27, మార్చి 2021, శనివారం

 



నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (2)


" శ్రీ మతి గారు ఏమిటి" ఈరోజు ప్రత్యేకత ముందు ఆ "గారు" లు తీయండి ఎంచక్కా పేరుపెట్టి పిలవండి అది కాదే

ఏదీ కాదన కండీ మీరను కుంటే అన్నీ అవుతాయి

సరే ఈరోజు అల్పాహారం ఏమిటీ "అట్టు అండి"

పెసరట్టా, మినపట్టా మీకు ఏది కావాలో చెప్పండి 

నీ మాటలతో నాకు కవిత్వం పుట్టు కొస్తుంది

ఏది చు "ట్టూ "అంత్యప్రాసతో చెప్పండి 

అసలు నిన్ను అర్ధం చేసు కోవటం నావల్ల కాదు అందుకే మధురిమలు చెపుతా విను అంటూ మొదలు పెట్టాడు శ్రీపతి 


వేడి ఉప్మా తింటే  - అల్లము తగిలినట్టూ

పెసరట్టూ తింటే   - ఉల్లియె ఇరుకున్నట్టూ 

మిర్చిబజ్జీ తింటే  - నాలిక సుర్రన్నట్టూ

మైసూర్ బజ్జి తింటే -  మైసూర్ చూసినట్టూ 


మరవరాలను తింటే - నాలిక చుట్టి నట్టూ    

మామిడి బద్ద తింటే  - పళ్లే గుంజి నట్టూ 

బఠాణీలను  తింటే  - పళ్లే  అది నట్టూ

ఇక బబుల్గమ్  తింటే - నాలిక చుట్టి నట్టూ   


పెరుగన్నమే తింటే  - ఉల్లి కొరుక్కున్నట్టూ

సెనగలు నములుతుంటే - గుప్పెడు బొక్కినట్టూ

ఎండలు పెరిగి ఉంటే - మజ్జిగ తాగి నట్టూ   

దిబ్బ రొట్టె తింటే -  మత్తు ఎక్కి నట్టూ  


అబ్బో బాగాచెప్పారండి  

అట్టు అట్టూ అనుచు అధిరేట్టు అరుపు  

పెట్టు పెట్టూ అనుచు బెదిరేట్టు అరుపు 

తట్టు తట్టూ అనుచు కాలి నట్టు అరుపు 

అట్టు పెట్టాను తనిపెట్టు అనుచు అరుపు 


అరుపుకు కళ్ళు తెరిచాడు శ్రీవారు ఎందుకే అంత పెద్దగా అరువు, కాస్త నెమ్మదిగా చెప్పవచ్చుగా  

అసలు మీకా చెవుడు నాకా అర్ధం కావటమే లేదు, ఇద్దరం డాక్టర్ వద్దకుపోదాము ముందు అట్టు తినండి ఇంకో అట్టు వేస్తా, నువ్వుకూడా తెచ్చుకో ఇద్దరం కలసి తిందాం, నీమాటకాదనను తొందరగా తెచ్చుకో        

అలా సాగినాయి సంభాషణలు ఇరువురి మధ్య  

అబ్బా మంట మంట పచ్చిమిరపకాయ తిన్నా అన్నిటికీ తొందరే ఇదిగో త్రాగండి అంటుగ్లాసు అందించింది. మంటా ముందు అక్కడ పెట్టు పంచదార తీసుకురా

ఏమిటండి అంత పెద్దగా అరిచావు 

మంచినీళ్ళనుకొని కాఫీ త్రాగా నాలిక కాలింది 

మీకు అన్నివిషయాలలో ఆత్రుత ఎక్కువే, ఆ ఆత్రుత అంతమంచిదికాదు అన్నది శ్రీమతి 

నాలిక కరుచుకున్నారు  శ్రీవారు .   

__(())_-

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (3)


చూడండి మనుష్యులందరూ జన్యపరంగా సమానము కానీ బుద్ధి, గుణము, నడవడి వారి తల్లితండ్రుల నుండి చేరుతుంది. మీరు మీనాన్నగారులాగా ఉంటారు అంటే నీవు మీ అమ్మ లాగా ఉంటావా అన్నాడు శ్రీవారు. 

ఏం కుండకూడదా,  మీరైనా నేనైనా బొడ్డు కోత కోసి భూమి మీదకు చేర్చారు, ఆ తర్వాత ఏడుపుతో ప్రారంభించి ఏడుపుతో ముగిస్తుందికదా " పుట్టేడప్పుడు గిట్టేటప్పుడు" నీకు గాని నాకు గని ఏమి తెలియదు నడిమధ్య ఉండేది నాది అనేది ఉంటుంది అది మీకు వేరే చెప్పాలా నేను.  నాది అనేది పోయి మనది అనుకుంటే కొంత తృప్తి. 

అది తెలుసనుకో మనుష్యుల మర్మం అర్ధం కావటం లేదే, ఎందుకో, కాదు అర్దహ్మ్ సెహెసుకోవటానికి ప్రయత్నించితే అంతా తెలుస్తుంది తెలియంది లేదు, తెలుసు కోవలసింది ఉండదు, ఆ పరమాత్ముడు నడిపినట్లు నడుచుకోవటమే. 

మరి         

మరి "శాస్త్రం ఏమి చెప్పిందో అది తప్పక చేయాలి". ఒక జ్ఞాని చెప్పిందానికి, మీ బుద్ధికి తోచిందానికి మధ్య ఎంపిక చేసుకోవలసి వస్తే, మీరు జ్ఞాని చెప్పిందాన్నీ ఎన్నుకోవాలి. చీకటి లో వెళ్లడం కన్నా, అప్పు తెచ్చుకున్న వెలుగులో వెళ్లడం మేలు. ఏ రోజు మీరు మేలు కుంటారో, ఆరోజు మీరు దాన్ని వదలి వేయవచ్చు. కానీ అలా ఎవరూ వదల లేదు. చేయడం అనేది ఒక కర్తవ్యం గా భావించి, శాస్త్రవిధులను అనుసరించి చేయవలసిన కర్మలుగా వేటిని పేర్కొన్నారో, వాటి మీద ఆసక్తిని, ఫలకాంక్షని వదలి, ఆ కర్మలు చేసుకుంటూ పోవాలి.

శాస్త్రం దగ్గరకు మీరు ఒక చిన్నపిల్ల వానిలా, ఒక అజ్ఞానిలా వెళ్లారు అంటే, శాస్త్రం మిమ్మల్ని మేలు కొలపగలదు. కానీ మీరు శాస్త్రముల దగ్గరకు, జీవించివున్న గురువుల దగ్గరకు ఒక జ్ఞానిగా వెడుతూ వుంటారు. అప్పుడు మిమ్మల్ని మేలు కొలపడం ఎవరికీ సాధ్యం కాదు.

మీరు మొదటి అడుగు వేసినప్పుడు మీకు గురువు కలుస్తాడు. చివరి అడుగులో పరమాత్మ కలుస్తాడు. అంటే గురువు మీతో నిరంతరం ఉంటాడు. అందుకే నీవు గురువు ద్వారానే పరమాత్మ చేరుకోవలసి ఉంటుంది.

ఏమిటో పొద్దున్నే నీ బోధ అర్ధ మయినట్టు ఉంటుంది అర్ధం కానట్టు ఉంటుంది 

మా గురువుగారు వ్రాసిన పద్యం పద్య గుర్తుకొస్తున్నది 

"మణిభూషణశ్రీః ( ర న భ భ ర..15/10 )..

----

రామచంద్ర శరణంమమ రమ్యత మాశ్రయే !

రామచంద్ర చరణౌ మమ రవ్వ ఫలాప్తిదౌ !

రామచంద్ర పరమాత్మని రంజిత సేవనం ,

రామ నం నమతమానస రామస పీఠినమ్ !!! 

అన్నారండి అంతా  రామనామము సఖ్యత చేర్చును మనము నిమిత్తమాత్రులం.   


మనస్సే లొకంలో సమానం సుఖాంతమ్ము

వినోదం విధానం వివాదం విశాలమ్ము

రుణమ్మే భయమ్మే సరాగం సహాయమ్ము 

గణాలే ప్రభావం‌ సకాలం ప్రధాణమ్ము  ....... అని తెలుసుకుంటే చాలు లోకం తీరు అర్ధం  అవుతుంది  

మనిషి అనేవాడు ఎలా మారుతాడు దానికి కారణం ఒక్కటే "జిహ్వతాపంతో ప్రేమకుచిక్కి గిలగిలా కొట్టు కుంటాడు . 

నేను కూడానా 

మీరేమన్నా తక్కువా అరవై దాటినా పౌరుషం, మైధునం ఎమన్నా తాగ్గాయా 

అది నిజమేననుకో 

అది తప్పా, ఏంటి తప్పు కానే కాదు అది ఉంటేనే మనిషిగా బతకగలుగుతారు లేదా 

లేదా ఇట్లా ఉంటాడు  

     

మనిషి అనురాగము పంచి - మతి లేకయు తిర్గు  వాడు  

విధి మాయ రోగము పంచి   - గతి లేకయు చిక్కు వాడు

 

కుల మంతయు గోల చేసి - కను మాయకు చిక్కు వాడు  

విధి బోధయు కొంత చేసి  - తనువంతయు పంచు వాడు

 

మది మాయ వేలము వేసి - మది తప్పియు పలుకే వాడు   

విధి లేక  గాలము వేసి  - కల కాలము రోగి వాడు 


చిరు దీపము వెలుగుచూసి - చిరు నవ్వుల మాయ లోడు 

శిఖ పట్టు తన్నులు చూసి  - గురు సేవయు చేయు వాడు 


సమ సేవలు తెల్పి చేసి - సమభావము పంచు వాడు 

సమ భోగము కలగ చేసి  - సమ యోచన తెల్పు వాడు 


అన్న దాన్ని తెలియ చేసి - ఆదు కొనుచుండెడి వాడు

తప్పులన్ని తెలియ చేసి - జీవితాన్ని నడుపు వాడు 

--(())--

మనుషుల్లో ఉండే కొన్ని రకాలు చెప్పావు  కాఫీ ఎలాచెయ్యాలో చెప్పవే అది మాత్రం చెప్పఁను నేను కలిపి తెస్తా హాయిగా త్రాగి సంతోష పడితేనే మీకు పౌరుషం పెరుగుతుంది 

అవునూ రాత్రి భజన జరుగుతుందిక దా ముసి ముసి నవ్వులమధ్య కాఫీ జుర్రుతున్నారు ఇద్దరు. 

--(())--


నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (4)


మనిషిలో ఆశలు మెండు అయినా అనుభవాలు చెప్పుకొని హాయిగా కాలక్షేప చేసికుంటూ రామకృష్ణ అనుకుంటూ 

ఏమిటే ఈరోజు నన్ను పిలుస్తున్నావు 

రామకృష్ణ అంటే మీరేనా "ఆదేవుడ్ని తలచానను కోవచ్చు కదా"

నన్ను పిలవకపోయినా ఆ దేవుడ్ని తలిచావ్ సంతోషం   

ఏమిటో చెప్ప బొయ్యారు 

మానాన్న గారు చెప్పిన చిన్ననాటి అనుభవాలు గుర్తుకొచ్చాయి 

నాకు చెప్పి కొంత బరువు తగ్గించుకోవచ్చుగా 

అవుననుకో 

ఇంకేమిటండి గుర్తునన్వి తెలపండి 

వేపచెట్టు కింద మడతమంచమెక్కి -  చెంబుడు నిమ్మకాయ మజ్జిగ తాగి పడుకునేవాడు. 

చద్దన్నంలో - ఆవకాయ కలిపి మీగడ పెరుగు వేసుకొని తినేవాడు. 

చిన్నుల్లిపాయలు, దోసకాయ, బెండకాయ, ములక్కాయ ముక్కలు పప్పుచారులో - వడియాలు అప్పడాలు నంచుకుని తినేవాడు.  

లేత కొబ్బరి కోసం కొబ్బరి బొండాం కొట్టించి దానిలో బెల్లముక్కపెట్టించుకొని - మరీ తినేవాడు.  


లేత లేత ముంజెలు వేలితో పొడుచుకుని రసాన్ని జుర్రుకొని ముక్కలు తిని పిల్లలకు పెట్టించేవాడు 

కమ్మగా ఉడికిన ముద్దపప్పు అన్నంకి ఆవకాయ, కందిపచ్చడి తో నేయి కలిపి తినేవాడు   

వేడివేడిగా చేసిన చపాతీ లలో కుతకుతలాడుతున్న చుక్కకూర పప్పు నంచుకుని తినేవాడు 

నూకలన్నంలో  వెన్న తీయని మజ్జిగ పోసుకుని ఉల్లిపాయ కొరుక్కొని తినేవాడు 


పులగం అన్నంలోకి ఘాటుగా పచ్చిపులుసు పోసుకొని ఊరి మిరపకాయలు కొరుక్కొని తినేవాడు 

పొడుగు వంకాయలు తెచ్చి బొగ్గుల పొయ్యి కాల్చి పొరలు తీసి గుజ్జులో ఉప్పు కల్పి తినేవాడు    

చెట్టు నుంచి తెంపుకొచ్చిన గుండు లేత వంకాయలు - మగ్గీ మగ్గగానే పళ్ళెంలోకి తెచ్చి పొడి పెట్టుకొని తినేవాడు 

సావిట్లో గేదెలతో పోటీపడి " తేగలు " తెచ్చి దానిలో ఉన్న చందమామ తీసి ఈనెలు తీసి తినేవాడు 


దోర పచ్చికొబ్బరి లోకి బెల్లం గెడ్డ జత చేసి తినేవాడు 

తిరుపతి లడ్డూ మొత్తం అచ్చంగా ప్రసాదంగా పెట్టి తినేవాడు 

పరపరలాడే పచ్చిమామిడికాయలో ఉప్పూ కారం దట్టించి కొరికి తినేవాడు 

పండిన వేపకాయ ఎవరూ చూడకుండా చీకిపారేసి వాడు 


ఓమ్మో ఇన్ని యున్న వంటకాల, ఇన్ని రుచులా, ఇందులో కొన్ని నాకసలు తెలియదు అందుకనే పూర్వ వారు 80 ఏళ్లకు కళ్ళలో శుక్లాలు తీసుకొనేవాళ్లట అస్సలు మందులు  వాడేవారు కాదుట ఏదన్న చిన్న రోగం వచ్చిన లంఖణం ఆయుర్వేద మందు వాడేవారట. 

 ఇప్పటి పరిస్థితి వేరు చిన్న పిల్లవాడికి లోకజ్ఞానం రావాలని సెల్లు ఇస్తున్నారు, తిండి పెడుతున్నారు  ఈ అలవాటు ఎప్పుడు మారుతుందో 

పిల్లలని ఏమి అనకు కోపం రావచ్చు పిల్లలకు మన సలహాలు నచ్చవు, మనతిండ్లు ఇష్టపడరు 

మీ నాన్న గారంటూ చక్కటి ఆహార పదార్ధాలు గురించి వివరించారు సంతోషం.

ఇంకా ఉన్నాయే, ఇప్పటికి ఈరోజుతో ఆపాను అంతే 

చిక్కటి కాఫీ తెస్తాను త్రాగి స్నానం చేసిరండి మీరు చెప్పిన వంటకం చేస్తాను 

ఏమిటి గుత్తోన్కాయ కూరచేస్తావా, ఆ చేస్తానండి మీకు ఏది ఇష్టమైతే అదేచేస్తాను అంటూ నవ్వుకుంటూ లోపలకు వెళ్ళింది శ్రీమతి.    

          --(())--

 నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (5)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏమిటండి ఈరోజు అలా ఉన్నారు, ఏమిలేదు ఏమి రాయలేదని అనిపించింది. ఈ వయసులో   

అవసరమా, డాక్టర్ గారుకూడా ఆలోచించ వద్దన్నారు కదా 

అది కాదే 

ఏది కాదు ఈ తెలుగు చదివేవారు తగ్గిపోతున్నారు, నీ వక్కడివేమి చేయగలవు అంతా నీ అహం తప్పా 

అవునే అవునూ 

తెలుగు బతికించాలని నాలో అహం పెరిగింది, ఆలోచనపెరిగింది దానితో వయసు పెరిగింది. 

అంట కోపముదేనికి 

చూడలేని వాటిని చూసినట్లు కల్పించి కవిత్వం వ్రాస్తారు, కధలు చెపుతారు ఎవరికోసం. 


నేను ఒకటే చెప్పగలను ముందుతరాలవారికి ఆన్లైన్ లో పనికొస్తుందని నా ఆలోచనా 

అవునండి ఈరోజు నాభావం చెపుతా విని వ్రాయండి 

కనిపించనివి అవి "గాలి, ప్రకృతి, ప్రేమ, మనసు" అవునా కాదా 

అవునే కనిపించేవి ఏమిటి మనిషిలో స్వార్ధం, అహంకారం, ఏడుపు, నవ్వు ఇంకా ఉన్నాయి 

అయితే నీవేమంటావు          

కాలల్ని బట్టి వయసును బట్టి వ్రాయండి నేను వద్దనుటలేదుగా       


ఆ చూపుల వెనుక  - భావం మేమిటో

మది పలికు తెలియక - ఆత్రం మేమిటో

నీహృదయం వెనుక - స్వప్నం యేమిటో 

పలకరింపు వెనుక - మొహం ఏమిటో 

నీ స్నేహం వెనుక - ప్రేమే ఏమిటో 

నీ దాహము వెనుక - తియ్యటి దేమిటో 

నీ పిలుపుల వెనుక - కోరిక ఏమిటో 

నీ అరుపులు వెనుక - ఆకలి ఏమిటో 

నీ తలపుల వెనుక - హద్దులు ఏమిటో 

నీ వేషము వెనుక - స్నేహము ఏమిటో 

మధుర వాక్కు వెనుక - మహిమలు ఏమిటో 

చిలక పలుకు వెనుక - ఉద్దేశ మేమిటో 

పెదవి విరుచు వెనుక - లౌక్యము ఏమిటో 

ప్రీతి వలపు వెనుక - ప్రేమ ఏమిటో  


చాలా చక్కగా చెప్పావు 

"మనసుకు కమ్మిన మాయ పొరలను ఎలా తొలగించాలో " తెలియక ఇలా ఉన్నాను 

అనుకుంటే మాయపొరలు లేదంటే ప్రేమ పొరలు అవి ప్రేమను మార్చలేవని  మీకూ తెలుసు.  

అయినా 

భగవంతునికి నమస్కరించుదాము  "తాము మంచిదనుకొను దానిని పొందుటకై" నమస్కరించు దాము .  కొందరు దేవుని సర్వఫల ప్రదాతగా నెరిగి నమస్కరించుచున్నారు.  (ఎవరి కోరికను బట్టి వారి ఫల స్వరూపముగా ప్రత్యక్షమగు దైవమునకు నమస్కరించుచు మోసాలు చేస్తున్నారు)  నిత్యమూ భగవంతుని కోరేవారు మన:శాంతి పొంది ఉండగలరని నా నమ్మకం.     

అయినా మనసు మధించే హక్కు ఎవరకూ లేదు, మనుగడకు ప్రేమధర్మాన్ని పాటిస్తూ క్రమశి క్షణతో నిత్య సత్యాలు తెలుపుతూ న్యాయాన్ని బతికిస్తూ దేశానికి రక్షణ కలిగిస్తూ జీవించేవారు 

మానవసేవచేసే నిజమైన మానవులు 

మరి మానవులం కాదా 

అనుకుంటే అందఱు చేసేవి, తప్పులే దేవుడొకడున్నాడు వాడ్ని నమ్మి బతుకుదాం 

ఈరోజు కాఫీ వొద్దులే ... వద్దులే అనుకోవటం దేనికి మీ అలవాట్లు మార్చుకోమనటంలేదు నేను 

కాఫీ తెస్తాను కాస్త పేపరు చదువుతూ ఉండండి 

తప్పుతుందా మీ మాటకు ఎదురుచెప్పటం కూడానా మాటలకు నవ్వుతు కదిలింది శ్రీమతి. 

--(())--

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (6)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మనుష్యులలో బుద్ధులు వేరుగా ఉన్నాయి, అవి కొందరిని బతికిస్తాయి, కొందరిని నాశనం చేస్తాయి కుటుంబమే నాశనమై పోతుంది.

అసలు బుద్ధి    

నిర్ణయ శక్తితో కూడిన బుద్ది  సాధకునిలో మార్పు తెచ్చుటకు తోడ్పడుతుంది. 

 ప్రకృతి యొక్క మార్పులు జ్ఞాన ప్రభావము వలన విజ్ఞానమయ కోశము, చిత్తము ఏర్పడుతుంటాయి. అవి పూర్తిగా శరీరము వాటి అంగములకు అనుగుణముగా రూపొందుతాయి. 

జ్ఞానమయ కోశము ఎఱుకతో కూడిన కలలు, ఇతర స్థితులు, అనుభవాలు, ఆనందాలు, దుఃఖాలు ఇవన్నీ అలానే దర్శనమవుతుంటాయి. 

బుద్ది ఎల్లప్పుడు శరీరమునకు చెందిన పనులు, విధులు అన్నియూ తనవి గానే పొరపాటు పడుతుంది. విజ్ఞానమయ కోశము అతి ప్రకాశవంతమై ఆత్మకు అతి చేరువుగా ఉండి తానే ఆత్మ అను భావముతో భ్రమలో ఉంటుంది. అందువలన అది అత్యంత మోసముతో కూడిన ఆత్మ భావన. 

అందుకే నేను చెపుతున్నా అంటూ శ్రీవారు తెలియపరిచారు 

 జీవమ్ ఒక్కటే -  జీవితమ్  వేరు

 రూపమ్ ఒక్కటే -  గుణం వేరు

 కాలం ఒక్కటే -  గమ్యం   వేరు

వనం ఒక్కటే - ఔషదాలు  వేరు..... .... ..


 ఆశ ఒక్కటే -  ఆశయం వేరు

 ఆకలి ఒక్కటే -  రుచులు వేరు

ఆరాటాలు ఒక్కటే - ఆదరనే లేని వేరు

 కలం ఒక్కటే -  కావ్యాలు వేరు   .... ... ...


కత్తి  ఒక్కటే - ఉపయోగం వేరు

ఖంఠం ఒక్కటే - గాత్రాలు వేరు

భాష ఒక్కటే - భావాలు వేరు

బంధం ఒక్కటే  - బాధ్యతలు వేరు ..... ..


తపస్సు ఒక్కటే - కోరిక వేరు

తేజస్సు ఒక్కటే - విస్తరణ వేరు

బలం ఒక్కటే - ఉపయోగం వేరు

మనస్సు ఒక్కటే - ఆలోచన వేరు .... ....


తరుణం ఒక్కటే -  తమకం వేరు

చరణం ఒక్కటే - చరిత్ర వేరు

ప్రయాణం ఒక్కటే - దూరాలు వేరు

ప్రాణం ఒక్కటే - మరణం వేరు  .... ....


నవ్వులు ఒక్కటే - ఫలితం వేరు

ఏడుపు ఒక్కటే  -- రోగాలు వేరు

తుమ్ములు ఒక్కటే -- కష్టాలు వేరు

తుమ్ములు ఒక్కటే -- ఫలితాలు వేరు

--((*))--

          నూతన చిత్తముతో బుద్ధి బలపడినచో స్వభావమందలి మలినములు నశించి, దైవీ స్వభావము లేర్పడును. గొంగళిపురుగు సీతాకోక చిలుక అయినట్లు మలిన స్వభావము దైవీ స్వభావమై వెలు గొందును.అప్పుడు మనస్సు శాంతి కలుగుతుంది. బుద్ధి మారకున్నచో , గొంగళి పురుగుగనే జీవించి నశించును. 

అందుకే జీవితం నిలకడ నిజ నిర్ణయాలపై చిత్తమే గమ్యము. సాధనయే మార్గము అవుతుంది 

 

--(())--

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (7)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏమిటండి కాస్త ఇంట్లోకి వచ్చి చీదొచ్చుకదా రోడ్డుమీద చీదితే ఏమనుకుంటారు 
చీదిన చోట కాస్త ఇసక చల్లండి. కాసేపున్నాక ఎండిపోతుంది. నిధ్ర్మం నీవు నిర్వహించు అసలే ఇది కరోనా కాలము. 
ఏమిటి వేపాకు తెచ్చావు 
వేపాకు, పసుపు, పచ్చకర్పూరం వేసి మరిగించి వచ్చిన రసాన్ని వడపోసి చెంచా తీసుకుంటే చాలు అన్ని రోగాలు పోతాయి.
యూట్యూబులో రోజుకొకటిచెబుతారు అవి అన్ని పాటిస్తే ఆరోగ్యం కాస్త అనారోగ్యమవుతుంది తెలుసా 
ఈరోజుకి ఇది చాలు        

పరిశుద్ధ జీవనము ఒక్కటియే మార్గమున పురోగతి నివ్వజాలదు.  పాత్రను పరిశుద్ధి చేయుట సద్వినియోగపరచుటకే కదా! కేవలము ప్రతిదినము తోమి, కడిగి, భద్రముగ వుంచిన పాత్ర వలన వినియోగము, ఆహార పదార్థములను వండుటకు పాత్రను వినియోగించినట్లే నీవు కూడ పరహితమను తెలిసిన విద్యను అందరికి పంచియు,  యజ్ఞము గా సమర్పణ చేయవలెను . 

పాత్ర అగ్ని తాకిడి భరించి, రుచికరమైన పదార్థములను తయారుచేసి పదిమందికి పోషణము కలిగించును. నీవును అట్లే జీవితపు ఆటుపోటులను భరించుచు, పదిమందికి వినియోగపడు పద్ధతిలో  విద్యను [పంచియు జీవించుట ముఖ్యము. కేవలము సదాచారమే సమస్తము అను భ్రమనందు జీవింపకుము. సదాచారమవసరమే. అది లేనివారు సత్కార్యములను నిర్వర్తించలేరు. అందరూ ఒక్కటే, భేదమును చూపక జీవించాలి  
మంచిని పంచి స్వార్థరహిత జీవితం గడిపే జీవాన్ని అని భావించు.   
III UUI UUI  
పరుగు తీసేటి కాలాన్ని   
వెలుగు పంచేటి ధర్మాన్ని 
తనువు మెచ్చేటి యోగాన్ని 
విషయ మేర్పర్చు వేదాన్ని 
తెలిసి పొందేటి జీవాన్ని 

సెగలు కమ్మాయి నా వెంట 
పొగలు చుట్టాయి నీ చుట్టు 
కధలు మారాయి నా బత్కు 
మడత కాజాను  ఆసించు
తెలిసి పొందేటి జీవాన్ని 

పనులు కల్పించి జీవిస్తు   
కళలు పంచేసి  బోధిస్తు   
క్రమము కల్పించి సేవిస్తు  
మనసు  చైతన్య పర్చేస్తు  
తెలిసి పొందేటి జీవాన్ని 

సొగసు చూపిస్తు ఏర్పాటు   
వయసు పొంగిస్తు తోడ్పాటు   
జిగురు కార్చేస్తు  దొంగాటు   
నిజము చెప్పేస్తు సాపాటు  
తెలిసి పొందేటి జీవాన్ని 

ఇది నిజం ప్రేమ మాధుర్య 
 కలసి సంతృప్తి పొందేది  
సహన ఓదార్య మే సాము  
స్య కళ ఉద్దేశ్య రేతస్సు  
తెలిసి పొందేటి జీవాన్ని
   
లెదుగ నా శక్తి  నీ ప్రేమ
మనలొ నీ శక్తి నా ప్రేమ 
కళలు తీర్చేటి నీ భక్తి 
కధలు తెల్పెటి నీయుక్తి 
--(())--
చాలా చక్కగా కవితను తెల్పావు, మనం నాలుగురుకోసం బతుకుదాం, తెలుగు భాషతో మంచి నడవడిక తెలుపుదాం.    
__(())--

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (8)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

భార్య గురించి తక్కువ చేసి మాట్లాడకండి 
ఎవరి కష్టం వారిది 
అవునా 
భార్య  లోపల పిల్ల లందరి యందు  జీవపరమైన ఆదరణ  ఒకే రకముగా ఉంటుంది. శిక్షణ వైవిధ్యముతో కూడి ఉండదు . కానీ ఎవరెవరి స్వభావమును బట్టి, ఎవరికి ఏవిధమైన శిక్షణ ఇస్తే  వారు సంస్కరింపబడతారో దాని ప్రకారముఒక తల్లిగా శిక్షణ ఉంటుంది. ఆదరణ విషయములో భర్తకు చేదోడుగా ఉంటుంది.  అందరి యందు దయార్ద్ర హృదయురాలుగా, కలుపుకోలుతనముగా  సర్వమూ ధారపోసే ఒక యంత్రముగా అవసరానికి సలహా ఇచ్చే మంత్రిగా, ధైర్యాన్ని ఉసిగొల్పి ధర్మాన్ని తెలిపి ఆచరణ సిద్ధిగా, అందరికీ సంతోషం కల్పించే ఒక నవ్వుల కల్పవల్లిగా ఆమెకు  ప్రియులు, అప్రియులు అనేవారుండరు .
 
ఆమె బలమే మన బలంగా మనలో సాధన జరగాలి అని కోరుకోవాలి. ఎందుకంటే ఆమె నిండా అమ్మవారు వ్యాపించి ఉంటుంది. తల్లి పిల్లల బంధం, భార్య భర్తల బంధం,   ఎప్పుడైతే మరుగవుతుందో నేర్చుకున్న విద్య కళలు రాణించవు . 

అందుకే నే చెపుతున్నా 

మనలో అసహనం చోటు చేసుకున్నప్పుడు చేజేతులా అవకాశాలను జారవిడుస్తాం.
సంసార జీవనానికి  కొలబద్ధ మౌనం, సహనం, ఓరిమి మొదలైన గుణాలను ప్రదర్శించడం ద్వారా వ్యక్తమౌతుంది. అతను విధికి ఎదురీదక స్థిరంగా నిలిచి ఉండగలుగుతుంది. ధర్మం తెలపగలుగుతుంది 

భగవత్సంకల్పం ప్రకారమే ప్రతీది జరుగుతుందని నిస్సంశయంగా నమ్ముతుంది . అందువలన ఉన్నత స్థితిలో సదా నెలకొని ఉంటుంది .
కోపం, అసహనత, లెక్కలు, వాదాలు, పోట్లాటలు ప్రపంచంలో ఇవే మనకు కనిపిస్తాయి. ప్రేమ క జీవనం గడపదలచిన వారు వీటి జోలికి వెళ్ళరు.

ఏమిటే ఈరోజు ఒక భార్యకు ఉండవలసిన లక్షణాలు అన్ని ఒక్క చిన్నకథగా చాలా చక్కగా చెప్పావు అసలు మనిషికే వెంటాడే లక్షణాలు ఏవి  
ఒక కవితగా తెలుపుతాను వినండి 

నిర్మాణ లక్ష్యమే - బంధమై వెంటాడు  
నిత్యము ప్రేమయే - సౌఖ్యమ్ము వెంటాడు 
ధర్మమ్ము నీడ యే  - తర్ముతూ వెంటాడు 
న్యాయమ్ము వల్లనే -  కాలమ్ము వెంటాడు 

ఆరోగ్య భావమే - సంసార మెంటాడు 
ఆనంద రోగమే - సంతోష మెంటాడు 
ఆలస్య  వేగమే - ఆదుర్ద వెంటాడు 
ఆకర్ష వేగమే  - ముగ్గులో వెంటాడు 

బాల్యంబు నీడలే - భాగ్యమై వెంటాడు 
భాగ్యమ్ము ఆశ యే - రోగమ్ము వెంటాడు 
రోగమ్ము వల్లనే  - గర్వమ్ము వెంటాడు 
గర్వమ్ము వచ్చుటే - దారిద్ర వెంటాడు 

వేదాంత పల్కులే - ఆశ్రయ వెంటాడు 
సౌందర్య పోషణ -  స్త్రీలలో  వెంటాడు  
కారుణ్య భావన  - శ్రీ రామ వెంటాడు 
ఆరాధ్య రోదనా - ఆత్మతో వెంటాడు  
 
కర్తృత్వ భావనే బంధం - తొలగితేనే మోక్షం.
తోలగక పోతే ఏర్పడు - జన్మ జన్మల బంధం  
ముక్తి సంపద ఉంటేనే - జన్మల సౌలభ్యం 
భక్తి ముక్తి యుక్తి శక్తి లేకపోతే - జన్మము వ్యర్థం 

ఎలా గుర్తుకొస్తా యే ఈ వాక్యాలు, కవితలు నీకు 
మీ ప్రోద్బలం, మీ ప్రోత్సాహం, మీ ఆరోగ్య ఉత్త్సాహం ఎదో తెలుసుకొని మీకొరకు ఈ చిన్న ఆలోచలే చెపుతున్నా రాసేవారు మీరు, రాయించేవారు మీరు నేను నిమిత్త మాతృరాలును మాత్రమే, మీ పాద దాసిని, మీ ప్రియాతి ప్రియమైన ప్రియురాలని, పిల్లలను కనే ఒక యంత్రమును. 
అబ్బా అన్ని వాక్యాలు బాగున్నాయి ఆ చివరి వాక్యమే బాగుండలేదు. ఏచేద్దాం ఆ బ్రహ్మ దేవుడు మాతలరాత అట్లారాసాడు, మీకు సుఖము అందించడమే మాలక్ష్యం, మాధేయం, మా ధర్మం  
అంట పెద్ద మాటలు వద్దులేవే ఈ రోజు కాఫీ ఇచ్చేది ఏ మన్నా ఉందా ? లేదా ?
చూసారా మీ మొగబుద్ధి చూపించారు 
ఆ ......... అంటూ .......... నాలిక కర్చుకున్నాడు .. శ్రీపతి 
             
--(())--

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (9)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

శ్రీవారు మీకు ఓకే విషయం చెప్పాలి 
ఏమిటే "ఈవయసులో చెయ్యాల్సింది ఆ వయస్సులో చెయ్యాలి కదా " అవును అది నిజము 
మనబ్బాయి చదువుపూర్తయినది పెళ్ళిచేస్తే బాగుంటుంది 
ఉద్యోగం రాలేదు కదా 
ఉద్యోగం వచ్చే లోపు ప్రేమ పుట్టితే మీరు ఆపగలరా 
అదేమిటీ అట్లాంటావు 
తల్లి తండ్రులు పిల్లలను చదివించాలి మాత్రమే తర్వాత వివాహము చెయ్యాలి వల్లకాలల్మీద వాళ్ళు నిలబడేటట్లు ధైర్యం చెప్పాలి, వారి సంపాదనమీద ఆధారాపడకూడదు , కట్నం ఇవ్వగలము అని ఆడపిల్ల పిల్లల పెళ్లి చేయక పోవటం కూడా తప్పు. వాళ్లలో విశ్వాసం కలిగించటమే తల్లి తండ్రుల కర్తవ్యము.    
లేని యడల 
మందారం తొ సంవ్యాప్తి - సింగారం తొ సంప్రాప్తి
సిందూరం  సంవ్యాప్తి  - వయ్యారంతొ  సంప్రాప్తి

నాంచారి దైవప్రాప్తి - బంగారి దైర్య ప్రాప్తి
వయ్యారి భావ్య ప్రాప్తి - సింగారి సౌర్య ప్రాప్తి

ఉద్వేగం తోను తృప్తి - ఉత్సాహం తో ప్రాప్తి
ఉన్మాదం తోను తృప్తి - ఉల్లాసం తో ప్రాప్తి
ఇలా పిల్లలు మారితే ఎవరు బాధ్యలు 
అందుకే 
దృఢ విశ్వాసములు -   అయిదు విధములైన జ్ఞానములు 
 
 1. ప్రాపంచిక జ్ఞానము = పిల్లల పెళ్లి మంచివారని తలంచి వారికి వివాహం చెయ్యాలని నిర్ణయం.  అనగా బావిని త్రవ్వకయే, ఇచ్చట మంచి నీరున్నదని భావించుటయు, భూమిని త్రవ్వుకొనుచు లోపలికి చొచ్చుకొని పోవుటయు మొదటి విశ్వాసము.

2. ధర్మశాస్త్ర జ్ఞానము= తల్లి తండ్రులు ఇటువారు అటువారు ఇచ్చి పుచ్చుకొని పిల్లల పెళ్లి చేసి ఏకం చెయ్యాలి . అనగా  నీటిని కన్నులార చూచుట రెండవ విశ్వాసము.

3. ఆధ్యాత్మిక జ్ఞానము= కొత్తగా పెళ్లిఅయినవారికి పూర్తిగా స్వశ్చ ఇచ్చి వారి సంతోషానికి అడ్డు లేకుండా ఉండాలి.   నీటిని రుచి చూచుట మూడవ విశ్వాసము.

4. బ్రహ్మ జ్ఞానము= సంసార సుఖము వల్ల పిల్లలు పుట్టి వారికి కర్తవ్యదీక్షగా పెంచి నలుగురిలో మంచివారు అనుకున్నప్పుడే తల్లితండ్రులగుర్తింపు  అనగా  ఆ నీటిని గూర్చి ఇతరులకు వర్ణించి చెప్పుట నాల్గవ విశ్వాసము. 

5 . విశ్వ విజ్ఞానము = కుటుంబములో సభ్యులందరూ కలసి ఒకేచోట ఉండటమే నిజమైన జీవితం అనగా   జ్ఞానము, సర్వజ్ఞత్వము నీరులేనిదే బతకలేరని ప్రాణుల విశ్వాసము 

ఆస్వాదించే అందం - ఇదే ప్రకృతి ప్రభంజనం
ఇక స్త్రీ ముఖార విందాం - ఆకర్షణ తోనె బంధం

చూసె రమణీయ దృశ్యం - పుడమితల్లి సింగారం
బతికించు తల్లి సహనం - తల్లీ తండ్రి బంధనం

నేలపైన బంగారం - అణువణువున పచ్చదనం
జీవితముకు వెచ్చదనం - ఆరోగ్యానికి తరుణం

నిజము తెలిపేటి వర్ణం - బతుకు వర్ణించె చిత్రం
హృదయం పెంచే కిరణం - పంచే మలయమారుతం

--((()))--

ప్రతిఒక్కరిలో విశ్వాసం, దృఢసంకల్పం కలిగిస్తే భయమనేది ఎట్టి స్థితిలో చేరదు, అధైర్యమనేది నీలో ఏర్పడదు    
మొత్తానికి పిల్లోడి పెళ్లంటూ జ్ఞానవంతమైన ఇషయాలు తెలిపావు, కవితలు కూడా తెలిపావు అందుకే నేనంటా " పంచే హృదయకిరణం - పంచే మలయమారుతం "

--(())--

 నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (10)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
 ప్రతిఒక్కరు  విచక్షణ జ్ఞానాన్ని సంపాదించాలి ఎవరో చెప్పారని చేశానని అనుట కాదు నీ  ఆత్మ సాక్షిగా నీ మనఃశాంతి నీతో ఉన్నవారికి శాంతి సౌఖ్యాలు కల్పించటమే మానవ జన్మకు సార్ధకం.    
తల్లితండ్రులపై పూర్తిగ భారము వైచి కర్తవ్యము నిర్వర్తింపని వాడు భ్రష్టుడగును. అట్టివానికి స్వశక్తి తగ్గును. నీపై నీవాధారపడుట పెంచుకొనుచు అత్యవసర విషయములనే తల్లితండ్రులకు  నివేదించుట నీ పెరుగుదలకు తోడ్పడును. ! అను మితిమీరిన విశ్వాసముతో బాధ్యతలను మరచుట అవివేకము. దీని వలన సాధారణ బాధ్యతలు కూడ నిర్వర్తించలేని స్థితి కలుగును. కనుక తల్లి తండ్రులను పురుషులైతే భార్యా సమేతముగా  నిరంతరమూ సేవలు చేయవలెను ఇది ఒక విధమైన ఋణము అటులనే కూతురైతే భర్తను ఒప్పించి తల్లి తండ్రులకు సేవచేయట సమంజసము, పిల్లలలకు పిల్లలు పెరుగుతుంటారు అయినను తాత బామ్మ,  అత్త మామ అంటూ పెద్దవారైన వారికి సేవలు చేయుట అందరి కర్తవ్యము.   
వేలు పట్టుకొని నడిపించుట ధీమంతులకు తగదు. నీకుగ నీవు నడువుము. కర్తవ్యములను, బాధ్యత లను నీకుగ నీవు మోయుము. కష్ట నష్టముల నోర్చుకొనుము. వేలు పట్టుకొని నడచువాడవు మహత్కార్యము లేమి చేయగలవు? ప్రతిదినము ప్రార్థన సమయమునందు నీకు వలసిన మానసిక సహాయము అందింపబడ గలదు. ధృతి గలిగి నీవే సమస్త బాధ్యతలను నిర్వర్తించుము. 
నిన్ను నిన్నుగ చూడగా - నన్ను నేనని తల్పగా   
నీవు నాకల దృష్టి గా  - నేను ప్రేమ సాక్షిగా 
నన్ను నీవని చెప్పగా   - కాల మాయకు చిక్కగా  
వాన నీటికి తడ్వగా    - ఎండ గాలికి మండగా
అగ్ని వాడక నీడగా    - రాజ కీయపు రంగుగా 
కాయ కష్టము నమ్మగా - మారు పల్కక చెప్పగా  
కారు చీకటి  కమ్మగా  - పాలు నిచ్చు బర్రెగా   
ఊలు నిచ్చిన గొర్రెగా - మేలు చేసెడి పెద్దగా 
వేలు ఖర్చులు చేయగా- రోజు లన్నియు ఒక్కగా    
దేని గూర్చియు ఆశగా  - సేవ చేసియు కోర్కగా   
ఇలా తడి పొడి మాటలు నిన్ను ఆవహిస్తాయి అయినా కార్వ్యము మరవకు అదే నేను కోరేది  
 IIU UUU IIU IIU 15/9
సమయానందంమ్మే సుఖసాగరమై 
సమ బాధా ప్రేమే సుఖరామయమై 
కమనీయంగా నే కరుణా లయమై 
రమయాలింగంమ్మే సమరాశయమై  
తన సమస్యలను తను స్ఫూర్తివంతముగ పరిష్కరించుకొను వానికి తల్లితండ్రుల సహాయము సద్గురువు సహాయము కూడ వెన్నంటి యుండగలదు. అర్జునుడు స్వయముగ యుద్ధము చేసినాడు. శ్రీకృష్ణుడు తోడ్పడినాడు. మిక్కుటముగ గురువుపై నాధారపడు వాడు ఏమియును చేయజాలడు.  
ఈరోజు మీరు బాగా చక్కగా చెప్పారు తల్లి తండ్రుల గురించి నాకు కొన్ని ప్రశ్నలు  వెయ్యాలని ఉంది 
అడుగూ స్త్రీ శక్తి కి ఎదురే లేదు అంత  తొద్దండి ఎదో నాకు ఆలోచన బట్టి అడుగుదామనికున్నా అంతే 
*ప్రశ్న : జ్ణానం : ప్రజ్ఞానం అంటే ఏమిటి ?*_
*శ్రీరమణమహర్షి గారు తెలియ పరిచారు "
 : ప్రజ్ఞానం కేవలం జ్ఞానం. దానిలోనుండి వెడలేది విజ్ఞానం. అంటే సాపేక్ష జ్ఞానం !*_
_*ప్రశ్న : విజ్ఞానదశలో సంవిత్ [విశ్వచైతన్యం] విదితమవుతుంది. ఆ శుద్ధ సంవిత్ అంతఃకరణల సాయంలేక తానై ఎరుకగా ఉండగలదా ?*_
 అవునట్లే అది తర్కసహం కూడా !*_
_*ప్రశ్న : జగత్తులో విజ్ఞానం వల్ల సంవిత్ తెలియనైన వేళల్లో ప్రజ్ఞానం స్వయంగా భాసించదు. అట్టిచో అది నిద్రలో గోచరించవలె కదా ?*_
 ఎరుక అంతఃకరణ వల్ల ఇప్పుడూ ప్రజ్ఞానం సర్వదా నిద్రలో సైతం వెలుగుతూనే ఉంటుంది. మెలకువలో ఎరుక అనూనతమైతే నిద్రలో కూడా అట్లే ఉండవలె !*_
_*ఉదా : రాజు ఒకరు హాలులోకి వచ్చి కూర్చుండి వెళ్ళిపోయాడు. అతడు వంట ఇంటిలోకి వెళ్ళలేదు. ఆ కారణంగా రాజక్కడికి రాలేదనవచ్చునా ? ఎరుక జాగ్రత్తగా ఉంటే, నిద్రలోనూ ఉన్నదనే అనవలె !*_
_*"లేదనే భావనే బాధ - బాధ లేని స్థితే ఆనందం !''*-
కనుక ఆనందం పరమానందం .. బ్రహ్మానందం ... ఆత్మానందం .. అందరికి ఉండాలి 
అదే ......  ....... .అదే ........  ...... 
--(())--

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (11)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏమిటండి ఈరోజు చాలా నీరసంగా ఉన్నారు.
ఇమిలేదు నీరసం లేదు కానీ నువ్వొక్కదానివే కష్టబడుతుంటే కొంత బాధనిపించింది. నీకు ఎటువంటి సహాయము చేయకుండా ఊరికినే కూర్చొని తింటున్నా అందుకనే 
అట్లా అనుకోకండి స్త్రీ పురుషుల ధర్మాలు ఉన్నాయి. ధర్మాలనేవి అందరికీ సమానము కానీ శ్రీ పురుష శరీరసౌష్టమును బట్టి  కొన్ని ధర్మాలు ఎవరికీ వారు పొందేవి ఉన్నాయి 
అందుకే  నే చెపుతున్నా   
అనుకోని సంఘటనలు (కొందరి వల్ల చెడుగా)  జరిగినప్పుడు మనమంచికే జరిగాయని భావించాలి 
ప్రతీకారవాంఛ జోలికి పోకండి జరిగేవన్ని కర్మ అని భావించండి.   
శ్రీవారు వింటున్నారా 
ఆ వింటున్నా 
ప్రతీకార వాంఛ నీ మనసుకు రానీకు, నీకున్న అమూల్యమైన   సమయం వృధా చేసుకోవద్దు 
వాటికోసం అనగా నిన్ను మానసిక ఇబ్బంది చేసినా దయా గుణం వహించు మనిషి కర్మ తనపని తను చేసుకుంటుంది.

చీమలను పక్షి తింటుంది అది చనిపోతే పక్షిని చీమలు తింటాయి

 ఎవరు బలవంతులూ అంటే ఇద్దరూ కాదు అందరికంటే సమయమే బలవంతుడు.

ఒక మనిషి ఒంటరిగా జన్మిస్తాడు ఒంటరిగా మరణిస్తాడు

 మనుష్యుల మంచిచెడుల ద్వారా చేసిన ఫలితమే మీకు స్వర్గానికి అయినా నరకానికి అయినా కర్మ ఆధారంగానే వెళ్తాడు
ఒక మంచి ఆటగాడు కూడా ఒకసారి ఒక అద్భుత ఆటగాడి ముందు బొమ్మలా మారిపోతాడు 
అదే కర్మ
నువ్వు వెళ్లిపోవాలి చెడు నుండి మంచికి, నువ్వు మంచిగా ఉంటే ఎప్పుడు అన్నీ నిన్నే అనుసరిస్థాయి, నీ మంచే నీకు గెలుపును ఇస్తుంది దురదృష్టం పైన.
నువ్వు ప్రపంచానికి మంచిని ఇస్తే అది తిరిగి మళ్లీ మంచిగానే నీ దెగ్గరకు తెస్తుంది.

మంచిఆ జీవనమంటే తెలియపరుస్తావా ... ఆ తెలియపరుస్తాను మధురిమలుగా వినండి 

*పవిత్రుడే నిజమైన - జీవితాన్ని సాగిస్తు 
ఇతరుల మేలుకోరైన - నిస్వార్థంగ సేవిస్తు

*పావనాత్ముడై అయిన - అధికారాన్ని చూపిస్తు 
తన మాటె వినాలనిన -  వత్తిడి నిరాకరిస్తు 
 
*సత్యము అనుష్ఠించిన -   అందరికి సహకరిస్తు 
స్వార్ధమే లే కుండిన -  వాంఛించేది యు చూస్తు
 
* ఆధ్యాత్మికము వలన -  బాధను వ్యక్త పరుస్తు
 సహజంగా తరుణాన -  ఉన్నతమైనది చేస్తు 

*పవిత్రమైనది కరుణ -  దివ్యమై సహకరిస్తు
 ఆకాంక్ష యే ఉండిన - అంతరమే మర్ధిస్తు

*ఈ సారవంతమైన - భూమాతను సేవిస్తు
 ఆధ్యాత్మిక రంగాన - విత్తనమై  జీవిస్తు

*ఫలితమే లేకుండిన - సంసారం సాగిస్తు 
  నిర్మలమైన మనసున - నిజ ప్రేమ చూపిస్తా
  
అసలు 

ధర్మమును పాటించకుండా, ధర్మానికి వ్యతిరేకముగా పనిచేయడం వలన బలము తగ్గి,  మనలో ఉన్న శక్తి తిరోధానము చెందుతూ ఉంటుంది. ప్రేమ అంటూ చుట్టూ తిరగకుండా ఎంత దైవారాధన చేస్తుంటే అంత శక్తి పెరుగుతూ ఉంటుంది. మన శక్తిని పదార్ధము వైపు గాకుండా పరమార్ధము వైపు మరల్చాలి.

*పరమార్ధము వైపు మన ప్రజ్ఞను పెంచుకోవాలంటే మనము ఏ మూలము నుంచి వచ్చామో, ఆ మూలముతో అనుసంధానం చెందాలి. ఆరాధన వలన, చక్కని ప్రవచనము వినడము వలన మనకు శక్తి పెరుగుతుంది. ధర్మముతో కూడిన కార్యక్రమముల వలన  మనలో చైతన్యము వికాసము చెంది, శక్తికి బలము చేకూరుతుంది. 
శుభం భూయాత్

చిన్న మాటకు పెద్ద సందేశమే తెలియపరిచావు  
అంతా మీరు నేర్పిన విధ్యే కదండీ 
మాటలు బాగా నేర్చావే 
అన్ని మీ దగ్గరేనండి అసలు విషయం మరిచా కొబ్బరికాయ తెచ్చారా షాపుకు పోయివచ్చారుగా 
ఆ మర్చి పోయానే ఇప్పుడేతెస్తా టి త్రాగిరాకండి కాఫీ కలుపుతా 
అలాగే ......................... అలాగే  

--(())--


నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (12)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏమండి బతుకులో స్వేచ్ఛ, బానిస,  కు తేడా ఏమిటో తెలుపుతారా మీరు? 
నీవన్న ప్రశ్నకు జవాబు కష్టతరమైనది అయినా ఒకరు చెప్పేది కాదు, చెప్పలేనిది కాదు ఎవరికీ వారు ఆలోచనబట్టి రెండు ఒకదానితర్వాత మారుతూ వచ్చేవి .    

"పూల సువాసన మట్టికి అంటుతుంది, కానీ మట్టి వాసన పూలకి అంటుకోదు. అలాగే మంచివారి సహవాసంతో  చెడ్డవాడు సజ్జనుడుగా మారవచ్చు కానీ...దుర్మార్గుడి దుర్గుణాలు మంచి వానికి అంటవు."

అట్లాగే స్వేచ్ఛ అనుకుంటే రోటికి రోకలి పోటు తప్పదు కదా, రోలు నేను బానిసను నన్ను బాదు తారు అనుకోదు, అట్లాగే స్త్రీలు నేనే చెయ్యాలా వంట, నేను మీకు బానిసనా, అనుకుంటే తప్పా,  నిజమో మీకే తెలియాలి, మొగవారు వంటచేసి ఆడవారిని సుఖపెట్టే లోకం వచ్చింది కారణాల అనేకం. ఒకరకంగా చెప్పాలంటే భార్యాభర్తలు అనుకుంటే బానిసలు, సర్దుకుబోతే స్వేచ్ఛ జీవులు.        

ఏది అసలైన స్వేచ్ఛ?... చాలావరకు రాజకీయ పరమైన, ఆర్థికపరమైన, బాహ్య స్వేచ్ఛలు మీకు ఎవరో ఇచ్చినవే కాబట్టి, అవి ఏ క్షణంలోనైనా మీ నుంచి పోయేవే. అందుకే అవి ఎప్పుడూ మీ చేతుల్లో ఉండవు. మీ చేతుల్లో ఉండేది "కన్న ప్రేమ, మంచి జ్ఞాపకాలు ".  

మా నాన్నతో నాకు ఎప్పుడూ గొడవే. ఆయన చాలా అవగాహన కలిగిన ప్రేమికుడే అయినా  ‘‘నువ్వు ఆ పని చెయ్యాల్సిందే’’ అని నన్ను ఆజ్ఞాపించేవారు. కోపమొస్తే (బడుద్దాయి, పిర్ర బద్దలు కొడతా అని తెట్టెవాడు నాకు అర్ధమయ్యేది కాదు అప్పుడు)   అది నాకు నచ్చేది కాదు. అందుకే నేను ఆయనతో ‘‘అలా ఆజ్ఞాపించకండి. అది బానిసత్వ దుర్గంధం కొడుతోంది. ఆ కంపు నేను భరించలేను. నాకు నేనుగా ఆలోచించే శక్తి తెలపండి, యుక్తి నేర్పండి అనేవాడ్ని.   

కావాలంటే ‘‘నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే చెయ్యకు’’ అనేవారు నిదానించి . ఆ పని చెయ్యాలా, వద్దా అనేది నీ  ఇష్టం కానీ, నా  ఇష్టం కాదు. మీరు చెప్పిన పని చెయ్యాలో, వద్దో నన్ను ఆలోచించు కోనివ్వండి. నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యను. ఒకవేళ, ఆ పని నేను చెయ్యకపోతే మీరు కోపగించుకోకండి. నేను ‘‘మీ మాట పాటించను అనట్లేదు. అలా ఆజ్ఞాపించకండి, అనేవాడ్ని అప్పుడే కోపం వచ్చేది బెల్టు తీసేవాడు, నేను పారిపొయ్యేవాడ్ని ఇది యదార్ధం.  

నేను సత్యానికి, స్వేచ్ఛకు, ప్రేమకే తల వంచుతాను. వాటికోసం నేను అన్నింటినీ త్యాగం చేస్తాను. అంతేకానీ, బానిసత్వానికి నేను ఏమాత్రం తల వంచను. ఈ జీవితం నాది. నా బతుకు నన్ను బతకనివ్వండి. ఆ హక్కు నాకుంది. మీరు చాలా అనుభవజ్ఞులే. కాబట్టి, మీరు నాకు మంచి సలహాలు ఇవ్వవచ్చు, సూచనలు చెయ్యవచ్చు. అంతేకానీ, నన్ను ఆజ్ఞాపించకండి. ఎలాంటి పరిస్థితిలోనూ నేను ఎవరి నుంచి ఎలాంటి ఆజ్ఞలను స్వీకరించలేను, వాటిని పాటించలేను’’ అనేవాడిని. యవ్వన కోపంతో.  

వెంటనే నాన్నగారు 
గదిలో ఉన్న చీకటి దీపం వెలిగించిన వెంటనే పోతుంది. అంతేకానీ, కొద్దికొద్దిగా చీకటిపోవడం, కొద్దికొద్దిగా వెలుగు రావడం జరగదు. స్వేచ్ఛ అంటే మీరు అన్ని బంధనాల నుంచి పూర్తిగా బయట పడినట్లు. అంతేకానీ, అది కాలానికో, నిదానానికో సంబంధించిన విషయం కాదు.
బంధనాలన్నింటినీ తెంచు కోవడం తప్ప మీకు మరొక దారి లేదు. 

చిన్నప్పటి నుంచి ‘‘పెద్దల పట్ల అణకువ, తల్లిదండ్రల పట్ల ప్రేమ, పూజారుల పట్ల నమ్మకం, గురువుల పట్ల గౌరవం’’ లాంటి మంచి మంచి పేర్లతో మీ చుట్టూ సృష్టించు కోవడం మొదలుపెట్టు అదే నిన్ను మంచిమార్గ నడిపిస్తుంది. నీలో ధైర్యం నింపుతుంది, నీలో ప్రేమ పుట్టిస్తుంది ఆప్రేమే నీకు ఒక కుటుంబం ఏర్పాటు చేస్తుంది అప్పుడు నీవు నాన్నవవుతావు నీ పిల్లలకు ఆజ్ఞలివ్వాలనుకుంటావు అప్పుడు ఈ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అనేవాడు. 

నాకు ఇప్పడికీ గుర్తు ఉంది మన్నగారి మాటలు "నేను మాములు వాహన డ్రైవర్ని, మానాన్నగారు చదువుకోమంటే చదవక తిరిగాను ఒకరి వద్ద బానిసగా బతకక స్వంత వాహనాల వల్ల నష్టపొ య్యాను అంతమాత్రాన అధైర్య పడక ముసిపాలిటి అత్తర్ బట్టి నడిపి పిల్లలను పోషించాను. మీరు చదువుకుంటే బగుబడతారు, అదృష్టముంటే ప్రభుత్వానికి సేవచేసే ఉద్యోగులవుతారు బానిస అని ఎప్పుడు మనసుకు రానీకు నేను చదివిన చదువుకు ఉద్యోగమూ అని భావించి స్వేచ్ఛ గా బతుకు అనేవాడు.           

కలం కాలం మారుతున్నవి సంపాదన పెరుగుతున్నది, స్వేచ్ఛ అంటూ ఆడమొగ తేడాలేకుండా తిరుగుడు మొదలైనది. ప్రకృతి సౌందర్యమును మరచి కుత్రిమ సౌందర్యానికి స్వేచ్ఛ అంటూ బానిసలవుతున్నారు అది అవసరమా చెప్పు శ్రీమతి 

నేనేమి చెప్పేది అన్ని మిరే చెప్పారు 

నేను ఒకటే చెపుతా "ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు " తల్లి తండ్రులుగా పిల్లల్ని చదీవించ గలము కానీ వారి బుద్ధులను మార్చలేము కదా.
మరి మనిద్దరం బానిసలమా స్వేచ్చా జీవులమా 
ఈ వయసులో చెప్పాలంటే మనిద్దరం బానిసలమే ఎవరికీ మనపిల్లలకా 
కాదు ఆదేవునికి    
చాలండి ఈ జీవితం " మీకు నేను, నాకు మీరు" కలసి ఆదైవాన్ని పార్ధిద్దాం పుడమితల్లి భరించి నంతకాలం ధర్మాన్నిరక్షించుదాం. మీరేమంటారు 
ఇక నేనదేముంది ఆదేవుని లీలల్లో మనము ఒక భాగమే అనుకుంటా ?
అవునా 
అవునంటే అవును కాదంటే కాదు అంతా మీయిష్టమే    
అంతా బాగ చెప్పావు మల్లా మొదలకొచ్చావు
 
నేను మీకు బానిసకదండీ అంటూ కాఫీ తెస్తా అని లోపలకువెళ్లింది శ్రీమతి 
అమ్మయ్యా ఇప్పడికి నాకు స్వేచ్ఛ వచ్చింది అంటూ నాలిక కొరుక్కొని అరిచారు శ్రీవారు  

--(())--
 

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (15)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏమండి మన మనవుడు మనవరాలు వచ్చారండి. 
వస్తే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు 
ముద్దుగా ఉన్నాయి అయితే ముద్దు  పెట్టుకో, కాని వాళ్ళ ఇంగ్లీషు నేర్చు కోవటానికి మాత్రం ప్రయత్నిచకు.  
పిల్లలను అలా పార్కుకు తీసుకెళ్తాను 
అప్పుడే ఇంగ్లీసు మాటొచ్చింది ఎంచక్కగా తోటకు తీసుకెళ్తున్నాను  చెప్పొచ్చుగా 
సరే అట్లాగేనండి 
మీరు ఆయితే 
డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ  ❓
అప్పడే తలుపుకు తాళం వేయకండి అని చెప్పే బదులు ఇంగ్లీషు ఒకటి 
 
’ఇందులో ‘కీస్’ కు( తాళం ) అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం.
ఇదో పిచ్చి ఎవర్ని ఉద్దరించటానికి 

చక్కగా అమ్మ అని పిలిపించుకొనే రోజులు తగ్గి పోయినాయి, మమ్మి డాడీ  అని పిలిపించు కుంటున్నారు కాలం మారుతున్నది మనతెలుగు చచ్చి పోతున్నది రామచంద్ర ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి. 
ఏమండి పిలిచారా   
పిలవలేదు నేను చెపుతా విను 
ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, తలుపుకు  తాళం  వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాటిని తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ? 
 దీనికి కారణం బానిస బతుకుకు ఇంగ్లీషు అవసరమని ప్రభుత్వం చెప్పుటయే, తెలుగుని వాడక పోవుటయే అంతా  మన ఖర్మ.  

మన తెలుగులో మాటలు లేవా ఎందుకు లేవు, చక్క గా  ఉన్నాయి 
కానీ మనం పలకం.

వంటింటిని......కిచెన్ చేసాం. వసారా.....వరండాగా మారింది.ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.
ఏమండి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు 
ఇంకా వేళ్ళ లేదా 

వెళ్ళలేదండి మీరు ఎందుకో బాధపడుతున్నారండి 
బాధ పడక ఏంచెయ్యాలి కట్టుకున్న పెళ్ళామే బంధువుల్ని గెష్టు లని, భోజనాన్ని లంచ్    అని నేర్చు కొని అంటున్నది .    
మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు అనడం,  .
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు.
భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం.
అందులో వడ్డించే వన్నీ.......

రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే. అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా,  వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం.బ్యాగ్ పట్టుకుని షాప్‍ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.

సరే నేనొక్కడ్నే ఇక్కడ కూర్చొని ఏమి చేసేది, నేను కూడా  ఆ తోటకొస్తాలే పా 
మా ఆయన ఎంత మంచి వారో 
శ్రీమతి మాట వినకపోతే శ్రీవారికి పస్తు అని ఎవరో కవి చెప్పారు. 
ఎంచక్కా ఆడుకోక ఆ  సెల్లో ఆడుతున్నారు, 
ఏమిటి 
ఏమోనండి వచ్చినపపడి నుండి ఎదో నవ్వుతున్నారు, అరుస్తున్నారు ఎదో గేమ్ ఆ టండి
అదుగో గేమ్ అనకు ఆట అను  
క్షమించండి తప్పు దొర్లింది 
ఎమ్ చ్చేద్దాం పిల్లలని అనలేం, పెద్దవాళ్ళను అనలేం ఎదో కాలం జరిగిపోతుంది కదా 
అవునండి పిల్లలు వెళ్ళేదాకా ఆ ఇంగ్లీసు గొడవ పక్కన పెట్టండి, పిల్లలకు కోపం వస్తుంది. 
అట్లాగేలే వాళ్ళ ముందు ఏమననులే 

మనం అలా కూర్చొని మాట్లాడుకుందాం పిల్లలు ఆడుకుంటున్నారుగా వాళ్ళని అలా వదిలేద్దామా ఆ ఆటలు మానమని చెప్పొద్దూ 
తల్లి తండ్రులే ఆడ మంటున్నారు మనమే చేయగలం, అమ్మోమ్మా తాతాయ్య అనిపించుకుంటే చాలు 
అది నిజమే 
మీరేదో చెప్పా బొయ్యారు 
నిన్న మన  పక్కింటాయన సీతా రామయ్యగారు  వచ్చి ‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు. మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది? 

ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ?
అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్నఅందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.

అవునండి మీరన్నది అక్షరాల నిజం 
పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్‍ కు పంపిస్తాం. సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు. ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోవాటం లేదండి. 
మనభాషను మరచిపోవద్దని గట్టిగా చెప్పు "మాతృభాష, మాతృభూమి, మాతృశ్రీ" ని మరచినవారు బాగుపడరు అని చెప్పు.   .    
అవునండి 

 ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, ఇతరులు అనుకోవాలన్న భావన.
అవునే పూర్వం పిట్టలదొర ఒకడొచ్చేవాడు నాలుగు బాషాలుమాట్లాడి నమ్మబలికి పాతగుడ్డలుంటే ఇవ్వమని, కొన్ని డబ్బులి ఇవ్వమని అడిగే వాడు, ఇవ్వకపోతే ఎదో రకం గొణిగేవాడు అలావుంది. .
 
ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.
ఏది మారాలంటే ఏంచెయ్యాలి మిరే చెప్పండి 

అందరూ తెలుగుభాషలో చదవాలి, చదివినవారికి ఉద్యోగాలు, ఇవ్వాలి, అమ్మతల్లి (కంప్యూటర్ ) లో తెలుగులోనే వాడాలి ఉత్తరప్రత్యుత్తరాలు మన పాతగ్రంధాలు పిల్లలకు నేర్పాలి "కాశీమజిలీకధలు, తెనాలి రామకృష్ణకధలు, వివేకానంద బోధలు, భారతం, భాగవతం రామాయణం  కధలు అందరికీ చెప్పాలి అదే నాకోరిక 
కలలు కనకండి ఇది అక్షరాల నిజం 
ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది తెలుగుదేశం దద్దరిల్లి పోతుంది. 
ఏమిటండి అలా మాట్టాడుతున్నారు నిద్దరలోనా 
తోటలోకూడా నిద్దరా 
ఒక బాధ  ఉన్న వాడికి నిద్ర ఎక్కడొస్తుందే, ఇది తెలుగు తల్లి ఆత్మ ఘోష నేను నిమిత్తమాత్రుడ్ని 
మీరు బాధపడకండి 
రోజులు మారుతాయి, మంచిరోజులొస్తాయి మన దేశాభివృద్ధికి మనపిల్లలు మనదేశానికే సేవ చేసే రోజులొస్తాయి, ఇక్కడే చదువుతాం, ఇక్కడే బతుకుతాం ఇక్కడ భాషనే మాట్లాడుతాం అని ప్రతిజ్ఞ చేస్తారండి 
ఆరోజులొస్తాయా 
వస్తాయండి 
మిరే చూస్తారు 
చూస్తానా 
దిగుల పడకండి ఆ రాముణ్ణి తలచుకొని హనుమంతుని పిలవండి అన్ని ఆయనే చూసు కుంటాడు అందరికీ మాతృభాషపై ధైర్యం నూరిపోస్తాడు 
ఓం శ్రీరామ్ .. శ్రీ మాత్రేనమ: ...ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమా;.. ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమా: 

--(())--   

23, మార్చి 2021, మంగళవారం

అంశం... మధురిమల

 పొలం ... ... 


పొలం వెళ్ళొచ్చాకనె 

నిర్వేదంగా ఉండెను  

గువ్వలా మనిషి  మారెనె 

నాలుక బయట పెట్టేను  ... .. 62


వానలే లేక పోయెనె 

మేఘాలు రాకుండేను  

కన్నీరే లేకుండెనె 

ఏమి అనలేకున్నాను ... ... 63


మింగ మెతుకు లేదాయెనె 

బతుకు దుర్బర మాయేను 

కథల బతుకుగా మారెనె  

తల్లితండ్రులకు చెప్పను ... ... 64


ఎరువు బూడిదగ మారెనె  

అప్పు ఎలా తీర్చ వలెను 

ఓర్పుతొ నారు పోసితినె  

బతుకుబండియు ఏమగును ... ... 65


కాలవకే నీరొచ్చునె 

ఇక మంచిరోజులొచ్చును 

నీకు సంతసమ్ము కల్గునె 

తల్లి మాట వేద మగును ... ... 66


నిను పుడమితల్లి పిల్చెనె

నీరు నీరు పెట్ట మనెను 

నాన్న ధైర్యము కల్గెనె 

అమ్మ దాహము తీర్చెదను .... ... 67


ఉత్త్సాహమ్ము కల్గెనె 

పొలము బిడ్డలా పెంచెను 

అప్పులన్నీ తీరేనె    

హృదయమ్ము చల్లఁ బడేను 68 


ఇపుడు బానిస బ్రతుకు

తప్పదు గంజికి వెతుకు

గుడిసెలో నున్న  ఇరుకు

జీవితము గడుపు బ్రతుకు... ... 69


శ్రమకు ఫలితము లేదులె

మనిషి జీవితము చితుపులె

కలుగును హర్షము మోపులె

ఇలలో జీవించు కళె... ... 70


ఇంటికీ అరుగు ఉండు

దానిపై పురుగు చుండు

అటుఇటూ జరుగు చుండు

గాలిలో ఎగురూ చుండు.... ... 71


చేతిల్లో సెల్లు తోను

గుండెల్లో జల్లు గాను

మాటల్లో సొల్లు గాను

తగ్గిస్తె మంచిది దేను .... ... 72


సునామీ అలలు వచ్చె

పాతాళ జలము వచ్చె

సమస్య మెలుకువ నచ్చె

వ్యధ భరితం మనసిచ్చె....73


డబ్బుల వేట ఇప్పుడు

దొంగకు ఆట తప్పుడు

కోరనే మూట ఎపుడు

దొరికితే దొంగ అపుడు .... 74


చేయకు రాజకీయం

కధలకు ఏమి న్యాయం

జీవితం నీతి మయం

ఇక మేమే నేతలం... 75


నీవు ఒక బుజ్జి కొండ

తిన్నావు మిగలకుండ

తినుటయె కడుపునిండ

వయసదే తప్పకండు ... 76


ఎన్నికలలో తప్పులు

ఎన్ని  కలలో ఒప్పులు

ఫలితాలలో తిప్పలు

తీర్పు కొరకు ఓపికలు 77


నీవి మెరిసే కన్నులు

మనకి కె ముఖ నవ్వులు

ఈ పగలే వెన్నెలలు

జీవితంలోన సెగలు... ... 78


జంటగనె ఈ గువ్వలు

మ్రోగె మువ్వల రవళులు

పొందు చిన్నారి నవ్వులు

సంతోషంతొ మలుపులు... 79


వేగముతోనే రైలు

ప్రయాణ ధరలే వేలు

పట్టు విడుపులే చాలు

అవసరమా ఇక చాలు ,,, 80


నీవు చదువును మరువకు

నీవు మంచిని విడవకు

నీవు చెడునే నుడువకు

నీవు కాలంతొ బతుకు ... ... 81


కరుగేను ఈ కాలం

    అరుగేను ఈ దేహం

    తరుగేను ఈ మోహం

    పెరగాలి ఈ లోకం .... ... 82


మనిషి నిలవని తనువుకు

 నీవు ఎక్కువ వగవకు

  నీవు  మక్కువ పెంచకు

  తక్షణమే ఇక పలుకకు ... .... 83


  ఇదే  క్షణికావేశం

  చేయు మనకే మోసం

   నీకు ఎందుకు రోశం

   తగ్గాలి ఆవేశం  ... ... 84


నిన్నను మరువకు నీవు

నేటిని విడవకు నీవు

 రేపును తలచకు నీవు   

కాలం గొప్పది వీవు ... .... 85


రోజులు నాకు గడిచెను

 బడినే నేను విడిచెను

 విత్తము కొరకు ఏడ్చెను

 బూజులు నేను దులుపెను.... ... 86


చదువుల బడిలో నేను

మమతల ఒడిలో నేను 

 నవ్వుల జడిలో నేను

 బాల్యం అంత తేలెను ... .... 87


కష్టము ఎరగని జీవి 

బాధల మరగని జీవి

తప్పుకు కరగని జీవి

 బాల్యం మరిగేబావి... .... 88


మంచి ఇపుడే ఎంచెడి

చెడునే ఇపుడే తుంచెడి

హృదయము ఇపుడే పంచెడి

బాల్యమే మరచి పోండి ... ... 89


మరచే పోనిది జ్ణానం

తిరిగే రానిది జ్ణొనం

 మరువగ లేనిది జ్ణానం

 చిరు ప్రాయమునే జ్ణానం ... ... 90


మనలో బుద్ది వికారము

శుద్ధి మనలో  అపారము

మనకే దారి విహారము

అందర్కీ నమస్కారము  ... ... 91


మూర్ఖత్వమే మనకు అహము

శూన్యత్వమే మనకు  ఇహము

చెడు బుద్ధియే మహరహము

హీనుల నడత దాంభికము .... ... 92


విఫలము మయ్యెను కార్యము

భయమే వీడితె ధైర్యము

విడువకు నీలో స్థైర్యము

కృషితో గెలుపే గమ్యము  ... ... 93


సొగసరి చూపుల  కళ్ళు

మనసున గుచ్చే ముళ్ళు

కొడితే రాలును పళ్ళు

జాగర్త చేయు వొళ్ళు ... ... 94


దుష్టుని విత్తము వద్దు 

విషమే మొత్తము సద్దు 

స్నేహపు చిత్తము రద్దు 

పతనము సాంతము హద్దు ..... ... 95


చదువుల కొలువులు ఏవి 

భద్రత నెలవులు ఉండు  

ఉన్నత పదవులు ఏవి 

మిన్నగ జగతిలో నుండు ... .... 94


పరువపు ఉలుకులు నీకు 

సొగసరి కులుకులు నాకు 

తేనియ పలుకులు నీకు 

వయసులోన హొయలు నాకు ..... ... 93


వేసవి కోకిల కూత 

ఉగాది వేపకు పూత 

వాడుము కొత్తది చింత 

కొత్తది  ఉగాది చెంత //// /// 92

    

జ్ఞాపకమ్ము నిదురపోదు

మౌనమ్ము మనసుకు చేరు 

భావం భందమైపోవు 

కవిత్వంతొ బతకలేరు  ... ... 93


నిక్షిప్తం బతకనీదు  

కాయము శిధిలమైపోవు 

ఊహల్లో నిలవనీదు 

అక్షరాలు తరిగి పోవు .... .... 94


పరవశం మనేది లేదు 

కండ్ల కన్నీరు మారవు 

బాధలకు అంతం లేదు 

బాధ్యతలు కావే బరువు .... ... 95


కాలానికి చివర లేదు

కవ్వముతో చిలక లేవు  

రోగాలకు అంతు లేదు 

బతుకుకు మార్గాలు లేవు  .... 96


కరోనా అర్ధం కాదు  

ఎండమావిలో నీరవు   

స్తబ్దతే జవాబు కాదు 

శరీరమే ఆవిరి అవు .... ////97


భయము మనసులో మారదు 

ఉత్తేజం పొందలేవు 

పచ్చదనమ్మే చెదరదు

ఉషోదయాన్ని గ్రహించవు .....98


మనిషిలో మార్పే రాదు 

ధనము రాగాల పాలవు 

ఆశతో పులుపు చావదు  

ఎవ్వరికి సలహాలు లేవు ....99


మనసుకు ఊరటే లేదు 

ఆశలకు దారులు లేవు 

ప్రకృతిలో మార్పులేదు     

కవితల దారులు మారవు ... 100


--(())--


14, మార్చి 2021, ఆదివారం

  


*ప్రేమజంట* మధురిమలు


ముచ్చటైనది జంట ఇది

జంట వలపుల పంట ఇది

పండె మురిపాలతొ ఇది

సిగ్గులు మోగ్గలు వేసేది


జోడు పక్షుల జోరు ఇది

జోరు గున్నది తీరు ఇది

తీరొక్క రంగుల తీర్పిది

తీర్పులే కాలమైనది 


అలిగిన ప్రేయసి చూడు

మూగ ప్రేమే ఇది చూడు

చూడు అలకలతో చూడు

హృదిని తట్టె ప్రేమ చూడు


స్వర్గపు సప్తవర్ణ మిది

దాంపత్య జీవితము ఇది

జీవితమిల స్వర్గము ఇది

శోభితము స్ధిరమైనది


ఎడబాటు భరించ లేక

భరించి తల ఎత్త లేక

ఎత్తి గుండె చూపు లేక

విలపించే చేయలేక


రామ్మా చిలుకమ్మా అని

అలకమ్మా వలదేమని

అలక మానుతున్నానని

చెలుని చేరి పలికానని


జంట బాసిన పక్షినై

పక్షి ఒంటరి పక్షినై

ఇదే ఒంటరి శోకమై

 ప్రేమల శ్లోకమాయై


బోయ వాని బాణము ఇది

శోకము తో శ్లోకం ఇది

బాధతో పక్షి రొద ఇది

రామకథారంభము ఇది


చెలియ చెలియ రావే అనియు

వచ్చే చేరవా అనియు

చేరి కౌగిలిలొ సుఖముయు

బంధించుము నన్ను ఇదియు

--(())-+



102 నేటి మధురిమలు


పట్టుకున్న  - సంసారం.

పందిరైన  - సంసారం

వాక్కు మింగు - సంసారం

చెప్పు కోని - సంసారం


వదులు కున్న - సన్యాసం.

కోర్క లేక - సన్యాసం

ఆశ తీర్చు - సన్యాసం

అన్ని పొందు - సన్యాసం


 వదలగలిగి పట్టుకున్న  

నిత్యమూ ఆధ్యాత్మికం

బతకగలిగి పట్టుకున్న

బ్రతుకంతయే ధార్మికం


మౌనం అనేది భూమి

 మాట అనేది చెట్టు

బాధ్యతనేది భూమి

బత్కు అనేది చెట్టు


మౌనం లో నుండు మాట

కోపంలో చేయు వేట

పిల్లల్లో ప్రేమ బాట

పెద్దల్తో ప్రేమ ఆట


మౌనంలో మాట రొచ్చు 

కోపంలో మాట ముచ్చు

తాపం లో మాట పుచ్చు

వేగంలో మాట నిచ్చు


సదా ఉండు మౌనమే.

సదా ఉండు యోగమే

సదా ఉండు లాభమే

సదా ఉండు కాలమే


అదే మాధవ నిలయం

అందు రాధా హృదయం

అదే మాధవ తాపం

అది రాధా విలాపం


రమ్యమ్ము బృందావనం

మది రాధా సంచారం

ప్రకృతి మురిపించె వైనం

రాస క్రీడల మైకం


ప్రకృతి పులకించేనులే

సెలయేళ్ళు నర్తించెలే

కోయిల వినిపించేలే

హృదయాలు తపించేలే



మధురిమలు .. చూడరా 


చేయి చేయి కలుప వద్దు 

చిలిపితనమే చాలురా 

మాట మాట పెంచవద్దు 

పలుకుతనమే చాలురా 


హాయి యనఁగఁ జూచుకొనుటె  

హరుస మదియే చాలురా 

ప్రేమ పొంది పంచు కొనుటె 

మనసుకు అదియె చాలురా 


పూయబోకు మత్తరులను 

 బూలగుత్తీ చాలురా 

చెప్పు మాట వత్తిడులను 

నమ్మ పల్కూ చాలురా  


రేయియంత ఫోనులోనఁ  

బ్రేమమాటలు  చాలురా 

కాలమంత ఖర్చులోన 

ఆశ లేకయు  చూడరా 

*


 (మీరు నేర్చుకోండి).... ప్రాంజలి ప్రభలు  

(మధురిమలు)

 

సృష్టి మాయావేగమే 

సర్వ సృష్టీ భావమే 

విశ్వ మార్గం శ్రేయమే 

బ్రహ్మసృష్టీ వేదమే 


మృష్టపాదా వేగమే 

కష్ట తత్వా వేగమే 

ఇష్ట సేవాభాగమే 

పుష్టి ఆహారమ్ముయే   


కష్టముల్ ద్రోయంగ రా

ఇష్టముల్ తీర్చంగ రా 

నష్టముల్ ప్రోవంగ రా 

చేష్టలే మానంగ రా 


ధాత్రిపై శోభించగా 

మంతమై శాసించగా 

తంత్రమై లాభించగా 

యంత్రమై తిర్గాడగా 


మాతృకా కాపాడుమా 

బ్రాతగా చూడాలిగా 

నాత్రమై వీక్షింతు మా  

వృష్టిగా సంతుష్టిగా


మాకు నీవారోగ్యమున్ 

మాకు నీవైశ్వర్యమున్ 

మాకు నీవానందమున్ 

మాకు దివ్యానందమున్ 

మీ విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మృష్టపాదా - ర/త/గ (ఆధారము - వాగ్వల్లభ) 

7 ఉష్ణిక్కు 35


64 కళలు వివరణ సహితం (బ్రహ్మ జీవతత్వాలు) (1)


1. గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది),

 

   స్వర ప్రధానముగా

   పద ప్రధానముగా  

   లయ ప్రధానముగా

   స్థితి ప్రధానముగా


   మనసు యొక్క అవధానము

   వయసు యొక్క కళ గానము 

   సొగసు యొక్క  లత గాళము 

   హృదయ మొక్క విష వాదము 


2. వాద్యము  

     (ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు )


నా ఆలోచనకు కారణం 

నా ధైర్యమ్మునకు మూలకం   

నా  ఆవేశముకు సంకటం                      

నా కర్తవ్యముకు భారతం  


నా  వ్రాతలకు ప్రాణం 

నా చూపులకు గమ్యం 

నా ఆటలకు ధైర్యం 

నా వాక్కులకు విశ్వం 


నా పదాలకు పరమార్ధం 

నా స్వరాలకు మది మార్గం 

నా వినోదము ఇది వాద్యం  

నా మనోమయ కల శబ్దం 


నా మనసుకు ఉత్తేజం 

నా వయసుకు ఉన్మాదం 

నా కళలకు  విఘాతం 

నా పలుకుకు సమ్మోహం

 

నా ఊహలకు మూలం 

నా ఆశలకు వాదం 

నా చూపులకు వేదం 

నా ప్రేమలకు దాహం 

--(())--


ఛందస్సులో గణితాంశములు – 4: అంత్యప్రాస

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావుఏప్రిల్ 2021

పరిచయము

ఒక పద్యము కలకాలము నిలిచిపోవాలంటే, అందులో భావార్థము ఉండాలి, దానితోబాటు పద్య శిల్పము కూడ చక్కగా ఉండాలి. ఈ శిల్పము పద్యపు అమరికను నిర్వచిస్తుంది. పద్యమునకు దోషములు లేక గణ, యతి, ప్రాసలు అమరియుండాలి. దానితోబాటు శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు పొదగబడి ఉండాలి. శబ్దాలంకారములలో ఛేక, వృత్తి, లాట వంటి అనుప్రాసములు, యమకములు, ద్వితీయాక్షర ప్రాస, అంత్యప్రాస వంటి షడ్విధ ప్రాసములు ముఖ్యమైనవి. ఉపమాదులు అర్థాలంకారములు. వీటన్నింటితో కావ్యకన్యకను సర్వాలంకార విభూషితగా చేయవలయును. దీనిని గుఱించి శంకరాచార్యులు శివానందలహరిలో ఇలా వ్రాసియున్నారు.


స్రగ్ధరా – మ/ర/భ/న/య/య/య UUU UIUU – IIII IIU – UIU UIUU


సర్వాలంకారయుక్తాం సరలపదయుతాం సాధువృత్తాం సువర్ణాం

సద్భిఃసంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం

ఉద్యద్భూషావిశేషాముపగతవినయాం ద్యోతమానార్థరేఖాం

కల్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం త్వం గృహాణ – (శివానందలహరి 98)


పైపద్యములోని అలంకారములు శ్లేష, స్వభావోక్తి. శివానందలహరి అనే కావ్యకన్యకను అందుకొనుమని శివుని ప్రార్థిస్తూ వ్రాసినది ఇది. ఇందులో కన్యకకు అన్వయించు విధముగా, కావ్యమునకు అన్వయించు విధముగా పదములను ఆచార్యులు వాడినారు.


సర్వాలంకారయుక్తను (ఉపమాది అలంకారములు గల దానిని లేక హారాది అలంకారములు గల దానిని), సరళపదయుతను (సులభమైన పదములు గల దానిని లేక వంకర లేని తిన్నని అడుగులు గల దానిని), సాధువృత్తను (మంచి పద్యములు గల దానిని లేక మంచి నడవడిక గల దానిని), సద్భిఃసంస్తూయమానను (పెద్దలచే పొగడబడిన దానిని), సరసగుణయుతను (నవరసములతోడి గుణములు గల దానిని లేక చక్కని గుణములు గల దానిని), లక్షితను (గుర్తించబడిన దానిని), లక్షణాఢ్యను (కావ్యలక్షణములు గల దానిని లేక శుభ లక్షణములు గల దానిని), ఉద్యద్భూషావిశేషను (వేదాంతవిశేషములతో ప్రకాశించు దానిని లేక ప్రత్యేక భూషణములతో ప్రకాశించు దానిని), ఉపగతవినయను (రహస్యములు గల దానిని లేక వినయము గల దానిని), ద్యోతమానార్థరేఖను (అర్థవంతమగు ధార గల దానిని లేక ధనరేఖ గల దానిని), ఈ కల్యాణిని, నా కావ్యకన్యకను ఓ దేవా గౌరీప్రియా స్వీకరించుము. ఇందులోని పదములు శ్లేషార్థములో కవిత్వమునకు, స్వభావోక్తిలో కన్యకకు వర్తిస్తాయి.


పద్యములలో అంత్యప్రాసలు

ఈ వ్యాసములో పద్యములకు ఒక నవసౌందర్యమును కలిగించే అంత్యప్రాసను ఎన్ని విధములుగా వ్రాయ వీలగునో అనే గణితాంశముపైన చర్చిస్తాను. తెలుగులో అంత్యప్రాస రగడలకు తప్పనిసరి. మిగిలిన ఛందములకు ఐచ్ఛికము. కొందఱు ద్విపదకు కూడ పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు పాదాంత విరామయతి నియతము అన్న మాటను మఱువరాదు ఈ సందర్భములో.


సామాన్యముగా పద్యములు చతుష్పదులు. సంస్కృత ఛందస్సులో వృత్తములన్నియు చతుష్పదులే. త్రిపదులను కూడ చతుష్పదులుగా పరిగణించి ఛందమును నిర్ణయిస్తారు. అందుకే త్రిపద గాయత్రి పాదములలో ఎనిమిది అక్షరములున్నను, దానిని ఆఱవ ఛందమైన గాయత్రికి చేర్చుతారు. ఆర్యాభేదములు ద్విపదలు. అందులోని ఒక ప్రత్యేకతయైన కందము కన్నడ తెలుగు భాషలలో ప్రాసయుక్తమైన చతుష్పదిగా వాడుతారు. కన్నడములో షట్పదులకు ప్రాముఖ్యత ఎక్కువ. షట్పదులను కూడ చతుష్పదులుగా పరిగణించ వీలగును. ఈ వ్యాసములో ఏకపద, ద్విపద, త్రిపద, చతుష్పదులకు అంత్యప్రాసను ఎన్ని విధములుగా ఉంచవచ్చునో అనే విషయమును సోదాహరణముగా తెలియబరుస్తాను. మొట్టమొదట వివిధ భాషలలో అంత్యప్రాసకు కొన్ని ఉదాహరణములను క్రింద ఇస్తున్నాను. ద్రావిడ భాషలలో ద్వితీయాక్షరప్రాస ముఖ్యమయితే ఉత్తర భారతీయ భాషలలో అంత్యప్రాస ముఖ్యమైనది. దానినే వారు తుక్ అంటారు. ఈ తుక్ లేని పద్యము ఆ భాషలలో అరుదు.


సంస్కృతములో అష్టపది-


చందనచర్చిత నీలకలేవర పీతవసన వనమాలీ

కేళి చలన్మణికుండల మండిత గండయుగస్మితశాలీ – (గీతగోవిందం)


(చందనము పూయబడిన దేహముతో పీతాంబరధారియైన ఓ వనమాలీ, మణికుండలములు కదలాడుచుండగా నవ్వుచు చెక్కిళ్లతో ప్రకాశించువాడా!)


ప్రాకృతములో దోహా-


జా అద్ధంగే పవ్వఈ సీసే గంగా జాసూ

జో దేఆణం వల్లహో వందే పాఅం తాసు – (ప్రాకృతపైంగలము)


(అర్ధాంగములో పార్వతి, శిరముపైన గంగ కలిగి దేవతలందఱికి ప్రీతిపాత్రమైన ఆ మహేశ్వరుని పాదములకు ప్రణమిల్లెదను.)


హిందీలో తోటకము-స/స/స/స IIU IIU IIU IIU (పాదాంత విరామము మాత్రమే).


జయరామ రమారమనం సమనం

భవతాప భయాకుల పాహి జనమ్

అవధేస సురేస రమేస విభో

సరనాగత మాంగత పాహి ప్రభో – (తులసీరామాయన్)


(జయరాముని, రమారమణుని, శమనునుని, భవతాపముతో భయపడు జనులను రక్షించువానిని, అయోధ్యాధీశుని, సురేశ్వరుని, రమేశ్వరుని, శరణాగతుడనై వేడుచున్నాను.)


మరాఠీలో చంద్రిక-న/న/త/త/గ III IIIU UIU UIU (పాదాంత విరామము మాత్రమే).


రఘుకుళటిళకా మేదినీపాళకా

సహృదయపదకా పాపపంకోదకా

సుహృదలికమలా నీరదశ్యామలా

అతులభుజబలా భగ్నరక్షోబళా – (మోరోపంత)


(రఘుకులతిలకా, మేదినీపాలకా, సహృదయులకు పతకమువంటివాడా, పాపపంకమును కడుగు నీటివంటివాడా, మంచి హృదయాళికి కమలమా, మేఘశ్యామా, సాటిలేని భుజబలము కలిగినవాడా, భగ్నహృదయములకు రక్షనిచ్చి బలమునొసగువాడా!)


జాతీయగీతము-


పంజాబ సింధు గుజరాత మరాఠా, ద్రావిడ ఉత్కల బంగ

వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగ

తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాంగే గాహే తవ జయ గాథా.

జనగణమంగలదాయక జయహే, భారత భాగ్య విధాతా! – (రవీంద్రనాథ టాకూరు)


తెలుగులో కళికగా మధురగతి రగడ- చ/చ – చ/చ (చ – ఎదురు నడక లేని చతుర్మాత్ర).


వెండియుఁ ద్రిభువన – వినుతి సమేతుఁడు

మండిత సద్గుణ – మహిమోపేతుఁడు

సురుచిర శివసమ – సుఖ సంధానుఁడు

పరమ పరాపర – భరితజ్ఞానుఁడు

విదితానందా-న్వీత మనస్కుఁడు

సదమల విపుల వి-శాల యశస్కుఁడు

శ్రీవిలసిత పద – చిరతర భద్రుఁడు

గావున సాక్షాత్ – కలియుగ భద్రుఁడు – (పాల్కురికి సోమనాథుడు)


బెల్ సంఖ్యలు


గణితశాస్త్రములో బెల్ సంఖ్యలు (Bell numbers) అని ప్రత్యేకమైన సంఖ్యలు ఉన్నాయి. వీటి విలువలు Bn 1, 1, 2, 5, 15, 52, 203… అనగా, B0=1, B1=1, B2=2, B3=5, B4=15, B5=52 … ఒక గణనీయ సమితిలో (set) n సంఖ్యలు ఉంటే వాటిని ఎన్ని విధములుగా విభజించ వీలగునో అనే విషయమును ఈ బెల్ సంఖ్యలు తెలుపును. వీటిని జ్యామితీయ రూపములో (geometrical method) చూపు విధానమును చిత్రములో చూపబడినది. B5 చిత్రము వికీనుండి గ్రహించబడినది, మిగిలినవి నేను చిత్రించాను. ఇందులో B2=2, B3=5, B4=15, B5=52 సంఖ్యల విభజన విధానము చూపబడినది. ఛందస్సును గుఱించి మనము ఇక్కడ చర్చిస్తున్నాము కనుక ఈ చిత్రములోని బిందువులు పాదములతో సమానము. వాటిని కలిపినప్పుడు మనకు ప్రాస ఉంటుంది, లేనప్పుడు ప్రాస లేదు. ఈ ప్రాస ద్వితీయాక్షర ప్రాస లేక అంత్యప్రాసగా ఉండ వచ్చును. ద్వితీయాక్షర ప్రాస అన్ని పాదములకు ఒక్కటే కావున అంత్యప్రాసను గుఱించి మాత్రమే ఇక్కడ చర్చిస్తున్నాను. ఇక్కడ ద్విపద, త్రిపద, చతుష్పదలను మాత్రమే నేను చర్చించబోతున్నాను. ద్విపదకు రెందు విధములైన ప్రాసలు, త్రిపదకు ఐదు విధములైన ప్రాసలు, చతుష్పదికి 15 విధములన ప్రాసలు సాధ్యము. ఇందులో ప్రాస లేమి కూడ ఒక విధమైన ప్రాసగా పరిగణించబడుతుంది. అంత్యప్రాసలను ఆంగ్లములోవలె a, b, c, d అక్షరములతో గుర్తించినాను. abab అనగా మొదటి మూడవ పాదములకు, రెండవ నాలుగవ పాదములకు అంత్యప్రాస అని అర్థము. వీటిని చదువునప్పుడు చిత్రములోని అమరికలను గమనించండి. క్రింద నా ఉదాహరణములు:


ఏకపది

ఇందులో ఒక పాదము మాత్రమే, కావున అంత్యప్రాస అసలు ఉండదు. ఉదా. శ్రీకృష్ణార్పణమస్తు.


ద్విపది

ద్విపదులకు రెండు విధములుగా మాత్రమే ప్రాస సాధ్యము.


1. ab – ప్రాసలోపము

ద్విపద – ఇం/ఇం – ఇం/సూ (సూ – సూర్య గణము, ఇం – ఇంద్ర గణము)

మనసూఁగెఁ దనువూఁగె – మమతతో నాకు

వనజాక్ష నీవె నా – ప్రణయంపు సొమ్ము


2. aa –

ద్విపద – ఇం/ఇం – ఇం/సూ

సిరి రామ జయరామ – చెలువాల రామ

చరణాల భజియింతు – జలధర శ్యామ


త్రిపది

త్రిపదులకు ఐదు విధములుగా అంత్యప్రాసలను ఉంచవచ్చునన్న విషయమును త్రిపదులైన గాయత్రీ ఛందము, కర్ణాటక త్రిపదులతో తెలుపుతున్నాను.


గాయత్రీ ఛందము – పాదమునకు 8 అక్షరములు, చివరి నాలుగు అక్షరములు రెండు లగములుగా నుండాలి. ప్రారంభములో న-గణము ఉండరాదు.


కర్ణాటక త్రిపది – ఇం/ఇం – ఇం/ఇం (ప్రాసయతి) // ఇం/సూ – ఇం/ఇం // ఇం/సూ/ఇం (// పంక్తుల విభజనను సూచించును)


1. abc – ప్రాసలోపము

గాయత్రి –

ఏకాంతమైన రాత్రిలో

రాకాశశిని జూడఁగాఁ

గాకుండె మేఘమడ్డమై


త్రిపది –

కనులతో నిను జూచి – మనసులో నిను దాఁచి

వినుచుంటి నీదు – ప్రేమస్వరము నేను

తనువెల్ల నీవె, నీవెరా


2. abb –

గాయత్రి –

నిధి నాకిల నీవెగా

మధువైరి ముకుంద రా

సుధ బిందువు చింద రా


త్రిపది –

అమవాస రాత్రిలో – నమరు నక్షత్రాల

విమలమౌ శశిని – బ్రేమతో నూహింతు

రమణు నామదిని దర్శింతు


3. aba –

గాయత్రి –

అందమ్ములకు ఱేఁడుగా

సౌందర్యముల రాశి, రా

సుందరా నాకుఁ దోడుగా


త్రిపది –

సొగసు నిండిన సామి – రగిలించె డెందమ్ము

పొగలతో మొగము – ముకురానఁ గనరాదు

వగలతోఁ గూడె నందమ్ము


4. aab –

గాయత్రి –

నును వెన్నెల ఛాయలోఁ

గనిపించని మాయలో

వనజాక్షుని ముద్దులే


త్రిపది –

నీతోడ నిజముగాఁ – జేతు నే వాదమ్ము

నాతురాన విన – నందమౌ నాదమ్ము

చేతమ్మవంగ నబ్జమై


5. aaa –

గాయత్రి –

దేవ రావేల బంధువై

జీవ కారుణ్య సింధువై

భావరుగ్మంపు మందువై


త్రిపది –

గగనమ్ము నిండె నా – పొగమంచుతోఁ జూడు

సిగరమ్ము లేదు – చెలువాలతో నేఁడు

జగమయ్యె నావిరికి వీడు


చతుష్పది

చతుష్పదికి 15 విధములుగా ప్రాస సాధ్యము. వేఱువేఱు ఛందములలో ఉదాహరణములు ఇవ్వబడినవి.


1. abcd – ప్రాసలోపము

ఇంద్రవజ్ర త/త/జ/గగ UUI UU – IIUI UU

ఆనంద రూపా – అవినాశ తేజా

గానస్వరూపా – కరుణాంతరంగా

నీనామమేగా – నిఖిలమ్ము మాకున్

శ్రీనాథ రావా – చిఱునవ్వు తేవా


2. aabc –

స్రగ్విణి (ర)2 -(ర)2 UIU UIU – UIU UIU

ముందుగా రమ్ము స-మ్మోహనా మాధవా

సుందరుం డీవె నా – శోభలో యాదవా

వందన మ్మిత్తురా – పాదముల్ గొల్తురా

నందగోపాలకా – నాదరూపాత్మకా


3. abbc –

ఉత్పలమాల భ/ర/న – భ/భ/ర/లగ UII UIU III – UII UII UIUIU

లెమ్మిఁక నిద్రనుండి చెలి – లెమ్మిది మార్గశిరమ్ము హాయిగాఁ

గమ్మఁగ సెజ్జపైఁ గడు సు-ఖమ్ముగ దొర్లెదవేల కామినీ

రమ్ము రయమ్ముగా మనము – రంజిలి స్నానములాడ భామినీ

యిమ్ముగ మాధవున్ గొలువ – నిప్పుడు వేళ యుషోదయమ్ములో


4. abcc –

మందారదామము ర/ర – ర/గగ UIU UIU – UIU UU

శ్రీధరా చిన్మయా – సిద్ధ సంకల్పా

మాధవా కేశవా – మాకు సర్వమ్మై

రాధికాలోల చే-రంగ రా రంగా

సాధుసంపూజితా – స్వామి నీలాంగా


5. abca –

తోటకము స/స – స/స IIU IIU – IIU IIU

కమలమ్ములతోఁ – గమలాకరముల్

రమణీయము లో – రమణీ కనుమా

భ్రమరమ్ములె యీ – వన సూనములన్

నమియించును గ-న్నయ నా కరముల్


6. abac –

మధ్యాక్కర ఇం/ఇం/సూ – ఇం/ఇం/సూ

ఈనాఁటి యీహాయి చెలియ – యేనాఁడు కనలేము మనము

గానమ్ము పాడంగ మీటు – గంధర్వ వీణియన్ దీటు

తేనియన్ ద్రావు నీ చెవులు – తీయఁగా మార సుస్వనము

వానగా మారు నీ వలపు – వాణిగా మారు నీ తలఁపు


7. abcb –

స్వాగతము ర/న – భ/గగ UIUIII – UII UU

రాగరంజితము – రాసపు లీలల్

భోగరంజితము – మోహన గీతుల్

త్యాగరంజితము – ధన్యుల చేఁతల్

యోగరంజితము – యోగ్యుల నీతుల్


8. aabb –

చతుష్పదిగా ద్విపద ఇం/ఇం – ఇం/సూ

శరణమ్ము నీవంటి – శారదా వాణి

వరవీణ మీటుమా – వరద గీర్వాణి

దరి నీవె మాకు స-త్వరము రా తల్లి

స్మరణమ్ము నీపేరె – స్వరరాగవల్లి


9. abba –

ఉత్సాహ (సూ)4 – (సూ)3/గ

నేను లేను వెదకుటేల – నిజముగాను గుడులలో

నేను గలను నన్ను జూడు – నీవు చదువు గదులలో

కానలేవు నన్ను నీవు – గంగ వోలు నదులలో

నేను గలను నన్ను జూడు – నీవు పలుకు నుడులలో


10. abab –

ఆటవెలఁది (సూ)3 – (ఇం)2 // (సూ)3 – (సూ)2 (// పంక్తుల విభజనను సూచించును)

చాల ప్రొద్దు గడచెఁ – జలియయ్యె నీధాత్రి

లాలి నల్లనయ్య – రామభద్ర

నేల నింగి యెల్ల – నిదురించె నీరాత్రి

పూల కనులు మూసి – పొమ్ము నిద్ర


11. abbb –

మధురాక్కర – సూ/ఇం/ఇం – ఇం/చం

నన్ను పాలింప రమ్మురా – నాదేవ నగుమోముతో

తెన్ను క్రొత్తఁగా నిమ్మురా – దీపాల వెలిగింతురా

కన్నె గాన సంద్రమ్మురా – కవితతోఁ బలికింతురా

విన్నపమ్ములన్ నమ్మురా – ప్రేమలోఁ గులికింతురా


12. abaa –

కందము –

సుందర రాసవిహారీ

నందాత్మజ నాట్యలోల – నరకధ్వంసా

బృందావనసంచారీ

సందియమా సర్వ మీవె – జయ మల్లారీ


13. aaba –

తేటగీతి – సూ/ఇం/ఇం – సూ/సూ

కనులకింపైన దైవమా – కనఁగ రమ్ము

దినము నీరూపె మదిలోన – దేవ నమ్ము

తనరు నీనామ మాకల్ప – తరువు మాకు

ధనము వేఱేల చూపు శ్రీ-ధర ముఖమ్ము


ఈ aaba అంత్యప్రాస పారసీక, ఉర్దూ భాషలలోని రుబాయీలలో వాడుతారు. చతుష్పదులైన రుబాయీలను 24 విధములుగా వ్రాయ వీలగును. అందులో ఒక దానిని క్రింద చదువవచ్చును.


వ్యావహారిక భాషలో ఒక రుబాయీ –

నీలమ్మగు నింగిలోన – నీకై వెదికా

నీలమ్మగు సంద్రమందు – నీకై వెదికా

నీలమ్మగు చుక్కఁ బిల్చి – నీకై యడిగా

నాలో ధ్వని యొండు చెప్ప – నన్నే వెదికా


14. aaab –

పంచమాత్రల చతుష్పది (పం)2 – (పం)2

నిను జూడ మనసులో – నెఱయైన యందమ్ము

కనుపాప నీవె నా – కన్నులకు చందమ్ము

వినుమయ్య కన్న నీ – ప్రేమ యానందమ్ము

వనజాక్ష నీవె నా – వలపునకు మందురా


15. aaaa –

చతుర్మాత్రల చతుష్పది (చ)2 – (చ)2 [రెండు మధురగతి రగడలు]

పొందిక పదములు – పులకల యానము

ఛందపు సొంపులు – చక్కని గానము

విందిడు హాయియు – వెన్నెల స్నానము

సుందర కవనము – సోమపు పానము


షట్పది

ఆఱు పాదములు కలిగిన షట్పదికి 203 విధములుగా ప్రాస సాధ్యము. కాని ఉప(అంశ)గణములతో లేక మాత్రాగణములతో నిర్మించబడిన షట్పదులలో 1, 2, 4, 6 పాదముల అమరిక ఒక విధముగా ఉంటే, 3, 6 పాదముల అమరిక మఱొక విధముగా నుంటుంది. మూడవ, ఆఱవ పాదములకు అంత్యప్రాస రెండు విధములుగా సాధ్యము (ప్రాసను ఉంచుట లేక ప్రాసను ఉంచకుండుట). 1, 2, 4, 6 పాదములకు చతుష్పదివలె 15 విధములుగా అంత్యప్రాస సాధ్యము. కావున షట్పదికి ఇట్టి విభజనతో 30 విధములుగా అంత్యప్రాస సాధ్యము.


ముగింపు

ఒకటినుండి నాలుగు పాదములు కలిగియున్న పద్యములకు అంత్యప్రాసలు ఎన్ని విధములుగా వీలగునో అన్న విషయమును Bell numbers ద్వారా వివరించబడినవి.


జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...





విలోమ వృత్తములు - Must Read Article 

++

ఒక వృత్తములోని అమరికలో గురులఘువులను తారుమారు చేయగా జనించిన వృత్తమును విలోమ వృత్తము అని నేను పిలువ దలచినాను. ఇట్టి ప్రస్తావన నాకు తెలిసి ఇంతవఱకు ఎక్కడ చదువలేదు. క్రింద ఒక ఉదాహరణము - 

++

UII UII UII UII - మోదకము - 12 జగతి 3511 

IUU IUU IUU IUU - భుజంగప్రయాతము - 12 జగతి 586 

++

ఇందులో మఱొక విశేషమేమనగా, రెండు విలోమ వృత్తముల సంఖ్యను కూడిక చేసి, అందులోనుండి 1 తగ్గించగా వచ్చిన సంఖ్య ఎప్పుడు 2^n where n = ఆ ఛందములోని అక్షరముల సంఖ్య. పై ఉదాహరణములో పాదమునకు 12 అక్షరములు ఉండే జగతి ఛందములో n = 12. 3511 + 586 - 1 = 4096 = 2^12. క్రింద కొన్ని ఉదాహరణములు - 

++

1) 

విద్యున్మాలా - మ/మ/గగ 

8 అనుష్టుప్పు 1 

++

ఛాయారేఖల్ - సంధ్యన్ నిండెన్ 

మాయాజాలం - బయ్యెన్ ధాత్రిన్ 

శ్రేయ మ్మీవే - శృంగారీ రా 

శ్రీదేవీ నా - చింతల్ దీర్చన్ 

++

కృతయుః - న/న/లల 

8 అనుష్టుప్పు 256 

++

చినచిన - చినుకుల 

చెనుకులు - చెలువము 

నిను గను - నిముసము 

మనమున - మధురము 

++

256 + 1 - 1 = 256 = 2^8

++

2) 

తోటకము - స/స - స/స 

12 జగతి 1756 

++

కమలాకుచ శ్రీ-కర కుంకుమముల్ 

రమణీయముగా - రహి నీయెదపై 

కమలమ్ములె యా - కనుదోయి గదా 

మము గావఁగ రా - మరుఁదండ్రి సదా 

++

సారంగము - త/త - త/త 

12 జగతి 2341

++

రంగా యనంగాను - రాగమ్ము నాలోన 

శృంగమ్ముపై నెక్కు - శృంగారితాపాంగ 

సంగీత సాహిత్య - సమ్రాడ్యశోవార్ధి 

మంగేశ సర్వేశ - మన్నించుమా దేవ 

++

1756 + 2341 - 1 = 4096 = 2^12

++

3) 

మోదకము - భ/భ - భ/భ 

12 జగతి 3511    

++

రంగుల పువ్వుల - రాశుల యామని 

పొంగిడు మోదపు - పున్నమి యామిని 

శృంగపు టంచుల - శ్వేత హిమమ్ములు 

రంగని సుందర - రాస రవమ్ములు 

++

భుజంగప్రయాతము - య/య - య/య 

12 జగతి 586 

++

తరించంగ నౌనా - తపించంగ నీకై 

భరించంగ లేనే - వ్యధల్ దాళలేనే 

స్మరించంగ నిన్నే - జయమ్మిందు లేదే 

వరించంగ రావా - ప్రమోదమ్ము నీవా 

++

3511 + 586 -1 = 4096 = 2^12

++

4) ఇప్పుడు శార్దూలవిక్రీడితమునకు విలోమవృత్తమును కల్పించుదామా? 

++

శార్దూలవిక్రీడితము - మ/స/జ/స - త/త/గ UUU IIU IUI IIU - UUI UUIU 

19 అతిధృతి 149337

++

రాధామాధవకేళిలోన రసముల్ - రాజిల్లు రమ్యమ్ముగా 

మాధుర్యంబన నద్దియే జగములో - మైకమ్ము మౌనమ్ములే 

రాధాదేవిని గొల్వ మాధవుని నా-రాధించునట్లే కదా 

యీధాత్రిన్ గల ప్రేమరూపుల సదా - యీనేను బ్రార్తించెదన్ 

++

కైవల్యము - న/త/ర - త/స/స/ల III UUI UIU - UUI IIU IIUI 19 అతిధృతి 374952 

++

గళములోనుండు నాదమే - గానమ్ము లలితో మురిపించు 

చెలిమిలోనుండు స్వేచ్ఛయే - స్నేహంపు సుధలన్ గురిపించు 

కలిమిలోనుండు దానమే - కైవల్య పథమున్ దను జూపు 

బలిమిలోనుండు న్యాయమే - భాసించి జయమున్ దరి చేర్చు 

++

149337 + 374952 - 1 = 524288 = 2^19

++ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

8


శ్రీకరమ్మై యీయుమా 


మృష్టపాదా - ర/త/గ (ఆధారము - వాగ్వల్లభ) 

7 ఉష్ణిక్కు 35 

++

మృష్టపాదా వేగ మా 

కష్టముల్ ద్రోయంగ రా 

యిష్టముల్ పూరించఁగా 

వృష్టిగా సంతుష్టిగా 

++

ధాత్రిపై శోభించఁగా 

నాత్రమై వీక్షింతు మీ 

రాత్రిలో మేమో ప్లవా 

మాతృకా కాపాడుమా 

++

మాకు నీవారోగ్యమున్ 

మాకు నీవైశ్వర్యమున్ 

మాకు నీవానందమున్ 

శ్రీకరమ్మై యీయుమా 

++

ప్రభవాది వర్షములలో ప్లవ 35వ ఏడు. 

++

ప్లవంగమ - ష/ష - ష/లగ మాత్రలు, అంత్యప్రాస (ఆధారము - ప్రాకృత పైంగళము) 

++

చైత్రపు నెల వచ్చె నేఁడు - సంతస మీయఁగా 

చిత్రముగా నవవర్షము - చెలువిడుఁ దీయఁగా 

గాత్రముతో శుకపికములు - కమ్మఁగఁ బాడఁగా 

నేత్రములకు నానందము - స్నేహితు లాడఁగా 

++

శార్వరి యన నిక్కట్టులె - శార్వరీ చనుమా 

శార్వరి యన మరణమ్ములె - శార్వరీ చనుమా 

శార్వరి యన నింటి చెఱయె - శార్వరీ చనుమా 

ఉర్వికింక ప్లవయు వచ్చె - నొప్పుగా మనుమా 

++

ఆమనిలో నందముగా - నాశలు పూయునో 

కోమలమై నవకవితలు - గుండెలు వ్రాయునో 

నామనమను కోవెలలో - నగధరుఁ డాడునో 

ప్రేమముతోఁ గ్రొత్త యేఁడు - ప్రియముగఁ బాడునో 

++

కం. కప్పవొ కోఁతివొ గొఱ్ఱెవొ 

చెప్పుమ నీవేమి ప్లవమ - చెలువముతో నీ 

విప్పుడు చేరితి వీధర 

తెప్పగ దాటించు మమ్ము - తిమ్మనతోడన్ 

++

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు




 #వివిదఫలాలనైవేద్యం  #ఫలితాలు


 కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.


 అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.


 నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.


 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.

 

మామిడి పండు. -  మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.


 అంజూర  పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

 

సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.

 

యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.

 

కమలా పండు. -  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.


 పనసపండు -  పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.


..

కధ  నిజ మాయనే  బతుకు నేర్పుకు ఆకలి నీరు దేనికిన్ 

విధి ఒక తీర్పులే నిజము తెల్పుట మానస మాయ కాలమున్ 

నిధి ఒక ఆశలే బతుకుమార్పులు  కాలము చేయు గాధయున్ 

మద గజ  యానకుం రవిక మాత్రమె చాలును  చీర యేటికిన్.. 


కల నిజ మాయనే మనసు మార్పుకు ఆశగ ఉండు దేనికిన్ 

వల పుల ఆటలే వయసు వేటకు మార్గము అవ్వు దేనికిన్   

పలుకుల మాటలే సొగసు కోరును నేర్పుగ ఉండు దేనికిన్ 

అలకల తీర్పులే హాయిని గొల్పును ఎప్పుడు ఔను దేనికిన్ 


చిరునగవే ఇదీ మదిలొ మండియు మాధుర మేది లేదియున్ 

విరి జతవై మదీ మలుపు మోసము చేసిన ఏమి చేయుదున్ 

సరియగునే నదీ తలపు వేషము  వేసిన చేయ నేదియున్    

తరుణము నీదియే కధలు చెప్పిన నమ్మియు పల్కు లెప్పుడున్ 


ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవుతున్నారో.. అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు.

 మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు ? అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు.

 నిజాన్ని పరిశీలిస్తే…పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. 

 మన కాళ్ళు.. ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు. 

 మన చేతులు.. కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు. 

 మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినినిbఆశ్రయించవలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారు కదా.. అని మీరు అడగవచ్చు 


కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు. 

 మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి. ‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు.

చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది. మరి మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా ? అన్నదే ఈనాటి మన ప్రశ్న! 

 పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ… వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి.


ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు ? 

ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం. 

వాయువు కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ. 

అగ్ని కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు. 

జలము కు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము (రుచి)లు. 

భూమి కి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ, రూప, రస, గంథాలు. ఈ ఐదు గుణాలూ...పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం. 

 జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము. 

 అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది. 

 వాయువు…‘రస, గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. 

 ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించ కుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది. 

 కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు… ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు ? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి.


అంటే ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు.అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించు కుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే !

 ‘ నిన్ను నీవు తెలుసుకోవడమే’ "దైవాన్ని దర్శించడమంటే".అదే దైవ సాక్షాత్కారం. 

--(())--

   



వర్తమానం


నిన్న జరిగిపోయింది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. నేడు నిజం, ఈ గంట నిజం. ఈ క్షణం నిజం. ఇది వర్తమానం. మరుక్షణమే అది గతమైపోతోంది... భవిష్యత్తు వూహల్లో వూరిస్తూ ఉంటోంది. ఎందరో తాత్వికులు ‘వర్తమానంలో జీవించు’ అని బోధిస్తుంటారు. వర్తమానం నిశ్చల ఛాయాచిత్రంలా ఉండదు. కదిలి పోతుంటుంది. కాలం ఎవరి కోసమూ ఆగదు. పరుగులు తీస్తూనే ఉంటుంది. వర్తమానం గురించి మాట్లాడుకునే లోపే అది గతమై జ్ఞాపకంలో నిలుస్తుంది.


ఒక గదిలో కూర్చుని కిటికీలోంచి చూస్తున్నప్పుడు సన్నటి వర్షపు తుంపర గడ్డిపూల మీద పడుతోంది... తుమ్మెదలు ఎగురుతున్నాయి. దృశ్యం తరవాత దృశ్యం కదలి పోతోంది... అది వర్తమానమా గతమా... ఇలా మారిపోతున్న దృశ్యాలు కోకొల్లలు... నేడు, నిన్న, రేపు... పుట్టుక, మరణం, పుట్టుక...




మరి వర్తమానం మాటేమిటి? దాన్ని పట్టుకోవాలనే ఉబలాటంలోనే ధ్యానం సాగుతుంది. ధ్యానం వర్తమానం. అది నిత్యనూతనం. కళ్లు మూసుకొని కాలాతీతమై పోవాలి. అప్పుడు మూడు కాలాలు ఒక్కటై పోతాయి. ఆనందసాగరంలో ఓలలాడతాం. కళ్లు తెరచి ఉన్నప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ, ఎవరితో ఉంటే వాళ్లతో వైరుధ్యాలకు అతీతంగా కలిసిపోవాలి. కలుపుగోలుగా ఆ క్షణాలను పండించుకొని బంధాలు కలుపుకొని ముందుకు సాగాలి. అదే ఆనంద వ్యవసాయం. చిన్న చిన్న విషయాల్లో కూడా తృప్తిని, ఆనందాన్ని పొందాలి. ఇలా వర్తమానం సాగాలి. రేపటికి మంచి స్మృతిని పదిలపరచుకోవాలి.


దివ్యత్వం ప్రకృతి రూపంలో ప్రతి క్షణం మాట్లాడుతోంది. మన మనసు పరధ్యానంలో పడిపోయి అవకాశాలను వదులుకుంటోంది. అటు జరిగిన దానిలోనో, ఇటు జరగబోయే దానిలోనో మనసు వూయలలూగి వర్తమాన క్షణాలను చెయ్యి జార్చు కుంటోంది. వేరే మాటల్లో కాలం కరిగిపోతోంది.


రాముడి గురించి చదువుతున్నప్పుడు మనసంతా ఆయనే నిండిపోవాలి. ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో మునిగిపోవాలి. తల దువ్వుకుంటున్నప్పుడు జుత్తు, దువ్వెన తప్ప తలలో రెండో ఆలోచన ఉండకూడదు. కాలం, ప్రకృతి, దివ్యత్వం ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటాయి. సరికొత్తగా ముస్తాబవుతుంటాయి. వర్తమానంలో ఉంటాయి. కలవాలనే ఇచ్ఛ మనకు ఎంత గాఢంగా ఉంటే అంత గాఢంగా మనం వాటిలో లీనమవగలం. ఈ రహస్యం తెలిసినవాడు సంతోషాన్ని నెమలి పింఛంగా ధరించి శ్రీకృష్ణుడిలా నిత్య వర్తమానంలో విహరిస్తాడు.


కాలం నుంచి తప్పించుకుపోయినప్పుడు ఎంతో ఆనంద పారవశ్యం కలుగుతుంది. మనసులో బొమ్మలన్నీ మాయమైపోతాయి. అవి ఉంటే కాలం ఉంటుంది. అవి అంతరించి పోయినప్పుడే కాలం కూడా అంతరించి పోతుంది. నిర్మల ‘వర్తమానం’ మాత్రం మిగులుతుంది.


వర్తమానం అన్నది కాలంలో ఓ భాగంగా భాషలో మాత్రమే ఉంటుంది.


 వాస్తవంలో వర్తమానం కాలానికి అతీతంగా ఉంటుంది. ఆ "వర్తమానంలో ఉండటమే ఆత్మస్థితి"లో ఉండటం.




🌹. 64 కళలు వివరణ సహితం  🌹

📚. ప్రసాద్ భరద్వాజ


1.    గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది),

2.    వాద్యము (ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు ),

3.     నృత్యము (భావాభినయము),

4.    అలేఖ్యము (చిత్రలేఖనము),

5.    విశేషకచ్ఛేధ్యము (తిలక-పత్రభంగాది రచన),

6.    తండులకుసుమ బలివికారములు (బియ్యపుపిండితో, పూలతో భూతతృప్తి కొఱకు పెట్టెడి ముగ్గులు),

7.    పుష్పాస్తరణము (పూలశయ్యలను, అసనములను ఏర్పఱచుట),

8.    దశన వసనాంగరాగము (దంతములకు, వస్త్రములకు రంగులద్దుట),

9.    మణిభూమికాకర్మ (మణులతో బొమ్మలను చేయుట),

10.    శయన రచనము (ఋతువుల ననుసరించి శయ్యలను కూర్చుట),

11.    ఉదక వాద్యము (జలతరంగిణి),

12.    ఉదకాఘాతము (వసంతకేళిలో పిచికారుతో నీళ్ళు చిమ్ముట),

13.    చిత్రయోగములు (రకరకముల వేషములతో సంచరించుట),

14.    మాల్యగ్రథన వికల్పములు (చిత్ర విచిత్రములైన పూలమాలలను కూర్చుట),

15.    శేఖరకాపీడ యోజనము (పూలతో కిరీటమును, తలకు చుట్టును అలంకరించుకొనెడి పూల నగిషీని కూర్చుట),

16.    నేపథ్య ప్రయోగము (అలంకరణ విధానములు),

17.    కర్ణపత్రభంగములు (ఏనుగు దంతములతోను శంఖములతోను చెవులకు అలంకారములను కల్పించుకొనుట),

18.    గంధయుక్తి (అత్తరువులు మొదలగునవి చేసే నేర్పు ),

19.    భూషణ యోజనము (సామ్ములు పెట్టుకొను విధానము ),

20.    ఇంద్రజాలములు (చూపఱుల కనులను భ్రమింప జేయుట),

21.    కౌచిమారయోగము (సుభగంకరణాది యోగములు),

22.    హస్త లాఘవము (చేతులలోనున్న వస్తువులను మాయము చేయుట),

23.    విచిత్ర శాఖయూష భక్ష్యవికారములు (రకరకముల తినుబండములను వండుట),

24.    పానక రసరాగాసవ యోజనము (పానకములు, మద్యములు చేయుట),

25.    సూచీవానకర్మ (గుడ్డలు కుట్టుట),

26.    సూత్రక్రీడ (దారములను ముక్కలు చేసి, కాల్చి మరల మామూలుగా చూపుట),

27.    వీణాడమరుక వాద్యములు (ఈవాద్యములందు నేర్పు),

28.    ప్రహేళికలు (సామాన్యార్థము మాత్రము పైకి కనబడునట్లును, గంభీరమైన యర్థము గర్భితమగునట్లును కవిత్వము చెప్పుట),

29.    ప్రతిమాల (కట్టుపద్యములను చెప్పుట),

30.    దుర్వాచక యోగములు (విలాసము కొఱకు క్లిష్ట రచనలను చదువులట),

31.    పుస్తక వాచకము (అర్థవంతముగా చదివెడి నేర్పు),

32.    నాటకాఖ్యాయికా దర్శనము (నాటకములకు, కథలకు సంబంధించిన జ్ఞానము ),

33.    కావ్యసమస్యాపూరణము (పద్యములతో సమస్యలను పూరించుట),

34.    పట్టికా వేత్రవాన వికల్పములు (పేముతో కుర్చీలు, మంచములు అల్లుట),

35.    తక్షకర్మ (విలాసము కొఱకు బొమ్మలు మొదలైనవి చేయుట),

36.    తక్షణము (కఱ్ఱపని యందు నేర్పు),

37.    వాస్తువిద్య (గృహాదినిర్మాణ శాస్త్రము ),

38.    రూప్యరత్నపరీక్ష (రూపాయలలోను, రత్నములలోను మంచి చెడుగులను పరిశీలించుట),

39.    ధాతువాదము (లోహములుండెడి ప్రదేశములను కనుగొనుట),

40.    మణిరాగాకర జ్ఞానము (మణుల గనులను కనిపెట్టుట),

41.    వృక్షాయుర్వేద యోగములు (చెట్లవైద్యము),

42.    మేషకుక్కుటలావక యుద్ధవిధి (పొట్టేళ్ళు, కోళ్ళు, లావుక పిట్టలు మొదలగు వానితో పందెములాడుట),

43.    శుకశారికా ప్రలాపనము (చిలుకలకు, గోరువంకలకు మాటలు నేర్పుట),

44.    ఉత్సాధన, సంవాహన, కేశమర్దన కౌశలము (ఒళ్ళుపట్టుట, పాదములోత్తుట, తలయంటుట వీనియందు నేర్పు),

45.    అక్షరముష్టికా కథనము (అక్షరములను మధ్య మధ్య గుర్తించుచు కవిత్వము చెప్పుట),

46.    మ్లేచ్ఛితక వికల్పములు (సాధుశబ్దమును గూడ అక్షర వ్యత్యయము చేసి అసాధువని భ్రమింపజేయుట),

47.    దేశభాషా విజ్ఞానము (బహుదేశ భాషలను నేర్చియుండుట),

48.    పుష్పశకటిక (పూలతో రథము, పల్లకి మొదలగునవి కట్టుట),

49.    నిమిత్త జ్ఞానము (శుభాశుభ శకునములను తెలిసియుండుట),

50.    యంత్ర మాతృక (యంత్ర నిర్మాణాదులు),

51    ధారణ మాతృక (ఏకసంధా గ్రహణము),

52.    సంపాఠ్యము (ఒకడు చదువుచుండగా పలువురు వానిననుసరించి వల్లించుట),

53.    మానసీక్రియ (మనస్సుయొక్క అవధానమునకు సంబంధించిన క్రియ),

54.    కావ్యక్రియ (కావ్యములను రచించుట),

55.    అభిధాన కోశచ్ఛందో విజ్ఞానము (నిఘంటువులు, ఛందోగ్రంథములు-వీని పరిజ్ఞానము),

56.    క్రియాకల్పము (కావ్యాలంకార శాస్త్ర పరిజ్ఞానము),

57.    ఛలితక యోగములు (మాఱువేషములతో నింకొక వ్యక్తివలె చలామణి యగుట),

58.    ద్యూతవిశేషములు (వస్త్రములను మాయము చేయుట మొదలగు పనులు),

59.    ద్యూతవిశేషములు (జూదము లోని విశేషములను తెలిసికొని యుండుట),

60.    ఆకర్షక్రీడలు (జూదములందలి భేదములు),

61    బాలక్రీడనకములు (పిల్లల ఆటలు),

62.    వైనయిక జ్ఞానము (గజ అశ్వ-శాస్త్ర పరిజ్ఞానము),

63.    వైజయిక విద్యలు (విజయసాధనోపాయములను తెలిసియుండుట),

64.    వ్యాయామిక జ్ఞానము (వ్యాయామపరిజ్ఞానము).

🌹 🌹 🌹 🌹 🌹