడ యున్నది. ఎందున్నను తాను తానుగనే యుండును. కాలము దేశము రూపము తనపై ప్రభావము చూపవు.

*త్రీణైవ తు పదాన్యాహు :   పురుషస్యోత్తమం ప్రతి ౹
  న ద్రుహ్యేచైవ దద్యాచ్చ   సత్యం చైవ పరం వదేత్ ౹౹ 

       మనిషి అత్యున్నత స్థానం పొందాలంటే మూడు మెట్లు ఉన్నాయి. ఎవరికీ వంచన చేయరాదు. ఇతరులకు దానం చెయ్యాలి మరియు మంచి ఫలితం ఇచ్చేలా సత్యం వచనాలు మాట్లాడాలి.
ఇంకా వుంది  (15)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
***
ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (15) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ

*సన్యాసి ఇంకా ఇలా తెలియపరుస్తున్నారు 

ప్రతి మనిషిలో అవగాహన లోపమే ఈ ప్రశ్నే తలెత్తడానికి కారణం. ఎలాగంటే బంగారంతో నగ తయారవుతుంది. అంటే బంగారమే నగ రూపంగా మారుతుంది. ఆ 'రూపం' బంగారాన్ని మార్చడం కానీ, 'రూపమే' బంగారంగా మారటం గాని జరగలేదు. నగరూపంలో 'ఉన్నా లేకున్నా' బంగారానికంటూ ఒక శాశ్వత ఉనికి ఉంది. అలాగే ఇప్పుడు నిజంగా కనిపించే మన బాహ్యరూపం ఉన్నా, లేకున్నా మనకు కూడా ఒక ఉనికి ఉంది. విలువ ఎప్పుడూ బంగారానికే ఉంటుంది.  మన అభిరుచి మాత్రమే వస్తువుపై ఉంటుంది. 'నాకు బంగారపు ఉంగరం చేయించుకోవాలని ఉంది, ఏ దేవుడి రూపంతో చేయించుకోమంటారు ? అని అడుగుతారు. ఇక్కడ మొదటి విలువ శాశ్వతమైన బంగారానికే ఇచ్చారు. రెండవ విలువ తన అభిరుచి అయిన దాని రూపానికి ఇచ్చారు. మనం కూడా బంగారంలా ఉన్న హృదయంలోని శాశ్వతమైన పరమాత్మ గుర్తించాలి. అప్పుడు ప్రాపంచిక విషయాల ప్రయోజనం అర్థమై, మనమే వాటికి ఇచ్చే ప్రాధాన్యతను తగ్గిస్తాము !

ప్రతిఒక్కరి మనసును బట్టి ఉంటుంది. అద్ధం ఎప్పుడూ తాజా ప్రతిబింబాన్నే చూపుతుంది. అది ప్రతిరూపాలను తనలో దాచుకోదు. అభ్యాసం చేసి మన మనసును కూడా నిరంతరంగా అలా ఉంచుకోగలిగితే అది సన్యాస జీవితంతో సమానం అవుతుంది. నిజానికి మన మనసు అనేక విషయాలను సహజంగానే సన్యసిస్తుంది. ఆఫీసు పనిలో మునిగిన మనసు ఇల్లు, ఇల్లాలు, పిల్లలను జ్ఞాపకమైనా తెచ్చుకోదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీసును స్మరిస్తూ కూర్చోదు. టీవీ సీరియల్ చూసే గృహిణి ఎవరైనా పరిచయస్తులు వస్తే అయిష్టంగానే టీవీ కట్టేస్తుంది. కానీ టీవీ చూస్తున్నప్పుడే తన కొడుకు మేడపై నుండి పడితే కనీసం టీవీని పట్టించుకోకుండానే పరుగు పెడుతుంది. ఇలా మనం నిత్య జీవితంలో ఎన్నో విషయాలను సహజంగానే వదలుగలుగుతున్నాం . మనసును అలా మలుచుకోగలిగినప్పుడు సంసారికి కూడా అది సన్యాస జీవితంతో సమానమే !

ఇంకా వుంది  (16)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
***
ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (16) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ

* ఓం శ్రీ రామ, శ్రీ మాత్రే నమః అంటూ ఉపన్యాసం ప్రారంభించాడు, ప్రకృతి ప్రభంజనం అందరికీ అందు బాటులో  ఉంటుంది, ఋతువులు బట్టి మారుతూ గుణాల్ని వట్టి కదులుతుంది.  ప్రతిఒక్కరు ప్రతి పనిలో ధైర్యంగా, పట్టుదలగా, ప్రయత్నం వదలకుండా చేసేపనిలో నిజాయితీ ఉంటెచాలు *నిజం గెలిచి తీరుతుంది ... ( సత్యమేవ జయతే )

* ప్రతి ఒక్కరూ ఇతరులకి ఉపయోగ పడటానికే ఈ దేహం సుమా, బతికి బతికించు కొనెడి శరీర సహాయం చెయ్యాలి అప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది.   (  పరోపకారర్ధంమిదం శరీరం )

* జీవితానికి మూలం డబ్బే ప్రధానం, డబ్బేవుంటే కొండమీద కోతి నైనా కొనవచ్చు అనెడి నానుడి, డబ్బుకులోకం దాసోహం, డబ్బులేనివాడు డబ్బుకి కొరగాడు నానుడి, 10 కోట్లుపెట్టి కారుకొన్న టైర్లువుండాలి, బంగారం కంచంలో అన్నమే తినగలము బంగారం తినలేము, ధనం ఉన్నాకష్టమే, లేకున్నా కష్టమే డబ్బే ప్రపంచమట   ( ధన మూల మిదం జగత్)

* ఎక్కడైనా మితిమీరి ప్రవర్తించకూడదు కదా !ప్రవర్తన బట్టి మనుష్యులకు గుర్తింపు ఉంటుంది. ప్రవర్తనం మార్చుకున్న జీవితం ఆగమ్యగోచారం, అందుకే  (అతి సర్వత్ర వర్జయేత్) అన్నారు 

*.అనుకున్నవి చెయ్యలేరు, అనుకోనివి జరుగు జండు, కాలం కలిసిరానప్పుడు   పనికిమాలిన ఆలోచనలే వస్తాయట..అందుకే  (వినాశకాలే విపరీత బుద్ధిః)

*మనం మంచిగా ఉంటే ఆ మంచే మనల్ని కాపాడుతుంది అని చెప్పిన మాట నిజమండీ...
  మన నడవడి ధర్మముగా వున్నట్లైతే ఆ ధర్మమే మనల్ని నడిపిస్తుంది (ధర్మో రక్షితి రక్షితః). 

* మనిషిలో భయం ఉండాలి పూర్వం ఇప్పుడు కూడా  దెబ్బలకు భయం ఉండేది,   దెబ్బకి దెయ్యం  వదిలిపోతుంది అని నమ్మేవారు అనేమాట (దండం దశగునో భవత్)

*.అతిగా ‌కాకా పడ్తున్నాడంటే అర్థమవుతోంది కదా వాడు ఎటువంటివాడో. నమ్మించి మోసం చేసేవారు లోకంలో వున్నారు జాగర్త పెద్దలు చెప్పనే చెప్పారు కదా..  (అతివినయం దూర్త లక్షణమ్)

*..పాలకులని అనుసరిస్తారుకదా జనం. మూర్ఖుని మాటలు మూర్ఖుడే వింటాడు, మంచివాని మాటలు వినటానికి అందరు ముందుకు రావాలి అదే లోకం (యధా రాజా తథా ప్రజాః)

*. ముసలితనంలో నీతులు చెప్తే ఇలా కూడా అంటారు బాబోయ్.. (వృద్ద నారీ పతివ్రతాః)

*.. బద్దకిస్తే కొన్ని పనులు చెడతాయని ఇలా అంటారు.. ఈరోజు చేయాల్సినవి ఆరోజు చేస్తే అందరికి  ఆరోగ్యం  (ఆలస్యం అమృతం విషం)

*.మీ  మేధస్సు వలన మీరు ఎక్కడైనా గౌరవింపబడతారు  సుమండీ.. ( విద్వాన్ సర్వత్ర పూజ్యతే) సంస్కృత సూక్తులను వివరిస్తూ తెలియపరిచారు సన్యాసిగారు.   

ఇంకా వుంది  (17)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
***
***

ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (17) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ..26/04
సన్యాసి భక్తులు రోజువారి భోదచేయటం మొదలుపెట్టాడు.
* జగన్మిథ్య అన్నారు - శంకరాచార్యులు.
* సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నారు - వేద ఋషులు. 
రెండింటిలో ఏది సత్యం?
రెండు సత్యమే.
* మొదటిది సాధనావస్థలో చెప్పబడింది. అనగా ఒకతల్లి తనబిడ్డకు చందమామచూపి జాబిల్లి రావే అనిపిలుస్తూ చల్లని గాలిలో నిద్రపుచ్చుతుంది. 
* రెండవది సిధ్ధ్యావస్థలో చెప్పబడింది. ఒక తండ్రి సూర్యని ప్రార్ధిస్తూ జలం ఆర్గ్యం ఇస్తాడు.
అలాగే ఒక సైన్టిస్ట్ లెక్కలు తెల్పుతూ ఆధునిక విధానాలకు తనవంతు కృషి చేస్తాడు.
ఇందులో తెలుసుకోవలసినది తల్లిప్రయత్నం ఉచితం, తండ్రి ప్రయత్నం ఇంగిత జ్ఞానము, ఇక సైన్టిస్ట్ ప్రయత్నం శాస్త్రీయం.
ఏది మిధ్య, ఏది ఉచితం, ఏది అనుచితం అని కూర్చుంటే జీవితం అగమ్యగోచారం.
మేలుకొన్న తర్వాత స్వప్నం ఉండదు.
మరణం తర్వాత ప్రపంచం ఉండదు.
 ఎవడి కల వాడిదే., ఎవడి లోకం వాడిదే.
ప్రతి మనిషి నా పరిమితులు నాకు తెలుసు; 
నా అపరిమితులు నాకు తెలియదు. అని అంటాడు, లోకాన్ని బట్టి ప్రకృతిని బట్టి మనిషి కదులుతూడేతప్ప, అంతా నావల్లే అనుకున్నా వ్యర్థమే.
ఇక్కడ (పరిమితులు) తెలియడం జ్ఞానం.
 అక్కడ (అపరిమితం) తెలియకపోవడం  జ్ఞానం.
"వట వృక్షం , సమస్త జీవకోటికి తండ్రి లాంటి తరువు, కూపస్థ జలం సర్వ సృష్టికి ప్రాణం నిలిపే జలము,
నారి కుచద్వయాలు సహజ స్త్రీ యవ్వన చిహ్నలు, ఆకర్షణ
జీవిత భాగస్వామికి ఉపరణ, ఏ ఎండ కాగొడుగు పట్టు 
శీతేషు ఉష్ణం , ప్రాణిలో కదలిక తెలపగలిగేది 
ఉష్ణేషు శీతలం "  .చల్లని భార్యతోడు ఉన్నట్లయితే .. అన్నారు .
ఆంటే మర్రిచెట్టు నీడ, బావిలో నీరు   , మగువ ఎదలు ... 
చలి కాలం వెచ్చగాను , వేసవి కాలం చల్లగా ఉంటాయని
తెలుసు కోవటమే 
ఇక్కడ కదిలించేది ఉండేది దైవ సంకల్పమే.
మన సంకల్పం కూడా దైవ సంకల్పంలో భాగమే. అని తెలుసుకోవాలి.
మనం గుణానికి  మనకంటే  ఎక్కువ  ఉన్న  వారితోనూ 
ధనానికి మనకంటే  తక్కువ ఉన్నవారితోనూ  పోల్చుకోవాలి.
సరైన జోడీ లేకుంటే ఎంత ఖరీదైన చెప్పు అయినా చెత్త బుట్టలోకే.
 సరైన భార్య లేకుంటే జీవితం కూడా అంతే.
అందుకని కొన్ని కీటక, జలచరాల గురించి తెలుసుకుందాం.
సద్గురువు - అక్కడికొచ్చిన వారందరికీ 1. విహాంగం, 2.భ్రమరం,3. మీనం 4. తాబేలు వాటి ప్రవర్తనా న్యాయాలు తెలుపుతాను వినగలరు
 1. విహంగ న్యాయం:-
 పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది.
 అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత భక్తులకు శిష్యులకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.
( స్పర్శ ప్రేమ మయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు కూడా)
2. భ్రమర కీటక న్యాయం:-
 భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది. 
 అలాగే సద్గురువు శిష్యులకు, భక్తులకు  'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలే తయారు చేస్తాడు.
( వాక్కు మధురం గా ఉండవచ్చు లేదా తిట్టవచ్చు )
3. మీన న్యాయం :-
చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణం గా చూస్తుంది.  తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలు గా మారుతాయి.
 ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడం వల్ల శిష్యులు, భక్తులు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.
4. తాబేటి తలపు న్యాయము :-
 తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది.  ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది '. 
ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లల గా తయారవుతాయి.
 అలాగే శిష్యులు, భక్తులు ఎక్కడ ఉన్నా వారు పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి అని 'సంకల్పిస్తారు'. 
ఆ దివ్య సంకల్పంతో శిష్యులు భక్తులు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు.
     ఇంకావుంది..18
మీ అభిప్రాయాలు తెలపండి, మీ విధేయుడు
  

ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (18) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ..27/04

మనలో మనము ఒక విధముగా ఉండలేము, మన మనసు మారి, గుణము మారి పలు పలువిధాలు మారు అంటూ సన్యాస ఉపన్యాసము తెలిపాడు.      
 
ఏదో జరుగుతుంది, మరియు ద్వంద్వత్వం పుడుతుంది. సృష్టికర్తలం... “ శైశవ దశ ”లో వున్నా, “ వృద్ధ దశ ” లో వున్నా... “ జ్ఞాని ”గా వున్నా, “ అజ్ఞాని ”గా వున్నా...“ పండితుడు ”గా వున్నా, “ పామరుడు ”గా వున్నా...మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం... ఇది అక్షరాల నిజము,  మీకు నచ్చినది ఏదైనా జరిగినప్పుడు, అది మరింత ఎక్కువగా ఉండాలనే కోరిక పుడుతుంది.  మీకు అందంగా అనిపించే ఏదైనా జరిగినప్పుడు, మీరు దానిని కోల్పోతారనే భయం పుడుతుంది, కాబట్టి అవినీతి అంతా అత్యాశ, భయంతో వస్తుంది. అనుభవంతో, మనస్సులోని ప్రతిదీ తిరిగి వస్తుంది మరియు మళ్లీ మీరు చిక్కుకుపోతారు ... ఇది లోక సహజం.   
       మన నోటిలోని మాటే మన నుదుటి మీద వ్రాత, మన భావాలే మన అనుభవాలుగా నిరంతరం పరిణామం చెందుతూ వుంటాయి, మన ఆలోచనలతోనే, మన మాటలతోనే, మన చేతలతోనే , మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాము లేదా దిగజార్చుకుంటున్నాం...

ప్రతి క్షణాన్నీ జీవితమంతా ఎవరికివారు సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ నా ప్రయత్నమంతా మిమ్మల్ని అనుభవానికి మించి, అంతకు మించి ముందుకు తీసుకెళ్లడమే. ఎందుకంటే అప్పుడు మాత్రమే మీరు మనస్సుకు అతీతంగా ఉంటారు మరియు అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది. అనుభవం లేనప్పుడు నిశ్శబ్దం ఉంటుంది.

ఆనందం లేనప్పుడు కూడా ఆనందం ఉంటుంది, ఎందుకంటే ఆనందం అనేది అనుభవం కాదు, మీరు ఆనందంగా ఉన్నారని మీకు అనిపించదు. మీరు భావిస్తే, అది కేవలం ఆనందం. ఇది కాసేపు వుండి వెళ్లి పోతుంది మరియు మీరు చీకటిలో వదిలివేయబడతారు. మన కర్మలు మనకే ఫలితాలను ఇస్తాయి...మన కర్మలను మనమే సరిచేసుకుంటూ వుండాలి...అలా కాకుండా సమయాన్ని వృథా చేస్తున్నామంటే... మనల్ని మనమే అవసానదశకు తీసుకువెళ్తున్నట్టు...అలాంటప్పుడు మనకు మనమే శతృవుగా అవుతాం. మీరు ఈ విషయం అర్థం  చేసుకుంటే, ఏ పద్దతి ఆధ్యాత్మికం కాదు, ఎందుకంటే అన్ని పద్ధతులు మీకు అనుభవాలను ఇస్తాయి. ఒక రోజు అన్నీ తొలగించ బడతాయి. ఇదే మీ లక్ష్యం కావాలి. ఫర్నీచర్ లేకుండా, అనుభవాలు లేకుండా, మీరు మీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు అంతిమంగా అనుభవాన్ని పొందుతారు. కానీ అది 'అనుభవం' కాదు, అది చెప్పే మార్గం మాత్రమే.

ఇంకా వుంది  (17)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
***


" సరదాగా నవ్వుకోండి.." 
         
*చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా మాస్టారు నన్ను కొట్టినప్పుడల్లా ప్రతీదెబ్బ తిన్న వెంటనే నేను చేతులను దులుపుకుని నా లాగుకి రాసుకున్న తర్వాతే రెండో దెబ్బకు చెయ్యి చాచేవాణ్ణి. శుచి-శుభ్రత అన్నది నాకు అప్పటినుంచే ఉండేది తెలుసా ! 

*అప్పట్లో మా గురువులంతా పాఠం చెప్పినంతసేపూ నిలబడే ఉండేవాళ్ళు, ఎందుకో తెలుసా? గౌరవం... నేనంటే వాళ్ళకి అంత గౌరవం...అంతే!

* నేను చదువుకునే రోజుల్లో మా గురువులు నాలుగురోజులకొకసారి మా నాన్నగారిని తీసుకుని రమ్మనే వారు! ఎందుకంటే వాళ్ళందరూ ఏ విషయమైనా నాకు సూటిగా చెప్పడానికి చాలా భయపడేవారు!

*నేను రాసినవి చదవడానికి మా గురువులంతా చాలా ఇష్టపడేవారు. అందుకే వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు కొన్ని వందలసార్లు మళ్ళీ మళ్ళీ రాసి చూపించమని ప్రతీరోజూ అభ్యర్థించేవారు!

*మా గురువులందరూ నన్ను "వీడొక సింహబలుడు" అన్నట్టుగా చూసేవారు. అందుకే వాళ్ళకి ఏమాత్రం భయం వేసినా క్లాసులో నుంచి నన్ను బయటకు పంపి గుమ్మం దగ్గర కాపలా కోసం నిల్చోబెట్టేవారు.

*మా గురువులకి నేను చాలా తెలివైనవాడిని అనే భావన బాగా బలంగా ఉండేది.అందుకే వాళ్ళంతా,"ఒరేయ్, నువ్వు స్కూలుకి ఎందుకొస్తావురా. పోయి ఎక్కడైనా పనిలో చేరిపోవచ్చు కదా!", అని కనీసం రోజుకోసారైనా అనేవారు! అంటే... చిన్నప్పుడే నేను ఉద్యోగం చేసే తెలివి తేటలు సమర్ధత ఉన్నాయి అని ముందుగానే గ్రహించారు అన్నమాట..

అందుకే, నా చిన్నతనం నిజంగా ఒక స్వర్ణ యుగం! 
****


ఆశతో కూడిన ఆలోచనలు లేనప్పుడు త్రివిధావస్ధలు సమంగా, సహజంగా, శాంతిగా.. ఉంటాయి !!


సాధారణ వ్యక్తికి జాగృతిలోని ఆలోచనలే కలలకు కారణం అవుతాయి. జాగృతి ఆలోచనలకు ప్రతిరూపంగా ఉంటుంది. ఆశతో కూడుకున్న ఆలోచనలే శాంతికి భిన్నంగా మనకు కనిపిస్తాయి. జీవనంలో భాగంగా సాగే ఆలోచన మనను బాధించదు. కోరికతో నిండిన ఆలోచనలే జాగృతిలో అశాంతికి, నిద్రలో తీవ్ర స్వప్నాలకు కారణం అవుతాయి. ఆశతో కూడిన ఆలోచనలు లేనప్పుడు జాగృతి, స్వప్నం కూడా గాఢ నిద్రలోని సుషుప్తితో సమానంగా, సహజంగా సాగుతాయి. అప్పుడు త్రివిధావస్థల్లో శాంతి నిండి ఉంటుంది.  మంచి కలలు, చెడ్డ కలలు మనఊహాలే. మనసు సమస్ధితిని పొందితే మూడు అవస్థల్లోనూ శాంతిగా ఉంటుందని చూపేందుకే జాగృతి, స్వప్న, సుషుప్తులు లేవని జనకుడు నిర్ధారిస్తున్నాడు !

   మన మీద మనకే నమ్మకం లేని సమయంలో కూడా మనల్ని *నమ్మే వాడే మనకు నిజమైన స్నేహితుడు ఆశ మనల్ని జాతకాలను నమ్మేలా చేస్తే కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది. అంతేకాదు బాధ మనిషిని నమ్మేలా చేస్తే మన ధైర్యం ఒక్కటే మనల్ని మనం నమ్మేలా చేస్తుంది. ధైర్యంగా ఉండండి. మీ జీవితాన్ని సంతోషంగా గడపండి. 
      
మీరెవరో మరి నేనెవరో
ఒకరి కొకరు ఏమౌతారో
భయంకర స్థితిన మారేదె వరో
తోడై నీడై కలసి ఉండేదేవరో

అర్ధం కానిదే అద్భుత సౌదర్యం కోసమో 
స్వార్ధం లోనిదే సద్భుద్ధి మాధుర్యం కోసమో 
తీర్ధం తాగితే పూజర్ధ కైకర్యం కోసమో
వ్యర్థం కానిదే విధ్వక్త  ఆశ్చర్యం ఎవరికో

ముసుగు తొలగగా వీధి నిర్మానుష్యం దేనికో 
పలుకు పలకగా తీరు మర్మానుష్యం దేనికో 
బలము పెరగగా భీతి కర్మానుష్యం దేనికో 
జలము చిలకగా జాతి ధర్మానుష్యం ఎందుకో

పరుగులు తీసే ఒక ప్రయాణం దేనికో 
బరువులు మోసే దయ ప్రయాణం దేనికో 
చిరుగులు మూసే చిరు ప్రయాణం దేనికో 
పురుగుల జాసే భయ ప్రయాణం మానుకో

గొడవలు మార్చాలి గుణపాఠం ఎవరికో 
మనుషులు మార్చాలి విధి పాఠం ఎవరికో 
గురువులు మార్చాలి బడి పాఠం ఎవరికో 
తరువులు మార్చాలి మది పాఠం బ్రతుకుకో

నా వాళ్లు నాకు అప నమ్మకం ఎందుకో 
నా నీడ  నాకు కళ నమ్మకం ఎందుకో 
నా తోడు నాకు విధి సమ్మతం ఎందుకో 
నా ఆట నాకు కల అమ్మకం మానుకో

ఏ శ్వాస లో ముడిపడేటి మిలితం దేనికో 
ఏ వాంఛ లో తడి పడేటి కలుషం దేనికో 
ఏ బ్రాంతి లో తల పడేటి తపనం దేనికో 
ఏ స్వేఛ లో  గతి పడేటి గమనం చేరుకో

వెతకకు నువ్వెందుకు కారణం మర్చిపో 
బతుకున నవ్వెందుకు మూలకం మారిపో 
అతుకులు కవ్వించుట వాలకం  మర్చిపో 
ఋతువులు రువ్వెందుకు జీవితం సర్దుకో

మీరెవరో మరి నేనెవరో
ఒకరి కొకరు ఏమౌతారో
భయంకర స్థితిన మారేదె వరో
తోడై నీడై కలసి ఉండేదేవరో
......
సర్వేజనా సుఖినోభవంతూ 
అలా పాడుకుంటూ అందరికి నమస్కారం చేసుకుంటూ కదులుతున్నాడు బైరాగి   
       


ఆలోచనామృతం విని అర్ధం చేసుకొని ఆచరిస్తే అందరికి శ్రేయస్కరం  

రామారావు ఇంటికి చేరగానే భార్య శ్రీమతి జానకి జమ్బుతో నీళ్లు తెచ్చి చేతికి కండువా అందించింది, ఏమిటో ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు మీరు అన్నది నవ్వుతు 

 నేను యధాప్రకారముగా నడక సాగగా నాతో  హనుమంతు కలిసాడు, కూర్చొని కధలు చప్పుకుంటుంటే ఒక బైరాగి పాట్ పడుతూ వచ్చాడు అతనితో కాలక్షేపం ఇంట సమయం పట్టింది, ఆయనను ఇక్కడి లి తే పోయ్యారా ఎమన్నా సహాయం చేద్దాం అవునే నేనుకూడా ఏంతో అభినయించా వప్పుకోనంటే పండు ఇచ్చి సాగనంపాను . 

పండు పండు ఇచ్చి పంపావా ఏమిటి అంట్లా  అంటావు,  అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం పదా లోపలకి అని బదులు చెప్పాడు రామారావు.   

సరదాగా సరసమాడుతూ రామారావు మాటలు 

సఖీ:: నీకిష్టమైతే, చెంతకొస్తావు, చేయిచాస్తావు ,  చెలిమిచేస్తావు, సలహాలిస్తావు, సహకరిస్తావు, కానీ నాకిష్టమైతే పట్టించుకోవు, పలుకరించవు, ప్రతిస్పందించవు, ఎరగనట్లు ఉంటావు. 


సఖీ: నీకునచ్చితే నవ్వుతావు, నవ్విస్తావు,  నమ్మిస్తావు, నటన చూపుతావు, కానీ నాకునచ్చితే నసుగుతావు, నటిస్తావు, నాలుకవెళ్ళబెడతావు, తెలియనట్లు చూస్తావు.   


సఖీ: నీవుమెచ్చితే  ఇంద్రుడవంటావు,  చంద్రుడువంటావు, చప్పట్లుకొడతావు, సంబరపడతావు 

కానీ నేనుమెచ్చితే, గమ్ముగుంటావు, వమ్ముచేస్తావు, పొమ్మనంటావు, అలక ప్రవర్తిస్తావు. 


సఖీ: నేనుపిలిస్తే, ఉలకవు, పలకవు, కదలవు, ఇకన్నా రుబ్బురోలు నయమనిపిస్తావు కానీ 

నీవు పిలిస్తే బరాబరారావాలి, బదులివ్వాలి, బద్ధకంవీడాలి, లేదా భద్రకాళివైపోతావు. 


సఖీ : నీవుకోరితే కాసులివ్వాలి, కొనిపెట్టాలి, కష్టపడాలి, కాదనకుండా ఒప్పుకోవాలి కానీ

నేను కోరితే బెట్టుచేస్తావు, బదనాంచేస్తావు, బ్రతిమాలించుకుంటావు, గాంభీర్యం ప్రదర్శిస్తావు 


సఖీ: నీవుమెడవంచితే, తాళికట్టాలి, తోడుగుండాలి, తృప్తిపరచాలి కానీ నేనుమెడవంచితే గేళిచేస్తావు గంతులేస్తావు గడుసుగుంటావు


సఖీ : నీకు షోకులుకావాలి, సుఖంకావాలి, సంసారంకావాలి, అందరిలో గోపా అనిపించుకోవాలి 

కానీ నేను పాట్లుపడాలి, పోషించాలి, పరిరక్షించాలి, అని హుకుం జారీ చేస్తావు 


సఖీ : మనం బాగుపడాలంటే అన్యోన్యంగా యుండాలి, కలసిముందుకుసాగాలి సంసార సాగరము నీదాలి, కలసి మెలసి నలుగురికి, దేశానికి సహాయంచేస్తూ జీవించాలి కానీ

మనమెప్పుడు తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, రట్టుచేసు కోకూడదు, కలసుండాలంటావు.  


సఖీ: మనకుకుదిరితే ముందుకెళ్దాం, లేకపోతే వెనుకడుగేద్దాం, ఆలోచించు నిర్ణయం చెప్పు ఔనంటే బంగారుభవితకు పూలబాట వేసుకుందాము. 

ఏమిటండి ఎంత ఉపోద్ఘాతము వెలువరించారునేను మీదగ్గర అట్లా ప్రవర్తించానా, మీదగ్గర పిల్లల దగ్గర తప్పుచేసినా ఇన్ని మాటలన్నారు. 

ఇప్పుడు నేను చదివినదంతా నమ్మవా మరి నాగురించేగా మీరు వ్రాసింది అవును కాదననుకో      

ఎదో సరదాగా వ్రాస్తే ఎలాఉంటుందో అని హనుమంతు అడిగితె వ్రాసాను,నీకు చదివి విని పించాను . 

ఆ అంతే

అయితే మీ మాటలు నమ్మవచ్చా, 

వెళ్లి కాఫీ పెట్టి తీసుకురా తాగుదాం, రండి ఇద్దరం కలసి పెట్టుకుందాం, ఎన్నాళ్ళ కెన్నాల్లకు         

వయసులో వేషాలు గుర్తు కొస్తున్నాయి, ఆ వస్తాయి వస్తాయి 

ఆ ... అ ... ఆ  

ఇతకముందే మీ తాతమ్మగారు వచ్చింది, ఆవిడకు పాతలవాట్లు మాత్రం మారలేదు, పలకరించండి, ఈరోజు మధ్యాన్నం మీ స్నేహితుని ఇంటికి వెళదాం. 

తాతమ్మ వచ్చిందికదే, అందుకనే వెల్దామంది, ఏమనుకుంటుందో అంటా నేను చూసుకుంటాగా మీరు రడీగా వుండండి, తాతమ్మకు చెప్పి వెళదాం. 

మాటల్తో భోజనాలు ఆయినాయి, తతమ్ముకు చెప్పారు, వెళుతున్నామని, అనగా తలుపేసుకొని లోపలకు నడిచినది, బయట జానకి రామారావు కార్ కదిలింది.                 

తాతమ్మ టివి పెట్టుకొని చూస్తున్నది.  

అప్పుడే కళింబెల్ నొక్కగా 


బామ్మగారు బామ్మగారు ..  ఎం బాబు ఆ అరుపు 
.....

* త్యాగం ఒక గొప్ప శక్తి

ఓంశ్రీమాత్రే నమః

త్యాగమనేది ఒక గొప్ప శక్తి. ఈ శక్తి కలిగినవారు ఎంతో గొప్పవారవుతారు. చాలామంది త్యాగం చేయటం ఒక పిరికితనంగా భావిస్తారు. సహనాన్ని కూడా పిరికితనమనుకొని తమను తాము వంచన చేసుకుంటారు. త్యాగంతో పాటు సహనం కూడా ఎంతో గొప్ప శక్తి, త్యాగమంటే వస్తువైభవాలు, వ్యక్తులు, పరిస్థితులపైన మన అధికారాన్ని వదిలిపెట్టడం.

ఎన్నోసార్లు ఈ అధికారాన్ని వదిలిపెడతాం కానీ ఇష్టంతో సంతోషంతో ఇతరుల సుఖాన్నాశించి సమాజ శ్రేయస్సు కోసం చేస్తే అది సత్వ గుణమన బడుతుంది. భయం, స్వార్థం, మొండితనాలతో బలవంతంగా చేసిన త్యాగం రజోగుణం, తమోగుణాలతో కూడిన త్యాగమన బడుతుంది.

చాలాసార్లు వ్యక్తి స్వార్థానికి లోబడి త్యాగం చేస్తాడు. నేను కొద్దిగా త్యాగం చేస్తే ఎంతో గొప్ప లాభం దొరుకుతుందనుకోవడం రజోగుణ త్యాగం. కొన్నిసార్లు వ్యక్తి మొండితనంగా త్యాగం చేస్తాడు. నిజానికి త్యాగమనేది ఎంతో లోతైనది, విలువైనది. ఒకసారి త్యజించిన వస్తువు గురించి మనసులో ఆలోచన కూడా రాకపోవడమే త్యాగానికి సరైన అర్థం. అంటే త్యాగాన్ని కూడా త్యజించాలి. ఒకవేళ ఎవరికైనా త్యాగం చేసి నేనేమైనా తక్కువగా త్యాగం చేశానా ఏమిటి? అనే సంకల్పమొచ్చినా కూడా చేసిన త్యాగానికి ఫలితముండదు. నిజమైన సుఖాన్ని పొందాలంటే త్యాగమే ఆధారం.

మోహాలోభాలలో దేనికైనా లోబడి ఉన్నవారు మనస్ఫూర్తిగా త్యాగం చేయడం వారి భాగ్యానికి నిదర్శనం. ఇందులో కష్టమనేమీ ఉండదు. ఎందుకంటే దీని ఆధారంతో ఆత్మకు అసలైన సుఖం లభిస్తుంది. విషయ వికారాలను, చెడు అలవాట్లను, వస్తువైభవాలు, సంబంధాలను మనసావాచాకర్మణా త్యాగం చేయడమనేది సత్యమైన త్యాగంలో భాగమే. అప్పుడే మనకు సత్యమైన శాంతి అనుభవమవుతుంది. కోరికలను త్యజించిన వారే శ్రేష్ఠాత్మలనబడతారు.

త్యాగం చాలా గొప్ప శక్తి కావటం వల్ల వ్యక్తి ఎంతో శక్తివంతుడవటమే గాక ఎందరో ఆత్మలకు ప్రేరణ నిచ్చిన వాడవుతాడు. యోగ  సాధన చేసే ఆత్మలో త్యాగమనే శక్తి నిండుతూ ఉంటుంది. వారి మనసు బుద్ధిలో ఎల్లప్పుడూ నేనొక పవిత్రమైన ఆత్మననే శ్రేష్ఠ చింతన ఉంటుంది. ఈశ్వరుని పట్ల నిజమైన ప్రేమ ఉన్నవారు దేన్నైనా సహజంగానే త్యాగం చేస్తారు.ఈ ప్రపంచాన్ని వదిలి సన్యసించడం అనేది పిరికితనం లేక పలాయనవాదం. 

రాజయోగం మనకిచ్చే శిక్షణ ఏమంటే ఈ సమస్తమైన వస్తువైభవాలు, వ్యక్తులు మన మధ్య ఉన్నప్పటికీ మన దృష్టి వాటిని ఆకర్షించరాదు. వేటిపైనా లోభమోహాలు ఉత్పన్నంకానపుడే సాత్విక త్యాగం చేయగలం. తనను తాను సుఖంగా ఉంచుకోవడానికి ఎందరినో బాధ పెట్టడం నిజమైన సుఖం కాదు. ఇతరుల సుఖంలోనే మన సుఖముందని గ్రహించి మనం ఇతరులకు సుఖాన్ని ఇవ్వగలిగితే మనం వారి ఆశీస్సులను పొందగలం. 

మనమిపుడు మానసిక  విషయవికారాలు మొదలైన అపవిత్రతను త్యజించాలనే దృఢ సంకల్పం చేసి ప్రతిజ్ఞ చేద్దాం. ఈ త్యాగం ఆధారంగా మనకు ఉజ్జ్వలమైన భాగ్యం తయారవుతుంది.

....



బామ్మగారూ!జనాభా లెక్కల సేకరణ కు వచ్చిన  అధికారిని,
దయచేసి ఇంట్లో వాళ్ళని పిలవండి!
";;;;;;;;;;;;;;;;;"
 ఏవండీ, ఇంట్లో ఎవరూ లేరా? 
ఏరా  భడవా?
నేనెవర్నీ?
పని మనిషినను కున్నావా? లేక ఇంకేమనుకుంటున్నావో చెప్పు త్రాష్టుడా? 
అయ్యో  బామ్మగారూ, నన్ను క్షమించండి,  ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు? 
డజన్ డజనా? ఓహ్, పన్నెండు మందా. సరే, పెద్దాయన ఏంజేస్తుంటారు? 
జైలు కెళ్ళాడు జైలు కెళ్ళారా? 
ఏం నేరం చేసారు? 
ఎన్నేళ్ళు శిక్ష పడింది?
కఠిన శిక్షా లేక సాధారణ శిక్షా?
నీ మెుహం మండా, వాడు జైలరు, న్యాయాధికారి  
ఓహ్ ! అలానా, ఆయనకు ఎంతమంది పిల్లలు?
ఓక పోతు, రెండు పెంటి పోతు,పెంటి ఏంటండీ?
వెధవా! 
అదికూడా తెలవకుండా ఎలా ఆఫీసర్వయ్యావు? ఆఫ్రాచ్రుడా! 
ఓ మగ, ఇద్దరు ఆడబామ్మగారూ!
 మీరు మరీ అమర్యాదగా  మట్లాడుతున్నారు, ఇప్పుడు చెప్పండి, వారి అబ్బాయి ఏం జేస్తుంటాడు? 
 కొంపలార్పుతుంటాడు 
ఛ ఛ  
అదేం పనండీ? మీరైనా చెప్పలేక పోయారా? 
నువ్వు పరీక్ష పేసయ్యేవా?
దొడ్డిదారిన అధికారివయ్యావా బడుద్దాయ్?
వాడు  ఫైర్ డిపార్ట్ మెంట్ రా అరకాణీ వెధవా ! 
బామ్మ గారూ!
మీరు సరిగ్గా చెప్పండి, ఇలా డొంకతిరుగుడు నాకర్థం కాదండీ, మీరు మరీ తిట్టేస్తున్నారు, 
ఈ మాత్రం తెలియని వాడివి నువ్వేం ఆఫీసరువురా? పింజారీ వెధవ బామ్మ గారూ!
ఇక చాలు, మరి ఆడపిల్లలు ఏం చేస్తారో సూటిగా చెప్పండి, దయచేసి.. 
ఒకత్తేమో  ఊడబెరుకు తుంటుంది, ఇంకోకత్తేమో తైతక్కలాడుతుంది. 
బామ్మగారూ!ఊడబెరకడం, తైతక్కలాడడం ఏందండీ? 
ఒకతి పళ్ళ డాక్టర్, ఇంకోతి భరతనాట్యం మాస్టర్ రా నెలతక్కువ వెధవా! 
";;;;;;;;;;;;;;;;"
అయ్యో పాపం స్ప్రహ తప్పేట్టున్నావే, ఇలా కూర్చుని తగలడు, ఇంత చద్దన్నం, రవ్వంత ఆవకాయ పెడతాను తిని చావు 
*****
    
"పిలుపు విని బాల్య మిత్రులను కలవాలని"  

విచ్చేశారు అందరూ బానపొట్టలు,  బట్టతలలతో, నెరసిన జుత్తుతో, పురుష పుంగవులు, వయసు చూపుతున్న వృద్ధులు నవ్వులమధ్య, సెలయేరు శబ్దముగా కూనిరాగాలు తరువుల కొమ్మల కదలికలుగా, ఆయాస పడుతూ పరిగెడుతున్న పిల్లవాడిలాగా కదలిక   !
బారెడుజడలూ, మూరెడుకాగా, సోడాబుడ్డి, కళ్ళద్దాలతో మహిళా మణులు !!

వాడు వీడేనా ?, వీడు  వాడేనా?, ఆమె ఈమేనా ?, ఈమె ఆమేనా ?, గుర్తింపుల గుబాళింపు !
పలకరింపులూ, నమస్కారాలూ, కరచాలనాలు, కౌగిలింతలూ, పరామర్శలూ, వర్ణనలూ, మార్పు చూపుతున్న కాల రాజకీయ ముచ్చట్లు, పిల్లలుపెడుతున్న అగచాట్లు, చాటుమాటున కన్నీరు దిగమింగిన చివాట్లు, నిత్యము జరుగుతున్న సిగపట్లు, మరచిపోలేని ఉడుం పట్లు,        
సాగుతున్నాయి ముచ్చట్లు 

తాతలుగా మారిన, అలనాటి అబ్బాయిలు, అమ్మమ్మలూ నానమ్మలుగా మారిన ఆరోజుల అమ్మాయిలు,  కొత్త కొత్త వేషాలతో, మెడ నిండా పుత్తడి తళుకుబెళుకులతో, హావభావవిన్యాసములతో పదహారేళ్ళ పడచుపిల్లలా గంతులు ఆ సమయాన     

మరోవైపు కాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు, చెంగు చెంగున అలనాటి గెంతులస్ధానంలో
జాగ్రత్తగా అడుగులు వేస్తూ చేరారంతా ఒకచోటికి

అలనాటి  అల్లర్లు, కొట్లాటలు, ఆటలు, పాటలు, సరదా సన్నివేశాలు, పదవతరగతి చదివిన పాట మాజేటి గురవయ్య పాఠశాల, గుంటూరు, కలయ తిరుగుతూ, నాటి జ్ఞాపకాలు కలబోసుకుంటూ ఆనాటి గురువులను, అధ్యాపకులను, ఉపాధ్యాయినులను, కలసి ఆనాటి   విద్యార్థులందరూ నేటి వృద్దులై వివిధ ఉద్యోగ వ్యాపార నిష్నాతులుగా ఏకమయ్యారు            

తమకలల రాణి కోసం, గుంపులో వెతుకులాడుతూ, దొంగ చూపులు చూస్తూ, గుర్తించలేని మార్పు, కోల్పోయిన వ్యధ, ఎన్నెన్నో జ్ఞాపకాలలో, మరెన్నో మార్పుల వాస్తవాలు. 

బ్రతుకు పండించుకున్న వారు కొందరైతే, పోగొట్టుకున్న వారు మరికొందరు, అందరి మోములోనూ, చెరగని చిరునవ్వు , నాటిమేటి విద్యార్ధి, ఏదో సాధిస్తాడనుకున్నవాడు
బడుగు జీవిలా, సంసార సాగరాన్ని, ఈదుతూ అలసిపోగా, ఎందుకూపనికిరాడనుకున్నవాడు
గొప్పవాడై కనుల ముందు, అరేయ్ ఒరేయ్ మావ బావ నాటి పిలుపుల ఆప్యాయతల స్థానాల్లో
సార్, గారు మర్యాదల మార్పులు !!!

కాలగర్భంలో జారిపోయి, కరిగిపోయిన కొందరు, నేస్తాల కన్నీటి జ్ఞాపకాలు, 

ఏదైతేనేం సుఖదుఃఖాల కలబోత, జ్ఞాపకాల దొంతరల వెదుకులాట, చేరుకున్నావా ? జాగ్రత్త !
చరవాణి హెచ్చరికల మోత ! తెలియకుండానే కరిగి పోయిన కాలం !

బాధాతప్త హృదయాలతో, అడ్డుపడే కన్నీటిపొరల, మసకచూపుల తడిలో, వీడ్కోలు తీసుకునే సమయం !
మరలా కలిసే మరోరోజుకు అందరూ కలవాలనే ఆశతో  !

కాలగమనంలో ఎందరో  చదువులు ముగించి, వెళ్ళేవారికి వీడ్కోలు, వచ్చేవారికి స్వాగతాలు పలుకుతూ , ఏమార్పూలేని పాఠశాల , చిద్విలాసంగా నవ్వుకుంటూ, వెళ్ళి రండని  ఆప్యాయంగాఆశీర్వదిస్తూ, మరోకలయిక కోసం ఎదురు చూస్తూ  !!!

 



సన్యాసి ఉపన్యాసం విపులీకరించే టప్పుడు తన ఉదేశ్యము తెలియ పరచాలని, రామారావు దగ్గరకు వచ్చాడు. నేటి పిల్లల ప్రేమ గురించి తెలపగలరు. అనగా అనాదిగా వస్తున్నా సంప్రదాయాలు మారుతున్నాయి అని చెప్పారు 

*సన్యాసి, ముఖ్యంగా నేను చెప్పేది స్త్రీలు పురుషులు (యువతీయువకులు) చదువులంటూ వయసొచ్చిన తర్వాత కూడా ఆ సుఖాన్ని పొందక, కామాన్ని అదుపులో పెట్టుకొని జీవించటం మొదల పెట్టడము, ఉద్యోగాలు సంపాదన, పెరగటం, తల్లితండ్రుల ప్రోత్సాహం,  బిడ్డలు పెళ్లి వద్దన్నా ఊరుకోవడం, సంపాదన వున్నా సరిపోదని, ఆడవారుకూడా పనులు చేయడం, ఎన్నో ఆశలను పెట్టుకొని పిలల్లను పెంచడం మనం అందరం చూస్తున్నాము.  

                 

ప్రస్తుతసమాజం లో ఆధునిక పరికరాలు వచ్చాయి, క్షణంలో లోకంలో వింతలూ విడ్డురాలు తెలుసుకుంటున్నారు, ఎంత తెలుసుకున్న ప్రేమ అనేది యువ తీ యువకుల్లో పుడుతుంది.  వాసుల్లో జరిగే ముచ్చట ఆవసువు జరగాలి అప్పుడే అందరికి ఆరోగ్యం. అందుకే సంభాషణలు. 


అందాన్ని చూశాక ఆనందాన్ని పొందాలని ఆశ, అధరాన్ని పొందాలని ప్రేమరుచి చూడాలని, చూపుల వలను విసిరాలని,  మగువ అనే గులాబీని పొందాలని, పూలను వర్ణిస్తూ మనసు లక్షణాలను తెల్పి, ఇచ్చా ప్రేమనుకోరా,  మనసు విప్పా హృదయ ముచ్చట పరచా, చెంతకు పిలిచా చెలిమిని కోరా, ఆమెను మెచ్చా ఆమెకు నచ్చా, విషయాన్ని విశదీకరించా, ఒంటరిగా పిలిచా తుంటరిగా మాట్లాడా, అనుభవాలను, ఆశయాలను, తెలియపరిచా, నవ్వులు పంచా ముగ్గులోకి దించా, మనసు, మనసు కలిపా, మమతాను రాగాలను పంచా, మతి పోగొట్టా మత్తులో పడవేశా, హృదయ శబ్దాన్ని అర్ధం పరమార్ధ మనితెలిపా, సమయస్ఫూర్తి గా సహాయాన్ని అందించి,  ఆరోగ్యం పెంచేటి పోషకాహారం అందించి, నిద్ర సుఖాన్ని కల్పించి, సమస్యలు లేని కాపురంగా సాగుతున్నది.  

   

ఈడు కుదిరింది జోడు కొచ్చింది, తోడుగా నిలిచింది నీడగా మారింది, కల నిజమయ్యింది కోరిక

నెరవేరింది, చేరువయ్యింది స్వర్గం చూపించింది, సుఖము ఇచ్చింది శాంతి కూర్చింది, బంధం పడింది బంధీ అయ్యింది, కాలనిర్ణయాలను తెల్పింది, స్వప్న్మం సార్ధకమయ్యింది

సమస్య పరిష్కారమయ్యింది, ఆనందాల సంద్రమయింది, కాపురం కలిసొచ్చింది కుటుంబం

వృద్ధిచెందింది, బ్రతుకు బంగారమయ్యింది జీవితం సుఖమయమయ్యింది


దివ్యప్రేమానుభవం - మానవ ప్రేమ వలె దివ్య ప్రేమ ఒక భావావేశం కాదు. భావావేశాలకు అతీతులమై అంతర హృదయం ద్వారా పరమాత్మతో ఏకత్వం భజించి నప్పుడు అనుభవానికి వస్తుంది దివ్యప్రేమ. ఇంద్రియ సంబంధమైన భావావేశపు పరుగులు దాని నెంత మాత్రమూ అందుకొనజాలవు.  అలా ప్రేమ గురించి సన్నాసి గారు తెలియపరిచారు, రామారావు మైక్ వద్దకు వచ్చి ఈరోజు మనకు మంచి విషయాలు తెలియపరిచారు మరలా అందరు కలుద్దాం సెలవు అనుటు ముగించాడు.      


నాయకుడనేవాడు గతాన్ని వదిలివేసి, క్షణ క్షణ మార్పులను గమనించి, ఎవరి లక్షణాలు ఎలాంటి ఓ తెలిసికొని, కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపకుండా, మనసులో ఉన్న విషయం బయటకు చెప్పి, ఈగో వదిలేసి, బాద్యత సక్రమంగా నిర్వర్తించి, తప్పును కూడ శాoతoగ చెప్పి, పరిష్కారంకూడా తెలియపఱచి, ఎవరైనా బాధలో ఉంటే ఓదార్పు చూపి, బరోస ఇచ్చి, అన్నీ సందర్భాలనీ స్వీకరించి, ఎంత కఠిన నిర్ణయం ఆయన  తీసుకునే దైర్యం చూపి, జనులకు మార్గ దర్శకుడు గా మారి,  ఎల్లప్పుడూ నవ్వుతూ పలకరింపు ఉంచి, సమస్యలపై ఆందోళన తెలపక, పరిశీలనచేసి, తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉండి, తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలిపేటట్లు, సహాయ సహకారం అందింస్తు, తను ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ, సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ ఎంతోకొంత ఇస్తూనే ఉండి, అనుచరుల ఎదుగుదలను కోరుకునే. వాడైఉండి, కానీ వారి ఎదుగుదలను అడ్డుకో కుండా, తన స్వార్థం కోసం కాకుండా అనుచరుల కోసం అందరికోసం  పనిచేసి, ఇలా ఎన్నో ఉండాల్సిన లక్షణా లున్న నాయకుడి ఎన్నుకోవాలి -

బ్రహ్మవేదముతోను బ్రహ్మాండమున  వెల్గు  ..  బోధకు నిలయమై పడచు వెల్గు    

పరమాత్మ నాలంబ నతొ జొచ్చు నిజవెల్గు ..  నఖిలజగంబుల నిండు వెల్గు

ఆది మధ్యాంతర  ప్రేమ వెల్గు  .. నాదాంత సీమల నడచు వెల్గు

చూడు జూడగ మహా శోభితంబగు వెల్గు .. సాదు జనానంద సంఘములో వెల్గు ..

  

మేరు శిఖరంబు నిండిన మేలు  వెల్గు ..     ప్రేమ మోహము వేషము పెంచు వెల్గు

మేను పులక రించేదియు మనసు  వెల్గు ..      ప్రాంజ లిప్రభ నాయక   ప్రేమ వెల్గు 

                      

వేదాంత సూక్తులు విని కొన్ని తెల్పినంత .. వేదాంతి రాజుగా యోగి కాడు  

కుండకళ్ళునుత్రాగి  తెలియక వాగినంత .. పూర్వపు శాస్త్రవేక్తగను  కాడు 

మనిషిగా ఉన్నంత మాత్రాన ఎప్పటికి ..   అసలు గుణాన్నియే   మార్చలేడు 

స్త్రీల  వెంట తిరిగి  స్థిరమైన నాయక  ..       సీఘ్రము నిజమైన వాడు  కాడు


ఎంత చదివిన గుణహీను డెంచ లేడు ..   సింహము జయించె నంతనే సిరులు తేడు  

నమ్మ పల్కులతో వాడు నటనకాడు ..    ప్రాంజలిప్రభ నాయక   ప్రేమ వెల్గు 

***                      

40 దాటిన తరువాత ఏ పని మీద మనసు లగ్నం కాదు. గడప దాటి బయటకు వెళ్లడానికే మనస్కరించదు.28 - 30 లో అయితే చాలా బాగుండేది. ఎక్కడికైనా ఏ సమయంలోనైనా వెళ్లినా అలసటే అనిపించేది కాదు.మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేది. 20-25 లో అయితే వసంతంలా ఉండేది. జీవితపు ఆనందం వేరేలా ఉండేది. మజా మస్తీ తిరగడం. గాభరా అస్సలు ఉండదు. 42-45 దాటితే ఏమవుతుందో నన్న ఆందోళన. ఆలోచిస్తూ ఉంటేనే భయంగా ఉంటుంది.

*

నేను చెప్పేది వయస్సు గురించి కాదు.

ఉష్ణోగ్రత (Temparature) గురించి చెబుతున్నా.  వేసవి వచ్చింది కదా! మరి.😂😀👍🏻

   ***   


సంగీతం ఆపాత మధురం, సద్భావం సమ్మోహ అధరం 

సాహిత్యం ఆలోచనామృతం, సామీప్యం సందేహనివృతం 


రెక్కలు విచ్చుకుంటేనే, విహంగాలు ఎగురగలవు

కోర్కలు మానుకంటెనే, కుటుంబాలు మనగలవు 


మబ్బులు ముసురుకుంటేనే, వానజల్లులు కురువగలవు

ఒప్పులు సరిలేకుంటేనే, గిల్లికజ్జాలు పెరగగలవు 


సూర్యుడు ఉదయించితేనే, తూరుపు తెల్లవారుతుంది

చంద్రుడు అస్తమించుతేనే, వెల్గుల కళ్ళు కదులుతుంది 

  

చంద్రుడు పొడిస్తేనే, వెన్నెల వ్యాపిస్తుంది

తారలు మేరిస్తేనే, థళుకు ఆవహిస్తుంది 

 

పూలు పూస్తేనే, తోటకు అందంవస్తుంది

కాయలుంటేనే, సిహత్తుకు అందం వస్తుంది 


పిల్లలు ఉంటేనే, ఇల్లు కళకళలాడుతుంది

స్త్రీలు ఉంటేనే, సుఖము నిత్యమై ఉంటుంది 


కాంతలకు కురులుంటేనే, కొప్పేదైనా అందాన్నిస్తుంది

శాంతి కొరకు మనసుంటేనే, బంధమే అందాన్నిస్తుంది  

 

ఆలోచన తడితేనే, భావము బయటకొస్తుంది

పోరాటం పుడితేనే, నామాంకం బయఁటకొస్తుంది 

 

ఆవేదన కలిగితేనే, అద్భుతరచన అవతరిస్తుంది

సహకారం కుదిరితేనే, సమయ రచన అద్భుతమౌతుంది 


మనసు ముచ్చటపడితేనే, మంచికవిత ముందుకొస్తుంది

వయసు తాపత్రయంతగ్గితేనే, మనసు కవిత ముందుకొస్తుంది 


చక్కనికైత చదివితేనే, చదువరులకు సంతోషంకలుగుతుంది

చుక్కల కాంతి మక్కువ ఐతేనే, చూపరులకు సంతోషం కల్గుతుంది 


డబ్బులు జేబులోయుంటేనే, కడుపులు నిండుతాయి

జబ్బులు లేకయుంటేనే, సుఖాలు నిండుతాయి 


విరులు విచ్చుకుంటేనే, సౌరభాలు వెదజల్లుతాయి

కురుల విచ్చుకుంటేనే, మల్లెపూలు గుబాలిస్తాయి 


కవితకు ప్రాసలేకపోతే, కూరలో ఉప్పులేనట్లుచప్పనే

హృదయానికి శబ్దం లేకపోతే, జీవం ఉన్నా జీవితమ్ లేనట్లునే

   

సరుకున్నకవి చక్కనికవితను, అనునిత్యము అందించగలడు

బ్రతికున్న కవి గుర్తింపు కవితను, నిత్య సత్యమును పంచగలడు 


దినదినం కవితలుచదవండి, ప్రతిదినం  పరవశించిపోండి

తెలుగును చదివి చదవమనండి, మాతృ భాషను గౌరవించండి 





       

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట

రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం

ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.   

*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*



*****


*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది!!!*

                         

విద్యా విధానం లో తాజా వార్తలు


కొత్త విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 36 ఏళ్ల తర్వాత కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తోంది.

 కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కొత్త విధానం ప్రకారం-

 కొత్త విద్యా విధానం 2023కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త విద్యా విధానంలోని అతి ముఖ్యమైన ప్రతిపాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:


ఐదు సంవత్సరాల ప్రాథమిక


 1. నర్సరీ @ 4 సంవత్సరాలు

 2. Jr KG @ 5 సంవత్సరాలు

 3. Sr KG @ 6 సంవత్సరాలు

 4. స్టడీ 1వ @ 7 సంవత్సరాలు

 5. Std 2nd @ 8 సంవత్సరాలు


మూడు సంవత్సరాల ప్రిపరేటరీ


 6. 3వ తరగతి @ 9 సంవత్సరాలు

 7. 4వ తరగతి @10 సంవత్సరాలు

 8. 5వ తరగతి @11 సంవత్సరాలు


మూడు సంవత్సరాలు మిడిల్


 9. 6వ తరగతి @ 12 సంవత్సరాలు

 10. 7వ తరగతి @ 13 సంవత్సరాలు

 11. 8వ తరగతి @ 14 సంవత్సరాలు


 నాలుగేళ్ల సెకండరీ


 12. 9వ తరగతి @ 15 సంవత్సరాలు

 13.Std SSC @ 16 సంవత్సరాలు

14.Std FYJC @17ఇయర్స్

15.Std SYJC @18ఇయర్స్


 ప్రత్యేక లక్షణాలు:

 #బోర్డు పరీక్ష 12వ తరగతిలో మాత్రమే జరుగుతుంది


ఎంఫిల్ డిగ్రీ రద్దు చేయబడుతుంది 4 సంవత్సరాలు

 ■ 10వ బోర్డు పరీక్షలు లేవు

 ◆ 5వ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాష, స్థానిక భాష మరియు జాతీయ భాషలలో మాత్రమే బోధించబడుతుంది. మిగిలిన సబ్జెక్టు ఇంగ్లిష్ అయినా సబ్జెక్టుగా బోధిస్తారు.

● ఇంతకుముందు 10వ బోర్డ్ పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి, అది ఇప్పుడు రద్దు చేయబడుతుంది.

★ 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సెమిస్టర్ వారీగా పరీక్ష జరుగుతుంది. పాఠశాల విద్య 5+3+3+4 ఫార్ములా కింద బోధించబడుతుంది.

కళాశాల డిగ్రీ 3 మరియు 4 సంవత్సరాలు ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో సర్టిఫికేట్, రెండవ సంవత్సరంలో డిప్లొమా, మూడవ సంవత్సరంలో డిగ్రీ.

◆ ఉన్నత విద్యను అభ్యసించకూడదనుకునే విద్యార్థులకు 3 సంవత్సరాల డిగ్రీ. మరోవైపు, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు 4 సంవత్సరాల డిగ్రీ కోర్సును అభ్యసించవలసి ఉంటుంది. 4 సంవత్సరాల డిగ్రీ చదివిన విద్యార్థులు ఒక సంవత్సరంలో MA చేయగలుగుతారు.

●MA విద్యార్థులు ఇప్పుడు నేరుగా PhD చేయగలుగుతారు.

★విద్యార్థులు మధ్యలో ఇతర కోర్సులు చేయగలుగుతారు. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2035 నాటికి 50 శాతం ఉంటుంది. మరోవైపు, కొత్త విద్యా విధానం ప్రకారం, ఒక విద్యార్థి ఒక కోర్సు మధ్యలో మరో కోర్సు చేయాలనుకుంటే, అతను ఒక కోర్సు తీసుకున్న తర్వాత రెండో కోర్సు చేయవచ్చు. పరిమిత సమయం వరకు మొదటి కోర్సు నుండి విరామం.

ఉన్నత విద్యలో అనేక ఇతర సంస్కరణలు కూడా ప్రతిపాదించబడ్డాయి. సంస్కరణల్లో గ్రేడెడ్ అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్షియల్ అటానమీ మొదలైనవి ఉన్నాయి. ఇది కాకుండా, ప్రాంతీయ భాషలలో ఇ-కోర్సులు ప్రారంభించబడతాయి. వర్చువల్ ల్యాబ్‌లను అభివృద్ధి చేస్తారు. నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ ఫోరమ్ (NETF) ప్రారంభించబడుతుంది. దేశంలో ఇప్పటి వరకు 45 వేల కాలేజీలు ఉన్నాయి.

● అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ సంస్థలకు ఏకరూప నియమాలు ఉంటాయి.



 ధర్మేంద్ర ప్రధాన్

 విద్యా మంత్రి,

 భారత ప్రభుత్వం



"పిలుపు విని బాల్య మిత్రులను కలవాలని"  

విచ్చేశారు అందరూ బానపొట్టలు,  బట్టతలలతో, నెరసిన జుత్తుతో, పురుష పుంగవులు, వయసు చూపుతున్న వృద్ధులు నవ్వులమధ్య, సెలయేరు శబ్దముగా కూనిరాగాలు తరువుల కొమ్మల కదలికలుగా, ఆయాస పడుతూ పరిగెడుతున్న పిల్లవాడిలాగా కదలిక   !

బారెడుజడలూ, మూరెడుకాగా, సోడాబుడ్డి, కళ్ళద్దాలతో మహిళా మణులు !!

వాడు వీడేనా ?, వీడు  వాడేనా?, ఆమె ఈమేనా ?, ఈమె ఆమేనా ?, గుర్తింపుల గుబాళింపు !

పలకరింపులూ, నమస్కారాలూ, కరచాలనాలు, కౌగిలింతలూ, పరామర్శలూ, వర్ణనలూ, మార్పు చూపుతున్న కాల రాజకీయ ముచ్చట్లు, పిల్లలుపెడుతున్న అగచాట్లు, చాటుమాటున కన్నీరు దిగమింగిన చివాట్లు, నిత్యము జరుగుతున్న సిగపట్లు, మరచిపోలేని ఉడుం పట్లు,        

సాగుతున్నాయి ముచ్చట్లు 

తాతలుగా మారిన, అలనాటి అబ్బాయిలు, అమ్మమ్మలూ నానమ్మలుగా మారిన ఆరోజుల అమ్మాయిలు,  కొత్త కొత్త వేషాలతో, మెడ నిండా పుత్తడి తళుకుబెళుకులతో, హావభావవిన్యాసములతో పదహారేళ్ళ పడచుపిల్లలా గంతులు ఆ సమయాన     

మరోవైపు కాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు, చెంగు చెంగున అలనాటి గెంతులస్ధానంలో

జాగ్రత్తగా అడుగులు వేస్తూ చేరారంతా ఒకచోటికి

అలనాటి  అల్లర్లు, కొట్లాటలు, ఆటలు, పాటలు, సరదా సన్నివేశాలు, పదవతరగతి చదివిన పాట మాజేటి గురవయ్య పాఠశాల, గుంటూరు, కలయ తిరుగుతూ, నాటి జ్ఞాపకాలు కలబోసుకుంటూ ఆనాటి గురువులను, అధ్యాపకులను, ఉపాధ్యాయినులను, కలసి ఆనాటి   విద్యార్థులందరూ నేటి వృద్దులై వివిధ ఉద్యోగ వ్యాపార నిష్నాతులుగా ఏకమయ్యారు            

తమకలల రాణి కోసం, గుంపులో వెతుకులాడుతూ, దొంగ చూపులు చూస్తూ, గుర్తించలేని మార్పు, కోల్పోయిన వ్యధ, ఎన్నెన్నో జ్ఞాపకాలలో, మరెన్నో మార్పుల వాస్తవాలు. 

బ్రతుకు పండించుకున్న వారు కొందరైతే, పోగొట్టుకున్న వారు మరికొందరు, అందరి మోములోనూ, చెరగని చిరునవ్వు , నాటిమేటి విద్యార్ధి, ఏదో సాధిస్తాడనుకున్నవాడు

బడుగు జీవిలా, సంసార సాగరాన్ని, ఈదుతూ అలసిపోగా, ఎందుకూపనికిరాడనుకున్నవాడు

గొప్పవాడై కనుల ముందు, అరేయ్ ఒరేయ్ మావ బావ నాటి పిలుపుల ఆప్యాయతల స్థానాల్లో

సార్, గారు మర్యాదల మార్పులు !!!

కాలగర్భంలో జారిపోయి, కరిగిపోయిన కొందరు, నేస్తాల కన్నీటి జ్ఞాపకాలు, 

ఏదైతేనేం సుఖదుఃఖాల కలబోత, జ్ఞాపకాల దొంతరల వెదుకులాట, చేరుకున్నావా ? జాగ్రత్త !

చరవాణి హెచ్చరికల మోత ! తెలియకుండానే కరిగి పోయిన కాలం !

బాధాతప్త హృదయాలతో, అడ్డుపడే కన్నీటిపొరల, మసకచూపుల తడిలో, వీడ్కోలు తీసుకునే సమయం !

మరలా కలిసే మరోరోజుకు అందరూ కలవాలనే ఆశతో  !

కాలగమనంలో ఎందరో  చదువులు ముగించి, వెళ్ళేవారికి వీడ్కోలు, వచ్చేవారికి స్వాగతాలు పలుకుతూ , ఏమార్పూలేని పాఠశాల , చిద్విలాసంగా నవ్వుకుంటూ, వెళ్ళి రండని  ఆప్యాయంగాఆశీర్వదిస్తూ, మరోకలయిక కోసం ఎదురు చూస్తూ  !!!

            🙏🙏🙏                                       


ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ