25, జులై 2020, శనివారం

ప్రాంజలి ప్రభ - అంతార్జాల పత్రిక పచ్చళ్ళు


ప్రాంజలి ప్రభ - అంతార్జాల పత్రిక పచ్చళ్ళు 
సేకరణ/ చ్చాయట: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

కొబ్బరి పచ్చడి వాన పడుతుంది హడావుడిగా చేశాను వీడియెూలేదు మామూలుగానే
కొబ్బరి
పచ్చిమిర్చి
ఉప్పు
పసుపు
మెంతిపిండి 
బెల్లం
తాలింపులో
పచ్చి పప్పు
చాయపప్పు
ఆవాలు
జీలకర్ర
ఇంగువ
నూనె
కరేపాకు
కొతిమీర
ఈపదార్ధాలనుపయెూగించాను
మీ అందరికీ తెలిసిందే

వాము ఆకుతో  రోటి పచ్చడి .
వాము ఆకు అప్పుడప్పుడు  వాడితే ఆరోగ్యానికి  చాలా మంచిది .
కనీసం మూడు నెలలకు ఒక్కసారి  అయినా  వాము పొడి  కాని  వాము ఆకు కాని  వాడితే  ఉదరం శుభ్ర పడుతుంది .
ఈ వాము ఆకుతో చాలా మంది బజ్జీలు వేసుకుంటారు .
వాము ఆకుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు .
కావలసినవి .
వాము ఆకులు  --  షుమారు 35 
చింతపండు  --  నిమ్మకాయంత. విడదీసి ఉంచుకోవాలి .
నూనె --  మూడు  స్పూన్లు 
ఎండుమిరపకాయలు  -  10
మెంతులు --  అర స్పూను 
ఆవాలు  --  అర స్పూను 
పసుపు  --  కొద్దిగా 
ఇంగువ --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత
తయారీ విధానము .
నువ్వుపప్పు  - 50 గ్రాములు .
నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించి చల్లారిన తర్వాత రోటిలో పొడి కొట్టుకుని  విడిగా  వేరే ప్లేటు లోకి తీసుకుని  ఉంచుకోవాలి .
ముందుగా  వాము  ఆకులను  కడిగి  శుభ్రం చేసుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి  స్పూనున్నర  నూనె వేసి నూనె బాగా కాగగానే  ముందుగా  మెంతులు తర్వాత  ఎండుమిరపకాయలు ,  ఆవాలు మరియు  ఇంగువ  వేసి పోపు వేయించుకొని  వేరే ప్లేటులోకి  విడిగా  తీసుకోవాలి .
తర్వాత తిరిగి  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన నూనె వేసి నూనె బాగా కాగగానే  వాము ఆకులు  మరియు కొద్దిగా  పసుపు వేసి  ఒక అయిదు నిముషాలు  ఆకును బాగా మగ్గనివ్వాలి.
తర్వాత  రోటి లో  వేయించి సిద్ధంగా  ఉంచుకున్న పోపు, చింతపండు  మరియు తగినంత  ఉప్పువేసి  మెత్తగా  పచ్చడి బండతో దంపుకోవాలి .
తర్వాత  మగ్గిన  వాము ఆకును కూడా వేసి పచ్చడి బండతో మెత్తగా  దంపుకోవాలి.
ఆ తర్వాత వేయించి సిద్ధంగా  ఉంచుకున్న  నువ్వుల పొడి కూడా వేసి , బండతో మెత్తగా  నూరుకోవాలి .
తర్వాత  వేరే గిన్నె లోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచికరమైన  వాము ఆకు  రోటి పచ్చడి  సర్వింగ్  కు సిద్ధం.
ఈ పచ్చడి మొదటగా  వేడి వేడి అన్నంలో  నెయ్యి వేసుకుని  తింటే  చాలా రుచిగా  ఉంటుంది.


రోటిపచ్చళ్ళు .
పాత చింతకాయ పచ్చడితో తీపి రోటి పచ్చడి .
మా చిన్నతనంలో  అమ్మమ్మ గారు , ఆ రోజుల్లో  పాత  చింతకాయ తో  తీపి  రోటి పచ్చడి  చేసే వారు.
ఈ విధముగా  చేసిన పచ్చడి  చాలా రుచిగా ఉండేది.
వేడి వేడి అన్నంలో  నెయ్యి  వేసుకుని  తినడానికి  మరియు దోశెలు  గారెల లోకి  కూడా  ఈ పచ్చడి  చాలా రుచిగా  ఉంటుంది .
తయారీ విధానము .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  అయిదు  స్పూన్లు   నూనె  వేసి  నూనె బాగా కాగగానే  పది ఎండు మిరపకాయలు ,  అర స్పూను  మెంతులు ,  స్పూనున్నర  మినపప్పు ,  అర స్పూను  ఆవాలు, కొద్దిగా  ఇంగువ  వేసి  పోపు వేయించుకోండి .
ఒక  కప్పు  పాత  చింతకాయ  పచ్చడి  తీసుకోండి .
 ఒక  40  గ్రా. బెల్లం  తీసుకోండి .
పచ్చడి లో  ఉప్పు లోగడే వేసి ఉంటుంది 
 కనుక   కొద్దిగా  ఉప్పు వేసుకుంటే  సరిపోతుంది .
ఇప్పుడు రోటిలో పోపునంతా వేసి   పచ్చడి  బండతో  ముందుగా మెత్తగా   దంపుకోవాలి .
పోపు  మెత్తగా  నలిగాక  ఉప్పు  బెల్లం వేసి  మెత్తగా  దంపి  తర్వాత  పాత చింతకాయ  పచ్చడి  వేసి  పొత్రము  తో  చాలా కొంచెం   నీళ్ళు  చిలకరించుకుంటూ  పచ్చడి మెత్తగా  కాటుకలా  రుబ్బు కోవాలి .
పాత చింతకాయ పచ్చడి వృధా కాకుండా ఈ పద్దతిలో  చేసుకునే వాళ్ళము .
ఇది మేము రోటిలో  చేసుకునే  పాత  చింతకాయ పచ్చడి .
తీపి  ఇష్టమైతే  ఇలా  చేసుకుని చూడండి .
పచ్చడి  బాగా ఊరి పుల్లపడి ఉంటుంది కనుక  తీపి వేసుకుంటేనే  పచ్చడి  రుచిగా ఉంటుంది .
 వేడి వేడి అన్నంలో  మరి కాస్త నెయ్యి  వేసుకుని  తింటే  చింతపండు  పచ్చడిలా చాలా బాగుంటుంది .
వెల్లుల్లి  ఇష్టమైనవారు  పది పన్నెండు వెల్లుల్లి  రెబ్బలు  పై పొట్టు ఒలుచుకుని , మూడు స్పూనుల నూనె లో ఆవాలు , కరివేపాకు మరియు ఒలిచిన వెల్లుల్లి  రెబ్బలు తో పోపు వేయించుకుని  పచ్చడిలో  వేసుకుంటే  పచ్చడి  మరింత రుచిగా ఉంటుంది .
దోశెలలోకి , గారెలలోకి , చపాతీలలోకి  కూడా బాగుంటుంది .

--(())--


మామిడి కాయతో ముక్కల పచ్చడి .( మెంతి బద్దలు  )

కావలసినవి .
పుల్లని పచ్చి మామిడి కాయ  --  ఒకటి .
పై చెక్కు తీసుకుని  చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
ముక్కలను విడిగా ప్లేటులోకి తీసుకుని  పైన  కొద్దిగా పసుపు వేసుకోవాలి .

నూనె  --  ఆరు  స్పూన్లు 
ఎండుమిరపకాయలు  - 12  
మెంతులు --    స్పూను 
ఆవాలు --   స్పూనున్నర  
ఇంగువ --   కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
పసుపు --  కొద్దిగా

తయారీ విధానము .
స్టౌ మీద బాండీ పెట్టుకొని  నాలుగు స్పూన్లు   నూనె పోసి, నూనె బాగా కాగగానే   ముందుగా మెంతులు మరియు ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి . తర్వాత అందులోనే ఆవాలు  మరియు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి.

పోపు చల్లారగానే   రోటిలో వేయించిన పోపు  మరియు తగినంత  ఉప్పు వేసి  పచ్చడి బండతో మెత్తగా  దంపు కోవాలి .

తీపి ఇష్టమైన వారు చిన్న బెల్లం ముక్క రోటిలో  వేసుకుని  దంపు కోవచ్చును. 

ఆ తర్వాత  మామిడి కాయ ముక్కలు కూడా రోటిలో వేసుకుని , మిగిలిన  రెండు స్పూన్లు  పచ్చి నూనెను  వేసుకుని , ఒకసారి ముక్కలు  చేతితో బాగా కలుపుకుని ,  వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

ఒక గంట సేపు మూతపెట్టి  ఉంచితే  ముక్కల పులుపు  కారానికి  పట్టి , ముక్కలు  ఊరి ,  బద్దలు మంచి రుచిగా ఉంటాయి.

అప్పుడే  పునాస కాపు కాయలు మార్కెట్లో కి వస్తున్నాయి. పునాసకాపు కాయలు  మంచి పులుపు  ఉండి , మెంతి  బద్దలకు  చాలా రుచిగా  ఉంటాయి.
అంతే. భోజనము లోకి , చపాతీల లోకి , రోటీల లోకి మరియు దోశెల లోకి ఎంతో రుచిగా  ఉండే మామిడి  కాయ ముక్కల పచ్చడి సర్వింగ్  కు సిద్ధం.
ఈ ముక్కల పచ్చడినే  మెంతి బద్దలు అని కూడా అంటారు .
బెల్లం  వేయకపోతే ఒక  వారం , బెల్లం  వేస్తే నాలుగు రోజులు  ఈ ముక్కల పచ్చడి నిల్వ ఉంటుంది .

--(())--

దోసకాయ ముక్కల  పచ్చడి .

కావలసినవి .
పసుపు రంగు గట్టి  దోసకాయ  ---  ఒకటి.
పై  చెక్కు   తీసి  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .
చిన్న నిమ్మకాయంత  చింతపండు   విడదీసి  కొద్దిగా నీళ్ళతో  తడిపి  ఉంచుకోవాలి ..
పచ్చిమిరపకాయలు  --  10
కొత్తి మీర   ---  రెండు కట్టలు .
మరి కాస్త  వేసుకున్నా  చాలా  రుచిగా  ఉంటుంది . కట్టలు  విడదీసి  కాడలు  తీసేసి  కొత్తిమీర   శుభ్రం  చేసుకోవాలి .
ఉప్పు   ---   తగినంత 
పసుపు  ---  కొద్దిగా .
పోపుకు  .
ఎండుమిరపకాయలు  --  6
మినపప్పు   ---  స్పూను 
మెంతులు  ---   పావు  స్పూను 
ఆవాలు  ---   అర  స్పూను  
ఇంగువ  ---  కొద్దిగా 
నూనె  ---   50  గ్రాములు 

తయారీ  విధానము  .
ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  పోయాలి.
నూనె  బాగా  కాగనివ్వాలి  .
నూనె బాగా కాగగానే   మెంతులు , ఎండుమిరపకాయలు  ,  మినపప్పు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగనివ్వాలి .

ఎక్కువ   నూనె  ఉంటే  ఆఖరున  పచ్చడిలో  కలుపుకోవచ్చు.
బాండీ లోనే  ఉంచేయండి 

పోపు  చల్లారగానే  ముందుగా   రోటి లో  ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు  మరియు  పసుపు వేసి పచ్చడి బండతో   మెత్తగా   దంపుకోవాలి .
తరువాత  పచ్చిమిర్చి  , తడిపిన  చింతపండు   మరియు  పోపు  వేసి బండతో  మెత్తగా దంపుకోవాలి. 

చివరగా  దోసకాయ  ముక్కలు  మరియు కొత్తిమీర  వేసి   ఒకే  ఒక్కసారి  దోసకాయ  ముక్కలు  నలగ  కుండా  పైపైన బండతో నూరుకోవాలి .
రోటిలో నుండి నూరిన పచ్చడి  ఒక  గిన్నెలోకి  తీసుకుని  బాండీలో  కాగిన  మిగిలిన  నూనె  అందులో పోసి   గరిటతో  ముక్కలు  పచ్చడి  బాగా కలిసేటట్లు  కలుపుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా   ఉండే  దోసకాయముక్కలు  పచ్చడి  సర్వింగ్   కు  సిద్ధం .

--(())--

ముందు గా గోంగూర పచ్చి మిర్చి కొంచెం నూనె వేసి ఉడికించాలి తర్వాత బాణాలి కొంచెం నూనె వెసి ఎండుమిర్చి ధనియాలు అవాలు మెంతులు  జీలకర్ర ఇంగవ వేసి వేయించాలి తర్వాత రోటీ లో వేసి పొడి చేసి ఉప్పు గోంగూర వెసి దంచి ఉల్లి వెసి దంచాలి

ఈ రోజు spécial‘ కీరదోసకాయ పచ్చడి’. బాగా కుదిరందంన్నారు మా ఇంట్లో.
చేసే విధానం.:
ఒక కీరదోసకాయ చెక్కుతూసి చిన్న ముక్కలుగ కోసి పెట్టుకోండి. కొతిమేర తరుగు 1/4 కప్పు రెడీ చేసుకోండి.
ఒకమూకుడులో 2 చెంచాల నూనేవేసి వేడిఅవగానే 10 బుల్లిటమోటాలు10 పచ్చిమిరపకాయలు. 4 వెల్లుల్లి రెబ్బలు మగ్గించి, చిన్న నిమ్మకాయంత
చింతపండు కూడా మగ్గించి పక్కన పెట్టుకోండి. 
చిన్నతావాలో 2 చంచాలు నూనె వేసి వేడిఅయ్యాక....2 చంచాలు మినపప్పు, శనగపప్పు, ధనియాలు,
1 చంచా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ , 5 ఎండు మిరపకాయలు వేసి  
వేయించి దించి సరిపడ వుప్పువేసి దంచి పొడి చేసుకోండి.
ఇప్పుడు రోట్లో మొదటవేయించిన టమేటా, మిర్చి, వెల్లుల్లి వేసి తగినవుప్పువేసి కచ్చపచ్చగా దంచి, దానిలో దంచినపొడి వేసి కలియతిప్పి
కీరదోసకాయముక్కలు,కొతిమేర , పసుపు ,
ఉసిరికాయంత చింతకాయపచ్చడి వేసి ముక్క  నలగకుండా పచ్చడి నూరి  తీసి 
పొడి గాజుసీసాలో పెట్టుకోవాలి. ఇది ఒకరోజు మాత్రమే బావుంటుంది. మిగిలితే ఫ్రిజ్ లో దాచుకోవలసిందే.

రోటి పచ్చళ్ళు గ్రూప్  సభ్యులందరికీ నమస్కారం . ఈరోజు నేను పచ్చికొబ్బరి ఉల్లిగడ్డ పచ్చడి చేశాను. ఎలా చేశానో చెప్తాను .పచ్చి కొబ్బెర, ఉల్లిగడ్డ, కొంచెం జీలకర్ర, కారం, ఉప్పు ,పల్లీలు ,కొంచెం బెల్లం ,వెల్లుల్లిపాయలు, పసుపు అన్ని రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి.  తర్వాత పోపు వేసుకోవాలి అది 5నిముషాలు స్టవ్వు సిమ్ లో పెట్టి మగ్గనివ్వాలి. ఇది  అన్నంలోకి ,చపాతి లోకి, దోశ పైన రుద్దుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే వారం రోజులైనా ఉంటుంది.

--(())--

దోసకాయ పచ్చి టొమాటో పచ్చడి చేశానండీ.. ఇవి మా అత్తమ్మ మిద్దె తోటలో కాయించినవి.. 
ఒక చిన్న దోసకాయ
చిన్ని చిన్ని టోమాటోలు కొన్ని
పచ్చిమిర్చి
ధనియాలు
జీలకర్ర
శనక్కాయపప్పులు (పల్లీలు)
ఇవన్నీ వేయించాను.. రోట్లో దంచాను
2 వెల్లుల్లి పాయలు
కొంచెం నానబెట్టిన చింతపండు
కొంచెం ఉల్లిపాయ 
కలిపి మరి కొంచెం దంచి తీశాను.. నాకు మరీ ఎక్కువ ముక్కలు గా ఉంటే నచ్చదు.. 😊.. అందుకే కొంచెం మెత్తగా దంచుకన్నా.. నా చేతిలో పనేకదా.

' బీట్రూట్ పచ్చడి '
సీజన్ కదా,బీట్రూట్ కాస్త తక్కువ ధరలోనే దొరుకుతుంది.ఇంటి ముందుకు బీట్రూట్,కారెట్ అమ్మకానికి వచ్చింది. రెండూ.తీసుకున్నాను.
ఇక పచ్చడి.ఈ పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం.ముందుగా బీట్రూట్,కారట్ పై తొక్క గిరేసి,ముక్కలు కోసాను.సరిపడా పచ్చి మిరపకాయలు,కొద్దిగా చింతపండు తీసుకుని, వీటి నన్నిటిని బాండీలో వేసి,కొద్దిగా నూనె వేసి బాగా మగ్గనిచ్చాను.
తర్వాత రోట్లో వేసి కొద్దిగా  ఉప్పు వేసి మెత్తగా నూరాను.
తర్వాత తాలింపు పెట్టాను. అంతే...తినటానికి కమ్మటి రుచి,చూడటానికి ఇంపైన రంగు. ఆహా..!! ఏమి రుచి..తినరా మైమరచి..!!
ఇంత పచ్చడి ఎందుకు టీచర్..? ప్రీజ్ లో పెట్టుకుని ఒక వారం తింటారా,ఏమిటి..?
అని మీరు అడుగుతారని  తెలుసు.. అబ్బే,,కాదు అదంతా ఒక్క రోజుకే.వుండేది ఇద్దరు.అంతనా..?మరో ప్రశ్న వస్తుందని తెలుసు..
    మా చిన్నప్పుడు నానమ్మ,అమ్మమ్మ,అమ్మలు ఏ రోటి పచ్చడి, నూరినా,ఏదన్నా కొత్త వంటకం చేసినా అది సగం వూర్లోకి,సగమే ఇంట్లోకి వచ్చేది.
పచ్చడి నూరిన రోలు దగ్గరే,సగం చిన్నచిన్న గిన్నెల్లో కి,తోడి ముందుగా వూర్లో కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి,మా మేనత్తకూ,ఇంకా ఒకరిద్దరి ఇళ్లకు నేనూ,మా అక్కల్లోం వెళ్లి ఇచ్చి వచ్చేవాల్లం.
   మా పెద్దలు ఏదైనా పంచుకుని తింటే,వుండే ఆనందం మన ఇంట్లో మనమే కడుపు నిండా మెక్కితే వుండదు..కొంచెమైనా పక్క ఇళ్ళవాల్లకు రుచి చూపించాలి అని చెప్పేవాళ్ళు.
పెద్దలు చెప్పిన పద్ధతే నాది..ఆ పచ్చడి సగం బయటకు,సగం ఇంట్లోకి.😀😀ఈ పచ్చడిలో టమోటా కానీ, కొతిమీర లాంటి ఆకు గానీ వేయో ద్దు.. అలా వేస్తే అసలు రుచి పోతుంది. మీరూ చేసి చూడండి..
పూదోట.శౌరీ లు.. టీచర్.బోధన్.

చింతతొక్కు, దోసకాయ రోటి పచ్చడి.
తయారుచేయు విధానం..
చింత తొక్కు పిలుపుకు తగ్గ పచ్చి మిర్చి, కొద్దిగా జీలకర్ర,దనియలను నూనెలో వాడ్చి, దోసముక్కలు చింత తొక్కు తో దంచి , ఇంగువతో పోపు పెట్టాలి.
ఇం

కొబ్బరి పచ్చడి   ---  రోటి పచ్చడి .
కావలసినవి .
కొబ్బరి కాయ  -  1 .
 కాయను  పగుల గొట్టి  రెండు  చిప్పలు  పచ్చి  కొబ్బరి  కోరాముతో  తురుము కోవలెను .
ఎండుమిరపకాయలు  --  8
పచ్చిమిరపకాయలు  --   5
చింతపండు   --  ఉసిరి కాయంత .  విడదీసుకుని  నీటితో  తడిపి  ఉంచుకోవలెను. 
పసుపు  --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
బెల్లం  --  చిన్న  ముక్క .  ఇష్టం  లేని వారు  మానేయ వచ్చును .
పోపునకు  --  
నూనె  --   మూడు స్పూన్లు 
మినపప్పు  --  స్పూను 
మెంతులు  --  పావు  స్పూను 
ఆవాలు  --  అర స్పూను  
ఇంగువ  --  కొద్దిగా .
తయారీ   విధానము .
కొబ్బరిచిప్పలను  పచ్చి కొబ్బరి    కోరాముతో  కోరుకుని  సిద్ధంగా   ఉంచుకోవాలి .
దాని పైన  కొద్దిగా  పసుపు  వేయండి .
ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు   నూనె వేసి  నూనె  బాగా కాగగానే   వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , ఆవాలు , ఇంగువ  వేసి  పోపు  వేగగానే  తొడిమలు  తీసిన  పచ్చిమిర్చి  కూడా వేసి  ఒక  నిముషం  ఉంచి   దింపుకోవాలి .
ఇప్పుడు  రోటిలో ఎండుమిర్చి ,  పచ్చిమిర్చి  , తడిపిన చింతపండు  , చిన్న బెల్లం  ముక్క మరియు తగినంత  ఉప్పు వేసి  మెత్తగా పచ్చడి బండతో  దంపుకోవాలి .  
తర్వాత  పచ్చి  కొబ్బరి తురుము కూడా  రోటిలో వేసుకుని   పొత్రముతో  నీళ్ళతో తడి  చెయ్యి చేసుకుంటూ మెత్తగా  రుబ్బుకోవాలి .
చివరగా  పోపు కూడా  పచ్చడిలో  వేసుకుని   పోపు  మరీ  నలగకుండా  ఒకసారి  పప్పులుగా  తగిలే విధముగా  పొత్రముతో  రుబ్బు కోవాలి .
తర్వాత  వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  కొబ్బరి  పచ్చడి  భోజనము   లోకే  కాకుండా  దోశెలు , పూరీలు  మరియు  చపాతీలలోకి  కూడా  చాలా బాగుంటుంది .

 .
క్యారెట్  పచ్చడి .
ఆలూరుకృష్ణప్రసాదు .
క్యారెట్  పచ్చడి .
కావలసినవి .
క్యారెట్లు  -  4 . షుమారుగా  పావు కిలో.
పీలర్  తో  పై చెక్కు తీసుకుని  ఎండు కొబ్బరి కోరాముతో  తురుము కోవాలి.
ఎండుమిరపకాయలు  -- అయిదు
పచ్చిమిరపకాయలు   -  నాలుగు
చింతపండు   --  చిన్న నిమ్మ కాయంత .  విడదీసుకుని  నీటితో  తడిపి  ఉంచుకోవలెను. 
పసుపు  --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
పోపునకు  --  
నూనె  --   ఐదు  స్పూన్లు 
మినపప్పు  --  స్పూను 
మెంతులు  --  పావు  స్పూనులో సగం 
ఆవాలు  --  అర స్పూను  
ఇంగువ  --  కొద్దిగా .
తయారీ   విధానము .
క్యారట్  ఎండు కొబ్బరి  కోరాముతో  కోరుకుని  సిద్ధంగా   ఉంచుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి , నూనె బాగా కాగగానే  క్యారట్  తురుమును మరియు కొద్దిగా  పసుపును  వేసి , మూడు  నిముషాలు  క్యారెట్  పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
తర్వాత  విడిగా  పళ్ళెం లోకి  తీసుకోవాలి .
ఇప్పుడు మరల స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు   నూనె వేసి  నూనె  బాగా కాగగానే   వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , ఆవాలు , ఇంగువ వేసి  పోపు  వేయించుకోవాలి. తర్వాత  పోపులో  పచ్చిమిర్చి ని కూడా  వేసి  మగ్గ  నివ్వాలి.
ఇప్పుడు ముందుగా రోటి లో  ఎండుమిర్చి ,  తడిపిన చింతపండు  మరియు తగినంత  ఉప్పు వేసి  మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .
తర్వాత  క్యారెట్  తురుమును మరియు పచ్చిమిర్చి ని   కూడా   వేసుకుని  మరీ  మెత్తగా కాకుండా  పచ్చడి బండతో నూరుకోవాలి .
చివరగా  పోపు కూడా  పచ్చడిలో  వేసుకుని   పోపు  మరీ  నలగకుండా  ఒకసారి  పచ్చడి బండతో  నూరుకుని  తర్వాత  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .
క్యారెట్  లో సహజంగా  తీపి  ఉంటుంది  కనుక   తీపి  ఇష్ట పడని వారికి  నచ్చుతుందో  లేదో  ఆలోచించి  చేసుకోండి.
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  క్యారెట్  పచ్చడి  భోజనము   లోకే  కాకుండా  దోశెలు , పూరీలు  మరియు  చపాతీలలోకి  కూడా  చాలా బాగుంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది.

చింతపండు   పచ్చడి  .
సాధారణంగా   పెసరట్లు , దోశెలు ,  ఇడ్లీలు , గారెలు  మరియు  అన్నం లోకి  అందరం  అల్లం   పచ్చడి  చేసుకుంటాము .
అలాగే   ఇప్పుడు  మామిడి  అల్లం  కూడ   ఇప్పుడు  బాగా  దొరుకుతోంది  కాబట్టి   చాలామంది  మామిడి  అల్లం  పచ్చడి  కూడా  చేస్తారు .
ఈ  రెండింటికన్నా  ప్రాచీనమైన   పచ్చడి  చింతపండు   పచ్చడి .
లోగడ  పెద్ద వాళ్ళందరూ   చింతపండు   పచ్చడినే  అన్ని సందర్భాలలోనూ చేసేవారు .
ఈ  చింతపండు  పచ్చడి  ఫ్రిజ్ లో  పెట్టక పోయినా  ఐదు  రోజులు  నిల్వ  ఉంటుంది .
చింతపండు   పచ్చడి.
కావలసినవి .
చింతపండు   ---    50  గ్రాములు.  
పసుపు  --  కొద్దిగా .
ఉప్పు ---  తగినంత 
బెల్లం  --  చిన్న ముక్క 
పోపునకు .
ఎండుమిరపకాయలు   ---  15
మెంతులు  ---   పావు స్పూను  
ఆవాలు  ---   ముప్పావు  స్పూను 
ఇంగువ   ---   కొద్దిగా 
నూనె  ---   నాలుగు   స్పూన్లు 
తయారీ  విధానము  .
ముందుగా   చింతపండు  రెబ్బలుగా  విడదీసి  పావు  గ్లాసు  వేడి  వేడి  నీటిలో  తడిపి  ఉంచుకోవాలి .  రసం  తీయనవసరం  లేదు .
ఆ  తర్వాత స్టౌ మీద బాండి  పెట్టి   మొత్తము నాలుగు స్పూన్లు   నూనెను వేసి , నూనె   బాగా  కాగగానే  వరుసగా  మెంతులు , ఎండుమిరపకాయలు వేయాలి . మెంతులు  వేగగానే  ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు వేగగానే  స్టౌ  ఆపివేయాలి .
పోపు  చల్లారగానే  రోటి  లో  ముందుగా  ఎండుమిరపకాయలు , పసుపు మరియు తగినంత  ఉప్పువేసి   పచ్చడి బండతో మెత్తగా    దంపుకోవాలి.
ఆ తర్వాత  తడిపిన  చింతపండు  కొద్ది నీళ్ళతో సహా , వేగిన  పోపు  మరియు  చిన్న   బెల్లం  ముక్కతో   సహా  రోటి లో వేసి  మెత్తగా పచ్చడి బండతో  నూరుకోవాలి. 
నీళ్ళు  పోయకుండా  గట్టిగా    విడిగా గిన్నెలోకి తీసుకోవాలి  .
అంతే  ఇడ్లీ  , దోశెలు , పెసరట్లు , గారెలు  మరియు  అన్నం లోకి  కూడా  ఎంతో  రుచిగా   ఉండే   చింతపండు  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం .

వంకాయ రోటిపచ్చడి హడావిడి వాన బాగా పడింది చిరుజల్లు లో చేశాతగ్గాక ఏమిటో ఇద్దరు మనుషుల మైనా పనివొగతెగదు చేసిచేసివిసుగొచ్చేస్తుంది మీతో నే చేసిన పచ్చడి చూసి మీరులైకుచేస్తే ఆవిసుగు తొలగి పోతుంది ఈఆషాఢంలో ఎంతమంది ఆడపిల్లలునేర్చుకున్నారో కదా
ఇంకశ్రావణమాసహడావిడి 

అల్లం పచ్చడి .
కావలసినవి .
అల్లం  ---  50  గ్రాములు .
చింతపండు  --  75  గ్రాములు 
పసుపు  --  పావు  స్పూను. 
పచ్చిమిరపకాయలు  --  8
ఉప్పు --  తగినంత 
బెల్లం  -  చిన్న ముక్క . *
* తీపి  ఇష్టం  లేని వారు  మానేయవచ్చును.
పోపుకు .
నూనె  --  నాలుగు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  - 15
మెంతులు  -  పావు  స్పూను   
ఆవాలు  --   స్పూను 
ఇంగువ  --  కొద్దిగా 
తయారీ విధానము .
అల్లం  పై చెక్కు తీసుకుని  ముక్కలుగా  తరుగుకొని  ఉంచుకోవాలి 
చింతపండు   విడదీసి గింజలను  తీసి  కొద్దిగా వేడి నీళ్ళు  పోసి   తడిపి  ఉంచుకోవాలి .
ఇప్పుడు  స్టౌ మీద  బాండీ  పెట్టి  నాలుగు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు ,  మెంతులు ఆవాలు  మరియు ఇంగువ  వేసి  పోపు వేయించుకోవాలి .   అందులోనే   పచ్చి మిరపకాయలు  కూడా  వేసి మూడు నిముషాలు  మగ్గ పెట్టుకోవాలి .
పోపు  చల్లారగానే  రోటిలో  ముందుగా  ఎండుమిరపకాయలు ,తగినంత  ఉప్పు మరియు   పసుపు  వేసి  పచ్చడి  బండతో  మెత్తగా దంపుకోవాలి . 
తర్వాత  తడిపి ఉంచుకున్న  చింతపండు , బెల్లం  ముక్క , అల్లం  ముక్కలు , పచ్చిమిరపకాయలు మరియు మిగిలిన  పోపు  వేసి  మెత్తగా  పచ్చడి  బండతో  నూరుకోవాలి . 
అంతే  ఇడ్లీ , దోశెలు , గారెలు , చపాతీలు మరియు భోజనము లోనికి ఎంతో  రుచిగా ఉండే  అల్లం  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం .

మామిడి   అల్లం   రోటి పచ్చడి .
తయారీ  విధానము  .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె  వేసి   ఎనిమిది   ఎండుమిరపకాయలు  ,  పావు  స్పూను  మెంతులు ,  స్పూను  మినపప్పు  ,  అర స్పూను  ఆవాలు ,  కొద్దిగా  ఇంగువ ,రెండు  రెమ్మలు  కరివేపాకు మరియు  అయిదు  పచ్చి  మిరపకాయలు   వేసి పోపు వేయించుకోవాలి .
నిమ్మ కాయంత  చింతపండు   చాలా  కొద్ది  నీళ్ళలో   తడిపి  ఉంచుకోవాలి  .
ఒక  75  గ్రాముల  మామిడి  అల్లం  పై  చెక్కు  తీసుకుని  ముక్కలుగా  చేసుకుని  సిద్ధం  చేసి  ఉంచుకోవాలి
ఇప్పుడు  రోటిలో వేయించిన   ఎండుమిరపకాయలు   ,  కొద్దిగా  పసుపు , తగినంత  ఉప్పు వేసి మెత్తగా   ఫచ్చడి బండతో  దంపుకోవాలి .
తర్వాత  మిగిలిన  పోపు  , చిన్న ముక్కలు గా తరిగిన  మామిడి  అల్లం  , చింతపండు తడిపిన నీళ్ళతో  ,  తీపి ఇష్టమైన వారు   కొంచెం   బెల్లం   వేసి  మెత్తగా  పచ్చడి బండతో  నూరుకోవాలి  .
ఆ తర్వాత  వేరే  గిన్నెలోకి    తీసుకోవాలి .
ఈ  పచ్చడి  ఇడ్లీ  , దోశెలు  ,  చపాతీలు  మరియు  అన్నం  లోకి  అన్నిటిలోకి  కూడా  చాలా రుచిగా  ఉంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు 

రోటి పచ్చడి సభ్యులకి నమస్కారం. ఈరోజు నేను కాకరకాయ పచ్చడి చేశాను. ఇది అన్నం లోకి చాలా బాగుంటుంది . కావలసిన పదార్థాలు - కాకరకాయలు ముక్కలుగా కోసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, సరిపడా ఉప్పు, పసుపు, వెల్లుల్లి ,కొంచెం బెల్లం, జీలకర్ర .
తయారీ విధానం - ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు రోట్లో వేసి బాగా దంచుకోవాలి.  తర్వాత అవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుని కాకరకాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసి ఇ దంచుకోవాలి. కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి అది పిండి కోండి ఆ నీరు పోయాక ఆ పిండిని మిశ్రమాన్ని రోట్లో వేసి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కలిపి దంచుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవాలి.ఇది ఐదు నుంచి పది నిమిషాలు మగ్గనివ్వాలి ఎందుకంటే ఆ చెడు వాసన పోవాలి కాబట్టి. ఇది అన్నంలోకి చపాతీల్లోకి తినొచ్చు. షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి 

రోటి పచ్చడి సభ్యులకు నమస్కారం. ఈరోజు నేను గోంగూర సొరకాయ పచ్చడి చేశాను. ఎలా చేసానో చెప్తాను. సొరకాయ, పచ్చిమిర్చి ,ఒక ఉల్లిపాయ, టమాట ఆయిల్ లో వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత గోంగూర వేసి మగ్గనివ్వాలి. అంతా బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయ, చింతపండు ,ఉప్పు, పసుపు, చింతపండు వేసి దంచుకోవాలి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి దంచుకోవాలి. బండ పచ్చడి  తాలింపు అవసరం లేదు. ఆయిల్ ఎక్కువగానే ఏసి వేయించుకుంటారు కాబట్టి.

దోసకాయ చింతకాయ రోటి పచ్చడి .
కావలసినవి .
పసుపు రంగు గట్టి  దోసకాయ  ---  ఒకటి.
పై  చెక్కు   తీసి  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .
చిన్న చింతకాయలు -- 150 గ్రాములు .
శుభ్రంగా  కడిగి  తగినంత ఉప్పు పసుపు వేసుకుని  రోటిలో పచ్చడి బండతో మెత్తగా  దంపుకుని  విడిగా  ఒక ప్లేటులోకి తీసుకోవాలి .
పచ్చిమిరపకాయలు  --  12
కొత్తి మీర   ---  రెండు కట్టలు .
మరి కాస్త  వేసుకున్నా  చాలా  రుచిగా  ఉంటుంది .
కట్టలు  విడదీసి  కాడలు  తీసేసి  కొత్తిమీర   శుభ్రం  చేసుకోవాలి .
ఉప్పు   ---   తగినంత 
పసుపు  ---  కొద్దిగా .
పోపుకు  .
ఎండుమిరపకాయలు  --  8
మినపప్పు   ---  స్పూనున్నర  
మెంతులు  ---   పావు  స్పూను 
ఆవాలు  ---   అర  స్పూను  
ఇంగువ  ---  కొద్దిగా 
నూనె  ---   50  గ్రాములు 
తయారీ  విధానము  .
ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  పోయాలి.
నూనె  బాగా  కాగనివ్వాలి  .
నూనె బాగా కాగగానే ముందుగా   మెంతులు వేసి బాగా వేగాక ఎండుమిరపకాయలు  ,  మినపప్పు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగనివ్వాలి .
ఎక్కువ   నూనె బాండీలో మిగిలి  ఉంటే  ఆఖరున  పచ్చడిలో  కలుపుకోవచ్చు.
బాండీ లోనే  ఉంచేయండి 
పోపు  చల్లారగానే  ముందుగా   రోటిలో    ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు  మరియు  పసుపు వేసి మెత్తగా  పచ్చడి బండతో దంపుకోవాలి .
తరువాత  పచ్చిమిర్చి  , రోటిలో తొక్కి సిద్ధంగా  ఉంచుకున్న  చింతకాయ తొక్కు    మరియు  పోపు వేసి  మెత్తగా  బండతో నూరుకోవాలి .
చివరగా  దోసకాయ  ముక్కలు  మరియు కొత్తిమీర  వేసి   దోసకాయ  ముక్కలు  నలగ  కుండా ఒకే ఒక్కసారి రోటిలో బండతో నూరుకోవాలి .
తర్వాత ఈ పచ్చడి  ఒక  గిన్నెలోకి  తీసుకుని  బాండీలో  కాగిన  మిగిలిన  నూనె  అందులో పోసి   గరిటతో  ముక్కలు  పచ్చడి  బాగా కలిసేటట్లు  కలుపుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా   ఉండే  దోసకాయ మరియు చింతకాయతో రోటి పచ్చడి  సర్వింగ్ కు  సిద్ధం .
చింతకాయలు  సంవత్సరం  అంతా దొరకవు కనుక , చింతకాయలు  దొరకని  పక్షంలో  ఒక  75 గ్రాములు  లేదా ఒక ముప్పావు  కప్పు  నూరని  చింతకాయ  పచ్చడి  తీసుకుని  పై తెలిపిన పద్ధతిలో  చేసుకొనవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .

రోటిపచ్చళ్ళ సమూహ సభ్యులకు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఎలా వున్నారు?  
ఆలుబుఖారా పచ్చడి.  ఆశ్చర్య  పోకండి .  ఇంటి ముందుకు ఆలుబుఖారా పళ్ళు అమ్మొస్తే కొన్నాను. రుచి చూస్తే తియ్యగా లేవు.  పుల్లగా వున్నాయి.  కరోనా కరువు అధిక ధరలతో కొని యేంచేయాలా అని పచ్చడి చేశాను.  
విధానము:- మామూలే మిర్చి , కావల్సిన పోపు దినుసులు (మినప్పప్పు, మెంతులు, ధనియాలు జీలకర్ర, యింగువ) వేయించుకొని, వుప్పు, పసుపు, చింతపండు, వెల్లుల్లి , కొంచెం బెల్లం తో ఆలుబుఖారా పళ్ళు 

హాయ్ ఫ్రెండ్స్  కొబ్బరి పచ్చడి చేశాను. తయారి విధానం, ఎండుమిరపకాయలు 6, పచిమిర్చి 5, మెంతులు ఆవాలు మినప్పప్పు ఇంగువ పసుపు  వేసి అన్నీ ఆయిల్ లో  ఫ్రై చేసి ఉప్పు, చింతపండు తగినంత వేసి రోలు  లో వేసి దంచటమే. తర్వాత తాలింపు అంతే  పచ్చడి రెడీ.


🤔🤔రోటిపచ్చళ్ళ ఉద్యమం(2016)🤔🤔
రోటి పచ్చడి.. పెళ్ళిలో ఎన్ని వందల రకాల వంటలు వడ్డించినా రోటిపచ్చడి లేకపోతే అది విందే కాదు. గోంగూర, దోసకాయ, దొండకాయ ఇలా ఏదో ఒక రోటి పచ్చడి ఉండాల్సిందే. రోటి పచ్చడి అంటే అంత ఇష్టం ఉన్నా, ఇప్పుడు మనం తింటున్నది  మిక్సీలో వేసిన రోటి పచ్చడి మాత్రమె. అంటే మైసూరు పాక్ లో మైసూర్ ఎలా ఉండదో, రోటి పచ్చళ్లలో రోలు కూడా లేకుండా పోయింది.
జనం అంతా మిక్సీ పచ్చళ్లనే రోటి పచ్చళ్ళు గా భావించి, తృప్తి పడుతున్న వేళ, ఒక వ్యక్తి విప్లవశంఖం పూరించాడు. “మిక్సీ పచ్చళ్ళ ఆధిపత్యం నశించాలి, రోళ్ళు, పచ్చడిబండలతో ప్రతి ఇల్లు కళకళ లాడాలి” అంటూ నినదించాడు. రోలు, పచ్చడిబండ(పచ్చడి నూరుకునే కర్ర) చేతబట్టి ఫేస్ బుక్ లో చెలరేగిపోయారు. మిక్సీలో వేసే పచ్చడీ ఒక పచ్చడేనా, చక్కగా ఒక రోలు కొనుక్కుని మన పచ్చడి మనం నూరుకోలేమా, మన చేతల్లో సత్తువలేదా, మన ఇళ్ళలో రోళ్ళు లేవా అని ప్రశ్నించిన ఆ విప్లవకారుడి పేరు వాసిరెడ్డి వేణుగోపాల్. రచయిత, జర్నలిస్ట్ కం పబ్లిషర్ అయిన  వేణుగోపాల్ పెన్ను పక్కనబెట్టి రోకలి చేతబట్టి, రోజుకో పచ్చడి నూరుతూ, ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ , చదివేవాళ్ళ నోళ్ళలో నీళ్ళూరేలా వర్ణిస్తూ, ఒక అలజడి సృష్టించారు. దీనితో రోటిపచ్చళ్ళ గతవైభవాన్ని తలచుకుంటూ, మిక్సీల డామినేషన్ ని తిట్టుకుంటున్న భోజనప్రియులకి ఆకలి రెట్టింపు అయ్యింది. కిచెన్ లో మూలకి వెళ్ళిపోయిన రోళ్ళు , మళ్ళీ దర్జాగా బయటకి వచ్చాయి. రోజుకో పచ్చడిని రుచిచూస్తూ, చూపిస్తూ రోళ్ళు మళ్ళీ వంటింటి మహారాణులు అయ్యాయి. చరిత్రకారులు రోటిపచ్చళ్ళ చరిత్ర ని పరిశోధించడం మొదలు పెట్టారు. ఆరోగ్య నిపుణులు, రోటి పచ్చళ్ళు కమ్మగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో వివరించడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా లో మొదలైన రోటిపచ్చళ్ళ ఉద్యమాన్నిసామాన్య ప్రజలోకి తీసుకెళ్లేందుకు ఇప్పుడు ఒక పుస్తకం మార్కెట్లోకి రాబోతోంది.
పచ్చళ్లలో రోటి పచ్చళ్ళు వేరు అని మాత్రమే అని తెలిసిన మనకు ఆ రోటి పచ్చళ్లలో 14 రకాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. త్వరలో రాబోతున్న ‘రోటి పచ్చళ్ళు’ పుస్తకం కోసం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. పూర్ణచంద్ గారు రాసిన ముందుమాటలో ఈ 14 రకాల పచ్చళ్ళను వివరించారు. అవేమిటంటే..
పచ్చళ్లు.. పధ్నాలుగు రకాలు..
….
1. తొక్కు: గోంగూర తొక్కు, చింతకాయ తొక్కు, ఉసిరికాయ తొక్కు, ఇవన్నీ నిలవ ఉండేలా తయారు చేసిన పచ్చళ్ళు. ఉప్పు కలిపి ఊరబెడతారు.
2. తురుము పచ్చడి: మామిడి, కేరెట్, బీట్రూట్, క్యాబేజీ వీటిని తురిమి తాలింపు పెట్టింది తురుము పచ్చడి. తురుముగా కనిపించటం కోసం దీన్ని రోట్లో నూరకుండానే పచ్చడి చేస్తారు.
3. ముక్కలపచ్చడి: తాలింపుగింజలు, ఉప్పు, కొత్తిమీర వీటిని రోట్లో మెత్తగా నూరి, దోసకాయ, మామిడి, దొండ ఇలాంటి కాయల్ని చిన్నముక్కలుగా తరిగి కలిపి తాలింపు పెడతారు.
4. పప్పుల పచ్చడి: కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఉలవలు ఇలాంటి పప్పుల్ని దోరగా వేయించి రోట్లో నూరి (లేదా రుబ్బి) చేసిన పచ్చడి. కందిపచ్చడిని పచ్చిపులుసుతోనూ, ఉలవపచ్చడిని మీగడతోనూ, తినాలని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. పెసరపచ్చడిని పెనం మీద చేత్తో వత్తి అట్టులా కాల్చి అన్నంలో ఆమ్లేట్‘ లాగా తింటారు.
5. ఆవపచ్చడి: రోట్లో నూరిన ఆవపిండిని పెరుగులో కలిపి తాలింపు పెట్టేది ఆవపచ్చడి.
6. పెరుగుపచ్చడి: కూరగాయల్ని నిప్పులమీద కాల్చిన బజ్జీపచ్చడిలో పెరుగు కలిపితే అది పెరుగుపచ్చడి. అరటి ఊచ(దూట)ను ఉడికించి రోట్లో నూరి చేసిన పెరుగుపచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
7. ఊర్బిండి: రుబ్బిన పదార్ధాన్ని ఊరుపిండి అంటారు. ముక్కలకు ఉప్పు రాసి, కొంతసేపు ఊరిన తరువాత రోట్లో వేసి నూరి తయారు చేసే పచ్చడిని ఊరుపిండి లేదా ఊర్బిండి అంటారు.
8. ఊరు పచ్చడి: దీన్ని రోటి పచ్చడి అంటున్నాం. పప్పుదినుసులు, కూరగాయ ముక్కలు వేయించి, మిరపకాయలు కలిపి రుబ్బిన పచ్చడి ఊరుపచ్చడి.
9. బజ్జీ పచ్చడి: శ్రీనాథుడు బజ్జులు అనే వంటకం గురించి ప్రస్తావించాడు. ఏదైనా కూరగాయని నిప్పులమీద కాల్చి, రోట్లో వేసి మూరి, పప్పుదినుసులతో తాలింపు పెట్టిన పచ్చడినే ఆయన ‘బజ్జు’ అన్నాడు. అంటే,బజ్జీ పచ్చడి!
10. ఊరగాయ పచ్చడి: కూరగాయని ముక్కలుగా తరిగి, ఉప్పు కలిపి ఉంచడాన్ని ఊరబెట్టడం అంటారు. నిమ్మ, టొమోటో మామిడి, చింతకాయ, కంద, పెండలం, గోంగూర వీటితో ఎక్కువగా ఊరగాయ పచ్చళ్ళు పెడుతున్నాం.
11. ఊరుపిండి పచ్చడి: నువ్వులు, వేరుశెనగ గింజలు, ఆవాలు, కొబ్బరి ఇలాంటి వాటిలోని నూనెని తీసేసిన తర్వాత మిగిలే పిండిని తెలికిపిండి అంటారు. దాన్ని నీళ్ళలో గాని, మజ్జిగలో గాని నాలుగైదు రోజులు నానబెడితే పులుస్తుంది. దానికి అల్లం, పచ్చిమిర్చి వగైరా చేర్చి రుబ్బి, తాలింపు పెట్టిన పచ్చడిని “ఊరుపిండి పచ్చడి” అంటారు.
12. కూరపచ్చడి: కూరగాయని మగ్గబట్టిన తరువాత కూరగానూ చేసుకోవచ్చు. పచ్చడిగానూ చేసుకోవచ్చు. కూరవండాక కూడా దాన్ని రోట్లో వేసి నూరితే కూరపచ్చడి అవుతుంది.
13. ఆక్కూర పచ్చడి: గోంగూరతో మాత్రమే కాదు, తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, గుంటగలగరాకు, లేత పారిజాతం ఆకులు, లేత సొర ఆకులు, లేత తమలపాకులు, కరివేపాకు, కొత్తిమీర, పొదీనా…ఇలా ఆక్కూరలన్నింటి తోనూ రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు.
14. పూలపచ్చడి: మునగపూలు, అవిశపూలు, వేపపూలు మామిడి పూలు, క్యాలీఫ్లవర్ పూలు, గోంగూర పూలు ఇవి.
సో, అది ఫ్రెండ్స్, ఇన్ని రకాల రోటిపచ్చళ్ళు ఉన్నాయన్న మాట. వాసిరెడ్డి వారి కృషితో, తెలుగు వాకిళ్ళలో మళ్ళీ రోళ్ళ చప్పుడు మొదలవబోతోంది. శభాష్ ‘రోలురత్న’  వాసిరెడ్డి వేణుగోపాల్ గారు.
–నరేష్ శిరమని

ఆలూరుకృష్ణప్రసాదు .
నిమ్మకాయ  కారం .  (  పాత తరం పద్థతిలో  రోటిలో  చేసిన  కారము. )
**************************
ప్రియమిత్రులందరికీ 
ఈ  రోజున  మీ  అందరికీ   నోట్లో  నీరు  ఊరించే  నిమ్మకాయ  కారం గురించి తెలియ చేస్తాను .
ఈ  నిమ్మకాయ  కారం  చేయడానికి  కావలసిన  పదార్ధములు .
పసుపు  రంగు  వచ్చిన  నిమ్మకాయలు  -   నాలుగు. ( 4 )
ఎండు మిర్చి   ---   15
నూనె  --  మూడు  స్పూన్లు 
పసుపు  --  పావు స్పూనులో సగం
ఉప్పు   ---  తగినంత 
పోపుకు  కావలసినవి .
పొట్టు మినపప్పు   అయితే పచ్చడి మంచి రుచిగా  ఉంటుంది  .
దొరకని పక్షంలో  చాయమినపప్పు   వాడండి.
మినపప్పు  ---  మూడు స్పూన్లు 
ఆవాలు  --     స్పూనున్నర 
మెంతులు  --  ఒక  స్పూను
ఇంగువ  --  తగినంత  (  కాస్త ఎక్కువ  )
ఈ  నిమ్మకాయ కారం  రోట్లో పచ్చడి బండతో  నూరుకుంటేనే  తినేటప్పుడు  పప్పులు  తగులుతూ  చాలా  రుచిగా  ఉంటుంది.
నిమ్మ కాయ  కారం  తయారీ  విధానము .
ముందుగా  నాలుగు  నిమ్మకాయలు  చేదు  దిగకుండా  రసం  తీసుకొని  వేరే  చిన్న గిన్నె లోకి  తీసుకోండి.
ఆ  తర్వాత  స్టౌ  వెలిగించి   బాండి పెట్టి  అందులో  మూడు  స్పూన్లు  నూనె వేసి , నూనె బాగా  కాగగానే  , ముందుగా  మెంతులు  నల్లగా  కాకుండా  పచ్చి వాసన  పోయి  కమ్మని  వాసన  వచ్చే వరకు  వేయించుకోవాలి. తర్వాత   అందులోనే  ఎండు మిర్చి , పొట్టు మినపప్పు , ఆవాలు , మరి కాస్త  ఇంగువ  వేసి పోపు  మాడకుండా  వేయించుకోవాలి. 
ఇప్పుడు  రోట్లో  ముందుగా  ఎండు మిర్చి , పావు  స్పూన్ పసుపు , సరిపడా  ఉప్పు వేసి పచ్చడి  బండతో మెత్తగా  దంచు కోవాలి. 
 ఆ  తర్వాత  మిగిలిన  పొపు  వేసి  మరీ  మెత్తగా   కాకుండా  పప్పులు  తగిలేటట్లుగా  దంపుకోవాలి.
చివరగా  తీసి  ఉంచుకున్న   నిమ్మరసం  కూడా రోటిలో వేసి పచ్చడి బండతో   నూరు కోవాలి.
ఆ తర్వాత నూరిన పచ్చడి   ఒక  గిన్నె లోకి  తీసుకోవాలి.
అంతే.  కమ్మని  మెంతులు  మరియు  ఇంగువల  వాసలతో  ఘమ  ఘమ  లాడే  నిమ్మకాయల రసం  సర్వింగ్  కు  సిద్ధం.
ఈ  నిమ్మకాయల  రసం  అన్నం లోకి, వేడి  వేడి  ఇడ్లీల లోకి మరియు దోశెలలోకి  కూడా చాలా  బాగుంటుంది .
పప్పులు   నిమ్మరసం లో  ఊరి  తినడానికి   చాలా చాలా  రుచిగా  ఉండటమే గాక , ఫ్రిజ్  లో  ఉంచక పోయినా  ఐదారు  రోజులు  నిల్వ ఉంటుంది.
రంగు  చాలా  బాగా  వచ్చింది   కదండీ .
ఇది పొట్టు మినపప్పు తో రోట్లో చేసిన నిమ్మకాయ కారం.
పుల్ల పుల్లగా  నోట్లో  నీరు  తెప్పిస్తూ  భలే   రుచిగా  ఉంటుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారు చేసిన విధానము  మరియు ఫోటో తయారుచేయు  సమయమున తీసినది
వొక టమాటావాడ్చాను
వొకవంకాయ వాడ్చాను
నాలుగు పచ్చిమిర్చివాడ్చాను
పసుపు
ఉప్పు
చింతపండు రసం
మెంతిపిండి
కొతిమీర
ఇంగువతాలింపు
రోటిపచ్చడి 👌👌🍅🍆
వంకాయ  కాల్చిన  రోటి పచ్చడి .  (  వంకాయ బజ్జీ  రోటి పచ్చడి )
కావలసినవి .
గుండ్రని వంకాయలు  --  మూడు. 
పచ్చిమిర్చి  --  8
కొత్తిమీర  --  ఒక చిన్న  కట్ట 
చింతపండు  --  నాలుగు రెబ్బలు
పసుపు  --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత .
పోపునకు .
నూనె  --  మూడు  స్పూన్లు 
ఎండుమిరపకాయలు  --- 6
మినపప్పు  --  స్పూను 
ఆవాలు  --   అర స్పూను 
జీలకర్ర  --  పావు స్పూను 
ఇంగువ  --  కొద్దిగా 
తయారీ విధానము .
ముందుగా  వంకాయలు పైన  నూనె రాసి  స్టౌ  సిమ్ లో  పెట్టి  అన్ని  వైపులా  కాల్చుకుని  చల్లారగానే  తడి చేతితో  పై తొక్క మరియు  తొడిమ  తీసుకుని  వేరే  ప్లేటులో పెట్టు కోవాలి .
వీటి పైన  కొద్దిగా  పసుపు వేసుకోవాలి .
చింతపండు  విడదీసి  నీళ్ళలో తడుపు కోవాలి .
ఇప్పుడు   స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం నూనె  వేసి , నూనె బాగా  కాగగానే   వరుసగా ఎండుమిర్చి   ముక్కలు , మినపప్పు  , ఆవాలు , జీలకర్ర ,  ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  ముందుగా  రోటి లో  ఎండుమిరపకాయలు , చింతపండు , ఉప్పు వేసి  మెత్తగా  పచ్చడి బండతో దంపుకోవాలి.
తర్వాత పచ్చిమిరపకాయలు   వేసి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .
తర్వాత  కాలిన  వంకాయలు , మిగిలిన  పోపు  మరియు కొత్తిమీర కూడా వేసి  ఒకసారి  బండతో  నూరుకోవాలి  .
అంతే .  దోశెలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  వంకాయ  కాల్చిన   బజ్జీ  రోటి పచ్చడి  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

🤔🤔🤔 సొరకాయ సొగసులు 🤔🤔🤔
వేయించిన వేరుశెనగకాయలు వెంటరాగా
సోయగాల సొరకాయకు జీలకర్ర సాయం కాగా 
ఒళ్ళంతా వేడినూనె రాసుకొని
ఒయ్యారంగా కడాయిలో తిరిగి రంగు తెచ్చుకొని 
కారంగా పచ్చని పచ్చి మిరపకాయలతో 
కాస్త ఘాటుగా తెల్లని వెలుల్లిపాయలతో 
చిటికెడు ఉప్పు, చింతలేని చింతపండు తో
చిద్విలాసంగా చిందులేస్తూ మిగితా అన్నిటీతో 
రోటిలో లో గెంతి గిఱ్ఱుగిఱ్ఱున తిరిగి 
ఘుమఘుమల తాళింపుతో కలిసి 
సొగసుగా తయ్యరైంది ఈ సొరకాయ పచ్చడి
సుందరంగా అలంకరించమని చేసింది అలజడి 
ఉయ్యాలలూగాలని ఉబలాటపడింది 
ఉరవడిగా సృజనాత్మకత ఉట్టి పడింది
                 

ఆలూరుకృష్ణప్రసాదు .
కరివేపాకు రోటి పచ్చడి .
తయారీ  విధానము  .
ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు  నూనె  వేసుకుని నూనె బాగాకాగగానే  , రెండు కప్పుల కరివేపాకు  , 50  గ్రాముల  పొట్టు  మినపప్పు  ,  పన్నెండు  ఎండుమిరపకాయలు  , అర స్పూను   ఆవాలు ,  ఇంగువ  కొద్దిగా వేసుకుని పోపు వేయించుకోవాలి.  
నిమ్మకాయంత  చింతపండు   వేడి నీళ్ళలో  పావు గంట సేపు   నాన బెట్టు కొని    చిక్కగా  రసం  తీసుకోండి .
పోపు చల్లారగానే  రోటి లో  ముందు  వేగిన  ఎండుమిరపకాయలు ,  తగినంత ఉప్పు మరియు కొద్దిగా  పసుపును వేసుకుని   పచ్చడి బండతో దంపుకోవాలి .  
ఆ  తర్వాత  వేయించి  సిద్ధంగా  ఉంచుకున్న పొట్టు మినపప్పు   కరివేపాకు   మిశ్రమం , చింతపండు  రసం మరియు తీపి  ఇష్టమైన వారు  కొద్దిగా  బెల్లం  వేసుకుని  కొంచెం కొంచెం   నీరు    చల్లుకుంటూ  పప్పులు పప్పులుగా   పొత్రముతో రుబ్బు కోవాలి.  ఈ విధముగా  రుబ్బితే  కరివేపాకు   పచ్చడి  రుచిగా బాగుంటుంది .
పొట్టు  మినపప్పు తో  అయితే  పచ్చడి చాలా రుచిగా  ఉంటుంది  . 
పొట్టు మినపప్పు  లేని పక్షంలో చాయమినపప్పు  వేసుకుని  పచ్చడి  చేసుకొనవచ్చును .
ఈ పచ్చడి  ఐదు రోజులు  నిల్వ ఉంటుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసీపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది
ఆలూరుకృష్ణప్రసాదు . 
ప్రియమిత్రులందరికీ 
ఈ  రోజు  స్పెషల్  అరటి కాయ పచ్చడి .
అరటి  కాయ  తో  పచ్చడా  !
అని  ఆశ్చర్య  పోకండి.
ఒకసారి  చేసి  చూడండి .
అరటి కాయ పచ్చడి  తయారు  చేయు  విధానము .
కాలసిన  వస్తువులు .
అరటి కాయలు       --   2
పెద్ద ఉల్లిపాయలు    --     2 
పచ్చిమిరపకాయలు   ---  4
కరివేపాకు     -----   3   రెమ్మలు
కొత్తిమీర     -----   ఒక చిన్న కట్ట .
పోపు  వేయుటకు.
నూనె  --  మూడు స్పూన్లు .
ఎండు  మిరపకాయలు  ---  5
చాయ మినపప్పు  ---  స్పూనున్నర  
ఆవాలు   ----  ముప్పావు   స్పూన్ 
ఇంగువ   ---  తగినంత 
పసుపు   ---  కొద్దిగా  
ఉప్పు   ----  తగినంత .
అరటి కాయ  పచ్చడి  తయారు చేయు విధానము .
ముందు  ఉల్లిపాయలు  పై  పొట్టు  తీసి  చాలా  సన్నగా  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి.
(  ఎలాగంటే  దోశెలలోకి  మరియు మిర్చి  బజ్జీలలోకి  సన్నగా  తరుగుతాము  కదా .  ఆ  విధంగా )
ఇప్పుడు  అరటికాయలు  శుభ్రంగా  కడిగి  పొడి  గుడ్డ పెట్టి  తుడవండి. 
అరటి కాయల  చెక్కు తీయవద్దు.
ఇప్పుడు  స్టౌ  వెలిగించి  సెగ  సిమ్  లో  పెట్టండి.
అరటికాయలు మీద  నూనె రాయనక్కరలేదు . 
ఆ  రెండు  అరటి కాయలు  వంకాయలు  బజ్జీ  పచ్చడికి  కాల్చినట్లు  కాల్చండి .
పై  చెక్కు  నల్లగా  అయి  చేతితో  పట్టుకొని   చూస్తే  లోపల  మెత్తగా  అవుతుంది .
గిన్నెలో  నీళ్ళు  పెట్టుకుని  చేతులు  తడి చేసుకుంటూ  ఆ కాయల  పై చెక్కు తీసేయండి .
ప్లేటులో చెక్కు వలిచిన  అరటి  కాయలు  ఉంచుకోండి.
ఇప్పుడు  స్టౌ  మళ్ళీ  వెలిగించి  మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగాక  అందులో  చాయ మినపప్పు , ఆవాలు , ఎండు మిరపకాయలు మరియు  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగాక  అందులో  కరివేపాకు , పచ్చిమిరపకాయలు   వేసి  రెండు  నిముషాలు  ఉంచి  స్టౌ  ఆపేయండి .
సన్నగా   తరిగిన  ఉల్లిపాయ ముక్కలు  వేయించవద్దు .
పోపు  చల్లారాక  ముందుగా   రోటిలో  ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు , పసుపు కొద్దిగా వేసి  మెత్తగా పచ్చడి బండతో  దంపుకోవాలి.
మిగిలిన  పోపు  ఇప్పుడే  వేయవద్దు.
తర్వాత  రోటిలో   మనం స్టౌ మీద కాల్చిన  అరటి కాయలు  , పచ్చి మిరపకాయలు  వేసి  పచ్చడి  బండతో  దంపుకోవాలి .
అరటికాయలు  బాగా  కాలి ఉంటాయి  కాబట్టి  దంపిన వెంటనే  మెత్త పడుతుంది .
ఇప్పుడు దంపిన మిశ్రమమును  ఒక  పళ్ళెంలోకి  తీసుకొని  సన్నగా  తరిగి ఉంచుకున్న  ఉల్లిపాయ ముక్కలు , మిగిలిన  పోపు , కొత్తిమీర   సన్నగా   తరిగి  చేత్తోనే  బాగా కలుపుకుని  ఒక  Bowl  లోకి  తీసుకోండి.
అంతే  రుచికరమైన  అరటి కాయ  పచ్చడి  భోజనం  లోకి  సిద్ధం.
ఇందులో  ఉల్లిపాయలు  పచ్చివి  వేసుకుంటేనే  చాలా రుచిగా  ఉంటుంది .
వేగిన  మినపప్పు పంటి కింద   తగులుతూ  చక్కని  రుచితో  ఉండే  ఈ  అరటి కాయ  పచ్చడి  తప్పక   try  చెయ్యండి.
మీ  అందరికీ   నచ్చుతుంది .
ఈ  పచ్చడికి  పండిన , ఓ  మాదిరిగా   పండిన  అరటి కాయలు మాత్రం   వాడవద్దు .
పచ్చడి  తీపి  వచ్చి  రుచి  పాడవుతుంది . పచ్చి  కాయలే  వాడండి .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారు చేయు  సమయమున  తీసినది 
అందరికీ 🙏
బాదంగింజల పచ్చడి
విధానము
వేయించిన ఎండు మిర్చి , పోపుగింజలు తో పచ్చిమిర్చి, నానబెట్టి పొట్టు తీసిన బాదంగింజలు, వుప్పు, పసుపు రోటిలో వేసి నీళ్ళు చల్లుతూ రోకలి బండ తో , బాగా మెత్తగా నూరి గిన్నె లోకి తీసుకుంటే ; అన్నం , లేదా టిఫెన్ల లోకి రుచికరమైన బాదంగింజల పచ్చడి సిద్ధం 

ఆలూరుకృష్ణప్రసాదు .
కొండ గోంగూర  ఆకుతో  పచ్చడి .
కొండ  గోంగూర  అంటే  పుల్ల గోంగూర.
ఈ  కూర  సంవత్సరం  మొత్తం  మనకి దొరుకుతుంది  .
రెండు  కట్టలు  తెచ్చుకుని   ఆకును  వలుచుకుని  కాసేపు  నీడన ఆర  బెట్టు కోవాలి  .
ఒక  ఆరు  పచ్చి మిరపకాయలు  తొడిమలు తీసుకుని  ఉంచుకోవాలి.
స్టౌ  మీద  బాండీ  పెట్టి  ఒక  మూడు  స్పూన్లు   నూనె  వేసి, నూనె బాగా కాగగానే   గోంగూర  ఆకును మరియు  పచ్చిమిర్చి   కొద్దిగా  ఉప్పు మరియు  కొద్దిగా  పసుపును  వేసి  మూత  పెట్టి  మెత్తగా మగ్గ నివ్వాలి .
మగ్గిన తర్వాత  వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి  .
తిరిగి  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మరో మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే ,   పది   ఎండుమిరపకాయలు , పావు స్పూను  మెంతులు , స్పూను  మినపప్పు  ,  ముప్పావు  స్పూను   ఆవాలు  , కొద్దిగా   ఇంగువ   వేసి  పోపు  వేయించుకోవాలి .
ఆ  తర్వాత  రోటిలో   ముందుగా   ఎండుమిరపకాయలు మరియు  తగినంత   ఉప్పును  వేసుకుని మెత్తగా పచ్చడి బండతో   దంపుకోవాలి ..
ఆ తర్వాత  వేయించిన  గోంగూర  పచ్చి మిర్చి మిశ్రమము రోటిలో వేసుకుని  మెత్తగా   పచ్చడి  బండతో  నూరుకోవాలి .
చివరగా  మిగిలిన  పోపు  వేసుకుని   ఒకసారి బండతో  నూరుకుని   వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి  . 
అంతే . ఎంతో  రుచిగా  పుల్ల పుల్లగా  నోరూరించే  కొండ  గోంగూర  పచ్చడి  భోజనము  లోకి   సర్వింగ్  కు  సిద్ధం .
ఈ గోంగూర  ఆకుతో  పచ్చడి  నాలుగు  రోజులు  నిల్వ ఉంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారు చేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది.

రోకలి దొరికిందోచ్ !! 
మొన్న  దిల్ సుఖ్ నగర్ వైపు వెళ్ళినపుడు.. ఎల్ బి నగర్లో రోళ్లు దొరుకుతాయని చెప్పంది విని... అటువైపు వెళ్లాను.  ఎల్ బీ నగర్ దాటి  వనస్థలి పురం రొడ్డున వెళ్తుంటే రోడ్డుకిరువైపులా    బంగారంలాంటి రోళ్ళు దర్శనమిచ్చాయు. వాటితో పాటూ ఏవేవో వస్తువులు. చేత్తో చేసినవి..కాస్త చవక రకాలు.  టెంపరరీ నివాసాల్లో బతుకులు సాగదీసే సంచారులు ఇలాంటివన్నీ చేస్తూ  పొట్ట పోసుకుంటూంటారు.  నిజానికి వీళ్ళే భారతీయ సంస్కృతీ సంప్రదాయాలని కాపాడే వాళ్ళు..కదా !! 
 టివీల్లో అడ్వర్టైజ్ మెంట్లు చూసి వాటికోసం ఎగబడి, సూపర్ మార్కెట్లో, కార్పొరేట్ షోరూముల్లోనూ  బ్రాండ్, లేబుల్సూ చూసి అంతర్జాతీయ సరుకులు కొనుక్కు బతికే మనం  నిజానికి సంతొషకర  జీవిత శైలిని ఎప్పుడో మరిచామేమో. చదువు, మల్టీ నేషనల్ ఉద్యోగాల వేట,  అమెరికాలాంటి దేశాలని ఎగిరిపోవాలనే  కాంక్ష తప్ప ... ఉన్నంతలో ఆరోగ్యంగా..ఆనందగా బతకాలని ఆలోచించలేము. కాలచక్రంలో .. జీవిత పోరాటంలో  మనకే తెలియని గమ్యాలకోసం పరుగు.  !! 
ఇహ విషయానికొస్తే.. రోలు దొరికింది. రాతి రోకలి ఉంది. కానీ నాకు రోకలి కావాలని అడిగాను. అది రైతు బజార్లో దొరుకుతుంది సర్ అన్నది. సరే  ఎస్సార్ నగర్లో రైతు బజార్ దగ్గరవుతుంది. అక్కడ కొందాం అనుకున్నాను. కానీ ఈ పదిరోజుల్లో వెళ్లలేకపోయా. రోలు ని చూసి  ఆగలేక ఇంట్లో ఉన్న ఒక గుండు రాయితో మొన్న టమాటో పచ్చడి చేసుకుతిన్నా.. రాయి చిన్నగా ఉండటం తో నూరటం సరిగ్గా కుదరటం లేదు.  సో రోకలి కావాల్సిందే అనుకుని.. ఇవ్వాళ సాయంత్ర  అదే పనిగా  ఎస్సార్ నగర్ రైతు బజార్ బయలుదేరా..  లోపలికి వెళ్ళి చూస్తే... అన్నీ కూరగాయలే తప్ప .. ఒక్క చోటా రోళ్ళూ, రోకలో దర్శనమిచ్చింది కావు.  డిస్సప్పాయింట్ మెంటుతో వెనుదిరుగుతూ.. అనిపించింది. ఇలాంటి వస్తువులన్నీ కాస్త  దిగువతరగతి మార్కెట్టులో ఉంటాయి. అక్కడ ప్రయత్నిద్దాం.  అని సనత్ నగర్ వైపు బయలుదేరాను. అనుకున్నట్టుగానే.....  మూసపేట్ బ్రిడ్జీ ఎక్కే ముందు.. బస్ స్టాపువద్ద.. చిత్ర విచిత్ర దుకాణాలు దర్శనమిచ్చాయి.  ఇనుప పెట్టెలూ,  మడుచుకోగల ఇనుప మంచాలు, నవారు మంచాలూ  మొదలైనవి. ఇక్కడ ఖచ్చితంగా దొరికితీరాలి అనుకుంటుండగానే....ఒక షాప్ లో ఇదుగో ఇక్కడున్నాం అని దర్శనమిచ్చాయ్ రోకళ్ళు !! 
ఇంకేమి....దిగి  నూటయాభై చెపితే వందరూపాయలకి బేరమాడుకొని తెచ్చుకున్నాను.  ఇహ సమయం ఉన్నప్పుడల్లా పచ్చళ్ళ ప్రయోగాలు చేయాలి. 
రోకలి కావాలనుకునేవాళ్ళకోసం అడ్రసు ఇస్తున్నాను. తెచ్చుకోండీ.. దంచుకోండీ !! 😛 

రోలున రుబ్బెడి పచ్చడీ
చాలా రుచిరంబు తినగ చవు లూరించన్
కాలంబుయె మారెను గద
రోలుయె యే యింటనైన రూఢిగ గలదా?
రోటి చట్ని యన్న లొట్ట లేయును జిహ్వ
మిద్దె నుంచి దించు మేటి మగడ!
పాటు యేమి లేదు పాడు "కరోన" తో
రుబ్బి నీవు నీయ రుచిగ నుండు.
ఓహో! కరోన! పాట్లివి,
యాహా! నా భార్య యాజ్ఞ యమలే జేస్తిన్.
సాహో! రోటీ చట్నిని
బాహువులే నొప్పి పుట్ట బఱబఱ రుబ్బన్.
గరగర మిక్సీ కంటెను
బరబర రుబ్బంగ రోటి పచ్చడి రుచియే
చురచుర కమ్మగ నుండును
బిరబిర లొట్టల తిననిదె ప్రియ భక్షణమే!
****** శిష్ట్లా తమ్మిరాజు ******
Comm

🌻🌹నా కొత్తరోలు- రోటి పచ్చళ్లు🌹🌻 
                       దొండకాయ పచ్చడి   
        (2011 పోస్ట్ సేకరణ) రచయిత నేను కాదు..
హమ్మయ్య! ఇన్నాళ్ళకి మళ్ళా మీ ముందుకొస్తున్నా! చాలా కూసింత బిజీగా ఉండటంవల్ల అప్పుడెప్పుడో మీకు చెబ్దామనుకున్న నా "కొత్తరోలు కథలు" చెప్పటానికి, ఇవ్వాళ్టికి కాస్త తీరిక దొరికింది. ఇప్పుడు కూడా ఇంకా చాలా కూసింత బిజీనేకాని, మరీ నా బ్లాగు "ఆకలో రామచంద్రా! రోటి పచ్చడో రామచంద్రా!" అని తెగ గొడవెట్టేస్తుంటేనూ ఇక ఉగ్గబట్టుకోలేక వచ్చేశానన్నమాట! ఇక మొదలెట్టేద్దామా నా రోటిపచ్చళ్ళ పురాణం..😉! ఇది కొన్ని భాగాలుగా రాస్తానన్నమాట! ఒక్కోభాగంలో కొన్ని కొన్ని టిప్స్ అలా ఫ్లోలో చెప్పేస్తానేం.......
మీకందరికీ బాగా తెలుసుకదా, నాకున్న రోటి పచ్చళ్ళ పిచ్చి! మిక్సీలు, గ్రైండర్లూ మనకి పడవు, కాబట్టి రోలు కొనుక్కోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసి ఒక బుజ్జి రోలు తెచ్చుకున్నా... మరేం! పెద్దది చాలా రేటు చెప్పాడు, మనం పప్పులూ,గట్రా రుబ్బంకదా, పచ్చడికే కదా అని చిన్నదే తెచ్చుకున్నా... మాకు ఇక్కడ చిన్నపాటి రోళ్ళపరిశ్రమ ఉందిలెండి! ఈ రోజుల్లో ఎవరు కొంటున్నారబ్బా అనుకున్నా! నాలాంటి పిచ్చ ఉన్నోళ్ళు చాలామందే ఉన్నారనిపించింది,అక్కడ వాళ్ళు తయారు చేసే రోళ్ళు చూస్తే....
ఇక ఎలాంటి రోలు మంచిది, మన్నిక ఉండాలంటే ఎలాంటిది తెచ్చుకోవాలి? అన్నది పెద్ద ప్రశ్న... రోళ్ళు కొండరాయితో చేసినవి, నాపరాయితో చేసినవి రెండు రకాలుంటాయి. కొండరాయితో చేసింది కాస్త ధర ఎక్కువగాని, వందల ఏళ్ళున్నా ఏమీకాదు. అదే నాపరాయితో చేసిందైతే ధర తక్కువైనా నాలుగైదేళ్ళకే పగిలిపోతుంది. కాబట్టి, కొండరాయిదే తెచ్చుకున్నా నేను. మా ఊళ్ళో మా ఇళ్ళ ముందు ఒక పెద్ద రోలుండేది. కొండరాయిదే, కాని ఎఱ్ఱ్రరాయిది...నేలబారున ఉండేది. అప్పట్లో పల్లెటూళ్ళల్లో ఇలాంటి రోళ్ళు ఊరి మధ్యలో, లేకపోతే ఇరవై ముఫ్ఫై ఇళ్ళకి కలిపి ఒకటి ఖచ్చితంగా ఉండేవి..వడ్లు దంచుకోటానికీ, చింతకాయ పచ్చడి తొక్కుకోనూ అందరూ ఇదే వాడుకునేవాళ్ళట! అటెళ్ళేవాళ్ళూ,ఇటెళ్ళేవాళ్ళూ కాసేపు రోకలి తీసుకుని నాలుగుపోట్లు వేసివెళ్ళేవాళ్ళు.. అలా అందరం ఒక కుటుంబం అన్న భావాన్ని పెంపొందించడానికి ఈ రోళ్ళు బాగానే ఉపయోగపడేవి... ఆ రోళ్ళూ పోయాయి, ఆ కలివిడి బతుకులూ పోయాయి..ప్చ్!
నేను కొన్న రోలు చిన్నది కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన పన్లేదు. గుంట కాస్త లోతు ఎక్కువ ఉన్నదే తీసుకున్నా. అదే, పెద్ద రోలు కొనే పనైతే గట్టు బాగా వెడల్పు ఉన్నది, గుంట తక్కువ ఉన్నది తీసుకుంటే మంచిది, రుబ్బుకోటానికి అప్పుడే అనువుగా ఉంటుంది. లోతు ఎక్కువ ఉంటే పొత్రం కిందకి వెళ్ళిపోయి పచ్చడిగాని,పిండిగాని సరిగ్గా మెదగదు. గట్టు లేకపోతే పక్కకి పడిపోతుంది. పొత్రం కూడా సరైన సైజు చూసి సరిగ్గా వేయించుకోవాలి.
పెద్దరోళ్ళలో రెండు రకాలుంటాయి. ఒకటి మామూలుగా పచ్చళ్ళు,పిండ్లు రుబ్బుకోటానికి. రెండోది గింజలు దంచుకోటానికి, పొడిపిండి కొట్టుకోటానికి, ఎక్కువ మోతాదు పచ్చళ్ళు(చింతకాయ,ఉప్పుగోంగూర,కొరివికారం) తొక్కటానికి. మొదటిది ఒకటే రోలు, నాలుగు పలకలుగా ఉంటుంది. రెండోది రెండు భాగాలుగా ఉంటుంది. కింద చిన్నగుంటతో ఉన్న గుండ్రటి కుంది ఉంటుంది.దానిపైన ఇంకాస్త వెడల్పున్న గుండ్రటి చట్రాన్ని ఎక్కిస్తారు.రెండూ కలిసి లోతు ఎక్కువ వస్తాయి. పై చట్రంగట్టు, కింద కుందికన్నా బాగా వెడల్పుంటుంది.
ఈ రోట్లో అరిసెల పిండి కొట్టేప్పుడు, చింతకాయ పచ్చడి తిరగ తొక్కేటప్పుడు, జొన్నలు తొక్కేటప్పుడు భలే సరదాగా ఉండేది. రెండు రోకళ్ళపోటు,మూడు రోకళ్ళపోటు,నాలుగు రోకళ్ళపోటు ఇలా పందేలు కట్టి వేసేవాళ్ళు. నాలుగురోకళ్ళపోటు వెయ్యగలిగితే మొనగాడి లెఖ్ఖ! ఒక రోకలికి ఒకటి తగలకుండా, రోలు అంచుకి తగలకుండా పోటు వెయ్యటమంటే, అబ్బో! పెద్ద ఆర్టు అది... మనకి మూడు రోకళ్ళపోటే గగనంగా ఉండేది..😉 లయబధ్ధంగా పోటు వేస్తూంటే ఆ రోకళ్ళ చప్పుడు వింటానికి ఎంత బాగుండేదో! అసలు మాకు పొద్దున్నే ఈ రోకళ్ళపోటుతోనే తెల్లారేది...పొద్దున్నే కళ్ళు నులుముకుంటూ వెళ్ళి అన్నయ్యా, నేనూ జొన్నలు తొక్కేవాళ్ళం..మా పక్కింటోళ్ళకీ, మాకూ పోటీ! ఎవరు వేగంగా పోటేస్తున్నారా అని. అన్నయ్య బాగా ఆవేశపడిపోయేవాడు. మనమేమో మహా నిమ్మది, రిజల్టు! నాలుగైదు పోట్లకొకసారైనా రెండు రోకళ్ళూ ఢీకొనేవి... నాన్న వచ్చి డిప్పమీద ఒకటిచ్చేవాడు, సరిగ్గా వెయ్యి అని....హ్మ్! ఆ రోజులే వేరు.........
ఇక రోలు ఎంచుకునేప్పుడు "కక్కు" బాగా కొట్టింది తీసుకోండి, అంటే లోపలవైపున గరుగ్గా గుంటలు,గుంటలుగా ఉంటుంది కదా, అది! అప్పుడు బాగా మెదుగుతుంది, పచ్చడైనా, పిండైనా....{దీన్నే గంట్లు కొట్టటం అని కూడా అంటారని గోదారోళ్ళ ఉవాచ!...😉..😉..}... పాతరోళ్ళకి కూడా మళ్ళా మళ్ళా "కక్కు" కొట్టిస్తూనే ఉండాలి...
ఇక రోలు సెలెక్షను అయిపోయింది కదా! అందులోకి వాడే రోకళ్ళూ,పచ్చడిబండలూ, పొత్రాల గురించి తరువాయి భాగంలో చెప్తానేం! అలా తెచ్చుకున్న కొత్తరోలుని "అలవాటు" చెయ్యాలి! అంటే కొత్తగా చెక్కిన రోలు కదా, ఇసుక వచ్చిద్ది అలానే వాడేస్తే. అందుకని ఆ ఇసక పోయేట్టు చెయ్యటాన్ని అలవాటు చెయ్యటం అంటారు... మామూలుగా అందరూ ఊకపోసి దంచుతారు ఏడెనిమిదిసార్లు...అప్పుడు లోపలున్న ఇసకంతా పోయి పచ్చడి తొక్కుకోటానికి వీలుగా తయారైద్ది. ఐతే నాకిక్కడ ఊక ఎక్కడ దొరికిద్ది? అందుకే జ్యోతిగార్ని అడిగా.... భలే అవిడియా చెప్పారు జ్యోతిగారు. గోధుమపిండి కలిపి, ఆ ముద్దని వేసి బాగా గుంటలో అంతా నాలుగైదు సార్లు రుద్ది, తర్వాత శుభ్రంగా కడిగేస్తే ఇసక ఒక్క పిసరకూడా లేకుండా పోయింది...
తర్వాత కొత్తరోలు మొదలెట్టాలంటే ఉండ్రాళ్ళు పొయ్యాలంట, తాంబూలాలివ్వాలంట! ఇవన్నీ మన బ్రహ్మచారి జీవితానికి ఎక్కడ కుదురుతాయి. అందుకని కాస్త పసుప్పూసి, కుంకవెఁట్టి, ఓ పసుపుకొమ్ము తాడు కట్టి మొదలెట్టేశా....😉 పైగా ఎప్పుడెప్పుడు రోట్లో పచ్చడి తొక్కుకు తిందామని ఆత్రం..😉! ఇక నా రోట్లో తొక్కిన మొదటి పచ్చడి చుక్కకూరపచ్చడి. దాని ఫొటో తియ్యలేదు ఆరోజు హడావుడిలో... తర్వాత దొండకాయ పచ్చడి చేశా! అది చెప్పుకుందామేం ఇవ్వాళ!
అసలు దొండకాయలంటే పచ్చడే!వాడ్చి పచ్చడి తొక్కితే ఎంత కమ్మగా ఉంటదో! వేపుడు,ఇగురూ మనకి అంత ఎక్కవు..... అది కూడా మా ఇళ్ళల్లో అంత రెగ్యులర్గా అలవాటు లేదు. దొండపందిరి ఉన్నా, ఇక ఏ కూరగాయలూ లేకపోతే దొండకాయ పచ్చడి అన్నమాట! "పిచ్చి దొండకాయలు" అంటుంటారు, మరి తింటే పిచ్చెక్కిద్దనో లేక పాపం!నీళ్ళు పోసినా, పొయ్యకపోయినా సంవత్సరాల తరబడి అలానే పిచ్చిపిచ్చిగా కాస్తుంటాయనో...😉
బాగా పచ్చిగా ఉన్న దొండకాయలే బాగుంటాయి పచ్చడికైనా, వేపుడు కైనా... కాస్తంత దోరబడి, లోపల ఎఱ్ఱగా ఉన్నా పచ్చడికి పనికొస్తాయి కాని వేపుడుకి పనికి రావు...ఇక పూర్తిగా పండిపోయాయనుకోండి! చూసుకోటానికీ,నోట్టో వేసుకు చప్పరించటానికీ,అదీ కాకపోతే అందమైన అమ్మాయి పెదవులతో పోల్చి వర్ణించుకోటానికీ తప్ప పచ్చడికి పనికి రావు..😉
అలా పచ్చగా నవనవలాడుతున్న దొండకాయలు ఒక పావుకేజీ(నలుగురికి రెండు పూటలకీ వచ్చిద్ది) తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి అడ్డంగా, చక్రాల్లా సన్నగా తరుక్కోండి...తొడెం, చివరి ముట్టె తీసేయండి. అవి పడితే సరిగ్గా మెదగవు. పంటికింద పడితే బాగోవు.
ఇప్పుడు బాండీ పొయ్యిమీదెట్టి, ఓ పెద్ద గెంటెడు నూనేసి, అది కాగంగనే, పైన తరుక్కున్న దొండకాయ ముక్కల్ని, ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయల్నీ వేసి వాడ్చాలి, అదేనండీ వేయించాలి ..😉..... అన్నీ బాగా వేగాయనుకోగానే చివర్లో కాస్త జీలకఱ్ఱా,నాలుగు మెంతులూ,కాసిన్ని ధనియాలూ వేసి వేగనివ్వాలి....
పచ్చిమిరపకాయల్తో తొక్కితే ఒకలా ఉంటుంది. ఎండు మిరపకాయలేసి తొక్కినా బాగుంటుంది. ఎండు మిరపకాయలైతే వేయించాల్సిన పన్లేదు. ముందు రోట్లో ఎండు మిరపకాయలేసి, కాసిన్ని నీళ్ళు పోసి తొక్కాలి, అది మెదిగాక దొండకాయ ముక్కలు, మిగతావి వేసి తొక్కా లి.
పైన వేయించిన సంభారాలన్నీ బాండీలోంచి డవిరెక్టుగా రోట్టోకి మార్చి, కుంకుడుగాయంత చింతపండూ,నాలుగు వెల్లుల్లి రెబ్బలూ, ఒక చిన్నస్పూను ఉప్పూ వేసి ఇక రోకలిబండ తీసుకుని తొక్కటమే.
ఒక చేత్తో ఎగదోసుకుంటూ మరో చేత్తో నూరాలి.దీనికి కొంచెం ఒడుపు కావాలి. అలవాటుమీద అదే వస్తుందనుకోండి.పైగా చేతి కండరాలకి భలే వ్యాయామంలే!..😉..పచ్చడి కొంచెమే అయితే, రెండు చేతులతో రోకలిబండ చివర్న పట్టుకుని నూరితే తొందరగా మెదిగిపోద్ది...
అలా రోట్లో పచ్చడి తొక్కుతూ ఉంటే, నాలుగైదు పోట్లు పడగానే కమ్మటి వాసన ముక్కుపుటాలకంటి ఉక్కిరిబిక్కిరి ఐపోతాం.... కాస్త తీసుకుని నాలిక్కి రాసుకోందే ప్రాణం ఊరుకోదు. కాని, రోటి దగ్గర నాకితే పెళ్ళికి వానపడిద్దని ఇంట్లో కట్టడి! ఇక్కడ మనకి స్వతంత్రం కదా! "పడితే పడింది వెధవవాన, పేద్ద కళ్యాణమండపం తీసుకుని చేసుకుందాంలే" అని సర్ది చెప్పుకుని చక్కగా రోకలికి అంటింది వేలితో తీసి చివర్లో నాకేస్తుంటా..😉
కొంచెం మెదిగింతర్వాత మరికాస్త కొత్తిమీర వేసి తొక్కండి. పచ్చడి మరీ లేహ్యంలా తొక్కొద్దు. కచ్చాపచ్చాగా తొక్కితేనే బాగుంటుంది. అమ్మ చెప్తూ ఉంటుంది,నెల్లూరులో ఉన్నప్పుడు ఇంటి ఓనర్లు అమ్మ పచ్చడి తొక్కుతుంటే,"పచ్చడిబండ అరిగిపోద్ది" అని హాస్యమాడేవాళ్ళంట! వాళ్ళు మరీ ఊరకే అలా, అలా ముక్కలు చితగ్గొట్టి తినేస్తారు...
ఇప్పుడు ఈ పచ్చడిని రోట్లోంచి గిన్నెలోకి తోడుకొని, కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు... ఎక్కువ పచ్చడి, అంటే ఒక కేజీ తొక్కి, నాలుగైదు రోజులు నిలవుంచాలనుకుంటే తాలింపు పెట్టుకుంటే నిలవుంటుంది.
ముక్కలు వేయించేప్పుడు కాసిన్ని దోసిత్తనాలు వేసి వేయించి పచ్చట్లో వేసి నూరితే పచ్చడి ఘుమఘుమలాడిపోద్ది.... చింతపండు బదులు ముడిచింతకాయ పచ్చడి కూడా వేసుకోవచ్చు,బాగుంటుంది. కొంతమంది ఇందులో పచ్చికొబ్బరివేసి నూరతారు, మనకి నచ్చదు.
పచ్చడి చేసుకున్న ఆనందంలో రోలు కడగటం మర్చిపోవద్దండోయ్! రోలూ,రోకలిబండా శుభ్రంగా కడిగి, రోకలిబండ ఎండ తగలని చోట జాగ్రత్త చేసుకోవాలి.
ఇప్పుడు చక్కగా అన్నం వండుకుని, వేడివేడన్నంలో ఈ పచ్చడేసుకుని, మరికాస్త నెయ్యివేసుకు తింటుంటే అబ్బబ్బ! ఆ వాసనకే ఆకలి చచ్చిపోయిన రోగికి కూడా ప్రాణంలేచొచ్చి ఓ ముద్ద నోట్లో వేసుకుని తరిస్తాడు...
Comments

ఆలూరుకృష్ణప్రసాదు .
మరో  వెరైటీ  రోటి వెల్లుల్లి  కారప్పొడి .
కావలసినవి.
ఎండుమిరపకాయలు  - 15.
చాయ మినపప్పు  -  రెండు  స్పూన్లు .
ఆవాలు - స్పూను
జీలకర్ర  - అర  స్పూను 
వెల్లుల్లి  రెబ్బలు  - 35
రెబ్బలపై  పై పొట్టు  వలుచుకోవాలి.
కరివేపాకు  - ఒకటిన్నర  కప్పు.
చింతపండు  - చిన్న నిమ్మకాయంత . విడదీసి ఉంచుకోవాలి.
పసుపు -  పావు స్పూను.
నూనె -  ఆరు  స్పూన్లు .
ఉప్పు -  తగినంత .
తయారీ విధానము .
ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టి  మూడు  స్పూన్లు  నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే  వెల్లుల్లి  రెబ్బలు  వేసి  వేయించు కోవాలి. మరీ  వేగకూడదు. మరీ ఎర్రగా  అవకూడదు.
వేగగానే  వేరే ప్లేటులోకి  తీసుకోవాలి.
మళ్ళీ  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన మూడు  స్పూన్లు  నూనె వేసుకుని  నూనె బాగా కాగగానే , వరుసగా  ఎండుమిరపకాయలు  , చాయమినపప్పు , ఆవాలు  , జీలకర్ర , పసుపు మరియు కరివేపాకును వేసుకుని పోపు వేయించుకోవాలి.
పోపు చల్లారగానే  ముందుగా  రోటిలో ఎండుమిరపకాయలు , చింతపండు  మరియు తగినంత  ఉప్పును వేసి మెత్తగా పచ్చడి  బండతో  దంపుకోవాలి.
తర్వాత  వేయించుకుని  సిద్ధంగా  ఉంచుకున్న  మిగిలిన పోపును వేసుకుని  మరీ మెత్తగా  కాకుండా పచ్చడి బండతో దంపుకోవాలి.
చివరగా  వేయించుకుని  సిద్ధంగా  ఉంచుకున్న వెల్లుల్లి  రెబ్బలు కూడా వేసుకుని  మరొక సారి  పచ్చడి  బండతో  దంపుకోవాలి.
తర్వాత  ఈ మిశ్రమమును రోటిలో నుండి   విడిగా ఓ  పళ్ళెంలోకి  తీసుకుని  , చేతితో బాగా కలుపుకుని విడిగా  ఒక  సీసాలోకి  భద్ర పరచుకోవాలి .
మామూలుగా  చేసుకునే కారప్పొడి లో  ధనియాలు వేసుకుంటారు. ఈ కారప్పొడి లో ధనియాలు  వేయరు.
వెల్లుల్లి  అసలు వాడని  వారు వెల్లుల్లి  బదులుగా   ఒక పావు కప్పు ధనియాలు  ఎండుమిరపకాయలు తో పాటుగా  పోపులో  వేసుకుని వేయించుకుని ఈ కారప్పొడి కొట్టుకోవచ్చును.
ముఖ్యంగా భోజనము లో  ముందుగా  వేడి  వేడి అన్నంలో  నెయ్యి వేసుకుని  ఈ కారప్పొడి  కలుపుకుని  తింటే అద్భుతమైన  రుచిగా ఉంటుంది.
అంతే గాక ఇడ్లీ , దోశెలు మరియు చపాతీల లోకి చాలా రుచిగా  ఉంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో తయారుచేయు  సమయమున  తీసినది.

పచ్చిమిరప కాయల పెరుగు పచ్చడి (నేను తరచుగా చేస్తుంటాను)
విధానము
 1. కొంచెం లావుగా తాజాగా వున్న పచ్చిమిరప కాయలు మీ అలవాటు ప్రకారము శుభ్రంగా కడిగి తుడిచి చాకుతో సన్నగా గాట్లు పెట్టి సిద్ధము చేసుకోవాలి. 
 2. మూకుడులో మినప్పప్పు, ధనియాలు, రెండు లేక మూడు మెంతి గింజలు, పావు స్పూను కు తక్కువ గా ఆవాలు, వొక్క జీడిపప్పు , యింగువ వేసి దోరగా  (dry roast ) వేయించుకోవాలి.  ఆ తరువాత మూడు స్పూన్ల తెల్ల నువ్వులు దోరగా (మాడకుండా) వేయించాలి.  వీటిని వొక పళ్ళెం లో తీసిపెట్టుకోవాలి. 
 3. అదే మూకుడులో కొంచెం నెయ్యి వేసి పచ్చి మిరపకాయలు వేసి గరిట తో  తిప్పుతూ అన్ని వైపులా దోరగా కాలేలా వేయించి, మిర్చికి సరిపోయేంత మాత్రమే, వుప్పు , పసుపు వేసి కలియబెట్టి వుంచాలి .  
 4. ముందుగా వేయించి బెట్టుకున్న నువ్వులు వగైరాలను, వీటికి మాత్రమే సరిపోయేంత వుప్పు వేసి రవంత బెల్లం కలిపి రోటిలో , రోకలి బండ తో నూరి, దంచి పొడి చేయాలి.  
 5. చివరగా వేయించి పెట్టుకున్న మిర్చి, రోటిలో దంచిన నువ్వుల పొడి అన్ని పెరుగు లో వేసి బాగా కలుపుకోవాలి.  మిర్చి విరిగి పోకుండా చూడండి .  కారంగా, ఘాటుగా వుండాలంటే వొకటి రెండు వేయించిన మిరపకాయలు కూడా రోటిలో నూరి కలపండి.  పోపు అవసరం లేదు.  మీకు కావాలంటే మీ యిష్టం కానీ నేతితో మాత్రమే .
 6. అన్నం తో మాత్రమే కాదు, చపాతీ, పుల్కా, అట్లు మొదలగు టిఫెన్లకు కూడా బాగుంటుంది 

కంది పచ్చడి రోటి లో తయారు చేసే విధానము:-
కావలసిన పదార్థములు:
కందిపప్పు 100 గ్రాములు, చింతపండు కుంకుడు గింజంత, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర పావు టీ స్పూన్, వెల్లుల్లి 3 రెబ్బలు, నూనె ఒక టీ స్పూన్, పోపు దినుసులు (ఆప్షనల్).
తయారు చేయు విధానము:
ముందుగా దోరగా కందిపప్పు వేయించుకోవాలి, తరువాత ఎండు మిరపకాయలు వేయించుకోవాలి కొద్దిగా నూనె వేసి, రోటిలో వేయించిన కందిపప్పు వేసుకుని మెత్తగా దంచుకోవాలి, ఉప్పు, చింతపండు, వేయించిన ఎండు మిరపకాయలు, వేసుకొని మెత్తగా దంచుకోవాలి కొద్ది కొద్దిగా నీరు పోస్తూ నూరుకోవాలి మెత్తగా పచ్చడిలా వచ్చేవరకు.
తరువాత దానిని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకోవాలి, ఇంగువ పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది.
కంది పచ్చడి, పచ్చి పులుసు, పిండి వడియాలు కు కాంబినేషన్ బాగుంటుంది.
మీరు ట్రై చేయండి.
Com

రోటి పచ్చడి సభ్యులకి నమస్కారం. ఈరోజు నేను దోసకాయ బజ్జి చేశాను .ఎలా చేశానో చెప్తాను. ఒక రెండు చిన్న దోసకాయలు తీసుకుని రౌండ్ గా  ముక్కలు కట్ చేసుకోవాలి. తొక్క తీయనవసరం లేదు.  దానికి సరిపడా పచ్చిమిర్చి, పసుపు, కొంచెం మజ్జిగ వేసి ఉడికించుకోవాలి .ఉడికించిన తర్వాత తీసి వాటిని రోట్లో వేసి   చింతపండు ,జిలకర ,వెల్లుల్లి, ఉప్పు, కొత్తిమీర,  వేసి బాగా దంచుకోవాలి. తర్వాత ఇంగువతో తరలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది  అన్నంలోకి కానీ దోసెల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇది పాత కాలం పచ్చడి మా అత్తమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు నేను చేస్తున్నాను. ఆయిల్ తక్కువగా పట్టిద్ది చాలా టేస్ట్ గా ఉంటుంది.


కాల్చిన దొండకాయలతో చింతకాయ (తొక్కు) పచ్చడి.  
పొయ్యి  మీద దొండ కాయలు కాల్చి వుంచుకోవాలి.  పోపుగింజలు, వేరుశనగ (పల్లీ) లు, యెండు , పచ్చి మిర్చి వేయించు కొని, రోటిలో దంచుకోవాలి.  కాల్చిన దొండకాయ లు కూడ రోటిలో  వేసి దంచి వుప్పు చింతకాయ కూడా వేసి నూరుకోవాలి.  చింతకాయ పచ్చడి లో వుప్పు చాలదనుకుంటే కొంచెం వేసుకోవచ్చు.  ఈ పచ్చడి చాలా రుచి గా వుంది.  మీరు కూడా చేసి , రుచి చూసి చెప్పండి .

రోటిలో దోసకాయ కాల్చిన పచ్చడి తయారు చేసే విధానం:-
కావలసిన పదార్థములు:
దోసకాయ -1, టమాటోలు -2 ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, వేయించిన ఎండు మిరపకాయలు -8, వెల్లుల్లి  రెబ్బలు-2, తగినన్ని పోపుదినుసులు 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేయించండి.
దోసకాయ కాల్చిన పచ్చడి తయారు చేయు విధానము:
ముందుగా దోసకాయ పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి, బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఎండు మిరపకాయలను వేయించుకోవాలి,  పోపుదినుసులు వేయించుకోవాలి,  పావు టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకొని అందులో టమాటో ముక్కలు వేయించుకోవాలి బాగా మగ్గనివ్వాలి. ఎండుమిర్చి రోటిలో వేసుకుని దంచుకోవాలి, పసుపు వెల్లుల్లి వేసి బాగా నూరి, టమాటో ముక్కలువేసి దోసకాయ ని వేసి బాగా నూరుకోవాలి. ఒక గిన్నెలో కి ఆ పచ్చడిని తీసుకోవాలి. పోపు దినుసులు వేసుకుంటే పచ్చడి రెడీ.
ఇది అన్నంలో కి దోసెలలో కి చపాతీలోకి బాగుంటుంది.
మా నానమ్మ గారు చేశారు.
మీరు ప్రయత్నించండి.

బీరకాయ  రోటి పచ్చడి .
మేము  బీరకాయ పచ్చడి  బీరకాయల  పై  చెక్కు  తీసి చేసుకున్నాము .
ఇష్టమైన వారు  పై  చెక్కుతోనే  ముక్కలుగా  తరిగి పచ్చడి  చేసుకోవచ్చును .
కావలసినవి . 
లేత  బీరకాయలు  --  3  పై  చెక్కు  తీసుకుని   ముక్కలుగా  తరుగు కోవాలి .
పచ్చి మిర్చి  --  ఎనిమిది .
చింతపండు  --  మూడు  రెబ్బలు . విడదీసి  కొద్దిగా  నీళ్ళతో  తడిపి  ఉంచుకోవాలి .
పసుపు  --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
కొత్తిమీర  --  ఒక చిన్న కట్ట 
పోపునకు .
ఎండుమిర్చి   --  5
మినపప్పు  --  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
మెంతులు  --  కొద్దిగా 
జీలకర్ర   --  పావు స్పూను 
ఇంగువ  --  కొద్దిగా 
నూనె  --  నాలుగు  స్పూన్లు 
తయారీ  విధానము .
ముందుగా  స్టౌ మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  బీరకాయ  ముక్కలు , పచ్చిమిర్చి , కొద్దిగా  పసుపు మరియు  తగినంత   ఉప్పు వేసి  మూత పెట్టి  ఓ  అయిదు  నిముషాల  పాటు  ముక్కలను  బాగా  మగ్గ నివ్వాలి .
తర్వాత మగ్గిన  ముక్కలను  విడిగా   ప్లేటులోకి తీసుకోవాలి .
స్టౌ  మీద  తిరిగి   బాండీ  పెట్టి  మిగిలిన  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే   వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు, మినపప్పు , జీలకర్ర  , ఆవాలు  మరియు  ఇంగువ  వేసుకుని   పోపు  వేయించుకోవాలి .
చల్లారగానే  ముందుగా  రోటి లో  ఎండుమిరపకాయలు , కొద్దిగా  ఉప్పు , తడిపిన చింతపండు  వేసి పచ్చడి బండతో మెత్తగా  దంపుకోవాలి .
తర్వాత   మగ్గిన  బీరకాయ  ముక్కలు,  పచ్చిమిర్చి , మిగిలిన పోపు మరియు  కొత్తిమీర  వేసి  ఒకసారి  కచ్చాపచ్చాగా  పచ్చడి బండతో  నూరుకుని  వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  బీరకాయ  పచ్చడి  అన్నం లోకి  సర్వింగ్  కు  సిద్ధం .
ఈ పచ్చడి  వేడి  వేడి  దోశెలలోకి  కూడా  బాగుంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము మరియు ఫోటో  మేము తయారు చేయు సమయమున  తీసినది.

పండుమిరపకారం
ఉప్పు
పసుపు
మెంతిపిండి
గోంగూర బాండీలో వేయించాను
రోట్లోనూరాను పండ్ల గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది

రోటిలో కొత్తిమీర పచ్చడి తయారు చేసే విధానం:-
కొత్తిమీర పచ్చడి కి కావలసిన పదార్థములు:
కొత్తిమీర -1కట్ట, ఎండు మిర్చి -15 కాయలు, శెనగపప్పు -1టేబుల్ స్పూన్, మినపప్పు -1 టేబుల్ స్పూన్, ఆవాలు పావు టీ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్, బెల్లం ముక్క చిన్నది, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, చింతపండు ఉసిరికాయంత, పచ్చిమిర్చి -6 కాయలు, జీలకర్ర పావు టీ స్పూన్.
తయారు చేసే విధానం:
ముందుగా పొయ్యిమీద బాండీ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి శెనగపప్పు, మినప్పప్పు,ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ,మెంతులు అన్ని వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకో టేబుల్ స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. రోటిలో ఎండుమిర్చి పోపు దినుసులు వేసి దంచుకోవాలి, బెల్లం ముక్క, ఉప్పు ,చింతపండు వేసి దంపుకోవాలి. కొత్తిమీర ,పచ్చిమిర్చి వేసుకుని నూరుకోవాలి కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ కోవాలి.
ఒక గిన్నెలోకి తీసుకున్నట్లయితే పచ్చడి రెడీ.
ఇది ఇడ్లీలలోకి,దోశలోకి,అన్నంలోకి బాగుంటుంది.
మీరు ప్రయత్నించండి
ఆలూరుకృష్ణప్రసాదు .
పొట్టు  మినపప్పు  తో  రోటిపచ్చడి.
ఇటీవల కాలంలో  మినపగుళ్ళు  మరియు  చాయమినపప్పు  వచ్చాయి కాని  పాత కాలంలో  వంటల లోకి  పోపులలోకి పొట్టు మినపప్పు నే వాడే వారు .
గారెలు  వేయడానికి  కూడా  పొట్టు మినపప్పునే  ఉపయోగించేవారు .
మినపసున్ని ఉండలు  తయారు చేయడానికి  కూడా  ఈ  పొట్టు మినపప్పు నే  ఉపయోగించేవారు .
అలా కట్టెల పొయ్యి మీద  బాండిలో  నూనె వేయకుండా  వేయించి  తిరగలిలో  విసిరిన  మినపగుళ్ళు ,  మినపసున్ని  విసిరేటప్పుడే  ఇల్లంతా  ఘమ ఘమ లాడి పోయేది .
పొట్టు మినపప్పు  ఉపయోగించడం  వలన  శరీరానికి అవసరమైన ఐరన్ ధాతువు  సమకూరుతుంది .
ఇప్పుడు  పొట్టు మినపప్పు  తో  రోటిపచ్చడి  ఎలా చేయాలో  తెలుసుకుందాం .
కావలసినవి .
పొట్టు మినపప్పు  --  75  గ్రాములు .
ఎండుమిరపకాయలు  --  15  
జీలకర్ర  --  స్పూనున్నర 
చింతపండు  --  నిమ్మకాయంత . ( విడదీసి పావు గ్లాసు నీళ్ళలో  పావు గంట ముందు తడిపి  ఉంచుకోవాలి .)
నెయ్యి  లేదా  నూనె  --  మూడు స్పూన్లు 
ఇంగువ --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
బెల్లం  --  చిన్న ముక్క 
(  ఇష్టం లేని వారు  మానేయవచ్చును )
తయారీ విధానము .
ముందుగా  స్టౌ  మీద బాండి పెట్టి  మూడు స్పూన్లు  నెయ్యి  వేసి , నెయ్యి బాగా కాగగానే  పొట్టు మినపప్పు , ఎండుమిరపకాయలు , జీలకర్ర  మరియు  ఇంగువ వేసి  కమ్మని  వాసన  వచ్చే వరకు  వేయించుకోవాలి .
చల్లారగానే  రోటిలో  ఈ మిశ్రమమును వేసుకుని , చింతపండును తడిపిన  నీళ్ళతో సహా , తగినంత  ఉప్పు మరియు చిన్న బెల్లం  ముక్కను వేసి  పొత్రముతో  కొద్దిగా  నీళ్ళు చిలకరిస్తూ   మరీ  మెత్తగా  కాకుండా  కొంచెం  పప్పులు తగిలే విధముగా  రుబ్బుకోవాలి .
తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
ఈ పచ్చడి  నాలుగు రోజులు  నిల్వ ఉంటుంది .
అంతే  ఎంతో  రుచిగా  ఉండి ఆరోగ్యకరమైన  పొట్టు మినపప్పుతో  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

రోటిలో లో బీరపొట్టు పచ్చడి తయారు చేసే విధానం:-
కావలసిన పదార్థములు:
బీరపొట్టు (బీరకాయ చెక్కు) -1పెద్ద కప్పు, పచ్చిమిర్చి -15 కాయలు, కొత్తిమీర కొద్దిగా, చింతపండు ఉసిరికాయంత, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి -2 రెబ్బలు, పసుపు చిటికెడు, నూనె-2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు కొద్దిగా.
తయారు చేసే విధానం:
ముందుగా బాండీలో నూనె వేసి,పచ్చిమిర్చి, బీరపొట్టు  వేయించుకోవాలి, వేగిన తరువాత ఆ నూనెలో పోపు వేసి వేయించుకోవాలి. రోటిలో బీరపొట్టు వేసి  మెత్తగా దంచుకోవాలి, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి, పసుపు ఒక్కొక్కటిగా వేసుకుని నూరుకోవాలి. తర్వాత దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో పోపు వేసుకుంటే పచ్చడి రెడీ.
మా నానమ్మ గారు మా చెల్లి తో చేయించారు.
ఇది అన్నంలోకి బాగుంటుంది.
మీరు ప్రయత్నించండి
ఆలూరుకృష్ణప్రసాదు .
రోటిపచ్చళ్ళు .
పాత చింతకాయ పచ్చడితో తీపి రోటి పచ్చడి .
మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు  పాత  చింతకాయ తో  తీపి  రోటి పచ్చడి  చేసే వారు.
ఈ విధముగా  చేసిన పచ్చడి  చాలా రుచిగా ఉండేది.
వేడి వేడి అన్నంలో  నెయ్యి  వేసుకుని  తినడానికి  మరియు దోశెలు  గారెల లోకి  కూడా  ఈ పచ్చడి  చాలా రుచిగా  ఉంటుంది .
తయారీ విధానము .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  అయిదు  స్పూన్లు   నూనె  వేసి  నూనె బాగా కాగగానే  పది ఎండు మిరపకాయలు ,  పావు స్పూను  మెంతులు ,  స్పూనున్నర  మినపప్పు ,  ముప్పావు  స్పూను  ఆవాలు, కొద్దిగా  ఇంగువ  వేసి  పోపు వేయించుకోవాలి. .
ఒక  కప్పు  పాత  చింతకాయ  పచ్చడి  తీసుకోవాలి .
 ఒక  40  గ్రా. బెల్లం  తీసుకోండి .
పచ్చడి లో  ఉప్పు లోగడే వేసి ఉంటుంది 
కనుక  నూర బోయే పచ్చడిలో  కొద్దిగా  ఉప్పు వేసుకుంటే  సరిపోతుంది .
ఇప్పుడు రోటిలో పోపునంతా వేసి   పచ్చడి  బండతో  ముందుగా మెత్తగా   దంపుకోవాలి .
పోపు  మెత్తగా  నలిగాక  ఉప్పు  బెల్లం వేసి  మెత్తగా  దంపి  తర్వాత  పాత చింతకాయ  పచ్చడి  వేసి  పొత్రము  తో  చాలా కొంచెం   నీళ్ళు  చిలకరించుకుంటూ  పచ్చడి మెత్తగా  కాటుకలా  రుబ్బు కోవాలి .
పాత చింతకాయ పచ్చడి వృధా కాకుండా ఈ పద్దతిలో  చేసుకునే వాళ్ళము .
ఈ విధముగా మేము రోటిలో   పాత  చింతకాయతో  తీపి  పచ్చడి చేసుకుంటాము. మీకు తీపి  ఇష్టమైతే  ఇలా  చేసుకుని చూడండి .
పచ్చడి  బాగా ఊరి పుల్లపడి ఉంటుంది కనుక  తీపి వేసుకుంటేనే  పచ్చడి  రుచిగా ఉంటుంది .
 వేడి వేడి అన్నంలో  మరి కాస్త నెయ్యి  వేసుకుని  తింటే  చింతపండు  పచ్చడిలా చాలా బాగుంటుంది .
వెల్లుల్లి  ఇష్టమైనవారు  పది పన్నెండు వెల్లుల్లి  రెబ్బలు  పై పొట్టు ఒలుచుకుని , మూడు స్పూనుల నూనె లో ఆవాలు , కరివేపాకు మరియు ఒలిచిన వెల్లుల్లి  రెబ్బలు తో పోపు వేయించుకుని  పచ్చడిలో  వేసుకుంటే  పచ్చడి  మరింత రుచిగా ఉంటుంది .
దోశెలలోకి , గారెలలోకి , చపాతీలలోకి  కూడా బాగుంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపి  మా అమ్మమ్మ గారు  తయారు చేసిన విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది 

ప్రియమైన   మిత్రులారా !
పునాస కాపు  మామిడి కాయలు  ఇప్పుడు  మార్కెట్లో  విరివిగా  వస్తున్నాయి .
ఈ  రోజు  మీకు  వంకాయ , మామిడి కాయ , పచ్చి కొబ్బరి కలిపిన రోటి పచ్చడి  గురించి  తెలియ చేస్తాను .
కావలసినవి ---
గుండ్రని  వంకాయలు  --  రెండు 
పుల్లని  పచ్చి మామిడికాయ -- ఒకటి 
పై  చెక్కు  తీసి  ముక్కలుగా  తరిగినవి  ఒక  కప్పు .
పచ్చి  కొబ్బరి కోరు  --  అర కప్పు 
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర   --   ఒక  కట్ట 
పచ్చి  మిర్చి  -   6
పసుపు  --  కొద్దిగా .
పోపు నకు  ---
ఎండు మిరపకాయలు  --  ఆరు  
ఆవాలు  ---  ఒక  స్పూను 
మినపప్పు  --  రెండు స్పూన్లు 
ఇంగువ  --  కొద్దిగా 
నూనె  ---  రెండు  స్పూన్లు 
ఉప్పు  --  తగినంత .
తయారు  చేయు  విధానము ----------------------------
ముందుగా  వంకాయలు  తడి లేకుండా  తుడుచుకుని  కాయ  పైన  కొద్దిగా  నూనె  రాసుకుని  స్టౌ  మీద  సన్నని  మంటలో  కాల్చి ,నీళ్ళ చేతితో  పై  తొక్కు  తీసుకోవాలి .
విడిగా  ప్లేటులో పెట్టుకోవాలి .
స్టౌ  మీద  బాండి  పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  కాగాక  ఎండు మిర్చి  మినపప్పు  ఆవాలు  జీలకర్ర   ఇంగువ  మరియు కరివేపాకు  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  రోటిలో  ముందుగా ఎండు మిరపకాయలు , పసుపు , ఉప్పు వేసి  పచ్చడి బండతో మెత్తగా  దంపుకోవాలి .
తర్వాత  మామిడి కాయ  ముక్కలు ,  పచ్చిమిర్చి   మరియు పచ్చి కొబ్బరి తురుము రోటిలో  వేసి పచ్చడి బండతో మరీ మెత్తగా  కాకుండా  దంపుకోవాలి .
చివరగా  స్టౌ  మీద  కాల్చి  పై  తొక్క  తొడిమ  తీసిన  వంకాయలు .  కొత్తిమీర , మిగిలిన పోపు  అంతా రోటిలో  వేసి  ఒకసారి  బండతో నూరుకోవాలి .
తర్వాత  నూరిన పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే  కరివేపాకు  , కొత్తిమీర  , మరియు  ఇంగువ  సువాసనలతో  ఘమ ఘమ లాడుతున్న  వంకాయ , మామిడి  కాయ , పచ్చి కొబ్బరి  కలిపిన   రోటి పచ్చడి  సర్వింగ్ కు  సిద్ధం.
ఈ పచ్చడి  అన్నంలోకి , దోశెల లోకి మరియు  చపాతీల లోకి  కూడా  బాగుంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారు చేయు  విధానము  మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది.

కలగలపు రోటి పచ్చడి : 
బీరకాయ తొక్కలు వేస్ట్ చెయ్డం ఇష్టం లేక ఇలా చేసాను రుచి మాత్రం మహా బాగా ఉంది.
బీరకాయ తొక్కు, ఒక నాఅలుగు బీరకాయ ముక్కలు, వంకాయ, కేరట్ , కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకులు వేసి మగ్గబెట్టుకుని , పోపు దినుసులు, యెండుమిర్చి , ఇంకో నాలుగు వెల్లుల్లి రేకులు , ఇంగువ కూడ దట్టించి తిర్గమోత పెట్టుకుని,  కాస్త ఉప్పు , పసుపు, చింతపండు బదులుగా కస్త పచ్చి చింత తొక్కు అన్నీ వేసి రొటిలొ వేసి కచ్చ పిచ్చా దంచుకోవడమే. 
యెలా ఉందీ చెప్పండి మరి

రోటిలో చుక్కకూర పచ్చడి తయారు చేసే విధానం:-
కావలసిన పదార్థములు:
చుక్కకూర -1 కట్ట, ఎండు మిరపకాయలు-15, చింతపండు ఉసిరి కాయంత, పచ్చిమిర్చి -6 కాయలు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, నూనె -2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు కొద్దిగా, ఇంగువ చిటికెడు.
తయారు చేసే విధానం:
పొయ్యిమీద బాండీ పెట్టి అందులో నూనె వేసి ఎండుమిర్చి, పోపు దినుసులు వేయించుకొని అది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన నూనెలో పచ్చిమిర్చి, చుక్కకూర వేసి వేయించుకోవాలి. రోటిలో ఎండుమిర్చి, చింతపండు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు ఒక్కొక్కటిగా వేసి దంచుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, చుక్కకూర వేసి నూరుకోవాలి.
ఒక గిన్నెలోకి తీసుకుంటే పచ్చడి రెడీ.
ఇది గోంగూర పచ్చడి లాగా ఉంటుంది, గోంగూర పచ్చడి పడని వాళ్ళకి ఇది చక్కగా పనిచేస్తుంది.
ఇది అన్నిటిలోకీ బాగుంటుంది.
మీరూ ప్రయత్నించండి.
Co

రోటిలో దోసకాయ ముక్కల పచ్చడి తయారు చేసే విధానం:-
కావలసిన పదార్థములు:
దోసకాయ-1, టమాటోలు-2, చింతపండు ఉసిరికాయంత, పచ్చిమిర్చి-5, కొత్తిమీర-4 రెబ్బలు, ఎండుమిర్చి -10 కాయలు, పసుపు చిటికెడు.
పోపు దినుసులు:
మినప్పప్పు-1 టేబుల్ స్పూన్, శనగపప్పు-1 టేబుల్ స్పూన్, ఆవాలు పావు టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, ఇంగువ చిటికెడు.
తయారు చేసే విధానం:
ముందుగా దోసకాయ ముక్కలు చిన్నగా తరుక్కోవాలి, పొయ్యిమీద  బాండీ పెట్టి ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి వేయించుకొని, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఆ బాండిలో టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. రోటిలో   ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి మెత్తగా దంచుకోవాలి, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, ఉప్పు ,పసుపు వేసుకుని మెత్తగా దంచుకోవాలి. తరువాత దోసకాయ ముక్కలు వేసి  కచ్చాపచ్చాగా నూరుకోవాలి.
నూరుకున్న పచ్చడి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పచ్చడి రెడీ.
ఇది అన్నంలోకి బాగుంటుంది.
మీరు ప్రయత్నించండి.


పులిహారగోంగూర 2కట్టలువడలినతరవాత బాండీలో నూనెవేసివేయించానుఅందులోనేపదార్ధాలనువేసిరోట్లోనూరానండి
తగినంతఉప్పు
తగినంత కారం
మెంతిపిండి
పసుపు
చింతపండు
చాయమినపప్పు
జీలకర్ర
ఆవాలు
ఇంగువ
తాలింపుతో
నూనె మాత్రం ఎక్కువపడుతుంది


#మునగాకు టొమాటో పచ్చడి#
కావలసిన పదార్ధాలు 
మునగాకు 
టొమాటో 
పచిమిర్చి 
నువ్వులు 
జీలకర్ర 
ఉప్పు 
వెల్లుల్లి 
చింతపండు
Co

ఆలూరుకృష్ణప్రసాదు .
ఆవతో  రోటి పెరుగు పచ్చడి.
లోగడ  పాత తరం పెద్ద వాళ్ళు  గారెలతో  అల్లం  పచ్చడితో పాటుగా  పెరుగుతో  ఆవ పచ్చడి కూడా చేసే వారు.
కొంతమందికి  ఈ ఆవతో పెరుగు పచ్చడి  కేవలం  పితృ కార్యముల  సమయముల లోనే  చేస్తారనే  అభిప్రాయం  ఉంది.
కాని  ఈ ఆవతో పెరుగు పచ్చడి  ఎప్పుడైనా  చేసుకొనవచ్చును .
బహుశ  గారెలు  శరీరానికి  మందం చేస్తాయనే  ఉద్దేశ్యంతో లోగడ  మన పెద్ద వారు  ఇలా  ఆవతో పెరుగు పచ్చడి మరియు అల్లం  పచ్చడి  వంటివి  గారెలతో పాటుగా  చేసే వారు.
ఈ ఆవ పచ్చడి  మరియు  అల్లం  పచ్చడి మనం  తీసుకుంటే  మనకు జీర్ణశక్తి  బాగా ఉంటుందని పెద్దలు ఈ రెండు  పచ్చళ్ళూ చేసే వారు.
గారెలతోనే  కాకుండా  విడిగా  పెరుగు పచ్చడి  మాదిరిగా  ఈ ఆవ పెరుగు పచ్చడి భోజనము  లోకి  తీసుకొనవచ్చును.
ఎందుకంటే  ఆ తరం వారు  పనస పొట్టు కూర , అరటి కాయ ముద్ద కూర , కంద ముద్ద కూర  మరియు  పెసర పప్పుతో తోటకూర  పులుసు కూర వంటి వాటిల్లో  తప్ఫని సరిగా  ఆవపెట్టి  కూరలు చేసేవారు.
వారు చేసిన రుచి  మనకు  రాలేక పోయినా , ఆ తరం వంటలు  మనం మర్చి పోకూడదు కదా. ప్రతి వారు ఆ తరం వారి ప్రాచీన వంటలను  మర్చిపోకుండా తప్పకుండా   చేసుకోవాలి. కారణం వారు చేసిన ప్రతి వంటలలో కూడా  ఆరోగ్యపరమైన  ప్రయోజనం  ఉంటుంది .
ఇక ఆవ పెరుగు పచ్చడి తయారీ విధానము గురించి తెలుసుకుందాము.
ముందుగా  ఆవ ఎలా  తయారు చేసుకోవాలి ?
ముందుగా  రోటిలో  లో  స్పూను  ఆవాలు వేసుకుని పచ్చడి  బండతో మెత్తగా నూరుకోవాలి.  తర్వాత అందులో పావు స్పూను  పసుపు  మరియు  రెండు  ఎండుమిర్చి  రోటిలో  వేసుకుని  మెత్తగా  పచ్చడి బండతో నూరుకోవాలి.  తర్వాత  అందులో రెండు పచ్చిమిర్చి  మరియు  చాలా చాలా కొంచెం  నీళ్ళు పోసి మెత్తగా బండతో నూరు కోవాలి. ఆవ వేరే ప్లేటులోకి తీసుకోవాలి .
ఇప్పుడు  మనకు  ఆవ  సిద్ధం అయ్యింది.
ఇప్పుడు  ఒక  గిన్నెలో ఒక కప్పున్నర  గట్టి  పెరుగు  తీసుకోవాలి .
అందులో  తగినంత  ఉప్పు మరియు  తయారుచేసి  సిద్ధంగా  ఉన్న  ఆవ  వేసుకుని  గరిటెతో  బాగా  కలుపు కోవాలి.
తర్వాత  స్టౌ మీద పోపు గరిటె పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి  వేసుకుని  నెయ్యి  బాగా కాగగానే  రెండు ఎండు మిర్చి  ముక్కలుగా చేసుకొని , అర స్పూను ఆవాలు  మరియు  రెండు రెమ్మలు కరివేపాకు పోపు వేసుకుని , ఆ పోపును   ఆవ పచ్చడి లో  కలుపుకోవాలి.  అప్పుడు  ఈ ఆవ పచ్చడి మరింత రుచిగా  ఉంటుంది .
 పోపు  వేసిన  తర్వాత పచ్చడి  పైన సన్నగా  తరిగిన  కొత్తిమీరను వేసుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే ఆవతో  పెరుగు పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము   మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది.

రోటిలో కరివేపాకు పచ్చడి తయారు చేసే విధానం:-
కావలసిన పదార్థములు:
కరివేపాకు-1 కప్పు, ఎండుమిర్చి -20 కాయలు, పచ్చిశనగపప్పు -1 టేబుల్ స్పూన్, మినప్పప్పు -1 టేబుల్ స్పూన్, ఆవాలు పావు టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, చింతపండు ఉసిరికాయంత, బెల్లం -1చిన్నది, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు.
తయారు చేసే విధానం:
బాండీలో ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలి, కరివేపాకు కూడా అందులో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న వన్నీ రోటిలో వేసి దంచుకోవాలి. చింతపండు బెల్లం ఉప్పు వేసి దంచుకోవాలి, కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ బండతో నూరుకోవాలి,మరీ మెత్తగా నూరి కోకూడదు.
అది ఒక గిన్నెలోకి తీసుకుంటే పచ్చడి రెడీ.
ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.  ఇది అన్నంలోకి,ఇడ్లీలోకి,దోసెల్లోకి బాగుంటుంది.
మీరు ప్రయత్నించండి.
బెండకాయ  పచ్చడి .
కూరకు  అంతగా పనికి రాని  ఓ మాదిరి  బెండ కాయలను  ఇలా  పచ్చడి  చేసుకోండి .
మరీ  ముదురు కాయలు  పచ్చడికి  పనికిరావు.
కావలసినవి.
బెండకాయలు  --  250 గ్రాములు.
ఎండుమిరపకాయలు  --  ఎనిమిది 
నూనె  --  నాలుగు స్పూన్లు 
మినపప్పు  --  స్పూనున్నర 
ఆవాలు  --  అర  స్పూను 
ఇంగువ  --  కొద్దిగా   
కొత్తిమీర   --  ఒక కట్ట 
ఉప్పు  --  తగినంత 
పసుపు  --  కొద్దిగా 
చింతపండు  -- మూడు  రెబ్బలు . 
తయారీ  విధానము .
ముందుగా  బెండకాయలు  ముచికలను తీసి కాస్త పెద్ద ముక్కలుగా తరుగు కొవాలి .
బాండీలో  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె  బాగా  కాగగానే  ఈ బెండకాయ ముక్కలను  వేసి , ముక్కలపై  కొద్దిగా  పసుపు వేసి  ముక్కల పైన  మూత పెట్టి మగ్గనిచ్చి  తర్వాత  వేరే ప్లేటులో  తీసుకోవాలి .
తర్వాత  తిరిగి  స్టౌ  మీద  బాండీ పెట్టి  మరో  రెండు  స్పూన్లు  నూనె వేసి , నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మినపప్పు , ఆవాలు మరియు  ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .
తర్వాత  రోటిలో  వేగిన ఎండుమిరపకాయలు  చింతపండు రెబ్బలు మరియు సరిపడా ఉప్పు వేసి పచ్చడి బండతో  మెత్తగా  దంపు కోవాలి .
తర్వాత  వేయించిన  బెండ కాయ ముక్కలు ,  మిగిలిన  పోపు మరియు కొత్తిమీర   కూడా  వేసి బండతో మెత్తగా  నూరుకుని  వేరే  గిన్నెలో  తీసుకోవాలి .
అంతే  ఎంతో రుచిగా  ఉండే  బెండకాయ  పచ్చడి   భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.
ఈ పచ్చడిలో  పచ్చి మిరపకాయలు  మేము వేయలేదు.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారు చేయు సమయమున  తీసినది.
ఆలూరుకృష్ణప్రసాదు .
వెలక్కాయ  రోటి పచ్చడి.
ఇప్పుడిప్పుడే  మార్కెట్లోకి  వెలగ కాయలు  వస్తున్నాయి.
చాలామందికి  ఈ  వెలక్కాయ పచ్చడంటే  చాలా ఇష్టం . కొంతమంది  వెలక్కాయ పండాక   పచ్చడి  చేసుకుంటారు. కొంతమందికి   ఈ పండు వాసన ఇష్ట పడరు. కాయ వాసన రాకుండా, కాయ తయారవ్వగానే  చేసుకుంటారు. కొంతమంది  ఈ పచ్చడిలో  బెల్లం  వేసుకుంటారు. ఇక ఈ వెలగ కాయ పచ్చడి తయారీ విధానము .
తయారీ  విధానము .
 ముందుగా  ఒక వెలక్కాయ తీసుకుని , కాయను   కొంచెం   బీటు  ఇచ్చేటట్లుగా  కొట్టు  కోవాలి . 
రెండు  ముక్కలుగా   చేయకూడదు.  
తయారైన   వెలగపండునే  తీసుకోవాలి .
తయారుకాని  వెలక్కాయ పచ్చడి చేస్తే పచ్చడి  వగరుగా ఉంటుంది .
బాగా  తయారైన  పండు  పచ్చడి  చేస్తే పచ్చడి  మగ్గిన  వాసన వస్తుంది. అలా  కాయ పండినా  వాసన ఇష్టమైన వారికి 
పచ్చడికి  బాగానే  ఉంటుంది .
బాగా తయారై పండిన వెలగపండుతో అయితే  కొద్దిగా  బెల్లం వేసి చేసుకుంటారు .
పండని   వెలక్కాయకు అయితే   బెల్లం  వేయనవసరం లేదు .
ఇప్పుడు  స్టౌ  వెలిగించి  సెగ  సిమ్ లో పెట్టి  కాయను  అన్ని  వైపులా  కాల్చు  కోవాలి .
బీటివ్వకుండా  డైరెక్టుగా  స్టౌ  మీద  పెడితే  కాయ  పగిలి పోయే  ప్రమాదం  ఉంది . మాకు లోగడ అలా జరిగింది .
కాయ చల్లారగానే  రెండు  ముక్కలు గా  చేసుకుని   స్పూను తో  అందులోని  గుజ్జునంతా  తీసుకుని  కాస్త పసుపు  గుజ్జు  పై  వేసి   వేరే  పళ్ళెంలో విడిగా  పెట్టు కోవాలి .
ఇప్పుడు  స్టౌ  వెలిగించి బాండి పెట్టి   మూడు  స్పూన్లు   నూనె వేసి , నూనె  బాగా  కాగాక  నాలుగు  ఎండు మిరపకాయలు  , పావు స్పూనులో సగం  మెంతులు ,  స్పూను  మినపప్పు  , పావు స్పూను  ఆవాలు ,  కొంచెం   ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  ఈ పోపు సామగ్రి   మరియు  తగినంత  ఉప్పును  రోటిలో వేసి , పచ్చడి  బండతో  మెత్తగా  దంపు కోవాలి.  తదుపరి అదే  రోటిలో  ఐదు పచ్చిమిరపకాయలు  వేసుకుని  పచ్చడి బండతో  దంపుకోవాలి .
ఆ తర్వాత  వెలగపండు  గుజ్జు  , మరి  కాస్త ఎక్కువగా   కొత్తిమీర   వేసి  మెత్తగా   బండతో  నూరుకుని ,  పచ్చడిని  వేరే  బౌల్  లోకి  తీసుకోవాలి .
తీపి ఇష్టమైనవారు  పచ్చడిని  నూరే  సమయంలో  కొద్దిగా  బెల్లం  వేసుకోండి .
అంతే  అందరూ  ఎంతగానో   ఇష్టపడే  వెలక్కాయ  పచ్చడి  భోజనము లోకి  సర్వింగ్  కు  సిద్ధం.
వినాయకచవితి రోజున అందరూ  తప్పనిసరిగా  పాలవెల్లికి  వెలక్కాయలు  కడతారు. మరుసటి రోజున స్వామి వారికి  ఉద్వాసన చెప్పినప్పుడు , ఈ వెలగ కాయలతో  పచ్చడి చేసుకొనవచ్చును . వెలక్కాయలు  వృధా చేయకుండా ఈ విధముగా  వెలక్కాయ పచ్చడి  చేసుకొనండి.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది.


🌹🌻🌹🌻వాక్కాయ పచ్చడి🌻🌹🌻🌹
               🌻 కావలసిన పదార్థాలు🌻
వాక్కాయలు - పావుకిలో, 
పల్లీలు - 100 గ్రాములు, 
ఎండు మిరపకాయలు - 10, 
వెల్లుల్లి రేకలు - ఆరు, 
కొత్తిమీర కట్ట - ఒకటి, 
కరివేపాకు - ఒక రెబ్బ,
జీలకర్ర - ఒక టీ స్పూను,
ఉప్పు - తగినంత, 
నూనె - సరిపడా,
ఇంగువ - చిటికెడు, 
తాలింపు కోసం- పోపు దినుసులు.
            🌹 తయారుచేయు విధానం🌹
వాక్కాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి రేకలు, కరివేపాకు, పల్లీలు, ఎండుమిరపకాయలు వేసి వేగించుకుని తీసెయ్యాలి. తరువాత మళ్లీ కొద్దిగా నూనె పోసి వేడెక్కాక వాక్కాయలు వేసి వేగించాలి. బాగా వేగాక కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి. చల్లారాక వీటన్నింటినీ రోట్లో వేసి మరీ మెత్తగా కాకుండా నూరుకోడం గాని రుబ్బుకోవడం గాని చేసుకొని తరువాత పచ్చడి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు లోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి.వేడివేడిఅన్నంలోనెయ్యివేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
   - సేకరణ

ఆలూరుకృష్ణప్రసాదు .
ప్రియమైన   మిత్రులారా !
ఇప్పుడు  పునాసకాపు  మామిడి కాయలు మార్కెట్లో  విరివిగా  వస్తున్నాయి. 
ఈ  రోజు  మీకు  మామిడి కాయ , పచ్చి కొబ్బరితో రోటి పచ్చడి  గురించి  తెలియ చేస్తాను .
కావలసినవి ---
పుల్లని  పచ్చి మామిడికాయ -- ఒకటి
పై  చెక్కు  తీసి  ముక్కలుగా  తరుగు కోవాలి.
పచ్చి  కొబ్బరి చిప్ప --  ఒకటి .
చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి.
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర   --   ఒక  కట్ట 
పచ్చి  మిర్చి  -   6
పసుపు  --  కొద్దిగా .
పోపునకు  ---
ఎండు మిరపకాయలు  --  ఆరు  
ఆవాలు  ---  ఒక  స్పూను 
మెంతులు   -- పావు స్పూను
మినపప్పు  --  స్పూనున్నర  
ఇంగువ  --  కొద్దిగా 
నూనె  ---  మూడు  స్పూన్లు 
ఉప్పు  --  తగినంత .
తయారు  చేయు  విధానము --
ముందుగా స్టౌ  మీద  బాండి  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె బాగా కాగాక  ముందుగా  మెంతులు వేసుకోవాలి. మెంతులు వేగగానే  తర్వాత వరుసగా ఎండు మిర్చి ,  మినపప్పు , ఆవాలు ,  ఇంగువ మరియు  కరివేపాకు  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  రోటిలో ముందుగా   ఎండు మిరపకాయలు , పసుపు , ఉప్పు వేసి  పచ్చడి బండతో దంపుకోవాలి .
తర్వాత  మామిడి కాయ  ముక్కలు     పచ్చి కొబ్బరిముక్కలు మరియు పచ్చిమిర్చి  రోటిలో వేసి బండతో   మరి  మెత్తగా  కాకుండా  కొంచెం  కచ్చాపచ్చాగా  తొక్కు కోవాలి.
చివరగా   కొత్తిమీర , మిగిలిన పోపు  అంతా  వేసి  ఒకసారి పచ్చడి  బండతో  నూరుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .
అంతే  కరివేపాకు  , కొత్తిమీర  , మరియు  ఇంగువ  సువాసనలతో  ఘమ ఘమ లాడుతున్న   మామిడి  కాయ ముక్కలు  , పచ్చి కొబ్బరి ముక్కలు కలిపిన  పచ్చడి  సర్వింగ్ కు  సిద్ధం.
ఈ పచ్చడి  అన్నంలోకి ,  దోశెలలోకి మరియు  చపాతీల లోకి  కూడా  బాగుంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది.

అరటి దూట పచ్చడి 2రకాలు.
ముందుగా అరటి దూటని చక్రాలుగా తరగాలి. తరిగిన చక్రాలను నీటిలో చిటికెడు పసుపు, చెంచా మజ్జిగ ,కొద్దిగా ఉప్పు వేసుకున్న నీటిలో వేసుకోవాలి.
ఇప్పుడు చక్రలను3  చొప్పున తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
కొంచెం చింతపండు నానబెట్టి 3 చెంచాలు గట్టి పులుసు తీసుకోవాలి.
పోపుదినుసులు 1చెంచా ఆవాలు, అరచెంచా మెంతులు 4 ఎండుమిర్చి ముక్కలు దోరగా తగినంత నూనెలో వేయించుకోవాలి.
2లేక 3 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకోవాలి.
రోలులో ముందుగా పోపు దంచుకోవాలి, మద్యలో పచ్చిమిర్చముక్కలు కూడా వేసుకుని మెత్తగా కాకుండా బరకగా దంచు కుంటూ దూట ముక్కలను ,చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసుకుని ముక్కలు నలగకుండా బాగా కలిసినట్లుగా దంచుకుని గిన్నెలోకి తీసుకోండి.
ఇష్టమైన వారు పోపులో ఇంగువ వేసుకోవచ్చు లేదా 2చెంచాలు ఆవాలు నూరి కలుపుకోవచ్చును.
పెరుగు పచ్చడి.
ముక్కలు తరగడం వరకు అదే విదానం.
ఒక కప్పు పులుపులేని పెరుగు తీసుకుని తగినృత ఉప్పు, చిటికెడు పసుపు కలుపుకోండి తరిగిన దూట ముక్కలు కలపండి.
పోపు దినుసులు.....1 చెంచా ఆవాలు, అరచెంచా జీలకర్ర,4 ఎండుమిర్చి ముక్కలు తగినంత నేయి వేసుకుని దోరగా వేయించి పెరుగు లో కలుపు కోవాలి.
ఇష్టంఉన్న వారు 2చెంచాలు ఆవాలు నూరి కలుపు కోవచ్చు లేదా పోపులో ఇంగువ వేసుకోవచ్చు.
2 పచ్చళ్ళు అన్నంలోకి చాలా బాగుంటాయి.
ఈ 2 విధానాలు నా భార్య మాణిక్యకుమారి చేస్తూ చెప్పగా వ్రాసినాను.
Comments



రోటిలో చింతచిగురు పచ్చడి తయారు చేసే విధానం:-
కావలిసిన పదార్థములు:
చింత చిగురు-1కప్పు, ఎండుమిర్చి -10 కాయలు, పోపు దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు,ఇంగువ చిటికెడు, ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి -2, నూనె రెండు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం:
ముందుగా బాండీలో నూనె వేసి ఎండుమిర్చి,పోపు దినుసులు,ఇంగువ వేసి వేయించుకోవాలి, వేయించిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత బాండీలో చింత చిగురు వేయించాలి. రోలు తీసుకుని ఒక్కొక్కటిగా వేసుకుని దంచుకోవాలి, ఆకు నలగకపోతే కొద్దిగా కొద్దిగా నీరు పోసుకుంటూ నూరుకోవాలి.
ఒక గిన్నెలోకి తీసుకుంటే పచ్చడి రెడీ.
ఇది భోజనంలోకి, చపాతీలోకి బాగుంటుంది.



ఆలూరుకృష్ణప్రసాదు .
కందిపప్పు  రోటి  పచ్చడి .
(  రెగ్యులర్ గా చేసుకునే పచ్చడి కొద్దిగా  మార్చాను . )
కావలసినవి .
కందిపప్పు  --  ఒక కప్పు
ఎండుమిరపకాయలు  --  పది 
జీలకర్ర  --  స్పూనున్నర 
చింతపండు  --   ఉసిరి కాయంత. కొద్ది  నీళ్ళలో  తడిపి  ఉంచుకోవాలి.
ఉప్పు  --  తగినంత 
ఇంగువ -- కొద్దిగా 
పోపునకు .
ఎండుమిర్చి  --  మూడు .
ముక్కలుగా  చేసుకోవాలి 
మినపప్పు  --  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
నెయ్యి  --  నాలుగు  స్పూన్లు 
తయారీ విధానము .
ముందుగా  స్టౌ  మీద బాండీ   పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసుకుని ,  నెయ్యి  బాగా  కాగగానే  కందిపప్పు , ఎండుమిర్చి , జీలకర్ర మరియు ఇంగువ వేసి  కందిపప్పు  కమ్మని  వేగిన వాసన వచ్చే వరకు  వేయించుకోవాలి. 
పోపు  చల్లారగానే   ముందుగా  రోటి లో  ఎండుమిరపకాయలు , చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి  మెత్తగా  పచ్చడి బండతో  దంపుకోవాలి .
తర్వాత  వేగిన కందిపప్పు కూడా రోటిలో  వేసుకుని  , కొద్ది కొద్దిగా  నీళ్ళు  చిలకరించు కుంటూ   పొత్రముతో  మెత్తగా  రుబ్బు కోవాలి.
తర్వాత రుబ్బిన  పచ్చడి వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు  వేసి  పైన పోపు  పెట్టుకోవాలి .
అంతే .   భోజనము  లోకి  ఎంతో రుచిగా  ఉండే  కందిపప్పు రోటి పచ్చడి  సర్వింగ్  కు సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .

సంబంధించిన  రెసిపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

పంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 

1. కందిపప్పు  రోటి  పచ్చడి .
(  రెగ్యులర్ గా చేసుకునే పచ్చడి కొద్దిగా  మార్చాను . )

కావలసినవి .
కందిపప్పు  --  ఒక కప్పు
ఎండుమిరపకాయలు  --  పది 
జీలకర్ర  --  స్పూనున్నర 
చింతపండు  --   ఉసిరి కాయంత. కొద్ది  నీళ్ళలో  తడిపి  ఉంచుకోవాలి.
ఉప్పు  --  తగినంత 
చిన్న ఉల్లి .. కొంత 
ఇంగువ -- కొద్దిగా 

పోపునకు .
ఎండుమిర్చి  --  మూడు  ముక్కలుగా  చేసుకోవాలి 
మినపప్పు  --  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
నెయ్యి  --  నాలుగు  స్పూన్లు 

తయారీ విధానము .
ముందుగా  స్టౌ  మీద బాండీ   పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసుకుని ,  నెయ్యి  బాగా  కాగగానే  కందిపప్పు , ఎండుమిర్చి , జీలకర్ర మరియు ఇంగువ వేసి  కందిపప్పు  కమ్మని  వేగిన వాసన వచ్చే వరకు  వేయించుకోవాలి. 

పోపు  చల్లారగానే   ముందుగా  రోటి లో  ఎండుమిరపకాయలు , చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి  మెత్తగా  పచ్చడి బండతో  దంపుకోవాలి .
తర్వాత  వేగిన కందిపప్పు కూడా రోటిలో  వేసుకుని  , కొద్ది కొద్దిగా  నీళ్ళు  చిలకరించు కుంటూ   పొత్రముతో  మెత్తగా  రుబ్బు కోవాలి. తర్వాత రుబ్బిన  పచ్చడి వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు  వేసి  పైన పోపు  పెట్టుకోవాలి .
అంతే .   భోజనము  లోకి  ఎంతో రుచిగా  ఉండే  కందిపప్పు రోటి పచ్చడి  సర్వింగ్  కు సిద్ధం.







శ్రీ రవి సప్తతి రహస్యనామ స్తోత్రం  ...  ....  9
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
🕉🌞🌏🌙🌟🚩

1) హంసో భానుః సహస్రాంశుః తపనస్తాపనో రవిః |


వికర్తనో వివస్వాంశ్చ విశ్వకర్మా విభావసుః ||



2) విశ్వరూపో విశ్వకర్తా మార్తాండో మిహిరోఽంశుమాన్ |


ఆదిత్యశ్చోష్ణగుః సూర్యోఽర్యమా బ్రధ్నో దివాకరః ||



3) ద్వాదశాత్మా సప్తహయో భాస్కరో హస్కరో ఖగః |


సూరః ప్రభాకరః శ్రీమాన్ లోకచక్షుః గ్రహేశ్వరః ||



4) త్రిలోకేశో లోకసాక్షీ తమోఽరిః శాశ్వతః శుచిః |


గభస్తిహస్తః తీవ్రాంశుః తరణిః సుమహోరణిః ||



5) ద్యుమణిః హరిదశ్వోఽర్కో భానుమాన్ భయనాశనః |


ఛందోశ్వో వేదవేద్యశ్చ భాస్వాన్ పూషా వృషాకపిః ||



6) ఏకచక్రరథో మిత్రో మందేహారిః తమిస్రహా |


దైత్యహా పాపహర్తా చ ధర్మో ధర్మప్రకాశకః ||



7) దోషఘ్నః చిత్రభానుశ్చ కలిఘ్నః తార్క్ష్యవాహనః |


దిక్పతిః పద్మనీనాథః కుశేశయకరో హరిః |


ఘర్మరశ్మిః దుర్నిరీక్ష్యః చండాంశుః కశ్యపాత్మజః ||



ఇతి శ్రీ రవి సప్తతి రహస్యనామ స్తోత్రం ||



🕉🌞🌏🌙🌟🚩

అమృత సంజీవన ధన్వంతరి స్తోత్రం ... 8 

🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥

🕉🌞🌏🌙🌟🚩

1) మృత్యుర్దూరాత్పలాయతే ||


2) అసాధ్యాః కష్టసాధ్యాశ్చ మహారోగా భయంకరాః |


శీఘ్రం నశ్యంతి పఠనాదస్యాయుశ్చ ప్రవర్ధతే ||


3) శాకినీ డాకినీ దోషాః కుదృష్టిర్గ్రహ శతృజాః |

ప్రేత వేతాళ యక్షోత్తా బాధా నశ్యంతి చాఽఖిలాః ||


4)దురితాని సమస్తాని నానా జన్మోద్భవాని చ |

సంసర్గజ వికారాణి వినీయంతేఽస్య పాఠతః ||


5) సర్వోపద్రవ నాశాయ సర్వబాధా ప్రశాంతయే |

ఆయుః ప్రవర్ధయే చైతత్ స్తోత్రం పరమమద్భుతమ్ ||


6) బాలగ్రహాభి భూతానాం బాలానాం సుఖదాయకమ్ |

సర్వారిష్టహరం చైతద్బలపుష్టికరం పరమ్ ||


7) బాలానాం జీవనాయైతత్ స్తోత్రం దివ్యం సుధోపమమ్ |

మృతవత్సత్వహరణం చిరంజీవిత్వ కారకమ్ ||


8) మహారోగాభి భూతానాం భయ వ్యాకులితాత్మనామ్ |

సర్వాధి వ్యాధి హరణం భయఘ్నమమృతోపమమ్ ||


9) అల్పమృత్యు శ్చాపమృత్యుః పాఠాదస్యః ప్రణశ్యతి |

జలాఽగ్ని విష శస్త్రాది న హి శృంగి భయం తథా ||


10) గర్భరక్షాకరం స్త్రీణాం బాలానాం జీవనప్రదమ్ |

మహారోగహరం నౄణామల్పమృత్యుహరం పదమ్ |


11) బాలా వృద్ధాశ్చదరుణా నరా నార్యశ్చ దుఃఖితాః |

భవంతి సుఖినః పాఠాదస్యలోకే చిరాయుషః ||


12) అస్మాత్పర తరం నాస్తి జీవనోపాయ కేహి కః |

తస్మాత్సర్వప్రయత్నేన పాఠమస్య సమాచరేత్ ||


13) మయుతా వృత్తికం వా చ సహస్రావృత్తికం తథా |

వదర్థం వా తదర్థం వా పఠేదేతచ్చ భక్తితః ||


14) కలశే విష్ణుమారాధ్య దీపం ప్రజ్వాల్య యత్నతః |

సాయం ప్రాతశ్చ విధివత్ స్తోత్రమే తత్పఠేత్సుధీః ||


15) సర్పిషా హవిషా వాఽభి సమ్యాగేనాఽథ భక్తితః |

దశాంశ మానదో హోమం కుర్యాత్సర్వార్థ సిద్ధయే ||

ॐॐॐॐॐॐॐ

స్తోత్రమ్ :--

ॐॐॐॐॐॐॐ


శ్రీ దత్తాష్టకము  ...  ... ... 7
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
🕉🌞🌏🌙🌟🚩

(1)గురుమూర్తిం చిదాకాశం సచ్చిదానంద విగ్రహం |

నిర్వికల్పం నిరాబాధం దత్తమానంద మాశ్రయే ||


(2)యోగాతీతం గుణాతీతం సర్వరక్షాకరం విభుం |

సర్వదుఃఖహరం దేవం దత్తమానంద మాశ్రయే ||


(3)అవధూతం సదాధ్యానం ఔదుంబర సుశోభితం |

అనఘాప్రియా విభుం దేవం దత్తమానంద మాశ్రయే ||


(4)నిరాకారం నిరాభాసం బ్రహ్మవిష్ణు శివాత్మకం |

నిర్గుణం నిష్కళం శాంతం దత్తమానంద మాశ్రయే ||


(5)అనసూయా సుతం దేవం అత్రివంశ కులోద్భవం |

దిగంబరం మహాతేజం దత్తమానంద మాశ్రయే ||


(6)సహ్యాద్రివాసినం దత్తం ఆత్మజ్ఞాన ప్రదాయకం |

అఖండమండలాకారం దత్తమానంద మాశ్రయే ||


(7)పంచయజ్ఞప్రియం దేవం పంచరూప సుశోభితం |

గురుపరంపరం వందే దత్తమానంద మాశ్రయే ||


(8)దత్తమానందాష్టకం యః పఠేత్ సర్వవిద్యా జయం లభేత్ |

దత్తానుగ్రహఫలం ప్రాప్తం దత్తమానంద మాశ్రయే ||


ఫలశ్రుతి:–

ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః!

సర్వసిద్ధిమవాప్నోతి శ్రీదత్తశ్శరణం మమ ||


శ్రీ దత్తాష్టకమును పఠించిన ఎడల సర్వ ఆరోగ్య సిధ్ధి,సర్వ కార్యములు నెరవేరును.

🕉🌞🌏🌙🌟🚩

శ్రీ గణ నాయకాష్టకమ్  (6) 

🕉🌞🌏🌙🌟🚩
ఓం శ్రీ రామ్ 🔥ఓంశ్రీమాత్రే నమః🔥
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక  
🕉🌞🌏🌙🌟🚩

1)ఏక దంతం మహాకాయం - తప్త కాంచనసన్నిభమ్!!

లంబోదరం విశాలాక్షం - వందేహం గణనాయకమ్ !!


2)మౌంజీకృష్ణాజిన ధరం - నాగ యజ్ఞో పవీతినమ్ !!

బాలేందు శకలం మౌళం- వందేహం గణనాయకమ్ !! 


3)చిత్ర రత్నవిచిత్రాంగం - చిత్రమాలా విభూషితం!!

కామరూపధరం దేవం -వందేహం గణనాయకమ్ !!

4)గజవక్త్రం సురశ్రేష్టం - కర్ణ చామర భూషితమ్!!


పాశాంకుశధరం దేవం - వందేహం గణనాయకమ్ !! 


5)మూషకోత్తమ మారుహ్య -దేవాసుర మహాహవే!!

యోద్దుకామం మహావీర్యం - వందేహం గణనాయకమ్ !!  

6)యక్ష కిన్నెర గంధర్వ -సిద్దవిద్యా ధరైస్సదా!!


స్తూయమానం మహాబాహుం -వందేహం గణనాయకమ్ !!


7)అంబికా హృదయానందం - మాతృభిః పరివేష్టితం !!

భక్తి ప్రియం మదోన్మత్తం - వందేహం గణనాయకమ్ !!


8)సర్వవిఘ్న హరం దేవం -సర్వవిఘ్న వివర్జితం!!

సర్వసిద్ది ప్రదాతారం - వందేహం గణనాయకమ్ !!


9)గణాష్టకం మిదం పుణ్యం - యః పఠే త్సతతం నరః !!

సిద్ద్యంతి సర్వకార్యాణి -విద్యావాన్ ధనవాన్ భవత్ !!

!!! ఇతి శ్రీ గణనాయకాష్టకమ్ !!!

🕉🌞🌎🌙🌟🚩


సేకరణ  ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక (5)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   
శ్రీ యంత్రోధారక హనుమత్ (ప్రాణదేవర) స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
ఓం శ్రీ  రామ్ 🔥ఓంశ్రీమాత్రే నమః🔥
🕉🌞🌏🌙🌟🚩

1) నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ |

శ్రీ మారుతాత్మ సంభూతం విద్యుత్కాంచన సన్నిభమ్ ||


2) పీనవృత్తం మహాబాహుం సర్వశత్రునివారణమ్ |

రామప్రియతమం దేవం భక్తాభీష్టప్రదాయకమ్ ||


3) నానారత్న సమాయుక్త-కుండలాదివిరాజితమ్ |

ద్వాత్రింశల్లక్షణోపేతం స్వర్ణపీఠ విరాజితమ్ || 


4) త్రింశత్కోటి బీజసంయుక్తం ద్వాదశావర్తి ప్రతిష్ఠితమ్ |

పద్మాసనస్థితం దేవం షట్కోణ మండలమధ్యగమ్ ||


5) చతుర్భుజం మహాకాయం సర్వవైష్ణవశేఖరమ్ |

గదాఽభయకరం హస్తౌ హృదిస్థో సుకృతాంజలిమ్ ||


6) హంసమంత్ర ప్రవక్తారం సర్వజీవ నియామకమ్ |

ప్రభంజనశబ్ద వాచ్యేణ సర్వదుర్మత భంజకమ్ ||


7) సర్వదాఽభీష్ట దాతారం సతాం వై దృఢమహవే |

అంజనాగర్భ సంభూతం సర్వశాస్త్ర విశారదమ్ ||


8) కపీనాం ప్రాణదాతారం సీతాన్వేషణ తత్పరమ్ |

అక్షాదిప్రాణహంతారం లంకాదహన తత్పరమ్ ||


9) లక్ష్మణప్రాణ దాతారం సర్వ వానరయూథపమ్ |

కింకరాః శర్వదేవాద్యాః జానకీనాథస్య కింకరమ్ ||


10) వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థ గిరౌ సదా |

తుంగాంభోది తరంగస్య వాతేన పరిశోభితే ||


12) నానాదేశగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః |

ధూపదీపాది నైవేద్యైః పంచఖాద్యైశ్చ శక్తితః ||


12) భజామి శ్రీహనూమంతం హేమకాంతి సమప్రభమ్ |

వ్యాసతీర్థ యతీంద్రేణ పూజితం చ విధానతః ||


13) త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః |

వాంఛితం లభతేఽభీష్టం షణ్మాసాభ్యంతరం ఖలు ||


14) పుత్రార్థీ లభతే పుత్రం యశోఽర్థీ లభతే యశః |

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ||


15) సర్వ థామాఽస్తు సందేహో హరిః సాక్షీ జగత్పతిః |

యః కరోత్యత్ర సందేహం స యాతి నరకం ధ్రువమ్ ||


16) యంత్రోధారక స్తోత్రం షోడశ శ్లోక సంయుతమ్ |

శ్రవణం కీర్తనం వా సర్వపాపైః ప్రముచ్యతే ||


|| ఇతి శ్రీ వ్యాసరాజకృత యంత్రోధారక హనుమత్ స్తోత్రమ్ ||

🕉🌞🌏🌙🌟🚩

ఓం నమఃశివాయ. శుభోదయవందనాలు.
పాల్కురికి సోమన్న కూడా అద్భుతంగా వ్రాశారు.
సేకరణ ప్రాంజలి ప్రభ . అంతర్జాల పత్రిక  (4)
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మీ అందరికోసం ఈ శుభదినాన చదవండి.

'అ'ఖిల లోకాధార
'ఆ'నంద పూర
'ఇ'న చంద్ర శిఖి నేత్ర 
'ఈ'డితామల గాత్ర

'ఉ'రు లింగ నిజరూప
'ఊ'ర్జితా జలచాప
'ఌ'లిత తాండవకాండ
'ౡ'నికృతా జాండ

'ఏ'కైక వర్యేశ
'ఐ'క్య సౌఖ్యా వేశ
'ఓం' కార దివ్యాంగ 
'ఔ'న్నత్య గుణ సంగ

'అం'బికా హృదయేశ
'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ
'ఖ'ల జలంధర హరణ
'గ'ల నాయక విధేయ
'ఘ'న భక్తి విజేయ

'జ'శ్చూల కాలధర
'చ'రిత త్రిశూల ధర
'ఛ'ర్మ యాధ్వస్త
'ఞ'న గుణ ధళ ధీర

'ట' త్రయాది విదూర
'ఠ' ప్రభావాకార
'డ'మరుకాది విహార
'ఢ' వ్రాత పరిహార

'ణ' ప్రవాగార
'త'త్త్వ జోనేత
'థ'వి దూర జవ పక్ష
'ద'వన పాలన దీక్ష

'ధ'రణీ థవోల్లీడ
'నంది కేశారూఢ
'ప'ర్వతీశ్వర లింగ
'బ'హుళ భూత విలాస

'భ'క్త్వ హృద్వ నహన
'మం'త్రస్తుతోధార
'య'క్ష రుద్రాకార
'ర'తిరాజ బిన హంస

'ల'లిత గంగోత్తంస
'ళ'మా విదవ్రంశ
'వ'రద శైల విహార
'శ'ర సంభ వాస్ఫార

'ష'ట్తింశ తత్త్వగత 
'స'కల సురముని వినుత
'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ
'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర
శ్రీ పర్వత లింగ
నమస్తే నమస్తే నమస్తే నమః.



--(())--
అఘనాశక గాయత్రీ స్తోత్రమ్ (3)
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
🕉🌞🌏🌙🌟🚩
నారద ఉవాచ:-

 1) భక్తానుకమ్పిన్సర్వజ్ఞ హృదయం పాపనాశనమ్ ।

 గాయత్ర్యాః కథితం తస్మాద్గాయత్ర్యాః స్తోత్రమీరయ ॥


 2) ఆదిశక్తే జగన్మాతర్భక్తానుగ్రహకారిణి ।

 సర్వత్ర వ్యాపికేఽనన్తే శ్రీసన్ధ్యే తే నమోఽస్తు తే ॥


 3)త్వమేవ సన్ధ్యా గాయత్రీ సావిత్రీ చ సరస్వతీ ।

 బ్రాహ్మీ చ వైష్ణవీ రౌద్రీ రక్తా శ్వేతా సితేతరా ॥


 4) ప్రాతర్బాలా చ మధ్యాహ్నే యౌవనస్థా భవేత్పునః ।

 బ్రహ్మా సాయం భగవతీ చిన్త్యతే మునిభిః సదా ॥ 


5) వృద్ధా సాయం హంసస్థా గరుడారూఢా తథా వృషభవాహినీ ।

 ఋగ్వేదాధ్యాయినీ భూమౌ దృశ్యతే యా తపస్విభిః ॥


 6) యజుర్వేదం పఠన్తీ చ అన్తరిక్షే విరాజతే ।

 సా సామగాపి సర్వేషు భ్రామ్యమాణా తథా భువి ॥


7) రుద్రలోకం గతా త్వం హి విష్ణులోక నివాసినీ ।

 త్వమేవ బ్రహ్మణో లోకేఽమర్త్యానుగ్రహకారిణీ ॥


 8) సప్తర్షిప్రీతిజననీ మాయా బహువరప్రదా ।

 శివయోః కరనేత్రోత్థా హ్యశ్రుస్వేదసముద్భవా ॥ 


9) ఆనన్దజననీ దుర్గా దశధా పరిపఠ్యతే ।

 వరేణ్యా వరదా చైవ వరిష్ఠా వరవర్ణినీ ॥ 


10) గరిష్ఠా చ వరార్హా చ వరారోహా చ సప్తమీ ।

 నీలగఙ్గా తథా సన్ధ్యా సర్వదా భోగమోక్షదా ॥


 11) భాగీరథీ మర్త్యలోకే పాతాలే భోగవత్యపి ।

 త్రిలోకవాహినీ దేవీ స్థానత్రయనివాసినీ ॥ 


12) భూర్లోకస్థా త్వమేవాసి ధరిత్రీ లోకధారిణీ ।

 భువో లోకే వాయుశక్తిః స్వర్లోకే తేజసాం నిధిః ॥  


13) మహర్లోకే మహాసిద్ధిర్జనలోకే జనేత్యపి ।

 తపస్వినీ తపోలోకే సత్యలోకే తు సత్యవాక్ ॥


 14) కమలా విష్ణులోకే చ గాయత్రీ బ్రహ్మలోకగా ।

 బ్రహ్మలోకదా రుద్రలోకే స్థితా గౌరీ హరార్ధాఙ్గనివాసినీ ॥


15) అహమో మహతశ్చైవ ప్రకృతిస్త్వం హి గీయసే ।

 సామ్యావస్థాత్మికా త్వం హి శబల బ్రహ్మ రూపిణీ ॥ 


 16) తతః పరాపరా శక్తిః పరమా త్వం హి గీయసే ।

 ఇచ్ఛాశక్తిః క్రియాశక్తిర్జ్ఞానశక్తిస్త్రిశక్తిదా ॥ 


14) గఙ్గా చ యమునా చైవ విపాశా చ సరస్వతీ ।

 సరయూర్దేవికా సిన్ధుర్నర్మదేరావతీ తథా ॥ 


15) గోదావరీ శతద్రుశ్చ కావేరీ దేవలోకగా ।

 కౌశికీ చన్ద్రభాగా చ వితస్తా చ సరస్వతీ ॥


 16) గణ్డకీ తాపినీ తోయా గోమతీ వేత్రవత్యపి ।

 ఇడా చ పిఙ్గలా చైవ సుషుమ్ణా చ తృతీయకా ॥


 17) గాన్ధారీ హస్తిజిహ్వా చ పూషాపూషా తథైవ చ ।

 అలమ్బుషా కుహూశ్చైవ శఙ్ఖినీ ప్రాణవాహినీ ॥


 18) నాడీ చ త్వం శరీరస్థా గీయసే ప్రాక్తనైర్బుధైః ।

 హృతపద్మస్థా ప్రాణశక్తిః కణ్ఠస్థా స్వప్ననాయికా ॥ 


19) తాలుస్థా త్వం సదాధారా బిన్దుస్థా బిన్దుమాలినీ ।

 మూలే తు కుణ్డలీ శక్తిర్వ్యాపినీ కేశమూలగా ॥


 20) శిఖామధ్యాసనా త్వం హి శిఖాగ్రే తు మనోన్మనీ ।

 కిమన్యద్ బహునోక్తేన యత్కిఞ్చిజ్జగతీత్రయే ॥


21) తత్సర్వం త్వం మహాదేవి శ్రియే సన్ధ్యే నమోఽస్తు తే ।

ఇతీదం కీర్తితం స్తోత్రం సన్ధ్యాయాం బహుపుణ్యదమ్ ॥ 


 22) మహాపాపప్రశమనం మహాసిద్ధివిధాయకమ్ ।

 య ఇదం కీర్తయేత్ స్తోత్రం సన్ధ్యాకాలే సమాహితః ॥


 23) అపుత్రః ప్రాప్నుయాత్ పుత్రం ధనార్థీ ధనమాప్ను యాత్ ।

 సర్వతీర్థతపోదానయజ్ఞయోగఫలం లభేత్ ॥ 


24) భోగాన్ భుక్త్వా చిరం కాలమన్తే మోక్షమవాప్నుయాత్ ।

 తపస్విభిః కృతం స్తోత్రం స్నానకాలే తు యః పఠేత్ ॥


 25) యత్ర కుత్ర జలే మగ్నః సన్ధ్యామజ్జనజం ఫలమ్ ।

 లభతే నాత్ర సన్దేహః సత్యం చ నారద ॥ 


 26) శృణుయాద్యోఽపి తద్భక్త్యా స తు పాపాత్ ప్రముచ్యతే ।

 పీయూషసదృశం వాక్యం సన్ధ్యోక్తం నారదేరితమ్ ॥

॥ ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణే ద్వాదశస్కన్ధే పఞ్చమోఽధ్యాయే శ్రీఅఘనాశకగాయత్రీస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

🕉🌞🌏🌙🌟🚩

ఈశ్వర దండకం (2)
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
 ప్రాంజలి ప్రభ 
🕉🌞🌏🌙🌟🚩

శ్రీ కంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ ! మురారి! 
ప్రియ చంద్రధారీ !
మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్య స్వరూపా !
విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! 
దేవ నీదైన తత్వంబు ! 
భావించి బుద్ధిం బ్రధానంబు కర్మంబు!
విజ్ఞాన ఆధ్యాత్మ యెాగంబు ! 
సర్వ క్రియా కారణంబంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతుల్ !
విచారించుచో నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా ! 
సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా !నిర్వికల్ప ప్రభావా !
భవానీ పతీ ! 
నీవు లోక త్రయీ వర్తనంబుల్ మహీవాయుఖాత్వగ్ని సోమార్క తోయంబు లం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై ఆది దేవా! మహాదేవ నిత్యంబు నత్యంత యెాగస్థితి న్నిర్మల జ్ఞాన దీప ప్రభా జాల ! 
విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ ! 
జితక్రోధరోగాది దోషుల్ ! 
యతీంద్రుల్ ! 
యతాత్ముల్ ! 
భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులైరి అవ్యయా! 
భవ్య సేవ్యా! భవా భర్గ భట్టారకా !
భార్గవాగస్థ్య కుత్సాది నానా ముని స్తోత్ర దత్తవధానా !
లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ ! 
భస్మానులిప్తాంగ ! 
గంగాధరా ! 
నీ ప్రసాదంబునన్ ! 
సర్వ గీర్వాణ గంధర్వులున్ !సిద్ధసాధ్యోరగేంద్రామరేంద్రాదులున్ ! 
శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా !!
సురాభ్యర్చితా !!నాకున్ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ !!త్రిలోకైకనాథా !మహా దేవ దేవా !!నమస్తే నమస్తే నమస్తే నమః !!*

 “మహా భారత అరణ్య పర్వంలోనిది !!అర్జునుడు ఈశ్వరుని మెప్పించి పాశుపతాది దివ్యాస్త్రములు పొంది ఈ ‘దండకం’తో శివుని సంతోష పరిచాడు!!

(కవి త్రయంలో ఒకరైన నన్నయ భట్టు వ్రాసినది)

🕉🌞🌏🌙🌟🚩
శ్రీ సూర్య పంజర స్తోత్రం (1)
ఓం శ్రీ రామ్  🔥ఓంశ్రీమాత్రే నమః🔥
 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
🕉🌞🌏🌙🌟🚩

1)ఓం ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం|
సకలభువననేత్రం రత్నరజ్జూపమేయమ్ |  
తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాం|
సురవరమభివంద్యం సుందరం విశ్వదీపమ్ ||


2)ఓం శిఖాయాం భాస్కరాయ నమః |
లలాటే సూర్యాయ నమః |   
భ్రూమధ్యే భానవే నమః |
కర్ణయోః దివాకరాయ నమః |  
నాసికాయాం భానవే నమః |
నేత్రయోః సవిత్రే నమః |  
ముఖే భాస్కరాయ నమః |
ఓష్ఠయోః పర్జన్యాయ నమః | 
పాదయోః ప్రభాకరాయ నమః ||


3)ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః |                       
ఓం హంసాం హంసీం హంసూం హంసైం హంసౌం హంసః || 


4)ఓం సత్యతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          
ఓం స్థితిరూపకకారణాయ పూర్వాదిగ్భాగే మాం రక్షతు || 


5)ఓం బ్రహ్మతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          
ఓం తారకబ్రహ్మరూపాయపరయంత్ర-పరతంత్ర-పరమంత్ర-సర్వోపద్రవనాశనార్థం దక్షిణదిగ్భాగే మాం రక్షతు ||


6)ఓం విష్ణుతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          
ఓం ప్రచండమార్తాండ ఉగ్రతేజోరూపిణే ముకురవర్ణాయ తేజోవర్ణాయ మమ సర్వరాజస్త్రీపురుష-వశీకరణార్థం పశ్చిమదిగ్భాగే మాం రక్షతు ||


6)ఓం రుద్రతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          
ఓం భవాయ రుద్రరూపిణే ఉత్తరదిగ్భాగే సర్వమృత్యోపశమనార్థం మాం రక్షతు || 


7)ఓం అగ్నితేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          
ఓం తిమిరతేజసే సర్వరోగనివారణాయ ఊర్ధ్వదిగ్భాగే మాం రక్షతు || 


8)ఓం సర్వతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          
ఓం నమస్కారప్రియాయ శ్రీసూర్యనారాయణాయ అధోదిగ్భాగే సర్వాభీష్టసిద్ధ్యర్థం మాం రక్షతు ||


9)మార్తాండాయ నమః భానవే నమః హంసాయ నమః 
సూర్యాయ నమః దివాకరాయ నమః తపనాయ నమః భాస్కరాయ నమః మాం రక్షతు || 


10)మిత్ర-రవి-సూర్య-భాను-ఖగపూష-హిరణ్యగర్భ- మరీచ్యాదిత్య-సవిత్రర్క-భాస్కరేభ్యో నమః శిరస్థానే మాం రక్షతు ||  
సూర్యాది నవగ్రహేభ్యో నమః లలాటస్థానే మాం రక్షతు ||


11)ధరాయ నమః ధృవాయ నమః సోమాయ నమః అథర్వాయ నమః అనిలాయ నమః అనలాయ నమః ప్రత్యూషాయ నమః ప్రతాపాయ నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు || 


12)వీరభద్రాయ నమః గిరీశాయ నమః
శంభవే నమః అజైకపదే నమః అహిర్బుధ్నే నమః పినాకినే నమః భువనాధీశ్వరాయ నమః దిశాంతపతయే నమః పశుపతయే నమః స్థాణవే నమః భవాయ నమః లలాటస్థానే మాం రక్షతు || 


13)ధాత్రే నమః అంశుమతే నమః పూష్ణే నమః పర్జన్యాయ నమః విష్ణవే నమః నేత్రస్థానే మాం రక్షతు || 


14)అరుణాయ నమః సూర్యాయ నమః ఇంద్రాయ నమః రవయే నమః సువర్ణరేతసే నమః యమాయ నమః దివాకరాయ నమః కర్ణస్థానే మాం రక్షతు || 


15)అసితాంగభైరవాయ నమః రురుభైరవాయ నమః  చండభైరవాయ నమః క్రోధభైరవాయ నమః  ఉన్మత్తభైరవాయ నమః భీషణభైరవాయ నమః కాలభైరవాయ నమః సంహారభైరవాయ నమః  ముఖస్థానే మాం రక్షతు ||


16)బ్రాహ్మ్యై నమః మహేశ్వర్యై నమః కౌమార్యై నమః వైష్ణవ్యై నమః వరాహ్యై నమః ఇంద్రాణ్యై నమః చాముండాయై నమః కంఠస్థానే మాం రక్షతు ||


17)ఇంద్రాయ నమః అగ్నయే నమః|యమాయ నమః నిర్‍ఋతయే నమః|వరుణాయ నమః వాయవే నమః|కుబేరాయ నమః ఈశానాయ నమః|బాహుస్థానే మాం రక్షతు || 


17)మేషాదిద్వాదశరాశిభ్యో నమః| హృదయస్థానే మాం రక్షతు ||


18)వజ్రాయుధాయ నమః శక్త్యాయుధాయ నమః|దండాయుధాయ నమః ఖడ్గాయుధాయ నమః|పాశాయుధాయ నమః|అంకుశాయుధాయ నమః|గదాయుధాయ నమః త్రిశూలాయుధాయ నమః|పద్మాయుధాయ నమః చక్రాయుధాయ నమః|   కటిస్థానే మాం రక్షతు ||


19)మిత్రాయ నమః దక్షిణహస్తే మాం రక్షతు |  
రవయే నమః వామహస్తే మాం రక్షతు |
సూర్యాయ నమః హృదయే మాం రక్షతు |  
భానవే నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు |  
ఖగాయ నమః దక్షిణపాదే మాం రక్షతు |  
పూష్ణే నమః వామపాదే మాం రక్షతు |
హిరణ్యగర్భాయ నమః నాభిస్థానే మాం రక్షతు |
మరీచయే నమః కంఠస్థానే మాం రక్షతు |  
ఆదిత్యాయ నమః దక్షిణచక్షూషి మాం రక్షతు |  
సవిత్రే నమః వామచక్షుషి మాం రక్షతు |
భాస్కరాయ నమః హస్తే మాం రక్షతు |
అర్కాయ నమః కవచే మాం రక్షతు ||


20)ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతి కరాయ ధీమహి | 
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ||

 || ఇతి శ్రీ సూర్య పంజర స్తోత్రమ్ ||

🕉🌞🌎🌙🌟🚩

✨ RADHA KRISHNA ✨ Artist: Nirmala Hare Krishna Hare Krishna Krishna Krishna Hare…
ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు(తేటగీతి )  
శ్రీ కృష్ణ అష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

మతి మరుపు దానను మన్నించు మాధవా
యద పిలుపు తెల్పి,  విశ్వాస ముంచితీ 
అణువణువు అర్చన అర్పించె భక్తి తో
కనికరము కోసము వేచున్నా మాధవా.. ... ... 2  

సిరి కొరకు కోరను,  కోపమ్ము వద్దులే
కళ నిజము చేయుము, కారుణ్య మాధవా
చిరు నగవు చూపుతు కాలమ్ము నీదిలే
అణువణువు పంచేటి ఆకర్ష మాధవా  ... ... 2    

నళిన లోచన దృష్టికి కప్పి ఉన్న 
కలల విననెంచి నకనక లాడు చున్న 
నాచి నంగ నాచియు మాట వళ్ళ చిక్కి 
నాతి తికమక పలుకుకు భాద మాధవా ... .. 2 
 ...  
కధల కళ వింతయు ఆశ్చర్య మవ్వుతూ 
వినయ విధి ఆటలొ చూసాను మాధవా
నెలఁత నమ్మకపు నటనకు చిక్కి ఉన్న 
చూపు చల్లని నెచ్చెలి పిలుపు మాధవా 

విభూతి చ్ఛందము (1 )
ర  జ  గ   - ర జ  గ = UIU  IUI  U = UIU  IUI  U  
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మౌనమే మనస్సు లే = జీవితం వయస్సు లే 
నిత్యమే ఉషస్సు లే  = రాగమే యశస్సు లే 

కాలమే కదళ్లు లే  = కాలమే వసంత మే 
గాధలే చిగుళ్లు లే  = గాధలే సరాగ  మే 

మాధవా ముకుంద మా = శ్రీధరా సు శీల మా 
ప్రేరణా సునంద మా  = వేషమే అనంత మా  

జీవితం వినోద మే  = జీవితం విషాద మే 
జీవితం ప్రభావ మే = జీవితం ప్రధాన మే 

శ్రీ మహేశ్వరీయె లే = శ్రీ మహా అశోక మే
శ్రీ విశాలమే యెలే  = శ్రీ ప్రభావమే యెలే


--(())--





నీ ఆలోచన నాకు నచ్చింది    ఛందస్సు               
సర్వేశి నూతన వృత్తము
గణములు - మ,స,న,స,త,జ,న,లఘువు  UU U II U  II II  UU U II U  II II
యతి -12
కాలాలెన్నయినా  కళకళము వేదాలున్నయినా కలకలము   
సామాన్యాన్ని  

వేదోద్ధారణ సేసినదెవరు? విద్యాదేవిగ వెల్గెడిదెవరు?
నాదోపాసన మెచ్చెడిదెవరు? నాట్యానందము నొందెడిదెవరు?
ఆధారంబయి యుండెడిదెవరు? అక్షీణంబుగ మించెడిదెవరు?
లేదన్నట్టిది పల్కనిదెవరు? ప్రేమే రూపుగఁ దోచెడిదెవరు?

అంతా తానయి నిండెడిదెవరు ? ఐశ్వర్యంబుగ నుండెడి దెవరు ?
చింతా శోకముఁ బాపెడిదెవరు ? శ్రేయంబైనది యిచ్చెడిదెవరు?
కాంతిన్‌ గుండెల నింపెడిదెవరు? కంటిన్‌ రెప్పగఁ గాచెడిదెవరు?
చెంతన్‌ గూర్చొని పల్కెడిదెవరు? స్నేహంబెప్పుడు పంచెడిదెవరు?

బోధన్‌ జేయుచుఁ దెల్పెడిదెవరు? ముక్తన్‌ జేయఁగఁ దల్చెడిదెవరు?
నీ ధైర్యంబునుఁ బెంచెడిదెవరు? నీ మార్గంబెదొ చూపెడిదెవరు?
నీ దైన్యంబునుఁ గూల్చెడిదెవరు? నీకై శక్తిని నిచ్చెడిదెవరు?
నీ దైవంబుగ నిల్చినదెవరు? నీవే నేనని యన్నది యెవరు?

కాంతిన్‌ గుండెల నింపెడిదెవరు?  కంటిన్‌ రెప్పగఁ గాచెడిదెవరు?
చెంతన్‌ గూర్చొని పల్కెడిదెవరు?  స్నేహంబెప్పుడు పంచెడిదెవరు?

--((***))--



దేవదత్త - ర/న/న/జ/ర/లగ UI UI III III - UI UI UIU
17 అత్యష్టి 44027


ప్రేమ పొంది తనువు మనసు - ధర్మ తత్వ దీవెనే
ప్రేమ కల్గి మగువ వయసు - మంచి మార్గ దీవెనే
ప్రేమ చింది చిలుక సొగసు - సేవ భావ దీవెనే
ప్రేమ దక్షత మగణి కల - నిత్య సత్య దీవెనే

మ్రోఁగె శంఖ రవము సమర - భూమియందుఁ బెద్దగా
తేఁగె శత్రు జనము నరుని - దేవదత్తమున్ వినన్
సాఁగె రథము భటుల నడుమ - సవ్యసాచి యమ్ములన్
వేగవేగ విడిచె నపుడు - వింటినుండి ధారగా

దేవదత్తమయిన వరము - దేవి దాను వాడఁగా
దేవదత్తమయిన శిశువు - దేవికిన్ జనించఁగా
దేవి దాను కలఁగి కలఁగి - తెల్లబోయె నప్పుడున్
పూవుఁ బోలు నిసుఁగు ననిచె - బుట్ట నుంచి నీటిపై

పాడ నొక్క తెలుఁగు పదము - పంకజాళి పూయుఁగా
పాడ నొక్క తెలుఁగు పదము - పాము లెల్ల నాడుఁగా
పాడ నొక్క తెలుఁగు పదము - పాయసమ్ము వద్దుగా
పాడ నొక్క తెలుఁగు పదము - వాణి యాలకించుఁగా

దేవదత్త వృత్తపు గణముల అమరికలో పంచమాత్రల నడక కూడ దాగియున్నది. ఒక విధముగా ఇది కూడ గర్భ కవిత్వమే, గతి గర్భ కవిత్వము. ఛందస్సులో పరిశోధనలు ఎందుకు చేయాలని ప్రశ్నించేవారికి ఇది కూడ ఒక జవాబు. ఖండగతిలో రెండు -



UIU IIIII - IIUI UIUIU

సుందరీ నిను గనఁగ - సొబగెల్ల నిండె నామదిన్
విందులే స్వరములను - విన నాకు తేనియల్ గదా
చిందవా యమృతమును - సెలవోలె పార నీ హృదిన్
ముందు రా ముదమియఁగ - పులకింతు మోహినీ సదా

నింగిలో నుడుపములు - నిశిలోన భాసిలెన్ గదా
దొంగలా జలదములు - దొగఱేని గప్పెఁ జూడఁగా
శృంగమం దతి సితము - హిమరాశి చెల్వముల్ గదా
రంగనిన్ గన మనము - రవళించి రాజిలున్ సదా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

హరవిలాస - ర/జ/ర/జ/న/గ 

UI UI UI UI - UI UI III U 
16 అష్టి 31403 

అంద మైన చంద మామ - యాకసాన వెలుగురా   

పండు గైన  సూర్య మామ - నింగి లోన వెలుగురా
పిల్ల పాప లందు మామ  - తల్లి తండ్రి వెలుగురా 
సంత సంతొ సంబరంగ - అంద నంత వెలుగురా   

వెల్గు పంచె వేళ పూలు - కన్ను లోన యలరెగా 

చేను వీచే గాలి వచ్చె - కన్ను  రెప్ప యలరెగా   
వాన జల్లు మారుతమ్ము - సీత లమ్ము యలరెగా 
పిండి వంట వింత శోభ - పండు గాన  యలరెగా  

సఖ్య మేఘ పూల జల్లు -  మై రమించఁ గదలెఁగా

విశ్వ ధాత  సేవ గాధ - గోప్య భావ గదలెఁగా 
స్వశ్చ భాష వెల్గు లూగి - ప్రేమ భంధ గదలెఁగా
స్నేహ శాంతి పల్కు లేగ - పండ గంత గదలెఁగా
        
జాల శీత లమ్ము గాలి - సర్వమయ్యె జడముగాఁ 
ప్రేమ భావ సంత సమ్ము - ఇంటి యంత జడముగా 
రాగ తాళ పాట లందు - వింత ఆట జడముగా 
కల్సి మెల్సి పంచు కొందు - అంద రూను జడముగా 

వచ్చి పొయ్యె వారి మాట - సద్ది మూట అనుటయే
మంచి చేసి చెప్పు మాట  మంచి నీళ్లు అనుటయే
రాగ తాళ పాట లందు వింత ఆట అనుటయే
ఉండి లేదు అన్న ఉన్న - దంత పోవు అనుటయే 

తప్పు చేసి ఒప్పు వాద   -  మాట నీటి బుడగయే
సేవ భావ మున్న చేత కాని వాని మాట పడుటయే 
కల్సి మెల్సి పంచు కొందు సంబ రాన తినుటయే
ప్రేమ భావ సంత సమ్ము ఇంటి యంత వినుటయే

--((*))--


ఆటవెలది పద్యాలు

ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రేనమ: :


ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక  

ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా 

న్యాయ సత్య ధర్మ మార్గము చూ పిన

అవని ఏలె రామ చంద్ర మూర్తి 
సకల జనుల బుధ్ధి మనసుకు మమతయు
పంచు రాజు వయ్య మాకు నీవు ......... 1

కష్ట సుఖము లన్ని కలబోసి పంచుచు

మంచి పనులు ఎంచి మనసు పంచి
స్వార్ధ బుధ్ధి వీడి సమతకై జీవించు
ధర్మ నిరతి చూపి నావు రామ  .........  2

మంచి వారి తోడు వంచకులను మార్చు

దేశ మంత ఉండు దీక్ష పరులు
విలువ లన్ని తెల్పి నిత్యశోభ
జనుల కంది పుచ్చి ఉన్న రామ  .......  3

లౌకి కంబు పెరిగి లావైన కోర్కలు 

రాగ భోగ లోభ రాక్ష సంబు
పుట్టి సంఘ మిపుడు రచ్చబండెక్కెను
కలియుగ సమర మిది మార్చు రామ .......  4

సార బీరు పారు వారకాంతల  జోరు

పెచ్చు పెరిగి మరిగి కోరు చావు
తెచ్చు కొనుట నిజము దేశ మంత
ఇట్టి జనుల బుధ్ధి మార్చు రామ  ......  5

 దేశ భక్తి లేక లేశంబు కొరగాక 

మాతృ భక్తి లేక మమత లేక 
పితృ భక్తి లేక గురువునే హింసించి 
ముష్క రాల బుధ్ధి మార్చు రామ ......  6

మూర్ఖ జనుల మధ్య ముక్కంటి యైనను 

సింహ జాతి మధ్య ఎలుక అగును 
మంచి చెప్ప లేరు మంచిని వినలేరు 
మంచి కన లేరు ఏమి రామ     ......  7      

సుందరమగు పృథ్వి జ్వాలా కరోనా తొ 

దేశ మంత కల్ముషమ్ము అయ్యె 
ప్రకృతి వికృతి గాను మార్పుతెస్తున్నది 
జనుల హంగు లన్ని మారె రామ .....  8

పరిసరాల వసతి జనులకు కరువాయె 

సమ సమాజ జగతి ప్రశ్న ఆయె 
విధివిధానఁ మంత తారుమారైనది 
హిత మేది తెల్ప లేను రామ ......  9

దేశ మేది యైన ఆశించు సుఖశాంతి   

గమన రితులెన్నొ గమ్య మోకటె  
కాల మాయ ఏది ఉన్నను నిగ్రహం 
తోడు నీడ వసతి చూపు రామ ........  10    

మతము మంచి చెప్పు మానవతకుచెప్పు 

దైవ కృపను పొందు దారి చూపు 
మనిషి మనిషి మధ్య మౌడ్యంబు చెప్పదు 
కలసి మెలసి బతుకు చెప్పు రామ ....  11

మనసు చెప్పినట్టి  దివ్య పలుకు ఇది  

నరక యాత నంత తెల్పలేదు 
బుద్ధి మనసు మార్చి ధర్మాన్ని నిలుపయ్య 
జనుల భాధ తెల్పు తున్న రామ   ..... 12 


ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (2 ) 

ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

హితము నెవరు జెప్ప సుతమని నమ్ము 

బతుకు కళలు మంచి మాట పంచు 
పరమత సహనంబు భారతావనికి జెల్లు 
కర్మ భూమి లోని జాతి రామ  ...... 13 

రామ నంద స్వామి త్యాగయ్య పోతన్న   

స్వామి రామకృష్ణ పరమ హంస 
శ్రీ వివేకనంద శ్రీ శంకరాచార్య 
నిన్నె కొలిచె మోక్ష మిచ్చె రామ ...... 14 

కాయ కష్ట జనులు కార్య సూరులు   

నిత్య సత్య పలుకు వేద మాయె 
ఉన్న పనిని ఓర్పుతో చేసి యున్నను  
రెక్క ఆడ లేని నీతి రామ   ...... ..... 15 

భరత మతము హితము సుందర కాండము 

దయ అహింస కరుణ ధర్మ రక్ష 
కులపు పోరు లేని జపము తపము 
పురుష శక్తి ముక్తి నివ్వు రామ .....  ... 16 

నీరు పరుగు కలయు కడలిలో నిక్కచ్చి 

వర్త మాన మన్న చూపులేదు 
ముళ్లు ముళ్లు ముళ్లు కలసి యే కాలాన్ని 
తెల్పి భయము అంత మార్చు రామ  ... ... 17   

జీవి తాన ఆశ ఉండుట తప్పదు 

మంచి చెడ్డ వెతక లేను నేను 
సగటు మనిషి బతుకు ఉంటేను చాలలే
అక్ష రాల మాట నిజము రామ .... ...  18  

చదువు వలన వ్యక్తి సంస్కారమొదుగును 

చదువు పెదవి కాచి నిత్య ముండు 
చదువు రాని వ్యక్తి  సంకట పడుచుండు
చదువు తల్లి కరుణ తెల్పు రామ ....... 19  

నేటి చదువులందు  పోటీలు పెరిగియు 

నవ్య న్యూనతలలొ నడక మాని 
నేటి చదువులన్ని నేర్పరులు కవులె 
సత్య బోధ తెల్పు మాకు రామ .......  20  

గురువు తల్లి తండ్రి గుర్తింపు లేకయు 

యువత వయసు సుఖము కోరు చుండు 
సుందరమ్ము మనసు చదువులు కోరక 
అడ్డ దారి తొక్కు తున్న రామ ......   21   

ఇంట తల్లి తండ్రి కోరికల్ వదిలియు 

దాచు కొనును తనయ చేష్ట లన్ని 
కాని హితము తెల్పు మతిమార్చుకోబిడ్డ
అనియు కంట నీరు తెచ్చె రామ ........ 22  

నేటి చిత్ర జగతి నేర చారిత్రంబు

చదువు భంగ పాటు, మధువు మగువ 
పెదవి కోరు బుద్ది పెచ్చుపెరుగుచుండు 
మంచి చెప్పు వారు లేక రామ ..... ..... 23  

చెలిమి బలిమి చూపి చదువనే మార్చెను 

కలిమి కలిగి ఆశ పెరిగి ఉండు 
జీవి తమ్ము లోన కొంత సుఖము 

కష్టములను తెచ్చి పెట్టు రామ ....  .... 24  










ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (3 ) 

ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

పిల్ల వాని శక్తి ప్రీతైన అంశాలు

నెరిగి తల్లి తండ్రి నేర్పు విద్య 
ఋణము తీర్చుకొన్న గోవర్ధనుడగును 
తీర్చ లేని వాడు చెడెను రామ  ....  ... 25

మనసు సంస్కరించ మరి రాదు పొరపాటు 

బయటి బ్రాంతు లన్ని పగటి కలలు 
చదువు లందు నీతి తెలుసియు బతుకును 
సార్ధ కమ్ము చేయ లేడు రామ ...  ...   26 

సమయ పాల నంబు సర్వుల బాధ్యత 

క్రోధ మంత మొదలి వినయ ముంచి 
బాల బతుకు బాట బంగారు బాటగా 
మార్చు ప్రీతి సకల మివ్వు రామ  ...  ... 27 

కమ్మ దనపు చదువు కంపల దిండుగా  

చేయు నొకడు తనకు చేత గాక 
తెలివి లేని వాడు చేయు పనియు       
ధనము వున్న వాడు చేసె రామ ... ...   28 
   
గురువు మాట లన్ని చవటకు ఎక్కవు 
మంచి విన్న చెడ్డ అనియు తోచు 
ఇట్టి వాని చదువు కన్నచాకలి మేలు 
మొండి బతుకు ఎన్ని నాళ్ళు రామ .... .. 29      

చదువు లున్న తల్లి చక్కని సంస్కృతి 

గురువు గాను చురుకు దనము తెల్పు 
ఎట్టి చదువు లైన నేర్పును సుతులకు 
ప్రేమ నంత పంచె తల్లి రామ ... ...  ౩౦ 

పిల్లల చదు వన్న పెనుభారమై పోయె  

తల్లి తండ్రి చింత దండి యాయె
తెలుగు నేర్ప లేక ఇంగ్లీషు వద్దని  
తల్లి తండ్రి బాధ తీర్చు రామ  ... ... 31 

బాబొ బడికి పోను ఇంగ్లీషు చదువొద్దు  

నాకు వద్దు నాన్న నన్ను వదులు 
చక్క నైన తెలుగు భాషను నేర్పుము 
బతుకు బండి లాగు చాలు రామ  ... ... 32 

ప్రార్ధన గణ నాధు నికి ముందు చేసియు
సాగును కనివిని ఎరుగ నీ విధాన
కవుల తెలుగు వెలుగు సాహిత్య సేవలు
చేయు కళల ఫలిత మివ్వు రామ.... ..... . 33

 శ్రీక రమ్ము పధ్య మిదియని ప్రశ్నించ

బాహ్య దోష ముండ వచ్చు అయిన
తెలియ చెప్ప ముందు కొచ్చి యే ఉంటిని
తప్పు లున్న దిద్ది చెప్పు రామ.... ........  34

శుభము లొసగు మాట చుప్ప నాతిగమారు 

చెడ్డ పలుకు బంక లాగ అతుకు
ఎంత చెప్పు చున్న కామపు సువాసన
మనిషి మదియు మారు లేల రామ.... ....  35

బుధ్ధి మంతు డిగనె బతుకు సాగాలంటె

లక్ష్మి వెలుగు కలిగి ఉండు చుండు
శాంతమూర్తి మారె లక్ష్యసిధ్ధిని పొంది
సహనశక్తి కల్గ చేయు రామ........... 36
#mahabarat #art #india #inspiration  Fanart of Karna,Mahabharat,by Snowcandy.CC:BY-NC-ND

ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (4 ) 
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

నేర్చు కున్న విద్య నేర్పుగ మదినిల్వ 

సాగ రంబు కలియు నీరు లాగ 
నిత్య జీవితంబు నిర్ధారణల్ జూపు 
జరుగ బోవు కర్మ తెలుపు రామ ...... ...... 37  

సుమపు వాసనలను సుకుమారమౌ రీతి   

పొందవలెను తప్ప కుంద దగుఁదు 
అట్లె నిత్య పూజ మనశాంతి కలుగుట 
మంచి రీతి తరచ నేర్పు రామ  ... .... 38  

నేర్పు చదువు నందు నేర్పును జోడించు 

అంత రంగ శక్తి సంత సించు 
ఆశ యాల గూర్చి ఆరాధ్యదైవాలె   
దిగుట మంచి మాట తెల్పు రామ ... .. 39 

అంకితంపు బుధి చదువు యందున్నను 

అద్భుతంబు శిష్యు లమరు నెచట 
అట్టి చదువు లెపుడు ధర్మము తెల్పును 
స్వార్ధ బుద్ధి విడె విద్య రామ   .... ..... 40 

రక్త పుష్టి విద్య రక్తియు సర్వము 

గురువు వద్ద పెరుగు గుణము పెరుగు 
విశ్వ శక్తి యంత విపులము గాతెల్పు 
జీవితమ్ము సుఖమునిచ్చు రామ  .. ... 41  

లోనదాగిఉన్న లోపముల్ త్రొక్కుచు 

లోనఁ దాగు ప్రజ్ఞ సాన పెట్టు 
మౌన మంత వదలి కార్యదక్షడువు
అయ్యి ధర్మ నిరతి తెల్పు రామ  ... ... 42 

గురుని శిష్యు డెపుడు మరువంగ లేడురా 

మంచి మాట మనసు పట్టి ఉండు
పదవి కాంక్ష లేని గురుశిష్య విలువ 
నిత్య సత్య బోధ యేన రామ  ...  ... 43 

అట పాట గూర్చి అద్భుతమును జెప్ప 

అట్టె నేర్చు కొను పుట్టు బిడ్డ 
ఏమి చెప్పఁ నున్న అన్నితెలుసుననే  
తట్టి కొట్ట చదువు తీరు రామ  ...  ... 44 .

కనబడు పదములలొ నీతులు ఎక్కువ

చెప్పా వీలు గున్న ఆచరణములు 
సున్న కనురు చిమిరి మల్లాప్రగడ మాట 
విన్న వారు నెల్ల సుఖము రామ ..  ... 45 

వేడు కపడి వినవ లెనుకవిత్వమునులే 

తుళువ చెడ్డ బుద్ది మనసు మారు 
వృద్ధి చెందు మిపుడు మనుషుల మేధస్సు    
సేవ తత్వ బుద్ధి కల్గు రామ ... .... 46 

యువకుల మదిలొ చదువే తప్ప ప్రేమని 

తిరుగు బుద్ధి చదువు నాశ నమ్ము 
జరిగి ఈగ లాగ తిరిగేటి మనసును 
బుద్ధి మార్చు దైవ పరము రామ  ... ... 47 

యువకు లందు బుద్ధి పరువములో ఉండి   

ప్రేమ ఉన్న వారి మాట కులుకు   
తొడమొదలు తొడిమ మొదలు తెలుపు 
ను కడుమధుర మగును వయసు రామ  .. 48   

--(())--




ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (5 ) 

ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

పింఛ మంత విప్పె నాట్య నెమలి 
మెఱుపు విఱుపు కాంతి అద్భు తమ్ము 
చల్ల గాలి వల్ల పులకరింపు పెరిగి 
పుడమి తల్లిపురుడు పోసె రామ .... ... 49    

ఎంత వారి కైన ఆకర్ష వికర్ష 

ఏదొ ఒక్క దాని తప్పి పోరు 
ఎందు వళ్ళ ననగ దైవము తెల్పిన 
యాగ కర్త ఏక మవుట రామ  ...  ...  50      

వలపు కులుకు తెలుపు సౌందర్య హాసినీ 

ఆట లాడు కొంటె కోమ లాంగి
బుడి బుడి నడకల బుడతకులొంగి నటన
చూపు యువతి మేలు చూడు రామ ...  ... 51  

ఆకు కాయ గూర తిన్నవానికియు

ఉప్పు కార మంత తిన్న జిహ్వ
చాప వల్ల కులుకు సొగసుకు మఱుగుట
లోక సహజ మేన తెల్పు రామ ... ..... ..  52 

ప్రేమ పంచి పెట్టు తల్లి తల్లి తండ్రులకును 

కొంత పూల బాట చేసి చూపి 
బిడ్డ లంద రూను సంతసమ్ముగా ఉందురు 
నిజము ఐన మాయ ఏది రామ  ... ... 53 

నీతి వర్తనంబు జాతిలో చిగురింప

మానవత్వ మహిమ మహిని వెలయు 
ఉగ్ర వాద మెటుల ఉర్విని చెలరేగు
ధర్మ పరులు ఉన్న ఏమి రామ ... ... 54 

నీతి వర్తనంబు నిండారు చదువులు       

నేర్చు కున్న వ్యక్తి నేర వృతి 
పంచుకొనగలేడు వంచనల్ చేయడు 
కుడితి లోప డిన ఎలుకయె రామ .. .. 55 

ఆట పాట లాడి ఆరోగ్యమును పెంచు           

చదువు లందు ఎదిగి జాతి పెంచు 
ఎన్ని ఉన్న తల్లి తండ్రులమాటను 
వదలి తిరుగు జాతి పీడ రామ  ... ... 56 

అర్ధ మైన విద్య అంకిత భావంబు 

జోడు ఎడ్ల వోలె మేడి పట్టు 
ప్రగతి పదము నందు పరుగెత్తు దేశంబు 
వ్యర్ద మన్న దేది కాదు రామ  ... ... 57  

ఓటు విలువ తెలియ లోటును గుర్తింప 

విద్య నిర్వ వలయు విధిగ జనులు
ప్రజలు విజ్ఞ లైన పాలన ప్రతిభయే 
విపుల ఓటు విలువ తెల్పు రామ ... .. 58 

మునుపు పాడి ఉండి ఆవుపాలను తాగు 

నేడు తగు చుండు కల్తి పాలు 
బలము బలము అంటు కుత్రిమ పాలుపట్టు 
ఏమి లోక మాయ మార్పు రామ .... ... 59 

నీచ బుద్ధి ఉన్న వానికి పలుకులు 

వెన్న పూస కరుగు నటుల ఉండు 
అర్ద మందు ఎదో ఆశయాలను చూపు 
చెప్పు ఒకటి చేత వేరు రామ ... ...  60  

--(())--



   Code: AG12 | Aalankritha


ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (6 ) 

ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

నలుపు తెలుపు  లోను లేదులే ప్రేమయు 

సంత సించు వేళ సంబ రమ్ము 
చూపు బుద్ది తెలిపి వినయాన్ని చూపియు 
చక్కఁ దిద్దె  సోకు లన్ని రామ ... ... 61     

కాల మంత ఒకరి సొత్తుయు కాదులే 

జీవి తమ్ము లోన  ఇచ్చి పుచ్చు 
కున్న విలువ నిలక డలొ తె లియులేదు తర్వాత
తెలియు ఇదియు ఏమి చెప్పు రామ ... ... 62  

చెడ్డ వాని సుఖము కోరియు నడిచినను

మంచి వాని బుద్ధి మారు చుండు
చేయు పాప మంత మరచి మూర్కునిలో
మార్పు ఏల వచ్చు చెప్పు రామ  ...  ...  63  

జన్మ మారి కొత్త యోని ప్రవేశమ్ము

చేయు పుణ్య పాప మంత ఉండు
ప్రకృతి శక్తి తోడు యుక్తి కలసి 
మార్పు వచ్చు వాక్క నిజమె రామ ... .... 64  

ఖర్చు మీరి  ఉంటె పేదరికం వచ్చు

పొదుపు మీరి ఉంటె కష్ట మోచ్చు
ధనము అధిక మున్న శాంతి కరువుయె
శిక్ష మీరి ఉంటె ఏల రామ    ....   ...   ,,65  

హాస్య మాడ దలచి మితిమీరిన నటన

నవ్వుల న్ని కొంప ముంచు చుండు
కోప మున్న ఇంట నొప్పులతో పని
ఎంత మందు తాగి వచ్చు రామ .... .... 66  

జీవి తమ్ము గాలి గుమ్మటం వలెతిర్గి 

కదలి చిక్కు కున్న బుట్ట నున్న 
పాము వల్లె ఉండి వెన్నలొచ్చువరకు
కాల మాయ తప్పు వరకు రామ  ...  ...  67  

అప్పు చేస్తె చిప్ప కూడు తప్పదు కదా

అప్పు లేక గంజి కూడు మేలు
పాప మంత ధనము గా మారి  అరగదు
తిన్న తిండి ఎక్కు వయితె రామ   ...  ... 68  

మాట మాట మధ్య కోప తాపము వద్దు

నవ్వు కుంటు మాట ఒప్పు మేలు 
కాల గమణ అనుకరించి యు జీవితం
మంచి చెడ్డ మధ్య ఉండు రామ  .... ... 69  

స్నేహ మున్న అక్కరకు ఉప యోగము

మంచి పలుకు మనసు చేరి యుండు
శత్రు వన్న వారు లేకన్న జీవితం
కోర్కెలెంట చిక్కు చుండు రామ  ... .... 70  

సాధనన్న నున్న సమ కూర్చు లోకము

మనిషి కి కరుణ దయ కలిగి ఓర్పు
ఏమి అనక ఉన్న కొన్ని కోల్పో తాము
జరగ బోవు ఘటన తెలుపు రామ   ... .... 71 

అర్ధ మలుపు కన్న అర్ధాంగి చొరవయే 

నిత్య సత్య విలువ తెలుపు నలుపు 
స్వార్ధ బుద్ధి ఉన్న జీవిత మరకయే 
చిరున గవు న రకము కల్గు రామ .... ...  72  
--(())--
Keshav (@keshav61) | Twitter

ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (7 ) 

ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

వద్దు వద్దు ఆట లొద్దన నెపుడును 

బాల్య చేష్ట లంటె నాకు ప్రీతి  
ముద్ద ముద్ద అంటె వెన్నముద్దలివిగో   
హాస మంత నాకు పంచు రామ  ... .... 73   

మట్టి సుద్దు చితిపి ఆటలాడినిపుడు 

ఏదొ కొంత వింత లాగ ఉండు   
చింత అంటె తెలియ కుండగా పాటలు 
కాల మంత సంబరమ్ము రామ .... ..... 74  

కన్న వారు యింట ఉన్న యిల్లే ఇల్లు 

వారు బరువు అన్న మీరు అంతె      
తనయ చేత పొందు తగురీతి శిక్షలు 
ప్రేమ అంటు దిగులు చూపు రామ ... .... 75  

అట పాట లాడి ఆరోగ్యమును పెంపు 

చదువు లందు ఎదిగి జాతి పెంచు 
దాన్ని మరచి తండ్రి దాస్యాని కంపిన 
ధనము వచ్చి బుద్ధి తరుగు రామ .... ..... 76  

చిత్త సుద్ధి కల్గి చేసిన దేదైన

ఆశ లన్ని తీర్చి కలిమి పెంచు 
కార్య సిద్ధి నిచ్చి కలలను పండించు     
శ్రమ యంత ఫలిత మిచ్చు రామ  ...  ....   77  

భావి పౌర విద్య బలవర్ధ కంబురా 

వెలుగు నిచ్చు విద్య దీప మదిర 
జాతి పెంచు విద్య జవసత్వమెరుగురా
మగువ మనసు దోచు విద్య రామ  .... ....  78  

మోగము చూస్తె మనసు ముద్దివ్వా లనిపించు

వృత్త మల్లె ఉన్న కురుల మెరుపు
వాన జల్లు కురిసి తడిసిన మోగము. 
ముత్య మల్లె మెరియు చున్న రామ ....  .... 79  

మనిషి వచ్చి చేరి ఇల్లంత దేచేసి 

మింగు పడని దేదొ అంట గట్టి
ఎన్ని మందు లేసి నాచావ కుండగా
లోక మంత రోగ మయ్యె రామ    ....   .....  ..  80  

అవని ఏలె మాత కంటనీరు  పెరిగి

ప్రేమ పంచ లేక బాధ తెలుపు
దారి తెల్ప లేక కాలుష్య వలలలో
చిక్కి చెప్పు కోక ఉంది రామ  .....  ...... .....  81  

వసుధ సతము సెగల రోగము కమ్మియు 

మనషి మనిషి మధ్య రోగ మొచ్చె
జీవ రాశి యంత కన్నుతెరచి చూడ
లేక ధనము లేక ఏల రామ     .....     .......  82  

జగము సుఖము కాదు దు:ఖస్వరూపము 

మిధ్య  వాద లోక మంత వచ్చె
జ్ఞాన మున్న దన్న రోగ మొచ్చె
సత్య ధర్మ మన్న దేది రామ    .......     .... 83  

విఘ్న నాయకా వినాయక నేనిన్ను

కోరె ఆత్మ లింగ కోస మేన 
మారు వేష మేసి పుడమిపై లింగాన్ని
ఉంచి సంత సించు టేగ రామ    .......   .... 84  

--(())--

Artist. India
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (8 ) 

ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

విద్య లేక లక్ష్మి  విద్వత్తు నియ్యదు 
గర్వ మెంతొ పెంచు ఘనత తుంచు    
వాణి గూడు లక్ష్మి వాగ్విభూతిని పెంచు 
బతుకు తెరువు పదిల పరచు రామ  ..... ..... 85 

అమ్మ వారి తెలివి అయ్యవారికి చెందు

అయ్య వారి తెలివి అమ్మ  వారికి చెందు 
ఇరువురిపలుకులను పిల్ల వానికి చెందు 
జన్మ జన్మ బంధ మేలె రామ    .... ....      86

దొంగ చదువు చదివి దొరయైన పక్షాన 

భంగ పడును కార్య భారము నందు 
మంచి చదువు చదివి మనిషిగా గుర్తింపు 
చదువు లేక కష్ట బతుకు రామ .... ....     87  

సమసమాజ మందు సంతృప్తి విద్యలు

ఆత్మ తృప్తి కలిగి సాగు జీవి  
ఎంత చదువు చదివి నా బుద్ధి మంచిది 
ఉండి ఓర్పు కలిగి లేదు రామ  ..... .... 88  

వెనక బడిన వారి వెనుదన్నుగనిల్చి 

వింత మెంత ఆయన విద్య నేర్పు      
చదువు తగ్గ కొలువు ఇచ్చిఆదుకొనుట 
మానవత్వ విలువ పెరుగు రామ .... .... 89  

రాజకీయ మెపుడు రాజీతో ముడిపడు 

ఆశ చూపి అడుగు ఓటు హక్కు 
ఓటు పొంది  వెన్ను తట్టెటి బతుకుండు 
గెలిచి నాక గర్వ ముండు రామ  .....  ....... 90    

రాయి తీల నెల్ల రాబట్టు కొనుటకై 

 నీచ రాజ కీయ వాడు చుండు 
అడ్డ దారి తొక్కి అందలమెక్కినా  
కుక్క బుద్ధి మార లేదు రామ  .... .....  91 

గంగ నీరు తెచ్చి కావేరిలో గల్పు  

మేటి మగలు లేరె నేటి జగతి 
దేశమెల్ల దోచు ధీమంతులుందురు 
ఉన్న లేని వాడు బతుకు రామ ....  ... 92 

దేశద్రోహి దొంగ పాశవిక రాక్షసుల్ 

పరుల భాగ్య మంది బతుకు జడులు
దేశ మందు తగ్గి ధీశక్తి పెరగాలి 
జనులు బతుకు ధైర్య ముండు రామ .. 93 

చదువు లేక సభ్య సంస్కారములు లేక 

చట్ట సభలొ జుట్లు పట్టు కొనెడి 
చవట పద్ధ తులను క్షమించి కూడదు 
కప్ప లాగ గంతు లాయె రామ .... ... 94 

నగర సాగరాల బుగల భూకంపాల 

జీవ రాశి భూమి లోని కేగె 
పెద్ద రీతి కుళ్ళి ఖనిజములు ఎగసె
మిగులు వారిబతుకు ఏల రామ ..... 95 

నరుని మలము కూడ నాణ్యము రీతిన 

వంట వాయు వగును వాడు కొనుము 
విజ్ఞడౌను వాడ వెకిలికానేరదు 
సకల మాయ యందు ఉండు రామ ... 96 

--(())--

Künstler. Indien    
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (9 ) 
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా 


రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఉలికి పాటు పడకు రోజుఉండు కథలే
ఉనికి మార్చి కొత్త భయము తాకు
వినని రోగ మేది. లేదు ఇలలొ
ఓర్పు చూపె పలుకు తెలుపు రామ.......  97

చినుకు పడితె జలుబు వచ్చుట సహజము
కునుకు పడితె మనసు కుదుట పడులె
కనుకు అలక మాని ఆవిరి పట్టుటే 
లంఖనంబు తెచ్చు మార్పు రామ.............98

రెప్ప చాటు బతుకు రెచ్చ పోవుటవద్దు
రచ్చ రచ్చ చేసి భయము తాకు 
కాల మిపుడు ఏదొ ఆవహించినదిలే
 ఓర్పు నిచ్చు పలుకు తెల్పు రామ........ 99

 పిడికె డంత గుండె పరిమళిస్తున్నది 
పిసికి పిసికి చిటిక డంత కమిలి
కదిలి జల్లు కురిసి బాధను మింగెను
గుండె గాయ మైన కదులు రామ. .... 100

యీల  పాడి గోల చేయు ఆకులమధ్య
ఎండ వాన చలిలొ నిప్పు మెరుపు
పూల వాస నిచ్చి కాయగా మారియు
తృప్తి పొంది తరువు నీడ రామ. . . 101

కమల నయన తనివి తీరని కామ్యపు
చూపు మాలొ ధర్మ నిర్ణ యంబు
నిలిపి మనసు విప్పి తెల్పేటి సత్యము 
నిత్య ధర్మ చలువ నీదె రామ .... ... 102  

కమల నయన మమ్ము పెంచియు పోషణ 
ప్రేమ భుక్తి పంచి నిష్ట నేర్పి
మనసు తలపు లన్ని నీకృపయే మాకు
వినయము మది తీర్పు తెలుపు రామ .. 103  

కమల నయన మనసు అర్పించి భక్తితొ
వేడు చుంటి నిన్ను ఆశ లేక
కరుణ దయయు భయము నాకున్న తెల్వియూ 
మాయ నీకు అన్ని తెలుసు రామ ... .... 104

కమల నయన మమ్ము బ్రోవుము ఎప్పుడూ
నీకు తప్పు లన్ని చెప్పు చుంటి
మక్కువైన మాట వాస్తవమేనని 
మోక్ష మార్గ మంత నీవె రామ  .... .... 105   

కమల నయన మనవి జనులను బ్రోచుము
ప్రేమ భందనా న్ని నిలుపు శక్తి
మాకు జన్మ అర్థ భావమ్ము మాపుము
సర్వ సభ్య సాక్షి నీవె రామ .... .... 106  

కమల నయన చూడు భౌతిక జగతినన్
నిద్ర నుంచి మేలు కొల్పు మిపుడు 
కోటి సూర్య తేజ మాబుధ్ధి ధర్మము
వైపు ఉంచి విధులు తెలుపు రామ ... 107  

కమలనయన భోగ మందిచి చూస్తావు
సొత్తు చూపి మత్తు లోకి దింపె
మాది నిన్న నేడు కష్టము అంతయు
రేపు మారు చుండు పకృతి రామ ... 108  

--(())--
ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు తెలియ పరుచు చున్నాను నేను 2012  నుండి నేటివరకు అనేక కవితలు కధలు వ్రాసి ఇందు పోస్టు చేసి యున్నను. ముఖ్యముగా వ్రాయునది నా గురువు గారు కీర్తిశేషులు శ్రీ మల్లవరపు బాలాజీ సుబ్బారావుగారు,  ఇచ్చిన (19 - ౦౬   -2  ౦ 1 1 ) పుస్తకము "విజ్ఞాన వైభవం " పుస్తకం ఇచ్చినపుడు కవిత్వం అంటే అసలు తెలియదు పుస్తకాలు సర్దనప్పుడు పుస్తకం కనిపించగా పద్యాలు వ్రాయాలనిపించి   23 /06 /2020 వెంటనే 108 ఆటవెలది పద్యాలు వ్రాసి గురువుగారికి గౌరవ సూచికంగా పుష్పాలను ఇద్దామని రాముని వద్ద ఉంచాలని భావంతో వ్రాయటం పూర్తి చేయటమైనది. మొట్ట మొదటి సారిగా ఏకధాటిగా వ్రాయటమైనది ఆరాధించే సీతా రామాంజనేయుని ప్రార్థిస్తూ మీకు తెలియ పరుస్తున్నాను.         

రేపటి నుంచి తెలుగు భాష నేర్చుకుందా౦ "ఛందస్సు " చిన్న వృత్తాలు మాత్రమే   
మరొక్క సారి గురువు గారిని తలుస్తూ వినాయపూర్వకముగా తెలియ పరుస్తున్నాను.  
                                                      ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
                                                         రచయత, విశ్రాంతి అకౌంట్సు ఆఫీసర్
                                                                                           6281190539   
1

6, జులై 2020, సోమవారం

గురు పౌర్ణమి


ఈ శరీరం-ఆత్మ ఏమిటి? భగవద్గీతలో ఏం చెప్పారు, దేనిని దేంతో పోల్చారు?

మనల్ని మనం చూసుకొనేపుడు ముందుగా కన్పించేది భౌతిక శరీరం. ఒకచోటు నుంచి మరోచోటుకి పోవాలన్నా, జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ప్రాపంచిక విషయాలను గ్రహించాలన్నా చైతన్యం ఉంటేనే సాధ్యమవుతుంది. మన దైనందిత జీవితంలో జాగ్రదావస్థలోనే గాకుండా, గాఢ నిద్రలో ఉన్నపుడు మనస్సు , ఇంద్రియాలు పనిచెయ్యవు. ఐనా ఊపిరి పీల్చుకోడం, గుండె కొట్టుకోవడం అనే ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు మనలను జీవింప జేసేది ప్రాణము. అది శ్వాస రూపంలో ప్రాణశక్తిగా శరీరాన్ని, అవయవాలను నడిపిస్తుంది. ఈ ప్రాణ శక్తి మనలో ఉండే సూక్ష్మ శక్తి. దేహంలో ఉండే చేతనమంతా ప్రాణము యొక్క వ్యాపారమేనని చెప్తారు.

జీవం అంటే శరీరానికీ ప్రాణానికీ ఉండే సంబంధమని చెప్పుకోవచ్చు. ఈ సంబంధం తెగిపోతే ప్రాణం పోయిందని అంటాం. అప్పుడీ భౌతిక శరీరాన్ని మృతదేహమంటాం.
 వాస్తవానికి శరీరం గాని, ప్రాణం గాని స్వతఃగా చైతన్యం లేనివే. మరి వీటికి చైతన్యాన్ని కలిగించే దేదో తెలుసుకోవాలి.

ఒక విషయం గాని, వస్తువుగాని మనకు తెలియాలంటే అక్కడ చూసే వాడొకడు ఉండాలి. చూడబడే వస్తువు లేక విషయం ఉండాలి. ఈ రెండిటినీ కలిపే చూడటం అనే ప్రక్రియ జరగాలి. అంటే చూసేవాడు, చూడబడే వస్తువు, చూడడం అనే క్రియ ఉండాలి. ఆ వస్తువుతో భౌతిక సంబంధం లేకపోయినా మనస్సు జ్ఞానేంద్రియాల ద్వారా; ఆ జ్ఞానాన్ని కల్గించేది చైతన్యమే. మనస్సు, ఇంద్రియాలు అన్నీ ప్రకృతి నుంచే ఏర్పడ్డాయి. ప్రకృతి జడము. అంచేత ఇవి చైతన్యవంతములు కావు. చూసే వస్తువుకు, చూసే వాడికి చూడడం అనే ప్రక్రియలకు వెనుక ఎరుక ఉన్నపుడే ఆ వస్తువు తెలియ బడుతోంది. ఆ ఎరుకే(awareness) చిత్త వృత్తి ద్వారా విషయానుభవం కలిగించేది.

స్వప్న జాగ్రదావస్థలలో సహితం శరీరాన్ని ఆశ్రయించి ఉండే ప్రాణం కూడ ఇంద్రియాలూ, మనస్సులాగ శాశ్వతం కాదు. కాని వీటన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చేది, చిత్త వృత్తుల ద్వారా విషయానుభవం కలిగించేదీ, చూసే వాడి వెనుక ఉండే చైతన్యమనే ఎరుకను ఆత్మ అంటారు. అదే అన్ని భూతాల అంతరాత్మగా చెప్పబడే బ్రహ్మము, లేక క్షేత్రజ్ఞుడు.
ఇదే విషయాన్ని ప్రశ్నోపనిషత్తులో ప్రాణం ఆత్మ నుంచే అంటే బ్రహ్మము నుండే ఉద్భవించి నట్లుగా చెప్పబడింది.

ప్రాణానికీ ఆత్మకూ గల సంబంధం మనిషికీ నీడకూ ఉండే సంబంధం వంటిదని అంటోంది. అంటే నీడను మనిషి నుంచి విడదీయలేం. అలాగే ప్రాణానికీ ఆత్మకూ ఉండే సంబంధం కూడా విడదీయలేనిదే. శరీరంలో ఆత్మ ఉన్నదంటే ప్రాణము ఉంటుంది. ఛాందోగ్యోపనిషత్తులో ప్రాణము ముఖ్య ప్రాణముగా చెప్పబడింది. ఆత్మ దేన్లో అద్దమునందు వలె ప్రతిబింబము చెందుతుందో, అదే ప్రాణమని చెప్పబడింది. రాజువద్ద ముఖ్యాధికారి పనులన్నిటినీ ఎలా చేసి పెడుతుంటాడో, అలా ఆత్మ క్రింద, సర్వాధికారాన్నీ ప్రాణము జరుపుతుంది. ఇది పరమాత్మను నీడలా అంటి ఉంటుందని చెప్ప బడింది.

మనస్సు ఆత్మకు అనుభవాలను కలిగించే పని ముట్టు లాంటిది. మనస్సు ద్వారా బాహ్యవిషయాలను అనుభవంలోకి తెచ్చుకొని, తిరిగి కర్మేంద్రియాల ద్వారా పనులను చేయిస్తుంది. ఇలా ప్రాణమే మనలో సమస్తాన్ని నడిపిస్తూ, ఆత్మ వల్ల చైతన్యం కలిగి ఉంటుంది. ఆత్మ ప్రాణ వాయువూ కాదు, మనస్సూ కాదు. అది శుద్ధమైనదని వేదాలు చెబుతున్నాయి.

రమణ మహర్షి వారు ఆత్మను గురించి ఇలా అంటారు. "చూడబడేది, చూసేది, చూపు అన్నీఅదే. ఆత్మ సాక్షాత్కారంలో చూడబడేదేమీ ఉండదు. ఎరుకయే దాని సస్వరూపం. దాని వెలుగులోనే శరీరము, అహంకారము, ప్రపంచమూ ప్రకాశిస్తాయి. మనస్సెంత ఉరకలు వేస్తున్నా అది అత్మవల్లనే. మనస్సు, శరీరం, ప్రపంచం వీటికి ఆత్మను విడిచి ఉనికి లేదు. చూసేవాడు ఆత్మ. కాని ప్రజలది తెలిసికోక, చూడబడే దానివెంట పరుగులు పెడుతుంటారు. తానున్నాని తెలిసినా, తానెవరో మాత్రం తెలియదు. అతడు ప్రపంచాన్ని చూస్తాడు. కాని అది బ్రహ్మమేనని గ్రహించడు".

"తెంపులేని ఎరుకయే ఆత్మ. మనిషి అంటే దేహము, ఆత్మ, మనస్సుల కలయిక. ఆత్మే చైతన్యవంతమైన శక్తి. దాన్నుంచే పుట్టి ; మనస్సు జడమైన దేహంతో కలసి ఇది నేను, అది నేను అంటుంది. అదే దేహాత్మ బుద్ది. ఆత్మ లేకుండా మనస్సు నిలువలేదు. మనస్సు ప్రాణం సహాయంతో దేహానికి కదలికను ఇచ్చి, తను చక్రవర్తిలా దేహేంద్రియాలతో ఇష్టం వచ్చినట్లు పనులు చేయించు కుంటుంది".

భగవద్గీతలో ఆత్మ గురించి ఇలా చెప్పబడింది. ఈ విశ్వమంతా వ్యాపించివున్న ఆత్మనాశనం లేనిది. దానినెవరూ అంతం చేయలేరు. నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ చంపేది కాని చచ్చేది కాని కాదు, ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకపోవడం జరగదు.

 జన్మరహితమూ, శాశ్వతమూ, అనాది సిద్ధమూ అయిన ఆత్మ నిత్యం. మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టేసి కొత్తబట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృశించిన శరీరాలను వదలి కొత్త దేహాలు పొందుతుంది. ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు; అగ్ని కాల్చలేదు; నీరు తడుపలేదు; గాలి ఎండబెట్టలేదు. ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది; అది నిత్యం, సర్వవ్యాప్తం, శాశ్వతం, చలనరహితం, సనాతనం. ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. వికారాలకు గురికాదు. ఇది స్థిరమైనది, అభిన్నము, ఆకారము లేనిది. దేశ, కాల, నిమిత్తాలకు అతీతమైనదీను. నిత్య పరిశుద్ధం. పరిపూర్ణము.

ఆ ఆత్మయే బ్రహ్మమని 'అయమాత్మా
బ్రహ్మ' - అని బృహదారణ్య
కోపనిషత్తు నందు చెప్పబడింది. అంటే ఈ జీవాత్మయే బ్రహ్మ. ఐతరేయోపనిషత్తు తృతీయాధ్యాయం మానవునికీ భగవంతునికీ ఉండే సంబంధాన్ని వివరిస్తుంది. అన్ని కార్యకలాపాలకూ ఆత్మే ఆధారమనీ, ఆ ఆత్మే బ్రహ్మమనీ చెబుతోంది. శరీరం లయమైనా ఆత్మలయమవ్వదు. నిత్యము, శుద్ధము, బుద్ధము (అంటే జ్ఞానరూపము), ముక్తము ( బంధం లేనిది), ఇది ఇంత అని చెప్పడానికి తగ్గ కారణం లేపోడం వల్ల నిరవధికము. దేశాన్ని బట్టి గాని కాలాన్ని బట్టి గాని దీనికి పరిమితులు లేవు గనుక అనంతమని చెప్పబడింది. జ్ఞానానికి అవధి లేదు గనుక సర్వజ్ఞమని చెప్పబడింది.

****

ఓం నమః శివాయ
శ్రీ ఆది శంకరాచార్య విరచితం
గురు అష్టకము

“నిజమైన గురువుకి సమానమైనదానిని మూడులోకాలలోను చెప్పలేము. పరుసవేది దేన్నైనా బంగారంగా మార్చుతుందేమో కాని ఇంకొక పరుసవేదిగా మార్చదు. కాని ఒక గురువు తన్ను నమ్మి శరణుజొచ్చిన శిష్యుడిని తనంతటివాడిని చేస్తాడు. కాబట్టి గురువు అసమానుడు. అల్ప బుద్ధి కలవాణ్ణి కూడా పండితుణ్ణి చెయ్యగలడు గురువు.


జగద్గురువులైన ఆదిశంకరులు గురువు గురించి చాలా గొప్పగా చెబుతారు. వారు ఒకచోట అడుగుతారు,“ఎన్ని ఉన్నా, మనస్సు గురు పాదములను పట్టుకోకపోతే ఏమిటి దాని ఉపయోగం?” అని. వారి రచించిఅన్ ‘గురు అష్టకం’లో ప్రతి చోట అడుగుతారు.ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? అని.ఎనిమిది శ్లోకములలోను దీన్ని మకుటంగా ఉంచి మనల్ని ప్రశ్నిస్తున్నారు.


శ్రీశంకర భగవత్పాదులు రచించిన గురు అష్టకం శిష్యునికి ఉండాల్సిన ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శిష్యుడికి ఉండాల్సింది గురువు మీద నమ్మకం, విశ్వాసం. మనకు ఎవరిమీద ఐతే గురి కలుగుతుందో వారే గురువు. లోకంలో నిషిద్ధ గురువులు కూడా ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం అంటే బురదపాము నోట్లో ఉన్న కప్పవంటి జీవితం అవుతుంది.

ॐॐॐॐॐॐॐॐ

శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం/గుర్వాష్టకం

ॐॐॐॐॐॐॐॐ

1) శరీరం సురూపం తథా వా కళత్రం  యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే  తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్॥

మంచి దేహధారుడ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


2)కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం  గృహం బాంధవాః సర్వ మేతద్ద్విజాతం!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే  తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికి గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


3) షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా  కవిత్వాది గద్యం సుపద్యం కరోతి!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే  తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

ఆరు వేదాంగములు (శిక్ష, చందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య), నాలుగు వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


4) విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచారవృత్తేషు మత్తో న చాన్యః!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

విదేశాలలో మంచి పేరు, స్వదేశంలో హోదా పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


5) క్షమామండలే భూపభూపాలవృందౌ సదా సేవితం యస్య పాదారవిందమ్! 

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

గొప్ప రాజ్యానికి చక్రవర్తివైనా, రాజులు మహారాజుల చేత సేవింపబడుతున్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

6) యశో మే గతం దిక్షు దానప్రతాపాత్  జగద్వస్తు సర్వం కరే సత్ప్రసాదాత్!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

నీ ఖ్యాతి నలుదెశలా వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంచించినా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


7) న భోగే న యోగే న వా వాజిరాజౌ  న కాన్తాసుఖే నైవ విత్తేషు చిత్తం!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


8) అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

నీ మనస్సు అరణ్యమున ఉన్నా, ఇంట్లో ఉన్న, సమాన్య విషయములపై తిరుగుతూ ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


9) అనర్ఘ్యాణి రత్నాది ముక్తాని సమ్యక్  సమాలింగితా కామినీ యామినీషు!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు సదా నిన్ను అనిగమించే అంటిపెట్టుకునే భార్య ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


10) గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ !

లభేత్ వాంఛితార్థ పదం బ్రహ్మసంజ్ఞం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం ॥

ఫలశ్రుతి:-

ఎవరైతే ఈ గుర్వాష్టకాన్ని చెదువుతారో, నేర్చుకుంటారో, మననం చేస్తారో, గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో, అటువంటివారు యోగి అయినా, సన్యాసి అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్తు అయినా తనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.


సదాశివ సమారంభాం, శంకరాచార్య మధ్యమాం!

అస్మదాచార్య పర్యంతం, వందే గురు పరంపరాం!!


🕉🌞🌎🌙🌟🚩

శ్రీ ఆది శంకరుల విరచిత
!!..గౌరీదశకమ్..!!
                  
1) లీలారబ్ధస్థాపితలుప్తాఖిలోకాం లోకాతీతైర్యోగిభిరన్తశ్చిరమృగ్యామ్|
బాలాదిత్యశ్రెణిసమానద్యుతిపుంజాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

తన లీలచే సమస్తలోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలసూర్యసమూహము వంటి కాంతి మండలము కలదీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


2)ప్రత్యాహారధ్యానసమాధిస్థితిభాజాం నిత్యం చిత్తే నిర్వృతికాష్టాం కలయంతీమ్|
సత్యజ్ఞానానన్దమయీం తాం తనురూపాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

ప్రత్యాహారము-ధ్యానము-సమాధి అనుయోగముల నాచరించు యోగుల మనస్సునందు ఎల్లప్పుడు సంతోషమును కలిగించునదీ, సత్యము- జ్ఞానము- ఆనందములు స్వరూపముగా కలదీ, సూక్ష్మరూపమున్నదీ, పద్మములవంటి కన్నులు కలదీ,అగు జగదంబయైన గౌరీదేవిని నేనుస్తుతించుచున్నాను.


3) చన్ద్రాపీడానన్దితమన్దస్మితవక్త్రాం చన్ద్రాపీడాలంకృతనీలాలకశొభామ్|
ఇంద్రొపెంద్రాద్యర్చితపాదామ్బుజయుగ్మాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడేె||

చంద్రచూడుడగు శివునిచే ఆనందింపచేయబడిన చిరునవ్వు ముఖము కలదీ, తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ, ఇంద్రుడు- విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడు పాదపద్మములు కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


4) ఆదిక్షాన్తామక్షరమూర్త్యా విలసన్తీం భూతె భూతె భూతకదంబ ప్రసవిత్రీమ్|
శబ్దబ్రహ్మానందమయీం తాం తటిదాభాం గౌరీమంబామంబురుహాక్షీమహమీడే||

’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరములు తన స్వరూపముగా విలసిల్లుచున్నదీ, పంచమహాభూతములలో (భూమి- నీరు- గాలి- అగ్ని- ఆకాశము) ప్రతి దానియందు అనేక ప్రాణులను సృష్టించునదీ, శబ్దబ్రహ్మస్వరూపిణియైనదీ, ఆనందముతో నండినదీ మెరుపువలే ప్రకాశించునదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీ దేవిని నేను స్తుతించుచున్నాను.


5) మూలాధారాదుత్థితవీథ్యా విధిరన్ధ్రం సౌరం చాన్ద్రం వ్యాప్య విహారజ్వలితాఙ్గీమ్|
యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం గౌరీమంబామమ్బురుహాక్షీమహమీడే||

సుషుమ్నానాడీ మార్గము ద్వారా మూలాదారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు సూర్య చంద్రస్థానములైన ’ఇడా’ ’పింగళా’ నాడుల యందు విహారించు తేజోమూర్తియైనదీ, సూక్ష్మమైన పధార్థము కంటే సూక్ష్మమైనదీ, సుఖస్వరూపిణియైనదీ, పద్మముల వంటి కన్నుల కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని స్తుతించుచున్నాను.


6) నిత్యః శుద్ధో నిష్కల ఎకో జగదీశః సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ|
విశ్వత్రాణక్రీడనలోలాం శివపత్నీం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

నిత్యుడు- శుద్దుడు- పరిపూర్ణుడు- ఒక్కడు- జగదీశుడు అగు పరమేశ్వరుడు గౌరీదేవిని చేయు సృష్టి స్థితిలయలకు సాక్షి, ప్రపంచరక్షణము అను క్రీడయందు ఇష్టము కలదీ, శివుని భార్య యైనదీ, పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


7) యస్యాః కుక్షౌ లీనమఖణ్డం జగదణ్డం భూయోభూయః ప్రాదురభూదుత్థితమేవ|
పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరన్తీం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

గౌరీదేవి గర్భమునందున్న సమస్తలోకములు మరల మరల పుట్టుచుండును. లీనమగుచుండును. భర్తతో కలిసి వెండికొండపై విహరించునదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


8) యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా సూత్రే యద్వత్ క్వాపి చరం చాప్యచరం చ|
తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

చరాచరరూపమైన ఈ ప్రపంచమంతయు, దారము నందు మణులవలే గౌరీ దేవియందు అల్లుకుని ఉన్నది. అద్యాత్మజ్ఞానమార్గముచే తెలుసుకొనదగినదీ, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


9) నానాకారైః శక్తికదమ్బైర్భువనాని వాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా|
కల్యాణీం తాం కల్పలతామానతిభాజాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

గౌరీదేవి తాను ఒక్కతేగానే ఉండి శక్తివంతములైన నానారూపములతో లోకములనన్నిటినీ వ్యాపించి స్వేచ్చగా క్రీడించిచున్నది. కళ్యాణస్వరూపిణి, భక్తుల పాలిట కల్పలత, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

10) ఆశాపాశక్లేశవినాశం విదధానాం పాదామ్భోజధ్యానపరాణాం పురుషాణామ్|
ఈశామీశార్ధాఙ్గహరాం తామభిరామాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

తన పద్మములను ధ్యానించు మనుషులకు ఆశాపాశములవలన కలుగు బాధలను నశింపచేయునదీ, పరమశివుని అర్ధాంగి, పరమేశ్వరీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


11) ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా- ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరీదశకం యః|
వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం తశ్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి||

ఎవడైతే శుద్ధమైన హృదయమును కలవాడై భక్తితో ప్రాతఃకాలమునందు ఈ గౌరీ దశకమను స్తోత్రమును పఠించునో అతనికి వాక్సిద్దినీ, ఉన్నతమైన సంపదను, శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును.

॥ జయ జయ శంకర హర హర శంకర ॥     
                 

🕉🌞🌏🌙🌟🚩

శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
1)కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీవామభాగమ్ |

సదాశివం రుద్రమనంతరూపం చిదంబరేశం హృది భావయామి ||



2)వాచామతీతం ఫణిభూషణాంగం గణేశతాతం ధనదస్య మిత్రమ్ |

కందర్పనాశం కమలోత్పలాక్షం చిదంబరేశం హృది భావయామి ||



3)రమేశవంద్యం రజతాద్రినాథం శ్రీవామదేవం భవదుఃఖనాశమ్ |

రక్షాకరం రాక్షసపీడితానాం చిదంబరేశం హృది భావయామి ||



4)దేవాదిదేవం జగదేకనాథం దేవేశవంద్యం శశిఖండచూడమ్ |

గౌరీసమేతం కృతవిఘ్నదక్షం చిదంబరేశం హృది భావయామి ||



5)వేదాంతవేద్యం సురవైరివిఘ్నం శుభప్రదం భక్తిమదంతరాణామ్ |

కాలాంతకం శ్రీకరుణాకటాక్షం చిదంబరేశం హృది భావయామి ||



6)హేమాద్రిచాపం త్రిగుణాత్మభావం గుహాత్మజం వ్యాఘ్రపురీశమాద్యమ్ |

శ్మశానవాసం వృషవాహనస్థం చిదంబరేశం హృది భావయామి ||



7)ఆద్యంతశూన్యం త్రిపురారిమీశం నందీశముఖ్యస్తుతవైభవాఢ్యమ్ |

సమస్తదేవైః పరిపూజితాంఘ్రిం చిదంబరేశం హృది భావయామి ||



8)తమేవ భాంతం హ్యనుభాతిసర్వమనేకరూపం పరమార్థమేకమ్ |

పినాకపాణిం భవనాశహేతుం చిదంబరేశం హృది భావయామి ||



9)విశ్వేశ్వరం నిత్యమనంతమాద్యం త్రిలోచనం చంద్రకలావతంసమ్ |

పతిం పశూనాం హృది సన్నివిష్టం చిదంబరేశం హృది భావయామి ||



10)విశ్వాధికం విష్ణుముఖైరుపాస్యం త్రిలోచనం పంచముఖం ప్రసన్నం |

ఉమాపతిం పాపహరం ప్రశాంతం చిదంబరేశం హృది భావయామి ||



11)కర్పూరగాత్రం కమనీయనేత్రం కంసారిమిత్రం కమలేందువక్త్రమ్ |

కందర్పగాత్రం కమలేశమిత్రం చిదంబరేశం హృది భావయామి ||



12)విశాలనేత్రం పరిపూర్ణగాత్రం గౌరీకలత్రం హరిదంబరేశమ్ |

కుబేరమిత్రం జగతః పవిత్రం చిదంబరేశం హృది భావయామి ||



13)కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం కాంతాసమాక్రాంతనిజర్ధదేహమ్ |

కపర్దినం కామరిపుం పురారిం చిదంబరేశం హృది భావయామి ||



14)కల్పాంతకాలాహితచండనృత్తం సమస్తవేదాంతవచోనిగూఢమ్ |

అయుగ్మనేత్రం గిరిజాసహాయం చిదంబరేశం హృది భావయామి ||



15)దిగంబరం శంఖసితాల్పహాసం కపాలినం శూలినమప్రయేమ్ |

నాగాత్మజావక్త్రపయోజసూర్యం చిదంబరేశం హృది భావయామి ||



16)సదాశివం సత్పురుషైరనేకైః సదార్చితం సామశిరస్సుగీతమ్ |

వైయ్యాఘ్రచర్మాంబరముగ్రమీశం చిదంబరేశం హృది భావయామి ||



17)చిదంబరస్య స్తవనం పఠేద్యః ప్రదోషకాలేషు పుమాన్ స ధన్యః |

భోగానశేషాననుభూయ భూయః సాయుజ్యమప్యేతి చిదంబరస్య ||


ఇతి శ్రీచిదంబరేశ్వరస్తోత్రం సంపూర్ణమ్ ||

🕉🌞🌎🌙🌟🚩

భగవాన్, మహర్షి, స్వామి, అవధూత, జ్ఞాని, సద్గురు ... ఈ పదాలన్నీ బిరుదులు కాదు, అవి పరమేశ్వరునికి పర్యాయపదాలు.

నీవు 'రోగం' అని దేనినైతే అంటున్నావో,  నిజానికి అది కూడా "ఆత్మానుభవం"లో భాగమే.

శిష్యుడు:- అపరోక్షం అంటే?

గురువు:- తాను ఉంటేనే ప్రత్యక్షమైనా, పరోక్షమైనా ఉండేది.  కాబట్టి తానే 'అపరోక్షం'.


గురు స్తోత్రం~~గురు గీత నుండి
💫💫🌏🌙🌞💫💫
🕉ఓం శ్రీమాత్రే నమః 🕉

గురు గీతలో గురువును స్తుతించే స్తోత్రం ఒకటి ఉంది.  అది 29 శ్లోకములతో అలరారుతోంది. గురుసంప్రదాయంను  అనుసరిమచే వారు నిత్యం పఠించే యోగ్యమైన స్తోత్రము ఇది. ఇది అందరూ నిత్యము చదువుకుంటారని అశిస్తాను. నా మటుకు నాకు ఇది ఎంతో మానసిక శక్తిని ప్రసాధించిన అద్భుత స్తోత్రం.
ఇదిగో మీ కోసం.

1) గురు ర్బ్రహ్మా గురు ర్విష్ణుః గురు ర్దేవో మహేశ్వరః
గురు రేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః      58

2) అఙ్ఞాన తిమిరాంధస్య ఙ్ఞానాంఙన శలాకయా
చక్షు రున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః     59

3) అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః    60

4) స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరం
త్వత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః   61

5) చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం స చరాచరం
అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః     62

6) నిమిష న్నిమిషార్ధ్వాద్వా యద్వాక్యాదై విముచ్యతే
స్వాత్మానం శివ మాలోక్య తస్మై శ్రీ గురవే నమః    63

7) చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం
నాద బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః    64

8) నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవ చ వ్యాప్తం యేన జగత్సర్వం తస్మై శ్రీ గురవే నమః     65

9) స పితా స చ మే మాతా స బంధుః స చ దేవతా
సంసార మోహ నాశాయ తస్మై శ్రీ గురవే నమః      66

10) యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతి తత్
యదానందేన నందంతి తస్మై శ్రీ గురవే నమః    67

11) యస్మిన్స్థిత మిదం సర్వం భాతి యద్భాన రూపతః
ప్రియం పుత్రాది యత్ప్రీత్యా తస్మై శ్రీ గురవే నమః   68

12).యేనేదం దర్శితం తత్వం చిత్త చైత్యాదికం తథా
జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మై శ్రీ గురవే నమః   69

13) యస్య ఙ్ఞాన మిదం విశ్వం న దృశ్యం భిన్న బేధతః
సదైక రూప రూపాయ తస్మై శ్రీ గురవే నమః    70

14) యస్య ఙ్ఞాతం మతం తస్య మతం యస్య న వేదసః
అనన్య భావ భావాయ తస్మై శ్రీ గురవే నమః   71

15) యస్మై కారణ రూపాయ కార్య రూపేణ భాతి యత్
కార్య కారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః    72

16) నానారూపమిదం విశ్వం న కేనాప్యస్తి భిన్నతా
కార్య కారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః   73

17) ఙ్ఞాన శక్తి సమారూఢ తత్వ మాలా విభూషణే
భుక్తి ముక్తి ప్రదాత్రేచ తస్మై శ్రీ గురవే నమః   74

18) అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే
ఙ్ఞానానిల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః  75

19) శోషణం భవ సింధోశ్చ దీపనం క్షర సంపదాం
గురోః పాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః  76

20) న గురో రధికం తత్వం న గురో రధికం తపః
న గురో రధికం ఙ్ఞానం తస్మై శ్రీ గురవే నమః     77

21) మన్నాథః శ్శ్రీ జగన్నాథో మద్గురుః శ్రీ జగద్గురుః
మమాత్మా సర్వ భూతాత్మా తస్మై శ్రీ గురవే నమః   78

22) గురు రాది రనాదిశ్చ గురుః పరమ దైవతం
గురు మంత్ర సమో నాస్తి తస్మై శ్రీ గురవే నమః      79

23) ఏక ఏవ పరో బంధుః విషమే సముపస్థితే
గురుః సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః       80

24) గురు మధ్యే స్థితం విశ్వం విశ్వ మధ్యే స్థితో గురుః
గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః    81

25) భవారణ్య ప్రవిష్టస్య దిఙ్ఞ్మోహ భ్రాంత చేతసః
యేన సందర్శితః పంథాః తస్మై శ్రీ గురవే నమః  82

26) తాపత్రయాగ్ని తప్తానా మశాంత ప్రాణినాం భువి
యస్య పాదోదకం గంగా తస్మై శ్రీ గురవే నమః     83

27) అఙ్ఞాన సర్ప దష్టానాం ప్రాణినాం కశ్చికిత్సకః
సమ్యక్ ఙ్ఞాన మహా మంత్ర వేదినం సద్గురు వినా  84

28) హేతవే జగతా మేవ సంసారార్ణవ సేతవే
ప్రభవే సర్వ విద్యానాం శంభవే గురవే నమః      85

29)ధ్యాన మూలం గురో ర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్ర మూలం గురో ర్వాక్యం ముక్తి మూలం గురోః కృపా   86.

🚩🔔🚩🔔🚩🔔🚩

శ్రీ శంకరాచార్య స్తవః(శ్రీశంకరాచార్యవర్యం)


1) సర్వలోకైక వంద్యం భజే దేశికేంద్రమ్ |

ధర్మప్రచారేఽతిదక్షం యోగిగోవిందపాదాప్తసన్యాసదీక్షమ్ |

దుర్వాదిగర్వాపనోదం పద్మపాదాది శిష్యాలిసంసేవ్యపాదమ్ ||


2)శంకాద్రిదంభోలి లీలం కింకరాశేష శిష్యాలి సంత్రాణశీలమ్ |

బాలార్కనీకాశ చేలం బోధితాశేష వేదాంత గూఢార్థజాలమ్ ||


రుద్రాక్షమాలా విభూషం చంద్రమౌలీశ్వరారాధనావాప్తతోషమ్ |

విద్రావితాశేషదోషం భద్రపూగప్రదం భక్తలోకస్య నిత్యమ్ ||


4) పాపాట వీచిత్రభానుం జ్ఞానదీపేన హార్దం తమో వారయంతమ్ |

ద్వైపాయన ప్రీతిభాజం సర్వతా పాపహామోఘబోధప్రదం తమ్ ||


5) రాజాధిరాజాభి పూజ్యం రమ్య శృంగాద్రివాసైక లోలం యతీడ్యమ్ |

రాకేందు సంకాశవక్త్రం రత్నగర్భేభవక్త్రాంఘ్రిపూజానురక్తమ్ ||


6)శ్రీభారతీతీర్థ గీతం శంకరార్యస్తవం యః పఠేద్భక్తియుక్తః |

సోఽవాప్నుయాత్సర్వమిష్టం శంకరాచార్యవర్యప్రసాదేన తూర్ణమ్ ||


ఇతి శ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి కృత శ్రీ శంకరాచార్య స్తవః ||

🕉🌞🌏🌙🌟🚩

Om Namaha Shivaya:
శ్రీమచ్చంకరాచార్య విరచిత శ్రీ సద్గురు పాదుకా స్తవము

1) శ్లో|| శ్రీ సమంచిత మవ్యయం పరమ ప్రకాశ మగోచరం|

  భేద వర్జిత మప్రమేయ మనన్త మాద్య మకల్మషం||

  నిర్మలం నిగమాన్త మద్వయ మప్రతర్క్య మబోధకం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||



 2)శ్లో|| నాదబిన్దు కళాత్మకం దశనాద భేద వినోదకం|

  మంత్రరాజ విరాజితం నిజమండలాంతర భాసితం||

  పంచవర్ణ మఖండ మద్భుత మాదికారణ మచ్యుతం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||



 3)శ్లో|| వ్యోమ వద్బహిరన్తరస్థిత మక్షరం నిఖిలాత్మకం|

  కేవలం పరిశుద్ధ మేక మజన్మహి ప్రతి రూపకమ్‌||

       బ్రహ్మతత్త్వ వినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం|| 



 4)శ్లో|| బుద్ధిరూప మబుద్ధికం త్రితయైక కూట నివాసినం|

  నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకమ్‌||

  పశ్చిమాన్తర ఖేలనం నిజశుద్ధ సంయమి గోచరం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||  



 5)శ్లో|| హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం|

  నీల మధ్య సునీల సన్నిభ మాది బిన్దు నిజాం శుకమ్‌||

  సూక్ష్మ కర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం|| 



 6)శ్లో|| పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం|

  పంచభూత సకామ షట్క సవిూర శబ్ద ముఖేతరమ్‌||

  పంచ కోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||



 7)శ్లో|| పంచ ముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం|

  విద్యుదాది ధగద్ధగిత్వ రుచిర్వినోద వివర్థనమ్‌||

  చిన్ముఖాన్తర వర్తినం విలసద్విలాస మమాయకం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||



 8)శ్లో|| పంచ వర్ణ రుచిర్విచిత్ర విశుద్ధ తత్త్వ విచారణం|

  చంద్ర సూర్య చిదగ్ని మండల మండితం ఘన చిన్మయం||

  చిత్కళా పరిపూర్ణ మంతర చిత్‌ సమాధి నిరీక్షణం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం|| 



 9)శ్లో|| హంసచార మఖణ్డనాద మనేక వర్ణ మరూపకం|

  శబ్ద జాలమయం చరాచర జన్తు దేహ నివాసినమ్‌||

  చక్రరాజ మనాహతోద్భవ మేక వర్ణ మతః పరం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||                                   


 10)శ్లో|| జన్మకర్మ విలీన కారణ హేతుభూత మభూతకం|

  జన్మకర్మ నివారకం రుచి పూరకం భవతారకం||

  నామరూప వివర్జితం నిజ నాయకం శుభదాయకం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||



 11)శ్లో|| తప్తకాంచన దీప్యమాన మహాణు మాత్ర మరూపకం|

  చన్ద్రికాన్తర తారకైరవ ముజ్జ్వలం పరమాస్పదమ్‌||

  నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||



 12)శ్లో|| స్థూల సూక్ష్మ సకారణాన్తర ఖేలనం పరిపాలనం|

  విశ్వతైజస ప్రాజ్ఞచేతస మన్తరాత్మ నిజాంశుకమ్‌||

  సర్వకారణ మీశ్వరం నిటలాన్తరాళ విహారకమ్‌|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||

     
      ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచిత శ్రీమద్గురు పాదుకాస్తవ స్సంపూర్ణం.

🕉🌞🌎🌙🌟🚩

వేదవ్యాసుడు - వ్యాసపూర్ణిమ - గురుపూర్ణిమ
ॐॐॐॐॐॐॐॐॐॐ

వేదవ్యాసుడు: వేదవ్యాసుడు సత్యవతీ పరాశరుల పుత్రుడు. వశిష్టుని మునిమనుమడు. ఇతనికే కృష్ణ ద్వైపా యనుడు, బాదరాయణుడు అని కూడ పేర్లు. యమునా నదీ ద్వీపంలో కృష్ణ(నల్లని) వర్ణంతో జన్మించినాడు గావున కృష్ణద్వైపాయనుడని పిలువబడినాడు. ప్రపంచ వాజ్మయంలోనే ఇతనికి సమానమైన విద్వాంసుడు మనకు గోచరించడు. అందుకే "వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం” అని లోకోక్తి.


వ్యాసుడు వేదవాజ్మయాన్ని లోతుగా అధ్యయనం చేసి పలువురికి ఉపయోగ పడునట్లు క్రమపద్ధతిలో సవరణలు, విభజనలు గావించి ప్రసరింపచేసినాడు అంటే వేదాలను విన్యాసమొనర్చినాడు కాబట్టి వేదవ్యాసుడన్నారు. శ్రీకృష్ణుడు “మునీనాం అప్యహం వ్యాసః” అనగా మునులలో నేను వేదవ్యాసుడను అని గీతలో అన్నాడు. వ్యాసుడు తన శిష్యులలో పైలునకు ఋగ్వేదమును, వైశంపాయనునకు యజుర్వేదమును జైమినికి సామవేదమును, సుమంతునకు అధర్వవేదమును అప్పగించి లోకమున ప్రసరింపజేసినాడు. వీరు వేదములను పరిరక్షించారు. అందుకే ప్రతి హిందువు నిత్యం వీరికి జలాంజలి సమర్పించాలి.


వేదవ్యాసుడు తత్త్వజ్ఞానం విద్వాంసుల వద్ద మాత్రమే ఉండడం సముచితం కాదు. అది సార్వజనికం కావాలి, సామాన్య జనుల వద్దకు వెళ్ళాలి అనే ఆలోచనలో కథల రూపంలో అష్టాదశ పురాణాలను రచించి ప్రజలకు ఉత్తమ మార్గదర్శనం లోకానికి మహోపకార మొనర్చినాడు. వీటిలోని భాగవత పురాణం చిత్తశాంతిని కలిగిస్తుంది. పంచమ వేదం వంటి మహాభారత గ్రంథాన్ని రచించి ఒక ఇతిహాస కారకుడుగా, చారిత్రకుడుగా, ఆధ్యాత్మికవేత్తగా, ఆర్థికవేత్తగా, రాజనీతివేత్తగా లోకప్రసిద్ధి వేదవ్యాసుడు పరిపూర్ణతత్త్వజ్ఞానంతో బ్రహ్మసూత్రములను రచించాడు. నాలుగు అధ్యాయాలు, పదహారు పాదాలు ఐదువందల యాభై సూత్రాలు. వాటిలో విశ్వంలోని ఏ యొక్క తాత్త్విక విచారధారను

విడిచిపెట్టకుండా ఆత్మ-అనాత్మల విషయంతో సహా సరళ సుందర శైలిలో చర్చించి తత్త్వోపదేశం చేశాడు.


లక్క ఇంటినుండి తప్పించుకొని వెళ్ళుచున్న పాండవులకు వ్యాసుడు కనిపించి ధర్మమును పాటింపుమని హితవులు చెప్పి ధర్మపక్షమైన పాండవపక్షం వెనుక ద్రుపద మహారాజు ప్రచండశక్తి ఉండాలనే భావనతో అర్జునుని ద్రౌపదీ స్వయంవరానికి పంపిచేను పంచపాండవుల పత్నిగా నిర్ణయించాడు. "వ్యాసుడు చెప్పాడంటే అడిగేదేముంది? అది యోగ్యమైనది ధర్మబద్ధమైనదే అయి ఉంటుంది" అని ప్రజలు భావించేలా సమాజాన్ని ప్రభావితం చేసినాడు. వ్యాసుడు చేసిన పని సరైనదే అనే సామాజిక దృఢనిశ్చయాన్ని కలిగించాడు.


వేదవ్యాసుడు మేరునగముపై శివుని గూర్చి తపస్సుచేసి రాగాతీతుడైన పుత్రునిపొందాడు. అతడే శుకమహర్షి వ్యాసుడు కాశీపట్టణంలో నివసించు చునప్పుడు ఒక సారి ఏ ఇంటను భిక్ష లభించకపోవుటచే కాశీపట్టణమును శపించబోగా పార్వతి అడ్డుపడి అతని క్షుద్బాధతీర్చి కాశీ బహిష్కరణ గావించింది. ఎంతటి వారైనను చేసిన తప్పునకు శిక్ష అనుభవింపక తప్పదు కదా!.


వ్యాసుడనునది ఒక్కని పేరు కాదు. అది యొక వ్యవస్థ అది యొక పీఠము, ద్వాపర యుగమందు ఆర్ష విద్యా ధర్మము లొకొక్కనిచే విస్తరింపబడుతుంటాయి, ద్వాపరమున స్వయంభువు, ద్వితీయ ద్వాపరమున ప్రజాపతి వ్యాసులైనారు, పక్షుడు, బృహస్పతి, వసిష్ఠుడు, త్రివరుడు, మొదలగువారు వ్యాసులై ఆ స్థానమనలంకరించి వేద ప్రసార ధర్మమును నిర్వహించినారు. ఇప్పుడు మనం చదుకుంటున్న ఈ పరాశర పుత్రుడు ఇరువది యేడవ వ్యాసుడుగ లోక ప్రసిద్ధుడు. అలరించిన రోజునే మనం వ్యాసపూర్ణిమగ గురుపూర్ణిమగ స్మరించుకుంటాం. మానసపుత్రుడైన అపాంతరతముడను వాడే ఈ వేదవ్యాసులుగా అవతార మెత్తినాడు. అందుకే వ్యాసుడు సామాన్య మానవుడు కాడు. వ్యాసపీఠము వాజ్మయ పఠనీయ దేవతా పీఠము. దాని నుండి తత్త్వజ్ఞానము, వ్యాసుని బుద్ధి మరియు గణపతి కలములనే త్రివేణీ సంగమము నుండి జాలువారిన ఆర్షవాజ్మయ జలధార. దీన్ని అధ్యయనం చేసి ఆచరణలో పెట్టుటతో మనం పునీతులం కావాలి.


అచతుర్వదనో బ్రహ్మ | ద్విబాహు రపరోహరి:

అఫాలలోచనః శంభుః ! భగవాన్ బాదరాయణః!

నాల్గుముఖములు లేనప్పటికిని బ్రహ్మ వంటివాడు, నాలుభుజములకు బదులు రెండు భుజములు కలిగినట్టి విష్ణువు వంటివాడు. లలాటమునందు నేత్రం లేనప్పటికిని సాక్షాత్తు శివుని వంటివాడు ఈ భగవాన్ బాదరాయణుడు మనమంతా ధర్మమార్గంలో పయనించడమే వారికి మనం సమర్పించే వందనం.


ఓం నమో పరమాత్మయే నమః

భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి.


 గురుసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు (శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.


ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు(అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు). మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యుల యొక్క ఆయుషును(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు.


 ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు. వాటిని తన నలుగురు శిష్యులకు ఉపదేశించి ప్రచారం చేయమని ఆదేశించారు. వేదాన్ని అర్ధం చేసుకోవడం కష్టమని, అందరికి అర్దమయ్యే విధంగా వేద సారం మొత్తాన్ని అష్టాదశ(18) పురాణాల్లోనూ, ఉపపురాణాల్లోనూ నిక్షిప్తం చేశారు. బ్రహ్మసూత్రాలను రచించారు. పంచమవేదంగా ప్రసిద్ధిచెందిన మహాభారతాన్ని వినాయకుడి సాయంతో గ్రంధస్థం చేశారు. ధర్మాచరణలో వేదమే ప్రామాణికం. మన సంస్కృతికి ఆది, పూనాది వేదమే. అటువంటి వేదాన్ని నాలుగుగా విభజించి, లోకానికి ఎంతో ఉపకారం చేసిన వేదవ్యాస మహర్షికి కృతజ్ఞతగా ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమగా, వ్యాసపూర్ణిమగా జరుపుకుంటాం.


వ్యాసమహర్షి తనకు పరంపరాగతంగా వస్తున్న విద్యను తన పుత్రుడైన శుకమహర్షికి ఉపదేశించాడు.


 శుకమహర్షి గౌడపాదాచార్యులవారికి, ఆయన గోవిందపాదాచార్యులవారికి, గోవిందపాదులు శ్రి శంకరాచార్యులవారికి ఉపదేశించారు. వైదిక సంస్కృతిని బౌద్ధ, చార్వాక, జైన మతాలు అంతం చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు కైలాస శంకరుడే ఆదిశంకరాచరుడిగా అవతరించాడు. శ్రీ శంకరాచార్యులవారు దైవ, ఋషి పరంపరగా వస్తున్న ఈ మహాద్భుత జ్ఞానాన్ని తన నలుగురు శిష్యులైన పద్మపాదాచార్యులు, హస్తమలకాచార్యులు, తోటకాచార్యులు, సురేశ్వరాచార్యులవారికి ఉపదేశించారు. వైదిక సంస్కృతిని పునరుద్దరించారు.


ఆత్మ జ్ఞానమైన, బ్రహ్మజ్ఞానమైన, వేదమైన, ఎటువంటి జ్ఞానమైన ఆధునిక కాలంలో కొత్తగా తెలుసుకుని/కనిపెట్టి చెప్పినవారు లేరు. నారాయణుడి దగ్గరినుండి పరంపరగా వస్తున్న జ్ఞానాన్ని, ఏదైతే వ్యాసుడి చేత చెప్పబడిందో, అది మాత్రమే చెప్తారు. వ్యాసుడి చెప్పినదానికి భిన్నంగా ఏది చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అది ఆమోదయోగ్యం కాదు. ఎంతో పురాతనమైన, సనాతమైన ఈ సంపద మనకు అందడంలో ముఖ్యపాత్ర పోషించిన వ్యాసమహర్షిని మన గురువులలో చూసుకుని ఆరాధించడమే గురు పూర్ణిమ.


వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాస రూపాయ విష్ణవే!

గురు అనే శబ్దానికి చీకటిని పోగెట్టేవాడు అని కూడా అర్థము ఉంది.
చీకటి అఙ్ఞానాన్ని పోగొట్టి ఙ్ఞానం అనే వెలుతురు చూపించే గురువుకి నేను నమస్కరిస్తున్నాను.

🕉🌞🌏🌙🌟🚩

🌝గురు పౌర్ణమి🌝  
🕉🌞🌎🌙🌟🚩

ఇంద్రాది దేవతల్ ఇష్టాన గొలువగా
             నయమైన రూపమ్ము నభము వెలిగె

కృత్తికా సంయోగ కేళిలో  ధృతినొంది
              కాంతులు విరజిమ్మె కలువరేడు

ధవళ వర్ణము నంత దండిగా పొడి జేసి 
               చిలకరించిన భంగి చిందుచుండె

పున్నమి వెల్గుల పుడమంత పులకించ 
                అమృత తరంగిణి యవని బారె

అవని జేరిన అందాల యంబుజుండు
కార్తికపు మాస దీపాల కాంతి గాంచి
తనను మించిన సౌందర్య దౌరు చూసి
సిగ్గుతోడగ తలవంచి చిన్న బోయె

ॐॐॐॐॐॐॐॐॐॐ

రచన:- మల్లేపల్లి ప్రమోద్ కుమార్ 
గానం:- శ్రీమతి బాల సుజాత గారు

🕉🌞🌎🌙🌟🚩

28, జూన్ 2020, ఆదివారం



చెప్పు చుండెను మల్లాప్రగడ కథేల ?



శ్రీ కృష్ణ మందారము(7)
తేట గీతి పద్యాలు 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

వట్టి మనిషిగా పుట్టించి ఒప్పు తల్లి 
గట్టి మాటల ప్రేమతో బతకు తల్లి 
గడ్డి పరకగా పుట్టించి మూగ జీవి 
మట్టి మనిషిగా పుట్టించె  లోకమాయ 

సప్త సాగర సతతంబు నీదు శక్తి
సప్త పర్వత సతతంబు నీదు శక్తి
సప్త మారుత సతతంబు నీదు శక్తి
సప్త స్వరము లందించు తల్లి శక్తి 

 కీర్తి చరితంబు  లోకము లందు వెలుగు 
 శక్తి వినయంబు లోకము లందు వెలుగు 
 తృప్తి తరుణంబు లోకము లందు వెలుగు 
 దివ్య చరణంబు లోకము లందు రక్ష 

ఏడు రంగుల వేడుక జూపు వెలుగు 
ఏడు శక్తులు ఏకము జూపు వెలుగు 
ఏడు కొండలు వేడుక జేపు వెలుగు 
నిత్య సత్యము పల్కెటి తల్లి వెలుగు 

వేణు నాదమ్ము మాధుర్యం ప్రేమ వెలుగు 
ప్రేమ సాహిత్య మాధుర్యం కాల తలపు 
కాల సౌందర్య మాధుర్యం సేవ తెలుపు 
సేవ కారుణ్య మాధుర్యం తల్లి జరుపు
--(())--


Download Chaganti Pravachanalu Google Play softwares - awsp19zEazvP ...
గురుదేవులు, మన మార్గ దర్శకులు, వాచస్పతి బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వరరావు శర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...

చాగంటి పలుకులు వెలలేని భాగ్యమ్ము 
దిశలెల్ల దీప్తి0చు తెలుగు వెలుగు   
మహిమాన్వితంబైన వాక్ధాటి  శక్తితొ  
భారత గాథలు తెలుపు వెలుగు 
కమనీయమౌ నీదుకారుణ్య లీలలన్,
పరమాత్మ భక్తితొ తెల్పు వెలుగు 
సంతోష మొసెగెడు శాంతి చేకూర్చేటి 
భారతరామాయణ కధ గీత వెలుగు  

ఎవరి కెవ్వరు బంధము తెల్పలేము 
తెలుగు వెల్గును పంచుట లక్ష్యమేగ 
భరత ఖండము వాక్ధాటి మరువలేదు 
తెల్పుచుండెను మల్లాప్రగడ మనస్సు  
--(())--


Oviyar K MADHAVAN ( 1906 - 1977 ) One of the Great Indian Artists and One of My Inspiration Artists in South India and Tamil Nadu - Artist Anikartick,Chennai,India
జీవన సత్యం 
సీసపద్యము 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

అనురాగ ఆనంద కారుణ్య విక్షనల్ 
జీవితం లో ఏసమయయము నైన  
వెలలేని యానంద- అక్రమ సంపదల్
మురిపించు సౌఖ్యపు సృష్టి చూడు  
సరిలేని సౌందర్య-సద్గుణ తేజముల్
కళలను కల్లోల మవును చూడు 
ఎనలేని నిర్వేద-వృష్ణినిన్ జల్లార్చి
ప్రేమను పొందియు పంచు చుండు 

సిరులు నాదిక్కు నామొక్కు-నీవె తండ్రి.!
కళలు  నాజన్మ భాగ్యంబు-నీవె తల్లి !
ప్రభలు నాయాత్మ బంధువు-నీవె గుర్వు !
చెప్పు చుండెను మల్లాప్రగడ మనస్సు   

--(())--

శృంగారం (అందం )
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
సీస పద్యము  

ఐస్వర్యకాంక్షతో నారట పడనేల? 
పెదవుల కాంక్షల పెరగ నేల?  
విషయలోలుండవై వెఱ్ఱినై పోనేల?
అద్దమ్ము ఆడది భద్ర మేల? 
పంచేద్రియమ్ముల-వలజిక్కి పోనేల?
పరువము భద్రత కోరు టేల ?  
సిరులకు మహిళకు మోహమ్ము మారుటేల?   
చీకటి వెలుగులు మార్పు టేల ?   

చురుకు మాటల్లో చురకలు పెరుగు చుండు 
కరకు మాటల్లో దడదడ పుట్టుచుండు    
కళల కులుకులు వణకును పుట్టు చుండు 
చెప్పు చుండెను మల్లాప్రగడ కథేల ? ....6 

--(())--

ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు 
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 
గురువు 
సీస పద్యము 

యువతను విశ్వవిజేతలు గామార్చి 
వినయము నేర్పే టి గురువు యుక్తి 
ధైర్యము తోకార్యము జయమును తెప్పించు 
విద్యయు సహనము నేర్పు గురువు 
నిన్ను నీవు పరిపూర్ణడవని అనుకోకు
దేశకుటుంబము రక్షనీవు
శాస్త్రవాక్యములను నమ్మక ములను 
విశ్వాసము తెలిపేటి గురువు బోధ

సాస్త్ర వాక్కు నందు నిజాన్ని గమనించు
యువత విద్య యందు మునిగి ఉండు
నేర్చుకున్న విద్య సద్విని యోగము 
చేసె బుధ్ధి గురువు చెప్పు విద్య ....  5
--(())--

సీస పద్యము 

యువతకు సాధ్యము అనుకుంటె ఆగదు
చెరగని చిరునవ్వు వెంట ఉండు
బండరాయి నయిన మార్చేటి మనసు 
కలిగిన యువతకు తోడు ఉండు
దీక్షతో సంకల్ప దృష్టితో విద్యాస
హాయము వల్లనే నేర్పు చూపె
తల్లి తండ్రుల వినయ వీధిలో యువతకు 
ప్రత్యేక రక్షణ చూపు చుండు

యువత భావాలు ఎప్పుడు స్నేహ ముంచు
కధలు చెప్పియు గొప్పలు చెప్ప కుండు
ప్రేమ సయ్యాట మోదలి లాలి పాడు
కలుషిత మనసు కానట్టి బాల కృష్ణ .......   4
--())) - -


సీసము
ఇప్పుడు వెతకాలి గుండెలోతుల్లోకి
బర్వైన భాష్ప బిందువుల విలువ
కనుగుడ్లు రక్షగా రెప్పలు ఉన్నాయి
కళ్లలో నీటిని తుడుపు ఏది
కన్నీటి సంద్రము యీదక తప్పదు
గమనించ బడలేక  మునక లేస్తు
హృదయంతో  ప్రేమను పంచియు ఆశలు 
తీర్చినా మిగిలిన రక్త చలువ

దిమ్మ తిరిగి చెమట పట్టించే టట్లున్న
శ్వాస విలువ తెలిసి కొనియు మనసు 
విప్పి పల్కు నేర్పు చూపిన కన్నీరు
పొంగు తుంది మార్గ మేది కృష్ణ... 3
--(()) - - 

సీస పద్యము 

చల్లని వెన్నల సవ్వడి గాలుల 
ఆకుల కదలిక హాయి నొసగి 
జాజుల ఘమఘమ వాసనకు పరవస 
మోందియు సుమధర హాస మోంది 
విరిసిన నవ్వులు అలలుగ ఎగసినే
మనసును దోచెను తృప్తి కొరకు
గాజులు గలగల మోహము పెంచెను
రాధిక హృద్యమే కృష్ణ చేరె

చిలిపి పనులకు తహతహ చెందు చుండె
వలపు తలపుకు కలియుట ప్రోత్స హించె
కులుకు చూపుల వలలో కి చిక్కి యుండె
కరుణ తోరాధ కృష్ణుల ప్రేమ లీల.... 2

--(())--

సీసము 
కాలాన్ని కరగించు ఆకలి కోర్కయు 
దాహాన్ని తీర్చేటి శక్తి నీకె
వేణు గానముతొ మనసులను రంజిల్ల
పరచుట సత్యపు కృష్ణ లీల
మురిసి ముచ్చట సరసపు సుమ శృంగార
రసమయి కృపధర కృష్ణ లీల
ముద్దుగా ముది తను ప్రేమించి వలపును
పంచేటి సౌందర్య కృష్ణ లీల

 ఆటవెలది 
ప్రేమ పంచి సౌఖ్య మందించు గోపాల
విశ్వ ధాత్రి సామ  వేద కర్త
స్నేహ మధుర భావ కల్పనా చాతుర్య
సర్వ మాయ సృష్టి కర్త తేజ....  1
--(()) - -