5, మార్చి 2024, మంగళవారం

 నేటి ప్రాంజలి ప్రభ.. దేవీ.. శ్రీదేవీ.. వృత్త మాల

ప్రతిరోజు చందస్సు గణాలు పొందు పరిచేద
గురువులు పండితులు వ్రాయగలరని ఆశిస్తూ..05/03..
***
Pranjali Prabha  వృత్త మాల
మాత్రా శ్రేణి..ర స య త త గ గ.. యతి.. 10

ధైర్య సాహసమేను విద్యాదైవమ్ము తోడ్పాటు గానే
సౌర్య వంతుడుగాను దేశా సౌఖ్యమ్ము ధర్మమ్ము గానే
ఆర్యపుత్రుడుగాను సత్యా ఆధ్యాత్మ మార్గమ్ము గానే
కార్య సిద్ధివలే సహాయమ్ కారుణ్య భావమ్ము దేవీ

నాకు విద్యల వెల్లువే ధ్యానా సత్య దారామృతమ్మే
లోకమందున ధైర్యపుణ్యశ్లోకాలు వళ్లించ లక్ష్య
మ్మే కళా మది మోక్ష ధర్మమ్మే నీతి సామర్ధ్య మూర్తిన్
చాక చక్యము జూపి సంసారం క్రాంతి నిచ్చేటి దేవీ

కాల నిర్ణయమే సవిద్యా కామ్యమ్ము కర్తవ్య దీక్షా
జ్వాల దేశమునందు దుష్టా జాడ్యమ్ము తర్మేటి శిక్షా
పాలకుండును సర్వ రాష్ట్రా పాఠ్యమ్ము తెల్పేటి రక్షా
వేళ మీరక సత్య సేవా విద్యా గాపాడుమా తల్లి దేవీ

మన్ననే మదివాక్కు సాధ్యా మాధుర్య సామ్మోహ సేవా
మన్నికై సహనమ్ము జూపే మంగళ్య బంధమ్ము సేవా
ఉన్న మార్గము నమ్మి జేసే యోనత్య లక్ష్యమ్ము సేవా
కన్న వారితొ జూపు ప్రేమ కర్తవ్య సర్వమ్ము దేవీ

ధ్యాన మార్గము నెంచి నిష్టా ధ్యాసా మహా ప్ర్రార్ధ నౌనే
మౌన లక్ష్యము గాను దాస్యంమౌ భక్తి సామాన్య మౌనే
మాన ప్రాణము విశ్వ కళ్యాణా ధ్యాన దారుడ్య మౌనే
వాన తీర్ధము పారమార్ధం వ్యాసార్ధమే ప్రేమ దేవీ

ఆకరమ్ములు సర్వ రక్షా సాధ్యా సమానమ్ము గానే
భీకరమ్ముల విద్య తోడై పూర్ణత్వ దాహమ్ము గానే
శ్రీకరమ్ముల నేస్తమే సు శ్రీలన్ సు బంధుత్వ మేనే
నీకరమ్ములు శ్రీకరమ్ముల్ నీ సాటి లేరమ్మ దేవీ

సామ్యమే చరితమ్ము సాధ్యా సామర్ధ్య సాంగత్యమేలే
కామ్య యున్నతినెంచ నిత్యా కర్తవ్య దాతృత్వ మేలే
రమ్యతే విషయమ్ము చాతుర్యమ్మేను మాటల్లు మేలే
సౌమ్యమే సహనమ్ము గానే సౌసీల్య బంధమ్ము దేవీ

కోరు కోకయు వచ్చి పోయే కోలాట బుద్దుల్ గ నేలే
చేరు వేయగు దుఃఖ మోనే చింతల్లొ చేష్టల్ గ నేలే
మారు పోకడ వచ్చిజేరే మానమ్ము  సౌఖ్యం గ నేలే
పారు నీదయ ధర్మ మౌనే పాఠమ్ము దీనమ్ము దేవీ

లోక శోకవినాశ కార్యా లోలా నతుల్ దివ్య వాణీ
నేకమౌ కళజూప సత్యా నీడా గతుల్ భవ్య వాణీ
స్వీకరమ్మగు లక్ష్య మార్గా స్వీకర్త బాంధవ్య వాణీ
శ్రీకరా భవ బంధ హృద్యా శ్వేత ప్రభా పూర్ణ దేవీ

నేటి ప్రాంజలి ప్రభ.. దేవీ.. శ్రీదేవీ.. వృత్త మాల
ప్రతిరోజు చందస్సు గణాలు పొందు పరిచేద
గురువులు పండితులు వ్రాయగలరని ఆశిస్తూ..05/03..
***
Pranjali Prabha  వృత్త మాల
మాత్రా శ్రేణి..ర స య త త గ గ.. యతి.. 10

ధైర్య సాహసమేను విద్యాదైవమ్ము తోడ్పాటు గానే
సౌర్య వంతుడుగాను దేశా సౌఖ్యమ్ము ధర్మమ్ము గానే
ఆర్యపుత్రుడుగాను సత్యా ఆధ్యాత్మ మార్గమ్ము గానే
కార్య సిద్ధివలే సహాయమ్ కారుణ్య భావమ్ము దేవీ

నాకు విద్యల వెల్లువే ధ్యానా సత్య దారామృతమ్మే
లోకమందున ధైర్యపుణ్యశ్లోకాలు వళ్లించ లక్ష్య
మ్మే కళా మది మోక్ష ధర్మమ్మే నీతి సామర్ధ్య మూర్తిన్
చాక చక్యము జూపి సంసారం క్రాంతి నిచ్చేటి దేవీ

కాల నిర్ణయమే సవిద్యా కామ్యమ్ము కర్తవ్య దీక్షా
జ్వాల దేశమునందు దుష్టా జాడ్యమ్ము తర్మేటి శిక్షా
పాలకుండును సర్వ రాష్ట్రా పాఠ్యమ్ము తెల్పేటి రక్షా
వేళ మీరక సత్య సేవా విద్యా గాపాడుమా తల్లి దేవీ

మన్ననే మదివాక్కు సాధ్యా మాధుర్య సామ్మోహ సేవా
మన్నికై సహనమ్ము జూపే మంగళ్య బంధమ్ము సేవా
ఉన్న మార్గము నమ్మి జేసే యోనత్య లక్ష్యమ్ము సేవా
కన్న వారితొ జూపు ప్రేమ కర్తవ్య సర్వమ్ము దేవీ

ధ్యాన మార్గము నెంచి నిష్టా ధ్యాసా మహా ప్ర్రార్ధ నౌనే
మౌన లక్ష్యము గాను దాస్యంమౌ భక్తి సామాన్య మౌనే
మాన ప్రాణము విశ్వ కళ్యాణా ధ్యాన దారుడ్య మౌనే
వాన తీర్ధము పారమార్ధం వ్యాసార్ధమే ప్రేమ దేవీ

ఆకరమ్ములు సర్వ రక్షా సాధ్యా సమానమ్ము గానే
భీకరమ్ముల విద్య తోడై పూర్ణత్వ దాహమ్ము గానే
శ్రీకరమ్ముల నేస్తమే సు శ్రీలన్ సు బంధుత్వ మేనే
నీకరమ్ములు శ్రీకరమ్ముల్ నీ సాటి లేరమ్మ దేవీ

సామ్యమే చరితమ్ము సాధ్యా సామర్ధ్య సాంగత్యమేలే
కామ్య యున్నతినెంచ నిత్యా కర్తవ్య దాతృత్వ మేలే
రమ్యతే విషయమ్ము చాతుర్యమ్మేను మాటల్లు మేలే
సౌమ్యమే సహనమ్ము గానే సౌసీల్య బంధమ్ము దేవీ

కోరు కోకయు వచ్చి పోయే కోలాట బుద్దుల్ గ నేలే
చేరు వేయగు దుఃఖ మోనే చింతల్లొ చేష్టల్ గ నేలే
మారు పోకడ వచ్చిజేరే మానమ్ము  సౌఖ్యం గ నేలే
పారు నీదయ ధర్మ మౌనే పాఠమ్ము దీనమ్ము దేవీ

లోక శోకవినాశ కార్యా లోలా నతుల్ దివ్య వాణీ
నేకమౌ కళజూప సత్యా నీడా గతుల్ భవ్య వాణీ
స్వీకరమ్మగు లక్ష్య మార్గా స్వీకర్త బాంధవ్య వాణీ
శ్రీకరా భవ బంధ హృద్యా శ్వేత ప్రభా పూర్ణ దేవీ


విన్న పాలను విన్న వించ విఘ్నాలు మాపేటి దేవీ

కన్న వారికి మంచి చేయు కాసేటి మోసేటి దేవీ

****


మల్లాప్రగడ రామకృష్ణ

అంశం.. మనసు

6-3-2024


విన్న పాలను విన్న వించ విఘ్నాలు మాపేటి దేవీ

కన్న వారికి మంచి చేయు కాసేటి మోసేటి దేవీ

వెన్న ముద్దలు ఆరగించు వేనోళ్ల మొక్కేటి దేవీ

 వెన్నెలై దయ చూప గల్గు విశ్వాన్ని యేలేటి దేవీ 


రాదు రాదను మాట నోటన్ రాణించ నీ శక్తి లీలన్

పోదు పొదను విద్య పంచెన్ భోగించ నీ యుక్తి లీలన్

కాదు కాదని లీల జల్లుల్ గర్హించ నీ ముక్తి వానల్

లేదు లేదన బోకు నేర్చన్ లీలావిశేషాలు దేవీ


ప్రీతి నిచ్చెడి  నీతి వాక్కుల్ విశ్వాస నీ భక్తి సేవల్

ఖ్యాతి పెంచెడి గీత వెల్గుల్ కాలమ్ము నీ మాయ శోభల్

జ్యోతి కాంతులు నిత్య శోభల్ జోలాలి నీ పాట మార్పుల్

నాతి వై పలు ధర్మ మై సన్మార్గంబు వై వెల్గు దేవీ 


కావ్య దీపము నిత్య వేల్గు కార్యమ్ము జే సేటి జీవిన్

దివ్య బావుక సత్య మార్గ తేజమ్ము నందించు జీవిన్

అవ్యయం మది విద్య నెంచి సామర్థ్య మేజూప జీవిన్

సవ్యమై యలరార బుద్ధి సత్యమ్ము తెల్పేటి దేవీ


చాలు చాలని చెప్ప లేను జాధ్యమ్ము   చెప్పాను లేకన్

మేలు మేలని ఒప్ప లేను మో హమ్ము నేమర్వ లేకన్

పాలు నీళ్లని తెల్ప లేను పాపమ్ము మార్చేది లేకన్

వీలు నీదయ నౌను తల్లి విశ్వమ్ము యేలేటి దేవీ


కంచి చేరితి నీదు భక్తి కామ్యమ్ము జూపేటి తీరుణ్

సంచి తమ్ముగు నీదు నీడ సమ్మోహ మాపేటి తీరుణ్

వాంచి తమ్ముగు నీదు పూజ వాశ్చల్య లక్ష్యమ్ము తీరుణ్ 

మంచి మాటలు నీదు భుక్తి మమ్మేలు నీ యుక్తి దేవీ


రంగు రంగుల రవ్వ వెల్గు రంగేళి రాజ్యంబు నందున్

చెంగు చెంగున దూకు వెల్గు చెంబేలి పువ్వుల్ల నందున్ 

హంగు పొంగుల గువ్వ వెల్గు హంగామ జూఫుల్లు నందున్

పొంగు బంధమ్ము జూపు వెల్గు ప్రోశ్చాహ పర్చేటి దేవీ


నిత్య మానస సౌఖ్య మౌను నీడల్లె వెన్నంటి శక్తిన్

సత్య సాధన ధర్మ మౌను సంతోష సాహిత్య శక్తిన్

ముత్య మైనది వెల్గు లౌను ముఖ్యమ్ము ప్రేమైన శక్తిన్

పైత్యమే కళ మాట లౌను దైవమ్ము తోడౌను దేవీ


అల్లరే మది పద్య మౌను యాశ్చర్య పర్చేటి కళల్

చిల్లరే గతి విద్య లౌను చేయూత లేనట్టి కళల్

పిల్లలే విధి మాట లౌను పీయూష బంధమ్మ కళల్

చల్లనీ పిలుపాయె నీదు చిన్మాయ మాపైన దేవీ

రామకృష్ణుని లీలల్ స్ఫూర్తీ రమ్యత్వ చేయూత శోభల్

శోమ లీలలు గానే స్ఫూర్తీ స్తోత్రమ్ము తో పూజ శోభల్

ప్రేమ రాగ మనస్సే స్ఫూర్తీ ప్రేమత్వ లక్ష్యమ్ము శోభల్ 

శ్యామ సుందర లీలే స్ఫూర్తీ సాధ్యాయ దీపమ్ము దేవీ


నా మనోగత శక్తీ  నీవే నాదంబు గానంబు నీవై

ప్రేమ రూపము యుక్తీ నీవే వేదార్ధ సారంబు నీవై

క్షేమమే యగు భక్తీ నీవే కీర్తింతు రూపంబు నీవై 

శ్రీ మయంబగు ముక్తీ నీవే శ్రీ శక్తి రూపంబు దేవీ


సర్వ జీవుల నాదమ్మేలే సంగీత సాహిత్య రాజ్ణీ

నిర్వ హించును లోకార్ధమ్మై నీ దృష్టి నీశక్తి రాజ్ణీ

సార్వ భౌముని సర్వార్ధమ్మే సంతోష సంతృప్తి రాజ్ణీ

పర్వమై సహ పాండిత్యమ్మే పాఠమ్ము పత్రాక్షి దేవీ


జ్ఞాన నేత్రము కల్పించే విజ్ఞానమ్ము పంచేటి ప్రేమా 

ధ్యానమేగతి సౌలభ్యమ్మే దానమ్ము చేసేటి ప్రేమా 

మానమే విధి మార్గంబేగా మానుష్య తత్త్వమ్ము ప్రేమా 

మౌనమే మది వాశ్చల్యమ్మే మోక్షమ్ము నిచ్చేటి దేవీ


శోభితా నన సిందూరా శ్రీస్తోత్రస్య మూల్యమ్ము నేత్రే

ప్రాభవమ్మగు సూర్యాధిత్యా ప్రాధాన్యతా శక్తి నేత్రే

వైభవమ్మగు చంద్రాదిత్యా వైఫల్య పూర్ణత్వ నేత్రే

లాభమే శుభ జీవంమౌనే లాలిత్వ భావమ్ము దేవీ


మానవుల్ కళ విశ్వాసమ్మే మాధుర్యమ్మే భూతళమ్మే

దానవుల్ కళ సూర్మార్గం మేధారూప  మ్మై లోకంబు కమ్మే

ప్రాణముల్ సహ వాశ్చల్యమ్మై ప్రావిన్యమ్మే సీతళమ్మే

మానమే విధి మౌనమ్మే సా మాన్యమ్ము మోదమ్ము దేవీ


రక్త  వర్ణము భక్తీ రక్తీ రమ్యత్వమ్మే స్వాహ తృప్తీ 

రక్షుడై గుణ దీక్షా దక్షా రౌరత్వమ్ము  ధణాఢ్య తృప్తీ 

భక్తులే కథ చెప్పేకామ్యమ్ బంధుత్వ బంధవ్య తృప్తీ 

భుక్తికే గతి దాంపత్యమ్మే ప్రోత్సాహ వైనమ్ము  దేవీ


ఈ ప్రపంచమె తెల్పే విద్యా యీశా మహేశా సువాక్కుల్

దాపముల్ నశియిమ్చే వేగన్ ధన్యంబు నాజన్మ వాక్కుల్

కోపమున్ వదిలించే వేగన్ క్రోదమ్ము మాపేటి వాక్కుల్

జూపు సత్పదమున్ తేజమ్మై శో భాళి నిత్యంబు దేవీ 


అమ్మ నీకృపతో మామార్పే ఆశ్చర్య కావ్యమ్ము లిచ్చెన్

కమ్మనౌ పదముల్ రాహించున్ కర్తవ్య లక్ష్యమ్ము తెల్పెన్

నెమ్మి కూర్చగనే తేజమ్మై  నీకే నమోవాక్కు నాకున్

రమ్ము నాకిడుగా వేగంధీరత్వమ్ము సంప్రీతి దేవీ 


ర స మ త  త గ గ యతి..10

వెన్న ముద్దలు ఆరగించు వేనోళ్ల మొక్కేటి దేవీ

 వెన్నెలై దయ చూప గల్గు విశ్వాన్ని యేలేటి దేవీ 


రాదు రాదను మాట నోటన్ రాణించ నీ శక్తి లీలన్

పోదు పొదను విద్య పంచెన్ భోగించ నీ యుక్తి లీలన్

కాదు కాదని లీల జల్లుల్ గర్హించ నీ ముక్తి వానల్

లేదు లేదన బోకు నేర్చన్ లీలావిశేషాలు దేవీ


ప్రీతి నిచ్చెడి  నీతి వాక్కుల్ విశ్వాస నీ భక్తి సేవల్

ఖ్యాతి పెంచెడి గీత వెల్గుల్ కాలమ్ము నీ మాయ శోభల్

జ్యోతి కాంతులు నిత్య శోభల్ జోలాలి నీ పాట మార్పుల్

నాతి వై పలు ధర్మ మై సన్మార్గంబు వై వెల్గు దేవీ 


కావ్య దీపము నిత్య వేల్గు కార్యమ్ము జే సేటి జీవిన్

దివ్య బావుక సత్య మార్గ తేజమ్ము నందించు జీవిన్

అవ్యయం మది విద్య నెంచి సామర్థ్య మేజూప జీవిన్

సవ్యమై యలరార బుద్ధి సత్యమ్ము తెల్పేటి దేవీ


చాలు చాలని చెప్ప లేను జాధ్యమ్ము   చెప్పాను లేకన్

మేలు మేలని ఒప్ప లేను మో హమ్ము నేమర్వ లేకన్

పాలు నీళ్లని తెల్ప లేను పాపమ్ము మార్చేది లేకన్

వీలు నీదయ నౌను తల్లి విశ్వమ్ము యేలేటి దేవీ


కంచి చేరితి నీదు భక్తి కామ్యమ్ము జూపేటి తీరుణ్

సంచి తమ్ముగు నీదు నీడ సమ్మోహ మాపేటి తీరుణ్

వాంచి తమ్ముగు నీదు పూజ వాశ్చల్య లక్ష్యమ్ము తీరుణ్ 

మంచి మాటలు నీదు భుక్తి మమ్మేలు నీ యుక్తి దేవీ

****
యమునా!* జననిగఁ బ్రజలలొ యాసలు తీర్చన్ 
సముచితముగ కాచుచున్న చక్కని తల్లీ!
ప్రముదముతోడనె భజింతు ప్రభలే యగుటన్ 
సముదంచిత కవన ధార జయదా దేవీ

అంబా శాంభవి భవాని యాశ్రిత దుర్గా
లంబోదర మాతవమ్మ లాలించమ్మా
కంబుగ్రీవా నతిగొనికాలము హంత్రీ 
దంబంబుల బాపుమమ్మ  దానవ దేవీ

వర సిద్ధి బుద్ధి తోడుగ వాక్కుల పంచెన్ 
వరముల నోసగెడు గణేశ భయభక్తులతో
నిరతము నిను గొలిచెతల్లి నిజమే యగుటన్ 
మరువక మము గావుమయ్య మదిలోనెపుడున్||

అల్లెద పద్యము తెలుగున ఆలన పాలన్ 
యల్లరి వేషము కలవర యాసగు లేలన్
చల్లని చూపుల కలయిక చలమై తృప్తిన్
తెల్లని వెలుగుల పరమగు తేలుచు దేవీ

నిలువెల్లనుభయముచేత నీరగు చుండన్
తలదాచుకుంటి తరణము తక్కెర చెందున్
నలనల్లని మేని ప్రభలె నయనములమరెన్
కళలే నిలిపిన జగతిన కానుపు దేవీ

నిను మిత్రుండను రజితము విలువేయగుటన్
గనకముబుద్ధియును నాల్గు కారణములుగన్
కనుగొను రూప కమనీయ కాలమగుటయున్
 కని దేవ గురుడుగ సెప్పె నన్నిట దేవీ

అందము లేకయు యగుపడి ఆకర్షితిగన్
అందములో రవి ని కాను ఆశ్రిత వాణిన్
అందము లో శశి ని కాను ఆ సత్తి యగున్
పొందుసు ఖమ్ము కలిగించు పోలిక దేవీ

మనసు శృతిలయలకు మగువ మాత్రము బుద్ధిన్
తనువు విలువ తెలుపగలగు తాపము నందున్
మనదను వశము సుఖమగు మానస మందున్
అణుకువ బ్రతుకు అల మల్లె ఆటలు దేవీ 

ధనమే పొందవచ్చు మనసు ధర్మము తప్పున్
మనకే నిద్ర కరువగుట. మర్మము వల్లన్
క్షణమే సుఖమగుచు నుండు క్షామము పెర్గున్
మనసే శాంతికి మనుగడ మావలి దేవీ

25, ఫిబ్రవరి 2024, ఆదివారం


సంసార..సుఖ..దుఃఖమ్ము.. స్వేచ్చా తేటగీతి మాల
 రచన మల్లాప్రగడ  రామకృష్ణ 

బంధ మేదైన నిలబెట్టు బాధ వద్దు
 ఉనికి కోల్పోయిన మది ఉంచి పలుకు
 చులకనే మదీయ భవము చూప గలుగు
 పట్టుదలతోను ప్రేమను పంచగలవు.001

 మనకు నిస్వార్థ పదమాల మనుగడయగు
 అభిమతము మనస్ఫూర్తిగా యడుగు వేయు
 నమ్మకము నయనాలుగా నటన వద్దు
 నచ్చననెడి మాటయనకు నమ్మి బ్రతుకు.002

కల్పిత మనెడి పాత్రలు కలలు యేను
కనికరముగాను కన్నీరు కథలు తీరు
 వాస్తవిక జీవితానికి వాద నొద్దు
 ముసుగులోననే ప్రేమలు ముఖ్యమవ్వు.003

మనుగడే ప్రశ్నల మయము మాయ మనసు
పలుకున ప్రమాదము లేక పలుక గలవు
 నిత్య అవమాన హేళన నీడ యగుట
 ధైర్యమే సంపదయగుటే దీన మహిళ.004

పదును లేని పొలమ్మని బాధ వలదు
 పంట పండినా పలుకులొ పోటు కలుగు
 బంధము నిలుపు బాధ్యత బలము యేను
 నమ్మకముతోను మదిలోన మార్గ దర్శి.005

ఆకు రాలుట కొత్తేమి కాదు కాదు
 బిడ్డ మారుట కొంతయు భీతి చెందు
 ఋతువు మారేను ఆకులు పురుడు పోయు
బిడ్డలూ మారు కాల మే తీర్పు తెలుపు..006

ఇదియు మాయ లోకముతీరు ఇష్టమొగుట
కలుషితంమైన బతుకులో కథలు తీరు
 లేడు లేడన్నవారికి లీలయిదియు
కళల కష్టాలకుంపటి కలియుగాన.007

ఆమె రమ్మంది కవ్వింపు అడుగు ముందు
 చూడనట్టు సైగలతోను చూపు కలుపు
 పక్కకు పిలిచే సొగసును పక్క చూపె
 పరిమళంపరికించవా పదములేల. Oo8

 పకపకానవ్వింది మనసుబలుపు చూప
 చిలిపిపరిహాస మాడింది చెలిమిలాగ
 నీవు ప్రవరాఖ్యుడగునేల నిజముతెలుపు
 ప్రేమ వలకపోసియుప్రియ ప్రేమ తెలిప.009

కాలమేవిధి రూపము గాయమేను
సుఖమునైన దుఃఖమునైన పురులు విప్పు
విధివిలాసము వల్లనే వేరు చేయు
కాలమునకు మించినదేది కనుగొనవులె. Oo9

బానిసన్నది ఎక్కడ బంధమేను
శ్రమకు తగ్గఫలముపొంద కృషియు గతియు
 ఎవరికెవరు తక్కువ యనయేల వలదు
 బీదవాని అదృష్టము భీతి వలదు. 010

ప్రోద్బల మగుట కాదులే పోరుయిదియు
 పౌరుల తెలివి పొందిన సౌఖ్యమేను
 ప్రగతి దేశ వైభవముగా ప్రతిభగాను
 పగలు సెగలు కమ్మినసేవ భరత భూమి..011

పేరనేది లేనిదగుట పీఠమైన
 పెన్నిధి యగటయే మన పెద్దదిక్కు
 భాగ్యమగు విధాత కళలు భరత భూమి
 జనుల సంతసమ్ము సహన జగతి తీర్పు..012

స్ఫూర్తి పొందేందుకుకృషియు సూత్ర మగుట 
ప్రకృతి సిద్ధము మూర్తులై ప్రతిభ చూపు 
ఆర్తితో చూడ అలసట ఆట ఏల 
రోజు రోజుకూ సంతసం కోప మేళ. .013 

తొక్కినంత మళ్ళీ పుట్ట తోడు గరిక  
దీప వెలుగు కావాలిలే ధరణి యందు 
స్థిరము లేనట్టి పాదర సమ్ము ఏల
జరిగె నంతా జగముననే జాతరగుట.014 

ఆశ మదిలోకి చేరితే ఆట మొదలు  
ఆశ కనుబొమ్మలెత్తినా కాన రాదు  
ఆశ అందరి లోనుండు ఆత్ర మేళ . 
ఆశ తీరా సభలొ కూర్చు న్నాను కలలె.015 

నన్ను బంధించ దలచియు నన్నుకోరు  
మంది ఉన్నకాంత కనులు మనసు పెట్టు   
కాంత ప్రేమ సంగమమంటు కనికరముయె  
సర్వసంగపరిత్యాగి శాంతి కాంతి ..016

వృత్తి ధర్మం ప్రకాశించి వేళ్ళు విరియు  
శక్తి గర్వప్రయోగించి శిక్ష చెందు 
భంగపడ్డా భయము లేక బ్రతుకు నేర్పు   
ధర్మ వ్యాధుడు పూజింప ధరణి యందు .017

శాంతి హేమంత మవ్వుట శాప మేళ 
మొదలు చిరునవ్వులుకలియు మోక్షమగుట 
మంచి పూబంతి తోడుగా మనుగడయ్యె 
వెన్నెల తుషార పూలుగా విరిసి తోడు .018

విద్య విధ్వంసము యగుట వింత కాదు 
చదువు కూడుపెట్టదనిఏ చెప్పుయేల 
నీవు నేర్చిన విద్యఏ నిన్ను మార్చు 
కాల యాపన మాటలు కామ్య మేల ..019

నీరు వేడిచేయుటతోను నీరు పొంగు   
పాలు కాస్తెమీగడ పొర్లు పలక నందు 
అహము కక్కాక నిజముఏ అథిది యగును     
కాల నిర్ణయం నమ్మియు కలసి బ్రతుకు. 020 

దేశ సేవలు చేసియు దేహ మలసి
అనుభవం తెలిపెను కళ అర్ధ ములను 
ఒకరికొకరు చెలిమిగాను ఓర్పు సలిపి
ప్రాంజలి ఘటించి తెలిపిరి ప్రభలు గీత..021

వ్యాధి ఎక్కువ తక్కువ వ్యాపకమ్ము
వైద్య మనునది శాంతికి వైన మగుట
వైద్యు డాయుష్షు ఆపేటి వైద్య మేది
ప్రభువు కాలనిర్ణయమునే ప్రజకు తెలిపె. 022

స్వచ్ఛ మైన చెలిమిగాను సర్వులందు
కష్ట నష్టమైనను ఇష్ట కళలు పంచి
స్వచ్ఛతను తెల్పి సహకార సహన ముంచి
కాల కొలిమిలో నిష్ఠగా కలసి బ్రతుకు.. 023

నేను కానరాకున్న భయమేను కలిగి 
ఆమెలో అపార్థాలుగా ఆద్రతగను    
దూరము పెరిగిపోయాక ఉండ లేక 
చెప్ప దలచిన వన్నియు చెప్పు చుండె   .024 

వీధుల విహరించెడివాడు వేంకటేశ  
దీనభాందవులకు భక్తి  దీక్ష నిచ్చి   
రక్ష చేయగలవు రమ్య శ్రీనివాస 
కలియుగాన కో ర్కలుతీర్చు కాల పురుష  .025  

వరమనుగ్రహించిన భగవానుడేను   
అన్న మాటకు అవతారమెత్తి ఆదుకొనెను 
గుణము తెలప చెలిమిగుడ్డ కూడు గూడు 
కర్మయొక్కఫలము లన్ని కడవరకునె  .026    

చల్లలమ్ముకొని బ్రతికే చలువ పల్లె
నీళ్లు చన్నీళ్ళ అమ్మేటి నేటి బస్తి 
కుండ నీరుమరిచెనులే పులుసు త్రాగు  
వేడినీరు తాగమనట వైద్య మనుట  .027


తప్పులన్నవి తృప్తి గా తాళ లేవు
రోగ మున్నను చాపల్య రుచిని కోరు
ఉప్పు తీపి వద్దన్నాను ఊపిరి కళ
దైవ బలముతోబ్రతికేను ధరణి యందు..028

చక్కనికనకమగునంచునక్కఁగలుఁగు
రవికనుపరికిణిఁదొడుఁగ లచ్చివోలె
యుంటివిఁగదఁటె ఖిన్నమౌయూహయేమి..
మాగృహఁపుసిరికళవళమందరాదె ..".029

అలలు అలసట లేకయే కదల కలుగు
కలలు అలసటతో వచ్ఛి కదల కలుగు
తీరు మారనట్టి అలలు తీరమందు
జారిపోవునట్టి కలలు జాలి గుండె..030

ఉజ్వల భవిష్యత్తు లన్ని ఉద్య మాలె
ఉత్తమ గుణాలు ఉత్సాహ ఉన్నతములె
ఉన్నత మనస్తత్వాలు తో ఊగు కళలె
ఉద్యమమున లక్ష్యము ఉన్నతాను భవములె. 031

తిన్న మేత చాలక బొక్కి తినుట ఏల
కుక్క పని గాడిద యు చేయు కూట మందు
గెలుపు ఓటు కోసము ధనం గాల మేయు
నిన్ను బలహీనులు తరిమే నిజము రోజు..032

ఏమి రూపము దాల్చి న ఏమి ధనము
దినము రంగుల మయమే ను దివ్య వెలుగు
హరిత వనము యే ఆశ్రిత హాలుని లయ
వింత వర్ణము కలిగిన విజయ వాంఛ.. 033

చెప్పు కష్టనష్టాలకు చరిత నంత 
చెప్పు పగలు రాత్రి ఘటన చరిత నంత
చెప్పు సంసారి సుఖముల చరిత నంత
చెప్పు గుండె మంటల జపం  చరిత నంత..034

కరువు కోతలతొ విద్యుత్తు కలలు కాదు
పయణ ఖర్చులు పెంచారు పగలు రాత్రి
ఉచిత మంటు పందారము ఉడత కాదు
ఇష్ట సచివులు మార్చుట ఇంటి కధలు..035

మంచి మనసుతో జగతి లో మాయ మార్చు
నిత్య సంస్కార ఔన్నత్య నియమ ముంచి
మనసు సంపదే గుణముగా మోద మగుటె
తెలివితో సాధనయె ధనం వెలికితీత.. 036

వర్షములు లేక పుడమి లో వేడి పెరిగె
మబ్బుల కలలు లాగనే మాయ మయెను
భూమి కోర్కెలు తీర్చక భోరున కళ
జనులకు గొడుగు ఉపయోగ జపము ఇదియె.. 037

 నిత్యము ప్రలోభాలతో నీడ జేరి
ప్రజల నాడి పత్రికలకు ప్రతిభ జూపి
ప్రగతి అలోచనలతోను ప్రేమ జూపి
మంచులా కరగించేను మనసులోన .. 038
   
కళ్ళు వున్నా కపోతిగా కాల మేల 
కళ్ళ కన్నీరు నమ్మేటి కాయ మేది   
కళ్ళు వర్ణణా కర్షణ కామ్య మేగ
కళ్ళ కనికరం చూపులు కధల గాను ..039   

కళ్ళు మూసియు ధ్యానము కామ్య సిద్ది 
కళ్ళు తెరచిచూ చిన దృష్టి కామ బుద్ధి 
కళ్ళ కలతలు జరిగినా కలలు సుద్ధి 
కళ్ళ మాటలే మనిషిలో కచ్చ పెంచు ..040

కళ్ళ చూపుల కాపురం కళల పంట 
కళ్ళ నీళ్ళుతుడుపుటేల కార్య మందు 
కళ్ళు ప్రకృతిలో కలసేవి కాల మందు 
కళ్ళ చూపునిర్ధారణ కన్న ప్రేమ     ..041 

కనులు కనులు కలిసెనులే కాంక్ష తీర 
కనుల తీర్పులో శృంగార కళల తీరు 
కనుల లోన పాప గనులే కనికరింపు  
కనుల లోనున్న కనుపాప కలసి పిలుపు ..042 

 మిత్ర రాష్ట్ర దుర్గంమ్ముయు మేలు కోరు 
 వక్రుతులని పేరు విధిగాను వెల్లువిరియు 
 సైన్య మేరాజ్యపాలన సమయ మగుట
 నిత్యము అమాత్య లధనమే నిజము తెలుపు.. 043  

 పెద్దల సహవాసం చేసి పేరు పొందె     
వినయ విజ్ఞాన సంపద విశ్వ మందు   
తానుచక్క బరుచు వాడు తనువు  ఓర్పు   
ఆత్మ సంపాదనం సృష్టి అందరిగను  .. 044

గురువు తెల్పు విద్యల వలన ఉన్నత మగు 
సేవ వల్లనే విజయము సేతు వగుట 
ధర్మ మార్గము వినయము ధరణి యందు 
వినయ వాక్కులు మనసున వినుట బ్రతుకు.. 045 

 విలువ లేని దుమ్ము, భయము, విధిగ చేరు
కళ్ళ లోపడి విలవిల లాడ గలుగు 
విలువ లేనిపలుకులన్ని వదలివేయు
ఉత్తముల లక్షణం దూది ఉప్పు యనుట .. 046

 భయమనేది మనిషి లోన భారమవదు  
ఒక్కసారి భయము తీర్చ ఓర్పు ఉంచి 
పారి పొయ్యేల భయముమే పాప బుద్ధి   
కుప్పకూలిపో యు భయము కూర్మి వలన .. 047

 ఏది ఏమైన పరిణామ జీవ మగుట 
నిత్య తార్కాణ అవతార నియమ మగుట 
బ్రహ్మ చారులకు ముదురు భావ మేల  
బెదిరి పోయి వాడికెవరు పిల్ల ముదురు  ..048

 బయటి విషయములుగ ఇంద్రి యమ్ము జూపు  
అహము సంసర్గ సంపర్క అంత మగుట
బ్రహ్మ నిష్టగల వివేక బంధ మగట    
పురుష శక్తి సౌజన్యము పురులు విప్పు ..049

 తాత తల్లి తండ్రి గురువు తర్లి పోవ  
జాతి కులములనె చపల తేల మగుట   
దాను దానయైన మనసు దలప యుండ 
తత్త్వ  వైరాగ్య ప్రాణియే తరము తెల్పు ..050

 కల్పనాశక్తి కలియుగ కాల మాయ
నిత్యమూ అభూత కళలు నిన్ను చేరు
ముక్తియు విముక్తి కోరుట ముఖ్య మగుట
ధ్యాన మన్నదీ ప్రకృతియే ధ్యాస పెంచు ..051

 నీతి అవినీతి మధ్యన నీడ తలుపు
మంచి చెడుల మధ్య మనిషి మనసు మాయ
అవసర అనవసర మైన ఆశ మెరుపు
పనులకొరకు ఓర్పుయు లేని ప్రగతి జీవి.. 052

 గుక్క గుక్కకు తిక్కగా చుక్క నక్కి
పక్క ఎక్కక మెక్కుచు పీక్కు పిక్క
తొక్క తొక్కిమక్కువ కక్కి తోలు చెక్కి
కుక్క నక్కలా బొక్కెది కూడు గుక్క .. 053

 ఎదుటివారి బలము తెల్సి ఎరుక పరచి
సులభ మవదు గెలుపులన్ని సూత్ర మౌను 
గుణము గోప్యము మనసుకే గుర్తు చేసి
కష్టమైన గుణము వల్ల కార్య ఫలము .. 054

 వైద్యులు మనసు రోగము పైరు పెరుగు
అర్ధమవని రోగి యగుట ఆకృతి గను
వ్రాత లేవైన సృష్టికి వరుస క్రమము
బ్రహ్మ వైద్యులు సామాన్య బంధ మగుట .. 055

పలక రింపులే రసరమ్య పాలు యగుట
చురక లవ్వు అల్లే తీగ చుముక మిచ్చి
తల్ల డిల్ల సవ్వడి వల్ల తరుణి తపన
పెదవులు పలుక రించియు పిలుపు లాయె .. 056

ముందు సంసారిగా మారి మునిగి తేలి
చపల బుద్దియు చూపక చరిత తెల్పి
కొంత తత్త్వము తెలిపియు కోర్క తీర్చి
చేర దూర జార బ్రతుకు చింత వలదు .. 057

ఆలికి విధేయత బ్రతుకు అలక అనక
పలుకు జవదాటని వినమ్ర భక్తి చూపు
సతుల సుఖానికి పతుల సమయ తృప్తి
స్పష్ట అప్రమత్తత ఆలి సహన మేను .. 058

ఆట లో గెల్చి ఓడుట నందరి కళ
హస్త గతము అగుటయును వాస్తవమ్ము
బ్రతుకు బదిమంది సుఖముగా బంధమౌను
సంభ వించు సహజ శక్తి సర్వ మాయ .. 059

ఎవరి లోకము వారిదే ఏమి చెప్ప
ఎవరి శోకము వారిదే ఏల చెప్ప 
ఎవరి కామము వారిదే ఏల తీరు 
ఎవరి రోగము వారిదే ఏల తగ్గు   .. 060

ఉక్క బోత ఎక్కువ మన ఊపిరి గను
పెద్ద వాళ్ళకే తిక్కగా పిల్ల ఏడ్పు
వెన్ను నిమురుతూ అమ్మయూ వినయ చూపు
గుండెలో ఆర్డ్రతా పెర్గి బుజ్జ గింపు

మనిషి ముగ్గుర్ని మరచితే మనుగడేది  
నిన్ను సహనంతొ కరుణించు నిజము మనిషి
నిన్ను మరచి వదలి వెల్లె  నిప్పు మనిషి  
నిన్ను కష్టాల్లొ దించియు నటన మనిషి 

తామరాకుపై నీటిబొట్టు తాకనంది  
అంత లోననే మాయమే అగుట చూడు
మానవుల జీవితమ్ముయు మడుగు లోన  
ఇప్పు డుండుము తర్వాత  ఇట వలదులె 

జీవితమ్ము అల్పమగుట జీవ మాయ  
పుట్ట గానేను ఏడ్పుయు పుడమి తీర్పు   
తల్లితండ్రుల పలుకులు తృప్తి నిచ్చె    
యవ్వనమ్ము కోరికలతో యేడ్పు పెంచె  

మనిషి తీరు మారుట  ఏను మనసు ఉన్న     
దేవ గురుబోధ నమ్మిన ధరణి యందు 
బంజరు ధరణి ఉడికియు బాధ చెందు 
వర్షధారలు పడగానె వరుస గలుపు 

విశ్వ భారతి స్ధాపన విశ్వమందు
ఆత్మ కధనువ్రాసిన ఘన ఆది యందు
శాంతి నిచ్చు విద్య కొరకు సాయమందు
రచనలన్ని రత్నములు గా క్రమమునందు

ఓ పగలు వెలుగులులేని ఓటమిదియు 
రాత్రి నిదుర రానిసమయ రాజ్య మిదియు
సూన్య మైనట్టి మనసుకు సూత్ర మిదియు
తలపు బ్రతుక నీయని రోజు తనము ఇదియు

గమనమే అగాధపు అంచు గమ్య మవుట
ఓ భయమ్ము నడవనీక ఓడి పోవు
ఉనికి గమనించె లోకమే ఊయల గుట
గెలుపు ఓటమి లేనిదై నిజము బతుకు 

ప్రేమకే కళ్ళు లేవని బీద పలుకు
వదల లేని బంధము ఇది వెగత పుట్టె
స్వప్న మైన కోరిక ఇది సమర మేను
ఓ నిజం జరా మరణము ఓర్పు లేక

మానవ వనరు లన్నియు మసక బారి
దోపిడీలకు దారిగా బోధ పెరిగె
మది అనారోగ్య యువతయే కలల తీరు
పాలనా పర ము కథలు పండు గాయె

బతుకు లో అంతర్జాలము భాద్యతయగు
మెదడు పనిలేని చదువులు మెలికలు ఇవి
పాఠశాలలు ధనముగా పాయ లగుట
దాహమును తీర్చ నేతల దయ కరువుయె

పిల్లికి ఎలుక లోకువ పిలిపు కరువు
పాలు రోగాన్కి లోకువ పలుక లేక
నీళ్లకే పాలు లోకువ చెలిమి చేరి
బ్రతుకు పిల్లికి ప్రేమయే బంధ మేను

అగ్నికన్ను లౌకిక తత్వ ఆట ఇదియు
మనువు వేదం సమన్యాయ మచ్చు లేదు
పదవి పిల్లి పంజరముగా పలుకు నేర్చె
ఈ ప్ర జాస్వామ్య కదలిక ఈల పాట

చెప్పినది చేయ కుండేటి చేష్ట లవియు
చేసి చెప్పలేని ఫలము చింత లవియు
ధనము దోచి దాచు నిజాయితీ యదనియు
రాజ నీతి అర్ధము కాదు రాజ్య మదియు

తొలకరి చినుకు పులకరించెను పుడమి న
తనివితీరా తపనలు తగ్గు తరుణ మందు
మట్టి పరిమళాలు కదిలే మరులు గొలుపు
బ్రతుకు బాటలోన సొగసు బంధ మగుటె

వాన లొచ్చెను వయసులో వరుస కలిపి
సరిగమల సంగతులు గల్పి సమయ మందు
సుఖము లెల్లరకు తెలిపి సేవ చేయు
జయము కోరునిత్యము శోభ జ్యోతి వలెను 

ఏది ఎవరికి తెలుసులే యదలొ మాట
కాలమున కన్ను కుట్టే ను..కాని దేది
గ్రహములు నిగ్రహము లేక గదిలి పోవు
పృధ్వి బాధభరించకే పలుక లేదు

గాలి వడగాలిలా వచ్చె గాళ మగుటె
రుధిర ధారలు విరజిమ్మె రుద్ర భూమి
జీవ నవరంద్రములు ఘోష జైత్రయాత్ర
విశ్వ వ్యాప్తంగ వీరంగ వీధి వీధి

కాల మాయ యిదియు.. కావ్య జగతి గాను
గోల యేలమనలొ..గాధ లగుటె
 తాళ లేక పలుకు.. తాపత్రయం మ్ముగా
ఏల అనుటయే దరి యేది కాదు

కాలమే నిన్ను నెట్టుచూ కళలు నేర్పు
తట్టుకొని నిలబడినా క తత్వ మగుటె
పట్టుదలతోనె పనులన్ని ప్రగతి జేర్చు
జ్వాల ప్రజ్వలన జరిగి జ్యోతి జూడు

మీరు ఎవరని అడగను మేలు కొరకు
తెలుగు వృద్ధి కొరకు సేవ తెలుప గలిగె
కలలు రూపము కధలను తెలపదలిచె
వినయ విధిరాత అనభవ వేద వాక్కు 

ధన్యవాదాలు తెలుపుతూ ధరణి నందు
చెలిమి చరితము సహజమే చిరు కళలలె
ఒకరికొకరు గా కలసి యే ఓర్పు జూపి
తెలుగు వెలుగుకు సహకార తెలుపు లీల

జ్యోష్యుల కళలు వెలిగెను జ్యోతి వలెను
సంగీతం తోను విద్యల సామ గమన
పిల్లల చరిత భవిష్యత్తు పేరు కొరకు
అరుణ కిరణము వలెసాగు ఆత్రుయ గుటె

పాదము కడిగి కడలియే పలుకరింపు
పున్నమి పరవశించి కదిలే పుడమి తోడు
మేను తాకిన చిరుగాలి మేలి ముసుగు
ఊహకేమనసు కలసే ఊపి రగుటె

తొలకరి చినుకు పులకరించెను పుడమి న
తనివితీరా తపనలు తగ్గు తరుణ మందు
మట్టి పరిమళాలు కదిలే మరులు గొలుపు
బ్రతుకు బాటలోన సొగసు బంధ మగుటె

ఎక్కడున్నాడొ నావాడు ఎరుక లేదు
ఏల చెప్పేది నాబాధ ఏరకమున
ఎటున చూసిన చీకటి ఏల మారు
యదల గోల ఏల తెలుప ఏమి లేదు 

జన్మ ఫలమును సాధించి జాతి పెంచి
అసలు నకిలీని గమనించు ఆశ వదులు
ఆట కాదులే అలసట అధిక మగుటె
చెప్ప లేనంత సంఘము చింత తగదు 

విజయమా వీర స్వర్గమా వేకు వగుట
స్వీకరించుట వినయమే సేతు వగుటె
నవ్వుతూ మృత్యువును కోరు నటన వద్దు
నీ కళలు నీకే రక్ష నేడు రేపు

సుఖము శాంతి నిచ్చు కధలు శుభ ఘడియలు
మనము సంతృప్తి పడుటయే మనసు పలుకు
ఎంత సాధన శోధన ఏల అనకు
జీవితాన ఆనందమే జీవ వాంఛ

తెలుగు పాటల పందిరి తేట తనము
తెలుపు మనసుపాట కలలు తరుణ మందు
మలుపు జీవితం పాటగా మనసు తృప్తి
ఆశల నిరాశ సంగీత పాట యిదియె

కలలు గనుక కధలు కా నే రవు మదిలో
కళ్ళు మూసుకున్న కధలు చెప్పు
కల్ల పలుకు లన్ని కావ్యము కావులే
కల్ల యనక వలదు కాల తీర్పు

ఎవరు ఎవరు కు బంధము ఏల చెప్పి
బ్రతుకు తెరువు కోసం కధ బడయు చుండు
వివిధ వాంఛలు విషయమే వివరణలులె
వరుస ఏదైన ప్రేమయే వాక్కు తెలుపు

పుండు పొలుసులు రాలితే పూర్తి తగ్గు
పుండు పైపొర పీకితే రుధిర మగును
చెట్టు ఎదిగినా అవసరం చెంత చలువ
ధ్యాన సాధన చేయాలి ధర్మ మగుటె

చిరు నగవు లమోము మనది చిన్నదైన
కధలు తెలిపేటి వినయమ్ము కళలు మనవి
ఎన్ని తెలిపినా లోటుయే ఏల బ్రతు
గళము విప్పి పలుకు ఇది కాల మాయ

మనసు కుదుపులు విశ్రాంతి మచ్చలు గను
అనుభవం తెల్పి అభిమాన ఆట మదియె
వేదనతో వ్రాసినా కధ విజయ ముద్దు
వ్యసన మనుట కాదు భవిత వాక్కు దిద్దు

చినుకు చినుకు గా నదిలోన కిరణ మాయె
రాలిపడ్డ పువ్వు లావుండి రమ్య పరచి
నన్ను తాకొద్దని కడలి నయన చూపు
బ్రతుకు మార్గమే తెలిపేటి బ్రహ్మ సృష్టి 

 కాల చక్రాన్ని ఆపాలి ఆశ నాది
పలుకు తో నమ్మకం పంచె ప్రధమ బుధ్ధి
ధైర్యమే నన్ను నడిపించు దురిత నందు
మనసు పొంది పంచాలని మౌన దీక్ష


*నిన్న నేడును మరునాడు నిజము నేనె
ఆది అంత సంతోష మౌ అమృత నేనె
నారు నీరు సమస్తము నటన నేనె
ప్రణయ ఖ్యాతి ఖేదం సుఖ ప్రళయ నేనె 

*కాల రంగులు ఋతువులు కలసి జూడు
లోక మాయ వెంటపడి యే కోలు కొనుచు 
భాషలోనేమనసు మార్పు బంధ మాయ
భ్రష్ట రూపాల మనుషులు భ్రమలు జూపు .

*ఎవరినైన నిందించక ఏల బ్రతుకు 
ఎవరినైన తప్పును పట్ట ఏల బ్రతుకు 
కాలచక్రం ఇరుసువంచ కామ్య మేది 
నిత్య విధిరాత మార్చుట నియమ మేది 

*సూర్య కిరణాలు కదలిక  సూత్ర మేది 
వెన్నెలమ్మ చీర కదిలె విజయ మేది
పుడమితల్లి పచ్చ దనము పూర్తి ఏది 
ఎందుకీ వికారాలుగా ఏల వచ్చు 

*కాల మార్పు సహజమేను కథలు చెప్ప 
మనిషి మార్పులు సహజమే మనుగడగుట 
మానవత్వం పరిమళించ మహిమ ఏది 
మనిషి వాసనను నిషేధ మార్గ మేది 
........
*సత్యము తెలిసే వరకు అసత్య భ్రమలు
దైవ భిన్నరూపాలు గా ధరణి యందు
మనసు ఏకగ్రత యె లేక మచ్చ తెచ్చు
నిగ్రహం దైవ నిర్ణయం నిజము తెలుపు

* స్ఫురణ సులువైన స్థితికాదు సూత్రధారి
నటన ఎవ్వరి కర్ధమొ నయన తీర్పు
నిత్య ఆధ్యాత్మిక మనెడి నీడ బిక్ష
నమ్మ పలుకల మధ్యనే నలిగి పోవు

*బంగరు మెరుపు వన్నెలు భగలు సెగలు
దూకుచు మనజులమనసు దూకుడుగుట
సంగమకలలు పరిహాస స్వేచ్ఛ కదులు
పండుగ జరుగు తరుణాన పదనిస కథ

*ఏది మంచి యనెడి జీవి ఏల చెప్ప
దారి చూప మనిషి లేడు ధరణి యందు
జీవిత సమరం తప్పదు చీకటింట
కొత్త పోకడల బతుకు కొల్ల గొట్టు

* మేక పులి వేట చూసితి కేక కేక
రక్షక భటుల విన్యాస రంగు మారె
ఎవరికీ వారు తెలివితో ఎదను దోచె
చివర కథ కూర్పు అద్భుతం విలువ మెండు

మగువలు చదువేల మనసు గెలుపుచాలు
తెగువ చూప వయసు తెలివి చాలు
తిరగ బుద్ధి యున్న తీపి చేదగుటయే
తరుణ సుఖము పొంద తపము చాలు


అవనిలో ఆడ జన్మయు అద్భు తమ్ము
ఆత్మ విశ్వాసమును చూపు ఆడది యగు 
ఇంటి ఇల్లాలు అమ్మగా ఇష్ట మగుట
ఈమె తత్వమే ప్రేమగా ఈద గలుగు

ఉగ్గు పాలతో ధైర్యము ఉజ్వలమగు
ఊహ ఊపిరి దైవత్వ ఊయ లామె
ఋణము తీర్చ సహనం రుజువు ఆమె
ఎగసి పడె కెరటం ఆమె ఎల్లరందు 

 ఏడు జన్మల స్నేహము ఎరుక గలిగి
ఐణ ఐశ్వర్య నిధి ఆమె అయిదొ తనము
ఓర్పు కునిలువెత్తునిదర్శ ఓడిపోని
ఔ షదవిధి ఔదార్యము ఔను ఆమె 

 బలము దర్ప అహంకార బంధ మొదలి
వస్తు సంగ్రహ క్రోధము వదలి వేసి 
కామము మమకారంమ్మొద్దు కథలు వదలి
సర్వ మోక్ష  సమర్ధుడు సమయ బోధ

అతను అమరలింగేశ్వరా ఆమె శక్తి
అతను మంగళ శక్తి శివ స్వ రూప
అతను గళము ఆమెయు అర్ధ నారి నీడ
అతను జాడ ఆమెయు పట్టు ఆట విడుపు

ఏది నిజము నిజాయితీ ఏల చెప్ప
అనుభవం వల్ల తెలియగల్గేటి విషయ
వాంఛలన్ని యు ఎవ్వరూ చెప్ప లేరు
కాలవిధి నిర్ణ నిర్ణయం కలసి వచ్చు

 మనిషి ఉన్నతి మహిళయే మరువ కండి
సహన నిజసహాయము చేసి సమయ తృప్తి
ఒక్కటే ప్రేమ యనక ఓదార్పు నిచ్చు
జీవితంలో వెలుగు నింపు జీవి మహిళ..

కాల నిర్ణయం కదలికగాను సహన
కవిత సాహిత్య హృధ్యమ్ము గాను నిత్య
సత్య సంభాషణ పరము నీడ నందు
సమయ స్ఫూర్తిగా స్వేచ్ఛగా సమర తెలుగు..

మహిళ కనిపించని వేరు మనసు చేరు
వనితల దినోత్సవము నాడు వినయ విజయ
ఉత్సవమ్ముగా గౌరవ వేల్పుల నియు
తల్లి చెల్లి అక్క మహిళ తరము ఇదియు..

 మాటకు పదును లేకున్న మనసు చేరి
అనువణువు అనుమానము దాని శక్తి 
మౌనమునకు రూపం లేదు మనసు చేరి 
అగ్ని వలెను దహించుటే దాని శక్తి..

తిండి లేక చావటమనే తీరు లేదు
తినను లేక చచ్చెడి వారు తీరు పెరుగు
తోడు లేని అనాదులు పోరు లేదు 
అందరున్న అనాదులు ఆట పెరుగు

మనసు సకలమై సుఖసేవ మంగళమగు 
యవరు యని యంచకే మది యాట యదియు 
బ్రతుకు భవ రోగ హితము కోరి బంధ సుబ్ర
హ్మణ్య మంత్రరాజము నాకు హాయి గొలుపు

 రాజకీయ అదును చూడు రాజ్య మేల
ఉచిత దారదత్తత మని ఊరు మారు
ఓటు ధనము చుట్టు తిరుగు ఓర్పు లేక
కోర్కె తీర్చ బిక్ష ముగను గొప్ప చెప్ప

నేల నీదని చులకన గీత మొద్దు
నేల కొరిగిన జీవితం గీత మౌను
త్యాగ గుణము సహనమేను దారి తెలుపు
నింగి నేల మధ్య బ్రతుకు నీది కాదు

 ఒంపు సోంపుల వనజాక్షి ఒప్పు కొనక
వాలు చూపు వల విసిరే వాకిటయని
బిగువు కుచ కుంభలా రాట బేల చూపు
వయసు పొంగు పోరాటమే వెళ్ళు వాయె

*ఆ. మేత కొలువు తట్టె మేలుకొలుపు యిది
మెరుపు కాంతి వలయ మౌన బంతి
మెచ్చు కొనును మదిని మేళతాళముగను
ప్రాంజలి కళ ప్రకృతి ప్రభల తీరు

గండు తుమ్మెద గంతులు గడబిడయగు
ఉండ బట్టలేని మనసు ఉరక లేయ
బేల బ్రతుకు ఊయల యగు బిడియ పడక
మృధు మధుర రసమును జుర్ర ముంగిటయగు

చేయ గలిగిన సాయమే చింత మాపు
స్థిరము శాంతి ఆనందము స్థితి గతి మతి
వినయ ఉపకారము విధిగా విజయ మిచ్చు
విశ్వ విశ్వాస బంధము చెలిమి తృప్తి


 నెమలినడకల కళలగు నీడ సినిమ
కన్నులు కలయు కథలన్ని లుపు సినిమ
హృదయ తాపాన్ని తగ్గించి హాయి గొలుపు
మూడు గంటల సంతసం ముఖ్య సినిమ

 నటన సామర్ద సంగీత నయన సినిమ
విజయ వినయ వినోదము విశ్వ సినిమ
గురువు భోదల చిత్రమై గుర్తు సినిమ
చిన్ననాటినుండి స్నేహ చిత్ర సినిమ

 తెలుగు చిత్ర పరిశ్రమ తేట సినిమ
ఆత్మ గౌరవాన్ని పెంచు ఆశ సినిమ
శంకరాభరణం కథ సమయ సినిమ
స్వాతి ముత్యాల శుభలేఖ సరళ సినిమ

 భారతీయ శృతిలయలు భాగ్య సినిమ
అన్ని నీవను అధ్యంత ఆది సినిమ
రాఘవామరుగేలరా రమ్య సినిమ
సప్తపది అపద్భాన్ధవ సరయు సినిమ

 ఆమురళి జీవిత చక్రమ యమ్ము సినిమ
ఇదియు సాగర సంగమ ఇష్ట సినిమ
నిత్య సిరిసరి మువ్వలు నిజము సినిమ
కళల కాలనిర్ణయములే కథల సినిమ

దశదిశలు చాటి చెప్పిన ధరణి సినిమ
ఆత్మ గౌరవ నిలిపేటి ఆట సినిమ
ఆశయాల సాధన సంపద యగు సినిమ
స్వర్ణ కమళ శుభోదయం సత్య సినిమ

ఆత్మ పరమాత్మ లీలలు ఆది సినిమ
శివము సీతామహాలక్ష్మి గీత సినిమ
స్వాగతం జీవనజ్యోతి సమయ సినిమ
కాశి నాధుని సృష్టియే కాల సినిమ

జన్మత విధి స్వయంకృషి జన్మ సినిమ
ధ్యాన వేద మంత్రాలగా ధ్యాస సినిమ
అన్య వర్ణాలను కలుపు అలల సినిమ
మాధవ కళలు మహనీయమ్మగుట సినిమ

అమృత  కళల స్వరాభిషేక కధ సినిమ
నేరమూ శిక్ష తెలిపేటి నిత్య సినిమ
విశ్వనాధ్ సృష్టి విశ్వమై విధిత సినిమ
మనసులో నున్న మహనీయ మధుర సినిమ

వెలుగు వైపుప్రయాణము విద్య సినిమ
ప్రతి మనిషి కధ వణికించు ప్రీతి సినిమ
పూల రాగాలు పులకించు పూజ్య సినిమ
ప్రణవ ప్రణతి శృతి ప్రభువు ప్రభల సినిమ

రాజ్య కీర్తి పదవి ధనం రంగు సినిమ
బంధమే వదలి నడక భాగ్య సినిమ
విషయ భోగము విదితమై విశ్వ సినిమ
స్వాతి కిరణాల శారద సహన సినిమ

కనికరము చూపెడి కళాత పశ్విని కళ
కాశి నాధుని చెంతనే చేర్చు వేళ
కాల గర్భాణ కళసేటి కాల మిదియు 
 జన్మ ఎత్తి జాతి సినిమా జీవి నీవు

 జగతిపై హితమును జూపు జపము సినిమ
మనసు బ్రతికించు సెగలన్ని మనువు సినిమ
ఎవ్వ రెవ్వారి కళలతో యదన సినిమ
తెగి సకలము ఆత్మ పలుకు దివ్య సినిమ

 నరుడి తలపు నటన ఈశ్వర కళ సినిమ
తలపు ఘటన నడుమ కళ తపన సినిమ
విధి విధాత జీవితము యే వినయ సినిమ
ప్రణవ నాధకనుల కళ ప్రభల సినిమ

 ఒప్పు కోనిది సత్యమే ఓర్పు సినిమ
స్వేకరించ లేని నిజము స్వేచ్ఛ సినిమ
సుకృతి యే రస సిద్ధియే సుఖము సినిమ
పుట్టుక మరణం విధిగాను పుడమి సినిమ

నవగ్రహములుగా చెలియంచు నిజము సినిమ
మంచి చెడుల వివరములు మనసు సినిమ
పురష మహిళలు యత్నమే పూజ్య సినిమ
కర్మలు జమ చేసుకొనెడి కామ్య సినిమ

చివరికి మిగిలేది పలుకు చెలిమి సినిమ
కలలు తీర జీవి గమన కాల సినిమ
మలుపు మెరుపు కలలు జీవి మనసు సినిమ
మరణ మైన సహజ మౌను మార్గ సినిమ

వయసులో నున్నప్పుడు పొగ రగుట సినిమ
వయసు ఒదిగినప్పుడు ఓర్పు విమల సినిమ
వయసు పలుకు లన్ని బ్రతుకు వ్యాధి సినిమ
వయసు ఖండాతరము సాగు విద్య సినిమ
............



ఒకరి ఆలోచనలు  ఏల ఓర్పు లేక
చెప్ప అద్భుత ధారగా చెలిమి తట్టి
నట్లు, మనసున ఆకాంక్ష నయన తీర్పు
మీ పదకవితా విశ్వాస మెప్పు సలుపు

లేవు వద్దన్న ఊర్కోదు లేత మనసు
ఉంది తినమన్న ఊర్కోదు ఉత్త వయసు
మాట అరదైన ఊర్కోదు మంత్ర సొగసు
ఇదియు మునుపెన్నడు వినలే ఇష్ట కాసు

 నీవు బయట చూస్తావు లే నీడ కొరకు
నిన్ను నీవు బయట పడ లేవు నిజము
నీదు మార్గము జగతిలో నియమ ముంచి
బాహ్య జగతి మరచి ధ్యాన బంధ మేను

*ద్వి. మాటలాడే వెన్నెముక లేని జీవి
పాటపాడే సుషుమ్న కనని జీవి
నిన్నటి నన్నయ్య భట్టుగా లేని 
మొన్నటి కవి సమ్రాట్టు కనని జీవి

మధ్య వయసులో ఖర్చులు మధన కోర్క  
వృద్ధ డైనయనారోగ్య వ్యాధి నిచ్చె 
జీవి తములోన రోగము చరిత మార్చు 
దీర్ఘ రోగము లొచ్చియు ధరణి యందు 

నాది నాది అనేటిది నమ్మి యేడ్పు
వ్యాధు లన్నితో బాధతో వాది యేడ్పు
చావ లేకయు బ్రతుకుతూ జాడ్య మేడ్పు
నిత్య బాధలు, భయాలు, నమ్మి యేడ్చు  .   

ఎవరు ఈలోక మందున యవరి కెరుక
ఎటుల అన్నను మాయనె యేలు చుండెఁ 
మరక లేనట్టి మనుగడ  మనుషి లేడు 
గురక కలలకు తరగని. గుర్తు తెల్పు 

ప్రకృతి ఆక్రమణలెవరి పరము కాదు
అవసరం అవకాశమ్ము ఆశ మనిషి
నీటిని కలుషితం చేయు నిర్ణయాలు 
గాలిలో విష పూరిత గమ్ము చేరు 

మ0డు టెండలు తగులుట మాడు దెబ్బ 
వాన వరదల క్రిములతో వచ్చి  జేరు 
దుఃఖ సుఖములు వెను వెంట దురద లయ్యె 
కరువు తోను మనిషి మారి  కధలు తెల్పు  

నేలను విచక్షణముచేయు  నరుడి రీతి  
మానవ అవస రా లతో మనసు కలలు  
పుడమి తల్లి బాధ్యతలన్ని భగ్గు మనెను  
ప్రకృతి మాతకు తలవంచి  పాద మొత్తు 

చూడ బడునవి అన్నియు పూలు కావు   
చూడ లేనిది యంతయు చూపు కాదు   
మానసిక మేను  దర్శన మధుర చరిత  
ద్రష్ట దృశ్యమంత జగతి ధరణి యందు ...... 
......
తాను తనలోకి చూడక దాచు దాన్ని
గొప్ప శకలంగ ఊహించి బోధ పల్కు 
దైవ దర్శనము సులభం ధైర్య మున్న 
వ్యక్తి గతపుణ్య మిగులుయె వ్యసన శక్తి.......
......
పరధనమును ఆశించేటి పాప బుద్ధి 
పరుల మానము ప్రాణము పంచ బుధ్ధి
పరుల మాటను నమ్మియు  పాడు బుధ్ధి
పరమ భక్తి యు నటనతో పంచ బుధ్ధి...... 
......
కలియుగ మనషి బతుకుకు కామ్య బుధ్ధి
చపల చిత్తుని మార్చిన చిత్ర  బుధ్ధి 
తెలివి తెల్లా రె సరికళ్ళ తెప్ప బుధ్ధి 
తగిన రీతిలో భార్యతో తపన  బుధ్ధి...... 
......
కుసుమ కోమల హృదయాన చూపు చేరి 
వీణ నాదసంగీతము విద్య చేరి  
పరిమళించియు ఆనంద పరిమళమ్ము 
నిత్య  మెరుపుల కదలిక నీడ మనసు .... 
......
తాను ఉండియు ప్రత్యక్ష  తత్వ  శక్తి 
తాను ఉండక యెపరోక్ష ధర్మ  శక్తి 
జ్ఞాన మన్నది మేలుగా జ్ఞప్తి   శక్తి 
జనన మరణాలు నమ్మేది జీవ శక్తి 
.....
రెండు జీవ కణాలకలయిక శక్తి 
జీవిలో రసాయనిక కణాల శక్తి 
జీవి నవవిద్యు దయ కాంతి జపము  శక్తి
జీవి చైతన్య బుద్ధితొ  జన్య శక్తి
.....
కంటి పాపతో చూసిన కనుల శక్తి 
భావ మాత్రము పొందేటి బంధ శక్తి 
విశ్వ సాధన చైతన్య విద్య  శక్తి  
జీవి అంతర్గత కళల జపము  శక్తి
.....
మూర్క మనిషిని స్నేహము ముడుచు శక్తి 
విశ్వ మాయను ప్రేమమ్ము వింత  శక్తి  
మనసు నిజమును తెలుసుకొ మోక్ష  శక్తి  
చెలిమి విలువలు స్థిరము చెప్ప శక్తి  
......
దేహ పరిణామ కణముల దీన శక్తి 
కర్త అనునయ వినయము కామ్య శక్తి 
కర్మ పరిపక్వ చైతన్య కాల శక్తి 
తెలుసు కోలేని మేధస్సు తృప్తి శక్తి
.......
ఎన్ని శక్తులు ఉన్నను యేదొ శక్తి 
ముందు ఆరోగ్య ఆకాంక్ష ముంపు  శక్తి 
కలియుగ బతుకు దీక్షతో కళల  శక్తి 
ముక్తి కొరకును ధర్మమ్ము ముఖ్య  శక్తి
......

లేత పువ్వును చూడంగ లేమి బుద్ధి 
కొర్కి చితిపియు నమిలియు తొక్కి తొక్కి  
నీకు పరిమళ మివ్వగ నీవు బాధ 
పెట్టి కోపస్వభావము పెంచ బుద్ధి      
.......
మంత్ర శక్తులు అనుకోగ  మాయ ఉండు 
యోగ శక్తులు సాధన యోగ్య మేది  
యంత్ర మన్నది నిలకడ యనియు త్రిప్పు 
తంత్ర మన్నది లోకోక్తి  తత్వ బుద్ధి   
......
సుఖము వెనుకనే కష్టము శుభము నిచ్చు  
గృహము లోనికి  వెలుగులు గొప్ప గుండు  
గ్రహము లన్నియు తిరుగుచు గోల యనకు  
దైవ పూజలు కల్గించు ధైర్య బుద్ధి  
.......
ముక్తి కలుగుట దారులు, పుడమి నందు  
ప్రేమ పొందియు, కాలాను ప్రీతి జూపు  
నిగ్రహమ్ముగా, జీవితపు నియమ కళలు  
పరచి, ఉపచార లక్ష్యము ప్రముఖ మనెను  
.......  
ఆపదలురాగ బుద్ధికి యర్ధ మవదు  
సీత కోరగా బంగారు జింక కొరకు 
రాము నికల రాజ్యము యిది రమ్య చరిత  
మనము ఆర్భాటమును చేసి మనసు మార్చు  
.....    
చంకలో బిడ్డ ఉన్నను వెతికి  నట్లు  
కంటి ముందున్న వస్తువు కాన నట్లు 
మంచి మాటలు చెవులకు మక్కు వవవు  
బుద్ది పెళ్ళాము ఆశకు బుద్ది చెప్పు  
......
అద్దపు గదిలో కుక్కలా యదర బెదర  
కంది రీగలా శబ్దము కరకరకర  
తేనె టీగలా పొడిచియు తీగ లాగు 
పందిలా పిల్లలను కని పొర్లు చుండు 
......
వెకిలి వేషము ప్రాణాల్ని వెలితి చేయు   
గుబిలి పుట్టంగ గుర్రమే గుక్కు చుండు 
వావి వరుసలు లేకయు వాత పెట్టు 
దొడ్డి దారిన దొంగలా దౌడు చేయు  
......
విత్తము కొరకు చెయరాని వింత పనులు 
మత్తు మగువకు చిక్కియు మాయ మొచ్చు 
విత్తు నాటినా దేవుడే దిక్కు ననుచు 
కత్తిలా బత్క లేకయు కదల గలుగు  
......
స్త్రీని బేరము పెట్టియు సీగ్ర బుద్ది  
స్త్రీల కోరిక తీర్చక వేచి ఉండు 
స్త్రీల ఆశలు అడియాశ చేయు చుండు 
స్త్రీల బతుకులు  వేదన తీవ్రతగను  
........
వ్యక్తి బానిస కాదురా వ్యాధి అదియు   
ధైర్య సంపద కలిగియు దంచు చుండు  
వ్యక్తి  కోపము జలముపై వ్యాకరణము  
దేనురా, కాల మాయకు ధిక్కి ఉండు 


మబ్బౌ రక్త వర్ణములతో మసక వెలుగు 
రెబ్బౌ రెక్క రెపరెపల రంగు మారు  
దెబ్బౌ పిడుగులా గగనమ్ము దడలు పెరుగు 
డబ్బౌ విలువయే లేనిది ఢమరకమ్ము 

సవతి పలుకులే ములుకులై సరయు చుండు
అవని మనసును చూడని ఆట మలుపు
భవిత ఎరుగని బ్రతుకులు భయము చెందు
కవిత కనరాదు తిక్కన కవిత లోన

తెలిసి నాక పోరుసలుపు తెలప లేక
నిజము నిర్ధారణలుతెల్చె నియమ మందు
దైవ కృపవల్ల మనముగా దమన నీత
శివుని లీలలే మనలోన నిలిచి పోయె

గుండె లోని మాటలు పెదా లొలుకు పాట
అడుగులో ఆట కదిలే ను అధర మాయ
వెలికి తీయుబుధ్ధి కదిలే వేకువగను
జీవ నృత్యము జరుగుటే జపము తపము

పరచిత అపరిచితుడు గా పాఠ మగుటె
మాన అవమాన అనుమాన మధన మాటె
కాల చక్రం లో తిరిగేను కళల ఆటె
నిత్య సామాన్య మైనదే నియమ తోటె

నిద్ర కాని నిద్రయగుటే నిజము తీర్పు
గమనికయె యగు ధ్యానము గమన నేర్పు
శూన్య స్థితిగను ఆత్మయే సూక్ష్మ మగుటె
నిత్య ఆలోచనలుపోయె నిర్మలముయె

గగన గాలి ఉరవడి తో గలగలలుయె
గాలి తోమేఘముయె కుర్వగాను మేలు
వర్షముగనులే వృక్షాలు వరుస పెరుగు
మంచిహృదయమే తోడుగా మనసు కలయు

గడప గుండెపట్ట దలిచె గడుసు తనమె
చేసి నామంటు ధనమునే చేత పెట్టు
యాత్ర యె ప్రభుత్వ పరమేగ యేమి పలుకు
తిన్న జీర్ణమగుట ఇంక తినుట కేను

లొంగి ఓటువేయు జనులు లోలకమగు
గుండె పూల కుండీలోన గుట్టు విప్పి
నిత్య పుష్ప పరిమళమ్ము  నీకు నాకు
సుందర సురభి శోభిత సుఖము శాంతి

కుసుమ మంత్రణం జీవితం కూడు గుడ్డ
తనువు మరుగెడు నీటిలో తరిగి నట్లు
మనసు కలతకు చిక్కియు మరిగి నాట్లు
చిత్త మేలేక నిష్క్రతి చెదిరి నట్లు

చిక్కులు ఎగిరే దూది లా చెదిరి నట్లు
చిత్త వృత్తినిరోధించె చేష్ట లుడికె
నిగ్రహమ్ముగా సాధన నెంచ నేల
సకల సంపదలు కలుగ సౌఖ్య మేది

విశ్వ మందునే జనులలో విజయ గోల

ఉన్న ఆ ఒక్కటే లేక ఉరికు పరుగు
ప్రేమ ఉన్నతిండికి అది పెనుగు లాట
ధనము నన్ను ఆశల వేట దుమ్ము లాట
సరస సంభాషణలు తెల్పె సరుయు మాట

రాత్రి చోరుని కార్యము రంగరించి 
నిద్ర మేము జయించు నిర్మలమ్ము 
రక్షగా విశ్వమంతయు రాత్రి యందు 
నిద్రపోని శునకములా నీడగుండు     

జాలి చూపుల జాబిల్లి జామురాత్రి 
చల్ల చల్లగా వెచ్చగా చరిత చెప్పు
పంఖ తిరుగుతూ నన్నునూ పట్టలేరు 
కీచురాళ్ళ శబ్దాలుగ కిటికి చెప్పు   

అంధకారపు వేళలో అలుక తీర్చి 
ఆదమర్చియు నిద్రలో ఆశ తీర్చి 
భద్రతయు కుటుంబములలొ భర్త ఓర్పు        
భయము లేదులే చెప్పిన భర్త తీర్పు 

వ్యధ మాపియు హాయిగా వాయిదాను 
వరుస మార్చియు సుఖమును వాక్కునిచ్చి
వాలు కన్నుల వరజాక్షి వరము తీర్చి 
ఒడుపు పట్టుకు బిగింపు ఓర్పు చూపె 

గుండెనేరాన్ని తలపక గంటు పడ్డ   
రాత్రి రాకాశి అరుపులు రమ్యగున్న 
రవ్వ వెలుగున రంజిల్లె రతిగ రాత్రి 
నీరుకారి పోయేదిగా మంచు కరిగె 

మగువ మనసున మక్కువ మగని చూపు 
చూపు కనరాని మనసున చేష్ట లుడుకు 
చెప్ప నలివికానికబుర్లు చెప్పు చుండి 
బంతి చామంతి ఏకమ్ము భాగ్యమవ్వు 

నిద్రపోనియ్యకుండగా నిజాము చెప్ప  
భావ భవభంద విషయము బాధ తెల్పి 
జన్మ పరిపక్వతను తెల్పి జాతరంత       
సలిపి మనసు మనసునందు సలపరింత 

రాత్రి మెల్ల మెల్లగను జారు రక్షకుండు  
వెలుగు నీవంతు ఇంకను విలువ ముద్దు  
ఒకరి తర్వాత పనులుగా  ఒకరు వచ్చె 
భార్య భర్తల ప్రేమలు భాగమయ్యె 

నిత్య నవజీవితమ్ముగా నిజము మలుపు
ఉభయ హృదయాల సరిహద్దు ఉవ్వి లూరి
 వయసు వలపుల వర్ణాలు వన్నె తెచ్చె
వధువు వరుల విరహ జోల వాసి కెక్కె

తేటగీత పద్యాలు  
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

కదన రంగము స్వర్గమై కదల వెలుగు
చెదలు పట్టిన తరువుయే నేల కొరుగు
అదును తప్పిన గుణముయే ఆట మెరుగు
చదును చేయు బుద్ధి నిజము చెప్ప గలుగు ... 1 
.....
వదలి వెళ్లిన మనసేను వలపు ధనము
కదిలె కాలాల అనుభూతి కథల ముదము
చెదిరె బుద్ధి కుశలతలు చితక తనము
ముదిరె వయసుకు సుఖములు మఖ్య గుణము ... 2
.....
అదుపు తప్పిన వసుధనం ఆటపట్టు
పొదుపు చేయు మూలధనము పోరు పెట్టు
చదువు లున్న ఆశధనము  జాడ్జ్య మెట్టు
కుదుపు లున్న మనసుధనం కూడు పెట్టు ... 3
.....
పొదల మాటున మృగములు తొంగి చూడు
వదల బుద్దియు మార్చియు వెతికి చూడు
కదిరి లాగతిరిగి లోక కలలు చూడు
ముదిరి బెదరక భాధలు ముందు చూడు   ... 4
.....
పదవి యందు కోరిక చేర పగటి కలలు
పెదవి మధురాను భవముయే పెర్చు వెతలు
పిదప బంధుననిపలికె పేరు కథలు
మదము చే మనుగడ ముప్పు మాయ సొదలు ... 5
......
వరము కోరి నీతొ వాక్కుగా తెల్పితి
కరుణజూపుమమ్మ శారదాంబ
కరము జొచ్చి కోరె కామితార్ధినియమ్మ
శరణు ఘోష నీకు శాంతి నిమ్ము
.....
చినుకు లేని రాజ్యమున నే చింత లేల
మతము పెట్టని కూడుకు మానమేల
కమిలిన శవాలు కంపుయే కధలు యేల
తల్లి నేలను చీల్చేటి తురుము నందు
......
నీకు సూర్యోదయాన్నిలె నిమ్మకుండు
నీవు సూర్యాస్తమనకులే నిన్ను మార్చు
నీకు శిశిరంలొ వాసంత నీదు వాక్కు
నీవు హేమంతము చదువు నీకు రక్ష
.....
విద్యలలొ అవిద్య యనుట విధము ఏల
పొందినది లోక కల్యాణ పద్ధతి యగు
అనుభవంతో ను తెల్పిన ఆశ అనకు
జ్ణాన మెప్పుడూ గొడ్డలి గాటు కాదు
.....
ఉద్దెరసలహా భవితకు ఊత మవదు
తాతకు అనవసరము గా సాగు కధలు
రైతు దేశము మనదియే రకము లేల
పంటకుయె గిట్టు బాటే ది ఫలము ఏది
........
మగువ నిద్ర మధువు తోను మనసు కూర్చి
పాత్ర లింకయు కలలుగా పడక మార్చి
గాజు రెప్పల బ్రతుకును గడప నుంచి
వచ్చి పోవు వారికి వేడి వరుస మార్చె
......
కళ్ళు చెమ్మగిళ్ళె నటన కాల మగుట
పట్టుదలతో ను కధలకు ప్రాణ మిచ్చె
తాత వారస నటనతో తెలుగు భాష
నందమూరి తారక రామ నాట్య రుద్ర
---
ప్రేమ చూపిన మాత్రాన పేరు రాదు
సమయ సద్విని యోగమే సహన మవదు
ఓర్పు ఓదార్పు వినయమ్ము ఓడిపోదు
అందుకే ప్రేమ ఓర్పు యే ఆదు కొనుట
...
మాతలకు మాత ద్రౌపతి మాన మిచ్చె
గౌతముని పత్ని అహల్య గౌరు జూపె
సుమతి సుఖము స్వేచ్ఛ కు నాంది సూత్ర మాయ
మాతలకు మాత విటులకు మాత వేశ్య
....
ధ్యానమే పరధ్యానమై దారి మార్చె
మనసు కల్లోల పరుచేను మాయ జేరి
నేను ఘటములా నుండినా నియమ మేది
కరువు వరదలు భయముగా కమ్ము చుండె
.....
*..వెన్ను తట్టెను హృదయము వేకువగుటె
విన్నపమ్ములు వివరాలు విజయమగుటె
విశ్వ సందేశ మైనది విదియ యనుటె
మాతరంఅను శ్రీ రామ మహిమ యనుటె
....
జన్మ జన్మల బంధము జపము రామ
రామ రామయనుచు కార్య రక్ష ధీర
విద్య సాహసం సంపద కల్గి వినయ మూర్తి
కార్య దీక్ష దక్షత కల్గి కావ్య వీర
......
నాది నీది నాడి నడక నాటక మగు
ఏది నీది వేడి చురక ఏత మగుట
ఆది నున్నది అదియేను ఆశ తలపు
వాది యై ప్రతి వాదిగా వాద మేల
.......
మనిషికి సుఖము లేదులే మనసు గతియు
స్థితికి మనిషి వెతలు పొందు సిరుల గతియు
సిరులు పొంద ఇంతి కలలు స్థిరము గతియు
మర్చి పోవడానికి మత్తు మందు గతియు
.......
చెప్ప నెట్టివాడను నేను చెలిమి బ్రతుకు
తప్పు ఒప్పులు పైవాడు తట్ట గలుగు
తరతమ యనక ఒక్కడై తడుము కొనుట
మేలు చేయ మనసు శాంతి మీకు నాకు
.......
నిజము గుండె తట్టు పలుకు నీడ యగుట
వైద్య వృత్తి నిజము తృప్తి వేడకగుట
నీ అబద్ధము తక్షణం నిజము యగుట
అర్ధ మగుటేను విలపించు ఆత్మ ఘోష
......
చెత్త పోతె దుర్వాసన చింత ఏల
ధనము లేదు బంధువు దుర దేది నీకు
కీర్తి పోతె కుక్క అరుపు కిచకిచలగు
నీదు ఆరోగ్య మే పోతె నీడ కరువు
.......
నాలొ నీవు నీలో నేను నటన యగుట
గోల లేని బ్రతుకు నేడు గొప్ప యగుట
బేల పలుకుల ప్రేమయే బోధ యగుట
గాయమైన తేరుకొను గమ్య మగుట
ఊహల కల ఊరుతునుండి ఊయల గుట
ఉరకల పరుగులు వేయ ఉద్య మగుట
పారుతున్న ఆలోచన కాల మగుట
అంతరంగాన్ని ఆడిస్తుఆశ యగుట
తలపులు తడుతూ తడిపొడి తపన యగుట
తందనాలాడుతున్నాయి తపన లగుట
యోచనలు వెంటబడుతున్న ఎల్ల లగుట
హృదయమే ఊగిసలగుటే హాయి గనుట
చింతనలు చాల పుడుతున్న చేష్ట లగుట
చలిత చిత్తము చంచలం చేయ ననుట
వంటిలోకొస్తున్న మనసు వర్ణ మగుట
విరివిగాచేయమంటున్న వినయ మగుట
భావము బయటకొస్తున్నను బంధ మగుట
కల్పనలు కడుతోస్తున్న కలలు కనుట
కమ్మనికవితలగుటయే కథలు యగుట
కలలు కోకొల్లలుగనులే కలసు కొనుట
వ్యక్తపరచమంటున్నాయి వయసు యగుట
అనుభవాలు కలుగుతున్న ఆశ లగుట
చక్కనికవితలు సృష్టియె చిత్తమగుట
మనసు మారముచేస్తున్న మనుగడ గుట
మది బయటకొస్తానంటు మేలు యగుట
మనసు మురిపించు నంటుంది మార్గ మనుట
కాలమే మనిషికి విధి కర్త యగుట
దేశమే సుఖ ప్రాప్తికి దివ్వె యగుట


తే.గీ  పుట్టుకకు మూల మేబేల పుడమి నందు
నిత్య వెలుగును అందించె నీడ తోడు
జాతి దాసోహ మనుటయే జగతి వెలుగు
ఆరని వెలుగై అమ్మగా ఆశ్రిత మది

తే.గీ సృష్టి వలయం వనిత బంధ శృతులు గతులు
ప్రతిఘటన నారికే గతి ప్రగతి రీతి
బందనా ప్రతి బంధాలు బాధ్యతగుట
కనబడు మనుష్య జాతికి కళలు నేర్పు

తే.గీ తిరుగులేని వేదన తోను తీవ్ర బాధ
మాతృ ప్రసవ సృష్టి జగతి మార్గ బోధ
వికృత చేష్టలున్నను ఓర్పు వినయ వనిత
ఎదురు తిరుగు హృదయ బాధ ఏమి చెప్ప

తే.గీ ధనమదాందులు పెరిగిరి ధరణి యందు
వావి వరుసలు చూడని వాద పురుష
తల్లి తండ్రుల పంచెడి తనయులగుట
గర్భ శోకమే ఆతల్లి గడవ లేక
***

నిన్ను పిల్వ లేను తల్లి నీదు చలిమి చాలులే
కన్ను మార్చి నేను పోను కనుల విందు చేసేదా
వెన్ను చూపె బుద్ధి లేదు వేచి సేవ నీకులే
నన్ను నమ్మి నావు నీవు నాదు భక్తి నీకులే

కడలి లో యెడతెగనిసిరి కాల మార్పు సంద్రమై 
విడమరచని గుప్తమౌను విశ్వవాకి టేయిదీ  
తడబడు అలలసుడు లేను తట్టలేని గమ్యమై 
విడిపడకయు లవణ మేను విశ్వమందునే విధీ  
 
ఆశ అన్నదేను కోరి పాశ మెనూ జీవితం    
నాశనమ్ము కాని బుద్ధి నటన తోను పాశమై 
శ్వాస కోరి జీవనమ్ము  సాధ్య కళల బంధమై      
ధ్యాస సంగ మౌట నిజము ధ్యాన మార్గ విశ్వమై
  

2, జనవరి 2024, మంగళవారం


శ్రీమద్రామాయణము || ఉత్తర కాండము

మొదటి సర్గ.(1)


రామ రావణ యుద్ధంలో రాముడు రావణుని సంహరించాడు. రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యకు వచ్చాడు. భరతుడు అప్పటి దాకా తాను పాలిస్తున్న అయోధ్యను రామునికి తిరిగి

సమర్పించాడు. రాముడు అయోధ్యారాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. జనరంజకంగా రాజ్యపాలన చేస్తున్నాడు.

రాముని అభినందించడానికి ఎందరో మహామునులు రాముడి ఆస్థానానికి వచ్చారు. తూర్పుదిక్కు నుండి కౌశికుడు, గార్యుడు, గాలవుడు, కణ్వుడు మొదలగు మహామునులు వచ్చారు.

అలాగే దక్షిణ ప్రాంతము నుండి ఆత్రేయుడు, నముచి, ప్రముచి,

అగస్త్యుడు, సుముఖుడు, విముఖుడు వచ్చారు. వారందరికీ అగస్త్యుడు పెద్దగాఉన్నాడు. పడమటి దిక్కునుండి పృషంగుడు, కవషి, ధౌమ్యుడు, కౌషేయుడు మొదలగు మహా మునులు తమ తమ శిష్యులను వెంట పెట్టుకొని రాముని ఆస్థానమునకు వచ్చారు. ఉత్తర ప్రాంతము నుండి వసిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అనబడే సప్తఋషులు అక్కడకు వచ్చారు. వారందరూ రాముని వద్దకు వచ్చి ద్వార పాలకుల ద్వారా తమ రాకను గురించి రామునికి తెలియ జేసారు. రాముడు వెంటనే వారినందరినీ లోపలకు ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు. రాముడు ఆ ఋషులనందరినీ సాదరంగా ఆహ్వానించాడు. వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. వారిని ఉచితములైన ఆసనముల మీద ఆసీనులను చేసాడు. ఋషులందరూ సుఖాసీనులు అయిన తరువాత రాముడు ఆ ఋషుల క్షేమములు అడిగి తెలుసుకున్నాడు. వారు రామునితో ఇలా అన్నారు. “రామా! నీ పరిపాలనలో మేము అందరమూ క్షేమముగా ఉన్నాము. నీవు రాక్షస సంహారము చేసి ఋషులకు మునులకు ఎంతో మేలు చేసావు. లోకకంటకుడైన రావణుని చంపావు. ముల్లోకములను జయించ సమర్థుడవైన నీకు ఆ రావణుని చంపడం అతి తేలికైన పని. నీవు ఒక్క రావణునే కాదు, ప్రహస్తుని, విరూపాక్షుని, మహోదరుని, అకంపనుని, త్రిశిరస్సుని, అతికాయుని, దేవాంతక, నరాంతకులను, కుంభనికుంభులను, యుద్ధోన్మత్తుని, మత్తుని, యజ్ఞకోపుని, ధూమ్రాక్షుని ఇంకా ఘోరకృత్యములు చేయు అనేక మంది రాక్షసులను కూడా సంహరించావు. వారంతా మునులకు ఋషులకు ఎంతో అపకారము చేసినవారు. వారంటే దేవతలు కూడా భయపడతారు. అటువంటి వారందరినీ చంపి లోకానికి ఎంతో మేలుచేసావు. రామా! రావణుని తమ్ముడు కుంభకర్ణుడు సామాన్యుడా! అటువంటి వాడిని నీవు తుదముట్టించావు. నీ పరాక్రమము అత్యంత శ్లాఘనీయము. రావణ కుమారుడు ఇంద్రజిత్తు సాక్షాత్తు ఇంద్రునే జయించిన వాడు. అటువంటి వాడిని లక్ష్మణుని చేత చంపించావు. ఎవరి చేతకూడా చంపబడని ఇంద్రజిత్తు మరణించాడని వార్త విని మేమంతా ఎంతో ఆశ్చర్యపోయాము. రావణుని, కుంభకర్ణుని, ఇతర రాక్షస వీరులను చంపడం అంత గొప్ప పని కాదు. కాని ఇంద్రజిత్తును చంపడం మీ అదృష్టమే అనుకోవాలి. ఇంద్రజిత్తును చంపి విజయం పొందడం సామాన్యమైన పని కాదు. ఎందుకంటే యుద్ధములో ఇంద్రజిత్తును ఎవరూ చంపలేరు. అందుకని

ఇంద్రజిత్తు మరణం మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఓ రామా! నీవు లోకంటకులైన రాక్షసులనందరినీ చంపి రావణ సంహారము చేసి సీతతో మాకు అభయాన్ని ప్రసాదించావు. కూడా అయోధ్యకు తిరిగి వచ్చి, రాజ్యపట్టాభిషిక్తుడవైన నిన్ను చూడటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. పదునాలుగు సంవత్సరముల తరువాత నిన్ను నీ భార్యతోనూ, నీ సోదరులతోనూ, నీ తల్లులతోనూ చూడటం మాకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది." అని ఆ మునులు రాముని ఎంతో శ్లాఘించారు. వారి మాటలు విన్న రాముడు చేతులు జోడించి వారికి

నమస్కరించి ఇలా అన్నాడు. “ఓ మహామునులారా! రావణుడు,

కుంభకర్ణుడు, ప్రహస్తుడు మొదలగు వారు మహావీరులు. వారందరినీ

కాదని మీరు ఇంద్రజిత్తును మాత్రమే పొగుడుతున్నారు. కారణం ఏమి? ఎందుకంటే మహోదరుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మత్తుడు, ఉన్మత్తుడు, దేవాంతక, నరాంతకులు, అతికాయుడు, త్రిశిరస్సు, ధూమ్రాక్షుడు, తక్కువేం కాదు. వారందరూ మహా బలవంతులు. పరాక్రమవంతులు. యుద్ధవిశారదులు. అటువంటి వారిని వదిలిపెట్టి కేవలం ఇంద్రజిత్తును మాత్రమే ఎందుకు ప్రశంసిస్తున్నారు? ఇంతకూ ఈ ఇంద్రజిత్తు ఎవరు? అతనికి ఆ పేరు ఎలా వచ్చింది? అతని బల పరాక్రమములు ఎటువంటివి? అతడు ఎందుకని రావణునికంటే కుంభకర్ణునికంటే ఇతర రాక్షస వీరుల కంటే గొప్పవాడయ్యాడు? అతడు దేవేంద్రుని ఎలా జయించగలిగాడు? అతడు ఎవరి వలన వరములు పొందాడు? తండ్రి కన్నా కుమారుడు ఎలా బలవంతుడు అయ్యాడు? దయచేసి నాకు తెలియజేయండి." అని అడిగాడు రాముడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము మొదటి సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్









శ్రీమద్రామాయణము ||ఉత్తరకాండము

ముప్పదియవ సర్గ. (30)


దేవతా గణము లన్నీ పరుగు పరుగున బ్రహ్మ దేవుని వద్దకు

వెళ్లాయి. దేవతా గణములందరూ జరిగిన సంగతి అంతా

బ్రహ్మదేవునికి చెప్పారు. ప్రస్తుతము ఇంద్రుడు రావణుని వద్ద లంకలో

బందీగా ఉన్నాడు అని విన్నవించుకున్నారు. దేవతాగణములను

వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు లంకానగరానికి వచ్చాడు. తన

పుత్రులతోనూ సోదరులతోనూ కూర్చుని ఉన్న రావణుని చూచాడు.

రావణునితోఇలా అన్నాడు. “కుమారా! రావణా! దేవతలు రాక్షసుల యుద్ధంలో నీ కుమారుడు మేఘనాధుడు తన అసమాన పరాక్రమాన్ని చూచాడు. నాకు చాలా సంతోషం అయింది. అటువంటి పరాక్రమవంతుడు నీకు కుమారుడిగా జన్మించడంతో నీ జన్మధన్యము అయింది. వీరత్వంలో నీ కుమారుడు నిన్ను మించిపోయాడు. నీవు కూడా సామాన్యుడికి కావు. మూడులోకములను జయించావు. త్రిలోకాధిపత్యము పొందుతాను అన్న నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ముల్లోకములో కెల్లా అత్యంత బలవంతుడు, వీర్యవంతుడు, ఇంద్రునే జయించి బంధించిన నీ కుమారుడు మేఘనాధుడు ఈ రోజు నుండి ఇంద్రజిత్తు అనే పేరుతో ప్రసిద్ధుడు అవుతాడు. అతని సాయముతోనే

కదా నీవు దేవతలను జయించగలిగావు. కాని ఒక్క మాట! ఇంద్రుని 

బంధించడం ధర్మం కాదు. అతనిని వెంటనే విడిచిపెట్టు. ఇంద్రుని విడిచి పెట్టడానికి దేవతలు నీకు ఏమి ఇవ్వాలో అడుగు." అని అన్నాడు బ్రహ్మ. ఇంద్రజిత్తు బ్రహ్మదేవునికి నమస్కరించి "దేవా! నేను

ఇంద్రుడిని వదిలిపెట్టాలంటే నాకు చావులేకుండా వరం ప్రసాదించు.”

అని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. “కుమారా!

పుట్టినవాడు చావక తప్పదు. ఇది కాలధర్మము. ఏ ప్రాణి కూడా

కలకాలము మరణం లేకుండా జీవించలేదు. మీరే కాదు మానవులకు,

జంతువులకు కూడా మరణం లేకుండా జీవించడం దుర్లభం. కాబట్టి

నీకు మరణం లేకుండా వరం ప్రసాదించడం కుదరదు.” అని చెప్పాడు

బ్రహ్మ. అప్పుడు మేఘనాధుడు ఇలా అన్నాడు. “దేవా! నేను

ఇంద్రుడిని విడిచిపెట్టాలంటే నాకు మరొక వరము ప్రసాదించండి.

నాకు ఒక దివ్య రథమును ఇవ్వండి. నేను యుద్ధమునకు బయలు

దేరే ముందు నాకు విజయము, శత్రువులకు వినాశము కలగడానికి

హెూమం చేస్తాను. నేను ఆ హెూమం పూర్తి చేసి కానీ యుద్ధ

రంగములో ప్రవేశించను. అప్పుడు ఆ అగ్ని గుండము నుండి ఒక

దివ్యమైన రథము నా ముందు ప్రత్యక్షం కావాలి. నేను ఆ రథము ఎక్కి యుద్ధం చేస్తాను. నేను ఆ రథము మీద ఉన్నంత వరకూ నాకు

మరణం లేకుండా వరం ప్రసాదించండి. ఏ కారణం చేతనైనా నేను

హెూమం పూర్తి కాకుండా యుద్ధరంగంలో ప్రవేశిస్తే, నాకు మరణం

రావచ్చు. కనీసం ఈ వరం అన్నా నాకు ఇవ్వండి. లేక పోతే నేను

ఇంద్రుడిని విడిచిపెట్టను. ఓ బ్రహ్మదేవా! ఋషులు, మునులు అందరూ తపస్సుచేసి అమరత్వమును కోరుకుంటారు. కాని నేను నా వీరత్వమును చూపి, నాకు అమరత్వము సిద్ధింపజేయమని

కోరుతున్నాను. ” అనిఅన్నాడు మేఘనాధుడు. " మేఘనాధుడు కోరిన కోరికకు బహ్మదేవుడు ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు. “నీవు కోరిన కోరిక సిద్ధిస్తుంది” అని దీవించాడు. మేఘనాధుడు ఇంద్రుని విడిచిపెట్టాడు. ఇంద్రుని తీసుకొని బ్రహ్మదేవుడు, దేవతాగణములు స్వర్గలోకమునకు వెళ్లిపోయారు.” రామా! మేఘనాధునికి ఇంద్రజిత్తు అనే పేరు ఇలా వచ్చింది.” అనిఅగస్త్యుడు రామునికి మేఘనాధునిగురించి వివరించాడు. అగస్త్యుడు ఇంకా ఇలాచెప్పసాగాడు. “రామా! ఇంద్రుడు స్వర్గలోకము వెళ్లిన తరువాత అతని ముఖంలో తేజస్సు అంతా తగ్గిపోయింది.. ఇంద్రుడు ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. దీర్ఘాలోచనలో మునిగి ఉన్న దేవేంద్రుని చూచి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. “ఇంద్రా! నీవే చేయకూడని పని ఏదో చేసావు? ఎందుకు చేసావు? నేను ఒకే వర్ణము, ఒకే భాష, ఒకే రూపము కల ప్రజలను సృష్టించాను. వారిలో ఎట్టి బేధభావము లేదు. నేను ఆ ప్రజలను గూర్చి ఆలోచిస్తున్నాను. అప్పుడు నేను మానవుని ప్రతి అవయవము నుండి శ్రేష్టమైన భాగమును తీసి, వాటితో ఒక స్త్రీని సృష్టిచేసాను. ఆ స్త్రీపేరు అహల్య. హలము అంటే వికారము అయినది. వికారములు

కలది. ఈమె ఎలాంటి వికారములు లేనిది కాబట్టి ఆమె అహల్య

అయింది.

 (హలము అంటే నాగలి. అది వికారంగాఉంటుంది. పైకి ఒక

కర్ర లేచి ఉంటుంది. దానిని మేడి అంటారు. దానిని పట్టుకొని పొలం

దున్నుతాడు రైతు. కిందికి ఒక కర్రులాగా ఉంటుంది. అదిభూమిలోకి

చొచ్చుకుపోతుంది. ముందుకు ఒక పొడుగాటి కర్ర ఉంటుంది. దాని

కొసన కాడి కడతారు. ఆ కాడికి ఎద్దులు కడతారు. దీనిని నాగలి,

అరక, హలము అంటారు.)

ఎలాంటి హల్యము లేనిది కాబట్టి ఆమెకు అహల్య అనే పేరు

సార్థకము అయింది. అందుకే ఆమెకు ఆ పేరు పెట్టాను. ఆమెను

ఎవరికి ఇచ్చి వివాహము చెయ్యాలా అని ఆలోచించాను. అప్పుడు

“నేను ఇంద్రుడిని. ఆమెను నాకు ఇచ్చి వివాహం చెయ్యండి" అని నీవు నన్ను అడిగావు. కాని అప్పటికే అహల్యను గౌతమునికి పరిచర్యలు చేయడానికి ఆయన వద్ద ఉంచాను. నేను పెట్టిన గడువు తీరిపోగానే గౌతముడు అహల్యను తిరిగి నాకు అప్పగించాడు. గౌతముని నిగ్రహ శక్తిని, అతని మానసిక బలాన్ని పరీక్షించి, అహల్యకు అతనే తగిన వరుడని నిర్ణయించాను. అహల్యను గౌతమునికి ఇచ్చి వివాహము చేసాను.అహల్య నీకు దక్కలేదని నీవు నిరుత్సాహపడ్డావు. కాని నీవు అహల్య మీద ఉన్న కోరికను చంపుకోలేకపోయావు. నీవు గౌతముని

ఆశ్రమమునకు వెళ్లి ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేసావు. కామంతో

ఆమెతో రతిక్రీడలు సలిపావు. నువ్వు తన ఆశ్రమంలో ఉండగా

గౌతముడు నిన్ను చూచాడు. నీవు చేసిన అకృత్యానికి గౌతముడు

నిన్ను శపించాడు. “ఓ ఇంద్రా! నేను ఇంటలేని సమయంలో నీవు నా

భార్యను అనుభవించావు. ఆ పాపానికి ప్రతిఫలంగా నీవు నీ

శత్రువులచేత బంధింపబడతావు. ఓ ఇంద్రా!ముల్లోకములను

పాలిస్తున్నావు. నిన్ను చూచి లోకములలో ప్రజలు కూడా నీ పాపపు

పనులను అనుసరిస్తారు. అందుకని నీ పాలనలో ఉన్న ప్రజలు ఏ

పాపం చేసినా అందులో సగభాగం నీకు సంక్రమిస్తుంది. నీకు ఈ

ఇంద్రపదవి స్థిరంగా ఉండదు. నీవు రాక్షసులు, దైత్యులు, అసురుల

భయంతో అనుక్షణం భయం భయంగా బతుకుతావు. నీవే కాదు. నీ

తరువాత ఇంద్రపదవిని ఎవరు అధిష్టించినా ఎవరూ ఆ పదవిలో

స్థిరంగా ఉండరు. ఇది నాశాపము" అని శపించాడు. తరువాత గౌతముడు అహల్యను చూచి ఇలా అన్నాడు. “ఓసి దుర్మార్గురాలా! నీవు తక్షణమే నా ఆశ్రమమునుండివెళ్లిపో, నీకు ఉన్న అందం చందం, రూపం యౌవనం వీటితో మదించి నీవు చెడు దారిలో నడిచావు. నీవే కాదు నీ కన్నా అందమైన వాళ్లు యౌవనంలో ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కాని వాళ్లు నీ మాదిరి చెడుదారి తొక్కలేదు. ఈ రోజునుండి మూడులోకాల్లో ఉన్న జనులు నీ కన్నా అందంగా, మంచి రూపంతో, యౌవనంతో విరాజిల్లుతారు.” అని అన్నాడు. అహల్య గౌతమునితో ఇలా అంది. “ఓ మహర్షీ! నేను ఏ తప్పూ చేయలేదు. ఇంద్రుడు తమరు ఇంటలేని సమయమున తమరి రూపంలో వచ్చి నన్ను అనుభవించాడు. ఇందులో నా తప్పు ఏముంది. నన్ను క్షమించండి" అని ప్రాధేయపడింది. అప్పుడు గౌతముడు ఇలా అన్నాడు. “రాబోవు యుగంలో ఇక్ష్వాకు వంశంలో రాముడు అనే పేరుతో ఒక క్షత్రియుడు జన్మిస్తాడు. ఆయన ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అతడు ఒక బ్రాహ్మణుని పని మీద ఇక్కడకు వస్తాడు. రాముని చూడగానే నీవు పవిత్రురాలవు అవుతావు. నీవుచేసి పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాముడే సమర్ధుడు. రాముడు నీ వద్దకు వచ్చినపుడు నీవు రామునికి ఆతిథ్యము ఇచ్చి సత్కరించు. ఆయన నిన్ను కరుణిస్తాడు. తరువాత నీవు నా దగ్గరకు వచ్చి నాతో ఉండవచ్చును." అని పలికి గౌతముడు ఆశ్రమమునకు వెళ్లిపోయాడు. తరువాత అహల్య చాలా కాలము తపస్సు చేసింది.

ఓ ఇంద్రా! నాడు నీకు గౌతముడు ఇచ్చిన శాపము ఈ నాడు నీకు ఇలా పరిణమించింది. నీవు అహల్య పట్ల చేసిన అపచారమును గుర్తుకు తెచ్చుకో! ఆ పాపకారణము చేతనే నీవు రాక్షసునిచేత బంధింపబడ్డావు. నీవు వెంటనే విష్ణుయాగము చెయ్యి. నీకు ఆ పాపము నుండి విముక్తి లభిస్తుంది. తరువాత స్వర్గమునకు

వెళ్లు. నీ కుమారుడు జయంతుడు క్షేమంగా ఉన్నాడు. జయంతుని

తాతగారు జయంతుని తీసుకొని పోయి దాచిపెట్టాడు. అతడు

క్షేమంగా నీ వద్దకు వస్తాడు." అని అన్నాడు. తరువాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్లిపోయాడు. తరువాత ఇంద్రుడు విష్ణుయాగము

చేసి స్వర్గలోకమునకు వెళ్లిపోయాడు.


(ఈ కధ మనకు కొత్తగా ఉంది కదూ! బాలకాండలో ఉన్న

కధకన్నా భిన్నంగా ఉంది. మనకు ఈ ఉత్తర కాండ కన్నా వాల్మీకి చేత

రచింపబడిన బాలకాండయే ప్రమాణము.)


ఓ రామా! నీకు ఇంద్రజిత్తు గురించి అతని బలపరాక్రమముల గురించి వివరంగా చెప్పాను. అతడు సాక్షాత్తు ఇంద్రునే జయించి బంధించాడు. ఇతరులు ఒక లెక్కా!" అని అన్నాడు అగస్త్యుడు.

అగస్త్యుడు చెప్పిన మాటలు విన్న రాముడు, అతని తమ్ములు, వానర ప్రముఖులు ఎంతో ఆశ్చర్యపోయారు. విభీషణుడు కలుగచేసుకొని “మునీంద్రా! మీరుచెబుతుంటే నా చిన్ననాటి స్మృతులు

గుర్తుకువస్తున్నాయి.” అని అన్నాడు. “రామా! రావణుని జన్మ వృత్తాంతము, అతని కుమారుడు మేఘనాధుని జన్మ వృత్తాంతము అతని బలపరాక్రముల గురించి వివరంగా చెప్పాను." అని అన్నాడు అగస్త్యుడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పదియవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్


శ్రీమద్రామాయణము ||ఉత్తరకాండము

ముప్పది ఒకటవ సర్గ. (31)


తిరిగే కాలూ తిట్టే నోరూ ఊరుకుండవు అని లోకోక్తి.

యుద్ధం యుద్ధం అంటే తిరిగే రావణునికి ఎవరితోనో ఒకరితో

కయ్యానికి కాలుదువ్వనిది నిద్రపట్టడం లేదు. దేవలోకమును జయించి ఇంద్రుడిని బందీగా పట్టుకున్న తరువాత ఆ దురద మరీ ఎక్కువ అయింది. కాని రావణుని విపరీతమైన యుద్ధకాంక్ష గురించి విన్న రామునికి ఒక సందేహం వచ్చింది. అగస్త్యునితో ఇలా అన్నాడు.

“మునీంద్రా! దుర్మార్గుడు, క్రూరుడు అయిన రావణుడు ఈ ప్రకారం యుద్ధం పేరుతో పీడిస్తుంటే అతనిని అడ్డుకునేవాళ్లు అతని

యుద్ధోన్మాదానికి అడ్డుకట్ట వేసేవాళ్లు క్షత్రియులు కానీ, క్షత్రియేతరులు

కానీ, ముల్లోకాలలో ఎవరూ లేరా! ఎవరికీ పరాక్రమమూ వీరత్వమూ

లేవా! ఎవరికీ రావణునితో సమానంగా అస్త్ర శస్త్ర విద్యానైపుణ్యము

లేదా! ఎవరికీ రావణునికి ఉన్నంత సైనిక బలం లేదా! లేక ఆ రోజుల్లో

క్షత్రియులందరూ భోగలాలసులై తమ పరాక్రమమును వీరత్వమును

మరిచిపోయి, అస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకోవడంలో శ్రద్ధ చూపలేదా! '

అని అడిగాడు. "“ఎందుకు లేరు రామా! ఆరోజుల్లో కూడా వీరాధి వీరులు, అమితమైన పరాక్రమవంతులు, యుద్ధ విద్యలో ఆరితేరిన వారు ఉన్నారు. కొంతమందికి కాలం కలిసిరాక ఓడిపోతే, మరి కొందరు మనకెందుకులే అని నిర్లిప్తంగా రావణునికి లొంగిపోయారు. దేనికైనా సమయం రావాలి కదా! యుద్ధోన్మాదంతో విర్రవీగుతున్న రావణునికి కూడా పతనం ప్రారంభం అయింది. అందుకనే రావణుడు నర్మదా నదీ తీరంలో ఉన్న మాహిష్మతీనగరాన్ని పరిపాలించే కార్తవీర్యార్జుని మీదికి యుద్ధానికి వెళ్లాడు. కార్తవీర్యార్జునుని అమాత్యులను పిలిచి “నేను రావణుడను. మీ రాజు మీదికి యుద్ధానికి వచ్చాను అని చెప్పండి. నాతో యుద్ధం చేస్తాడా లేక ఓడిపోయానని ఒప్పుకొని నాకు దాసోహం అంటాడా. " అని హుంకరించాడు రావణుడు. దానికి అమాత్యులు “కార్తవీర్యార్జునుడు నగరంలో లేడు. విహారానికి వెళ్లాడు” అని చెప్పారు. “మీరాజు ఎక్కడ ఉన్నాడో చెప్పండి" అని అడిగాడు. వారు “నర్మదానదీ

తీరానికి వెళ్లారు" అని చెప్పారు. రావణుడు వెంటనే వింధ్యపర్వతముల వద్దకు వెళ్లాడు. విధ్యపర్వత ప్రాంతములో విహరిస్తూ ఆ పర్వతము అందాలను ఆస్వాదిస్తున్నాడు. రావణుడు నర్మదా నదీ తీరాన. తన మంత్రులతో సమావేశం అయ్యాడు. తన మంత్రులను చూచి ఇలా అన్నాడు. "చూచారా! ఇప్పుడు మధ్యాహ్నం అయింది. సూర్యుడు తన ప్రతాపం చూపించాలి. కానీ నేను ఇక్కడ ఉన్నానని తెలిసి సూర్యుడు భయపడి తన తాపం చూపడం లేదు. గాలికూడా నాకు భయపడి చల్లగా వీస్తూ ఉంది. ఈ నర్మదా నది కూడా ఉధృతంగా కాకుండా భయపడుతూ భయపడుతూ మెల్ల మెల్లగా ప్రవహిస్తూ ఉంది. మీరు కూడా ఈ నర్మగా నదిలో దిగి హాయిగా జలకాలాడండి. నేను కూడా తనివిదీరా స్నానం చేస్తాను. తరువాత మనతో తెచ్చిన స్వర్ణ లింగమునకు అభిషేకాదులు చేసి శివునికి పూజలు చేస్తాను" అని పలికాడు రావణుడు. వెంటనే రావణుని సేనాధిపతులు అయిన శుకుడు, సారణుడు, ప్రహస్తుడు, మహోదరుడు, ధూమ్రాక్షుడు అందరూ నర్మదా నదిలో దిగిస్నానాలు చేస్తున్నారు. రావణుడు కూడా నర్మదా నదిలో దిగి పుణ్యస్నానం చేసాడు. రావణుని అనుచరులు శివపూజకై పుష్పములను

తీసుకొని వచ్చారు. రావణుడు శుభ్రమైన వస్త్రములను ధరించాడు.

తనలో ఎల్లప్పుడూ ఉండే బంగారు శివలింగమును నర్మదా నదీ

తీరంలో ప్రతిష్ఠించాడు. ఆ శివలింగమునకు పూజలు చేసాడు. శివుని

ఎదుట సామగానమును ఆలపించాడు. నృత్యము కూడా చేసాడు. 

తన పూజ,నృత్య,గానములతో పరమశివుని తృప్తిపరిచాడు రావణుడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పదిటవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్


శ్రీమద్రామాయణము||ఉత్తర కాండము

ముప్పదిరెండవ సర్గ. (32)


రావణుడు శివలింగమును పూలతో అర్చిస్తున్న నర్మదా

నదీతీర సమీపంలోనే కార్తవీర్యార్జునుడు తన భార్యలతో నర్మదా నదిలో దిగి జలక్రీడలు ఆడుతున్నాడు. ఈ సంగతి రావణునికి తెలియదు. రావణుడు నర్మదానది ఒడ్డున శివుని పూజిస్తున్న సంగతి కార్తవీర్యునికి తెలియదా. ఆ సమయంలో కార్తవీర్యుడు తన వేయి చేతులను చాచి నర్మదానదీ ప్రవాహమును నిరోధించాడు. అప్పుడు నర్మదా నదిలో ఉన్న నీరు, నీటి వాలుకు ఎదురుగా ప్రవహించడం మొదలెట్టింది. అప్పుడు రావణుడు ఉన్న ప్రదేశంలో నదీజలాలు ఎదురు తన్ని గట్టు మీదికి ప్రవహించాయి. ఆ ప్రవాహ వేగమునకు రావణుడు ప్రతిష్టించిన శివలింగము, లింగము మీదవేసిన పూలు అన్నీ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రావణుడు ఆశ్చర్యపోయాడు. నర్మదా నదీ వాలుగా కాకుండా ఎదురు ప్రవహించడం గమనించాడు. వెంటనే తన మంత్రులైన

శుకుడు సారణుని పిలిచి ఆ విపరీతమునకు కారణమేమో

తెలుసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. శుక సారణులు ఆకాశంలోకి ఎగిరి నదీ తీరంవెంట చూసుకుంటూ పోతున్నారు. వారికి నర్మదా నదిలో దిగి తన భార్యలతో స్నానం చేస్తున్న కార్తవీర్యుడు కనపడ్డాడు. అతడు తనవేయి చేతులు అడ్డుపెట్టి నదీ ప్రవాహాన్ని ఆపుచేయడం చూచారు. వెంటనే వెనుకకు మరలి వచ్చి ఆ విషయమును రావణునికి చెప్పారు. “రాక్షసరాజా! ఎవరో తన బాహువులను అడ్డుపెట్టి నదీ ప్రవాహాన్ని ఆపుతున్నాడు. తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు." అని చెప్పారు. రావణునికి విషయం అర్థం అయింది. తాను ఎవరి కోసం వెదుకుతున్నాడో ఆ కార్తవీర్యార్జునుడు అతనే అని తెలుసుకున్నాడు. వెదుకుతున్న తీగ కాలికి తగిలినట్టు కార్తవీర్యార్జునుడు తనకు సమీపంలో ఉన్నాడని తెలుసుకున్న రావణుడు వెంటనే అతని మీదికి యుద్ధానికి వెళ్లాడు. రావణుని మంత్రులు సేనాధి పతులు అతనిని అనుసరించారు. నర్మదా నదిలో స్త్రీల మధ్యలో జలక్రీడలు ఆడుతున్న కార్తవీర్యార్జునుని చూచాడు రావణుడు. రావణుని కోపం మిన్నుముట్టింది. నది ఒడ్డున నిలిచిఉన్న కార్తవీర్యుని అమాత్యులతో “రావణుడు యుద్ధం కోరుతూ వచ్చి ఉన్నాడు అని మీ రాజుకు చెప్పండి” అని ఆదేశించాడు. ఆ మాటలు విన్న అమాత్యులు రావణుని చూచి “రాజా! కార్తవీర్యుడు మదిరా పాన మత్తులో, నదీజలాలలో స్త్రీలతో క్రీడించుచున్నాడు. యుద్ధం చేయడానికి మంచి సమయాన్ని ఎంచుకున్నావే! స్త్రీలతో కేళీవిలాసాలతో తేలియాడుతున్న వారు యుద్ధానికి సిద్ధంగాఉంటారా! నీవూ ఒక రాజువే కదా! ఆ మాత్రం తెలియదా నీకు! నీకు అంతగా మా రాజుతో యుద్ధం చేయాలని ఆసక్తిగా ఉంటే కాస్త ఓపిక పట్టు. ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో. సుఖాలన్నీ అనుభవించు. రేపు వచ్చి మా రాజుతో యుద్ధం చెయ్యి. అయినా నీకు అంత తొందరగా ఉంటే మేము ఉన్నాము కదా! ముందు మాతో యుద్ధం చేసి గెలువు. తరువాత మా రాజు గారితో చేయవచ్చును. నీలాంటి వీరుడితో యుద్ధం చేయడానికి మేము చాలు" అని పరిహాసంగా అన్నారు. యుద్ధం ఆమాటలకు రావణుని అమాత్యులకు కోపం వచ్చింది. కార్తవీర్యుని అమాత్యుల మీద పడి, చంపి, తినేసారు. ఇంతలో కార్తవీర్యుని సేనలు రావణుని అనుచరులను చుట్టుముట్టారు. ఇరుపక్షములకు యుద్ధం మొదలయింది. శుకుడు, సారణుడు తమ మాయాయుద్ధంతో కార్తవీర్యుని సేనలను సమూలంగా నాశనం చేసారు. ఈ గందరగోళం అంతా కార్తవీర్యార్జునుడు స్నానం చేసే చోటికి వినపడుతూ ఉంది. ఇంతలో కొంతమంది సేనానాయకులు పరుగు పరుగున వెళ్లి కార్తవీర్యునికి జరిగిన విషయం తెలియజేసారు. కార్తవీర్యుడు జలములలో నుండి బయటకు వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకున్నాడు. తాను స్త్రీలతో క్రీడిస్తున్న సమయంలో యుద్ధానికి పిలిచిన మూర్ఖుడి మీద కోపంతో మండి పడ్డాడు. తన గద తీసుకున్నాడు. రాక్షస సేనలలోకి చొచ్చుకుపోయాడు. ప్రహస్తుడు ఒక

ముసలంతో కార్తవీర్యుని అడ్డుకున్నాడు. తన ముసలాన్ని కార్తవీర్యుని మీదికి విసిరాడు. ఆ ముసలము అగ్ని కణాలను విరజిమ్ముతూ కార్తవీర్యుని మీదికి వేగంగా దూసుకుపోయింది. కార్తవీర్యుడు ఏమాత్రం తొటుపడకుండా ఆ ముసలమును తన గదతో మోదాడు. ఆ ముసలం విరిగి కిందపడింది. తన గదను పైకెత్తి ప్రహస్తుని తల మీద ఆ గదతో మోదాడు. ఆ దెబ్బకు ప్రహస్తుడు మొదలు నరికిన చెట్టు వలె నేలకూలాడు. తమ నాయకుడు ప్రహస్తుడు పడిపోగానే శుకుడు, సారణుడు,మహోదరుడు, ధూమ్రాక్షుడు పారిపోయారు. ఇది చూచి రావణుడు కార్తవీర్యుడి మీదికి దూకాడు. రావణుడికి కార్తవీర్యుడికి ఘోరంగాయుద్ధం జరిగింది. ఇద్దరూ గదలతో కొట్టుకుంటున్నారు. వారి గదలు ఒకదానితో ఒకటి కొట్టుకోడం వలన పుట్టే ధ్వనులతో నలుదిక్కులు మారుమోగిపోయాయి. రావణుడు కార్తవీర్యుడు తమ గదలతో ఒకరి వక్షస్థలము మీద ఒకరు మోదుకుంటున్నారు. రెండు ఏనుగులు కుమ్ములాడుకుంటున్నట్టు కొట్టుకుంటున్నారు. కార్తవీర్యుడు తన బలాన్ని అంతా కూడగట్టుకొని తన గదతో రావణుని వక్షస్థలము మీద గట్టిగా మోదాడు. బ్రహ్మవరప్రసాది అయిన రావణుని ఆ గద ఏమీ చేయలేకపోయింది.. రెండుగా విరిగి కిందపడింది. కాని కార్తవీర్యుని గదాఘాతానికి రావణుడువెనక్కుతూలాడు. పెద్దగా అరుస్తూ కిందపడ్డాడు. ఇదే సందని

కార్తవీర్యుడు ఎగిరి రావణుని మీదికి దూకాడు. రావణుని కంఠం

పట్టుకున్నాడు. తన బాహువులతో రావణుని బంధించాడు. రావణుని కార్తవీర్యుడు గట్టిగా తాళ్లతో కట్టేసాడు. పెద్దగా గర్జించాడు.

ఇంతలో ప్రహస్తుడు స్పృహలోకి వచ్చాడు. రావణుడు కార్తవీర్యుని చేతిలో బందీ కావడం చూచాడు. వెంటనే ప్రహస్తుడు కార్తవీర్యుని మీదికి వెళ్లాడు. ప్రహస్తుడు స్పృహలోకి రావడం చూచిన రాక్షస వీరులు ప్రహస్తుని వెంట కార్తవీర్యుని మీదికి ఉరికారు. రాక్షస

వీరులు కార్తవీర్యుని చుట్టుముట్టారు. వాడి అయిన ఆయుధములతో

కార్తవీర్యుని కొట్టారు. కాని కార్తవీర్యుడు చలించకుండా ఆ

ఆయుధములను తన గదతో ఎదుర్కొన్నాడు. గదతో మోదుతూ రాక్షస వీరులను చెల్లాచెదరు చేసాడు. రాక్షస వీరులు పారిపోగానే

కార్తవీర్యుడు రావణుని బందీగా తీసుకొని తన నగరానికి వెళ్లాడు.

రావణుని బంధించిన కార్తవీర్యునికి మాహిష్మతీ నగరంలో

ఘనస్వాగతం లభించింది.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పది రెండవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్


శ్రీమద్రామాయణము|| ఉత్తరకాండము

ముప్పది మూడవసర్గ. (33)


రావణుడు కార్తవీర్యుడికి బంది అయ్యాడు అన్న వార్త ముల్లోకములలో పాకి పోయింది.. అంతా విచిత్రంగా చెప్పుకుంటు

న్నారు. ఒక యుద్ధోన్మాదికి తగిన గుణపాఠం చెప్పాడని కార్తవీర్యుని

అందరూ పొగిడారు. ఈ సంగతి రావణుని తాతగారు అయిన పులస్త్యునికి తెలిసింది. హుటాహుటిన కార్తవీర్యుని వద్దకు వచ్చాడు. వాయు మార్గంలో మాహిష్మతీ నగరానికి వచ్చాడు పులస్త్యుడు. పులస్త్యుడి రాక గురించి కార్తవీర్యునికి తెలిసింది. కార్తవీర్యుడు వెంటనే నెత్తిన చేతులు పెట్టుకొని నమస్కారం చేస్తూ పులస్త్యునికి ఎదురు వెళ్లాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసాడు. అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. సగౌరవంగా రాజభవనానికి తీసుకొని వచ్చాడు. పులస్త్యుని ముందు చేతులుకట్టుకొని వినయంగా

నిలబడ్డాడు కార్తవీర్యుడు. "బ్రాహ్మణోత్తమా! నేను ఈ జన్మలో తమరిని చూస్తానని అనుకోలేదు. నా పుణ్యవిశేషము వలన తమరే నా నగరానికి విచ్చేసారు. నా జన్మధన్యం అయింది. నా నగర వాసులు ధన్యులయ్యారు. నేను, నా రాజ్యము, నా భార్య, నా కుమారులు తమరి అధీనములో ఉన్నాము. ఆజ్ఞాపించండి. తమరికి ఏమి సేవ కావాలో అది చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము." అని వినయంగా పలికాడు కార్తవీర్యుడు. కార్తవీర్యుని వినయానికి, బ్రాహ్మణ భక్తికి ఎంతో సంతోషించాడు పులస్త్యుడు. "రాజేంద్రా! నీవు, నీ భార్య, పుత్రులు క్షేమంగా ఉన్నారు. ప్రజలను ధర్మం తప్పకుండా పరిపాలిస్తున్నావా! అగ్నిహోత్రములు చక్కగా వెలుగుతున్నాయి కదా! ప్రజలు ఏ భయమూ లేకుండా సుఖంగాఉన్నారు కదా! ముల్లోకములను జయించిన రావణుని జయించిన నీ పరాక్రమము, వీరత్వము సాటిలేనిది. సముద్రములు, దిక్పాలకులు, వాయువు, అగ్ని ఎవరికి భయపడి తమ తమ సహజ గుణములను కూడా ప్రకటించరో అట్టి నా పౌత్రుడు రావణుని జయించి లోకోత్తరవీరుడవని అనిపించుకున్నావు. ఇప్పటిదాకా రావణుడు ఆర్జించిన కీర్తిని అంతా నీవు అతిక్రమించి అందరి ప్రశంసలకు పాత్రుడవు అయ్యావు. అటువంటినిన్ను ఒక కోరికకోరుతున్నాను. కాదనకుండా తీర్చు. రావణుని విడిచి పెట్టు."అని అడిగాడు. కార్తవీర్యుడు మారు మాటాడకుండా పులస్త్యునికి నమస్కరించి రావణుని విడిచిపెట్టాడు. రావణునికి అతిథి సత్కారములు చేసాడు. అగ్ని సాక్షిగా రావణునికి కార్తవీర్యునికి స్నేహం కుదిరింది. ఇద్దరూ భక్తితో పులస్త్యునకు నమస్కరించారు. పులస్త్యుడు రావణుని లంకకు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. రావణుడు తన మంత్రులతో సేనాధి పతులతో, సైన్యముతో లంకానగరానికి వెళ్లిపోయాడు. తరువాత బ్రహ్మదేవుని కుమారుడు అయిన పులస్త్యుడు బ్రహ్మలోకమునకు వెళ్లిపోయూడు.

రామా! ఇదీ రావణుని మొదటి ఓటమి. మహాబలశాలి అయిన రావణుడు కార్తవీర్యుని వలన ఓటమి పాలై అవమానము పొంది, పులస్త్యుని జోక్యముతో విడిచిపెట్టబడ్డాడు. రామా! ఎవరూ తాము బలవంతులమని విర్రవీగకూడదు. వాడి కంటే బలవంతులు ఉంటారు అని మరిచిపోకూడదు. (తాడిని తన్నేవాడు ఒకడయితే, వాడి

తల తన్నే వాడు మరొకడు ఉంటాడు అని లోకోక్తి).

రామా! ఇంతజరిగినా రావణునికి బుద్ధిరాలేదు. మరలా తన

జైత్రయాత్ర కొనసాగించాడు. రాజుల మీదికి యుద్ధానికి పోవడం

వారిని హింసించడం, వారి స్త్రీలను అపహరించడం యధేచ్ఛగా

కొనసాగించాడు.” అని చెప్పాడు అగస్త్యుడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పది మూడవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

శ్రీమద్రామాయణము || ఉత్తరకాండము

ముప్పది నాలుగవ సర్గ.(34)


“రామా! కార్తవీర్యుని చేతిలో శృంగభంగము పొందినా సిగ్గు లేకుండా,

నిర్భయంగా భూమి నలుచెరగులా తిరుగుతూ రాజులను యుద్ధానికి ఆహ్వానిస్తున్న రావణునికి వాలి రూపంలో మరొక ఎదురు దెబ్బ తగిలింది. రావణునికి ఎదుటి వాడు రాక్షసుడా, మానవుడా,

ఎవడైనా లెక్కలేదు. వెళ్లడం యుద్ధానికి ఆహ్వానించడం, ఓడించడం,

హింసించడం రావణుని నిత్యకృత్యం అయింది. ఆ పరంపరలో ఒకసారి రావణుడు కిష్కింధకు వెళ్లాడు. అప్పుడు కిష్కింధను వాలి

అనే వానర రాజు పరిపాలిస్తున్నాడు. రావణుడు వెళ్లి వాలిని యుద్ధమునకు పిలిచాడు. అప్పుడు వాలి మామగారు తారుడు అనే వానరుడు రావణునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షస రాజా! వాలి ప్రస్తుతము కిష్కింధలో లేడు. సంధ్యావందనమునిమిత్తము బయటకు వెళ్లాడు. కిష్కింధలో నిన్ను ఎదిరించే వాడు ఎవరూ లేరు.

అందుకనికొంచె సేపు ఉండు. వాలి నాలుగు సముద్రముల జలములలో సంధ్యావందనము ఆచరించి ముహూర్తకాలములో తిరిగి రాగలడు. రావణా! మరొక విషయము. అదుగో అక్కడ ఒక ఎముకల గుట్ట కనపడుతూ ఉంది. ఆ ఎముకలు ఎవరివి అనుకున్నావు. వాలితో యుద్ధం చేసి చచ్చిన వాళ్ల ఎముకల గుట్ట. నీకేదో ఎవరి చేతిలోనూ చావకుండా బ్రహ్మ వరం ఉందని విన్నాను. ఆ వరసలో వానరులు లేరు కదా! అందుకని నీవు వాలిని యుద్ధంలో ఎదుర్కొంటే నీకు మరణం తప్పదు. తరువాత నీ ఇష్టం. వాలి వచ్చే లోపల ఈ లోకంలో ఉన్న అందాలను అన్నీ చూడు. ఆనందించు. స్త్రీలతో సుఖించాలంటే సుఖపడు. ఎందుకంటే వాలి వచ్చిన తరువాత నీకు ఈ అవకాశం దొరకదు. వాలిని ఎదుర్కొని నీవు ముహూర్తకాలం కూడా జీవించలేవు. లేదూ నీకు చావాలని మహా తొందరగా ఉంటే, వెంటనే దక్షిన సముద్రతీరమునకు వెళ్లు. వాలి నీకు అక్కడ తారస పడతాడు.” అని మెల్ల మెల్లగా రావణునికి నాలుగు చురకలు అంటించాడు వాలి మామగారు తారుడు. ఆ మాటలు విన్న రావణునికి కోపం తలకెక్కింది. తారుడిని గట్టిగా అరిచి జడిపించాడు. వెంటనే తన పుష్కక విమానము ఎక్కి దక్షిణ సముద్రతీరానికి వెళ్లాడు. దక్షిన సముద్ర తీరంలో సంధ్యోపాసన చేస్తున్న వాలిని చూచాడు రావణుడు. రావణుడు పుష్పకము దిగాడు. వెనక నుండి వాలిని పట్టుకోడానికి వెనకనుండి తక్కుతూ తారుతూ వెళ్లాడు. వాలి కూడా క్రీగంటితో రావణుని చూచాడు. కాని చూడనట్టు ఊరుకున్నాడు. “వీడు నన్ను పట్టుకోవాలని వస్తున్నాడు. వీడిని ఒక పట్టు పట్టాలి" అని అనుకున్నాడు. ఏమీ ఎరుగనట్టు వేద మంత్రములు పఠిస్తూ సూర్యోపాసన చేస్తున్నాడు. వాలిని పట్టుకోడానికి రావణుడు వాలి దగ్గరగా వచ్చాడు. తన చేతికి అందే దూరంలోకి రాగానే, వాలి రావణుని గరుడుడు పామును పట్టుకున్నట్టు మెడపట్టుకున్నాడు.రావణుని తన ముందుకు లాగి తన చంకలో ఇరికించుకున్నాడు. వేగంగా ఆకాశంలోకి ఎగిరాడు. రావణుడు కిందికి వేలాడుతున్నాడు. గిలా గిలా కొట్టుకుంటున్నాడు. కట్టుకున్న ధోవతీ ఊడిపోతూ ఉంది. అయినా వాలి వాయువేగంతో ఎగుతున్నాడు. రావణునికి ఊపిరి ఆడటం లేదు. ఇదంతా చూస్తున్న రావణుని మంత్రులు సేనాధి పతులు పెద్దగా అరుస్తూ వాలిని వెంబడించారు. ముందు వాలి, వాలి చంకలో రావణుడు, వెనుకగా అరుస్తూ రావణుని మంత్రులు, సేనాధిపతులు ఆకాశంలో ఎగురుతూ పోతున్నారు. కాని వారు వాలి వేగాన్ని అందుకోలేకపోయారు ఎగిరి ఎగిరి వారి చేతులు, కాళ్లు తొడలు, అరిచి అరిచి నోరు నొప్పెట్టాయి. కాని వాలి దొరకలేదు. ఇంక లాభం లేదని ఆగిపోయారు. వాలి రావణుని చంకలో ఇరికించుకొని అన్ని సముద్రజలములలో సంధ్యావందనము ఆచరించాడు. వాలి పశ్చిమ సముద్ర తీరానికి చేరుకున్నాడు. వాలి పశ్చిమసముద్రంలో స్నానం చేసి, సంధ్యావందనము ముగించుకొని ఉత్తరసముద్రతీరం చేరుకున్నాడు. ఉత్తరసముద్రంలో స్నానం చేసి సూర్యోపాసన చేసి తరువాత తూర్పుసముద్రతీరానికి వెళ్లాడు. అక్కడకూడాస్నానం, సంధ్య పూర్తి చేసుకొని వాలి కిష్కింధకు బయలు దేరాడు. ఇంత దూరమూ ప్రపంచ విజేత రావణుడు వాలి చంకలో ఇరుక్కుని పిల్లి పిల్ల వేలాడినట్టు వేలాడుతున్నాడు. వాలి వాయువేగానికి తట్టుకోలేక అల్లల్లాడిపోతున్నాడు. వాలి కిష్కింధ దగ్గర ఉన్న ఉద్యానవనంలో దిగాడు. రావణుని మోసి మోసిఅలిసిపోయిన వాలి, అక్కడ ఆగి అలసట తీర్చుకుంటున్నాడు. రావణుని తన చంకలో నుండి విడిచిపెట్టాడు. బతుకు జీవుడా అనుకుంటూ రావణుడు వాలి చంకలో నుండి బయటకు వచ్చి ఒళ్లు విరుచుకున్నాడు. అప్పుడు వాలి ఇలాఅడిగాడు. “ఇంతక ఎవరు నీవు! ఎక్కడి నుండి వచ్చావు? నన్ను ఎందుకు పట్టుకోబోయావు?” అనికుశల ప్రశ్నలు వేసాడు.

రావణుడు ఆశ్చర్యంతో వాలిని చూచి ఇలా అన్నాడు. “ఓ వానరేంద్రా! నేను రాక్షస రాజు రావణుడను. నీతో యుద్ధం చేయడానికి వచ్చాను. నాతో యుద్ధం చేయకుండా ఈ ప్రకారం నన్ను బాధపెట్టావు. నన్నుఒక జంతువును పట్టుకొని తిప్పినట్టు నాలుగు సముద్రములు తిప్పావు. నీ బలము అనుపమానము. నన్ను మోసుకుంటూ నాలుగు సముద్రములు తిరిగావు కదా! నీకు అలసట కలగలేదా! నీకు ఉన్నటు వంటి గమన వేగము కేవలము మనస్సుకు, వాయువుకు, గరుడునికి మాత్రమే ఉంది. నీతో అనవసరంగా పెట్టుకున్నాను. నాకు తగిన శాస్తి జరిగింది. నీతో స్నేహమును కోరుతున్నాను. మనము అగ్నిసాక్షిగా స్నేహితులము అవుదాము.తరువాత వాలి రావణుడు అగ్నిని మండించి, పరస్సరము

కౌగలించుకొని అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు. సోదర స్నేహము

పెంపొందించుకున్నారు. వాలి రావణుని తీసుకొని కిష్కింధలో

ప్రవేశించాడు. రావణుడు కిష్కింధలో ఒక నెలరోజులు ఆనందంగా

గడిపాడు. తరువాత రావణుడు లంకకు వెళ్లాడు. రామా! ఇదీ వాలి రావణుల మైత్రి కధ. రావణుని నాలుగు సముద్రముల నీళ్లు తాగించిన ఆ వాలిని నీవు సునాయాసంగా చంపావు." అని అన్నాడు అగస్త్యుడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పది నాలుగవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్


శ్రీమద్రామాయణము ||ఉత్తరకాండము

ముప్పది ఐదవ సర్గ లో ఒకటో భాగం. (35-1) 

హనుమంతుని వృత్తాంతం 


అప్పటి దాకా రావణుని జన్మవృత్తాంతము, రాక్షసుల పుట్టుక గురించి విన్న రాముడు, ఆఖరున వాలి యొక్క బల పరాక్రమముల గురించి విని ఆశ్చర్యపోయాడు. కాని రాముడికి ఒక అనుమానము వచ్చింది. హనుమంతుడు వాలి సుగ్రీవులకన్నా బలవంతుడు అని విని ఉన్నాడు అది ఎలా సాధ్యం అని అనుకున్నాడు. అదే ప్రశ్నను అగస్త్యుని అడిగాడు రాముడు. “ఓ అగస్త్య మహర్షీ! మీరు చెప్పినట్టు వాలి బలము, రావణుని బలమూ అసమాన్యము. కానీ హనుమంతుని బలముతో పోలిస్తే, వీరి బలము తక్కువే కదా ఎందుకంటే, రావణునికి, వాలికి బలంతో పాటు అహంభావము, పొగరు, ఇతరుల పట్ల తృణీకారభావము ఉన్నాయి. కాని హనుమంతునిలో బలము, శౌర్యము, దానికి తగ్గట్టుbవినయము,

విధేయతా, మంచి తనము, బుద్ధి, నీతి, కార్యసాధనము, ఇవన్నీ హనుమంతుని బలమును ఇనుమడింపజేసాయి.  నూరుయోజనముల దూరము ఉన్న సముద్రమును ఎలా దాటాలా అని దిగులుపడుతున్న వానరసేనల మాదిరి దిగాలు పడకుండా, తన వంతు ప్రయత్నం తాను చేసాడు. సముద్రమును దాటాడు. ఎంత వెదికినా సీత కనపడలేదు. కాని పట్టుదల మానలేదు. సీత దొరికే వరకూ వెదుకుతూనే ఉన్నాడు. సీతను చూచాడు ఆమెను ఓదార్చాడు. అదీ హనుమంతునిలో ఉన్న కార్యదీక్ష, పట్టుదల. ప్రతి

మనిషిలో ఇవి ఉండాలి. రాక్షసులు తనను ఎదిరించినపుడు

భయపడిపారిపోలేదు. తన బలపరాక్రమములతో వారిని ఎదిరించాడు.bసంహరించాడు. ప్రతీకారం తీర్చుకోడంలో కూడా హనుమంతుడు గట్టివాడు. దూతగా వచ్చిన వాడిని చంపమన్నాడు రావణుడు. తుదకు తోకకుbనిప్పు అంటించమన్నాడు. నిప్పు అంటించి వదిలేసి ఉంటే తన దారిన తాను పోయేవాడు హనుమంతుడు. కాని, రాక్షసులు అమితోత్సాహంతోnహనుమంతుని తోకకు నిప్పు అంటించి, డప్పులు కొట్టుకుంటూbఊరేగించారు. లంకా నగరం అంతా తిప్పారు. అప్పుడు హనుమంతుడికిbకోపం వచ్చింది. ఒక కొంపకు నిప్పు పెట్టాడు. అది లంకను దహించివేసింది. హనుమంతుడు చేసిన పనులను యమ, కుబేర,bవరుణులు కూడా చేసినట్టు మనం వినలేదు. కేవలము హనుమంతుని బలపరాక్రమములు, బుద్ధికుశలత వల్లనే నేను నా సీతను,

రాజ్యమును పొందగలిగాను అనడంలో అతిశయోక్తి లేదు.

మునీంద్రా! అసలు హనుమంతుడు లేకపోతే కనీసం సీత ఎక్కడ ఉన్నదీ నాకు తెలిసేది కాదు. ఇంతటి బలపరాక్రమములు బుద్ధికుశలత ఉన్న హనుమంతుడు, వాలికి సుగ్రీవునికి వైరము

ఏర్పడప్పుడు ఎందుకు పారిపోయాడు. వాలిని ఎందుకు ఎదిరించి

చంపలేదు. ఇదే నాకు అర్థం కావడం లేదు. దయచేసి నాకు

హనుమంతుని వృత్తాంతము అంతా సవిస్తరంగా తెలియజేయండి.”

అని అడిగాడు. ఆ సమయంలో హనుమంతుడు రాముని పక్కనే ఉన్నాడు. అమాయకంగా రాముని వంక, అగస్త్యుని వంక చూస్తున్నాడు. హనుమంతుని వంక చూచాడు అగస్త్యుడు. చిరునవ్వు నవ్వి రామునితో హనుమంతుని వృత్తాంతమును ఇలా చెప్పసాగాడు. “రామా! ఈ హనుమంతుని విషయంలో నువ్వు చెప్పినది అంతా సత్యమే. బలపరాక్రమములలో బుద్ధికుశలతలో హనుమంతునికి సాటి ఎవరూ లేరు, రారు. కాని హనుమంతునికి మునుల శాపం ఒకటి ఉంది. దాని ప్రభావంతో హనుమంతునికి తన బలం తన పరాక్రమము తనకు తెలియదు. ఒకరు చెబితేకాని తాను

మహాబలవంతుడు అని తెలుసుకోలేడు. ఈ హనుమంతుడు తన

బాల్యము నుండి అత్యంత సాహసోపేతమైన కార్యములు చేసాడు. అవన్నీ ఇతనికి గుర్తులేవు. అందుకని ఏమీ ఎరుగనట్టు అమాయకంగా కూర్చుని ఉన్నాడు. ఈ హనుమంతుని గురించి నీకు సవిస్తరంగా చెబుతాను విను. మేరు పర్వతమును హనుమంతుని తండ్రి కేసరి పరిపాలిస్తున్నాడు. ఆ మేరు పర్వతము మీద సూర్య కిరణములు పడి బంగారు పర్వతము మాదిరి ప్రకాశిస్తూ ఉంటుంది. కేసరి భార్యపేరు అంజనాదేవి. విధి వశాత్తు వాయుదేవుడు ఆమెతో సంగమించాడు. వాయుదేవుని కరుణ వలన అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. పుట్టినప్పుడు హనుమంతుడు పచ్చని శరీర కాంతితో ప్రకాశించాడు. ఒకరోజు అంజనాదేవి పండ్లు తీసుకురావడానికి అడవికి వెళ్లింది. అప్పుడు హనుమంతునికి ఆకలి వేసింది. గట్టిగా ఏడిచాడు. అప్పుడు సూర్యోదయము అవుతూ ఉంది. సూర్యుడు మేరు పర్వతము మీద చిన్న గుండ్రటి పండు మాదిరి ప్రకాశిస్తున్నాడు. ఆకలిగా ఉన్న హనుమంతుడు ఆ ఫలమును అందుకొని తినవలెనని పైకి ఎగిరాడు. సూర్యుని వైపుపోతున్నాడు. అంత చిన్న బాలుడు సూర్యలోకము వంక

ఎగురుతూ వెళ్లడం చూచి దేవతాగణములు ఆశ్చర్యపోయారు. చిన్న

పిల్లవాడప్పుడే ఇంత వేగంగా ఎగురుతున్నాడు. ఇంక పెద్ద వాడైతే ఎంత వేగంగా ఎగురుతాడో అని ఆశ్చర్యపోయారు. తన కుమారుడు అలా ఎగరడం చూచిన వాయుదేవుడు చిన్నవాడు ఎక్కడ సూర్యరశ్మికి కమిలిపోతాడో అని భయపడ్డాడు. పసివాడి వెంటనే ఉంటూ చల్లటి గాలి వీచ సాగాడు. ఆ బాలుడు ఫలము లాగా ఉన్న సూర్యుని పట్టుకోవాలని ఎగురుతూ సూర్యమండలం చేరుకున్నాడు. ముద్దుగా ఉన్న హనుమను చూచి సూర్యుడు కూడా చల్లబడి పోయాడు “ పసివాడు...ఏదో తెలిసీతెలియకుండా నా దగ్గరకు వచ్చాడు. ఇతనిని ఎందుకు బాధ పెట్టడం” అని అనుకున్నాడు సూర్యుడు.


సశేషం


శ్రీమద్రామాయణము || ఉత్తరకాండము

ముప్పది ఐదవ సర్గ లో రెండవ భాగం (35-2)

హనుమంతుని వృత్తాంతం 


కాని ఆ సమయంలోనే రాహుగ్రస్త సూర్యగ్రహణం సంభవించింది. రాహువు సూర్యుని పట్టుకోడానికి వస్తున్నాడు. కాని సూర్యుని దగ్గరగా ఉన్న హనుమంతుని చూచాడు. “ఇదేమిటి. నేను సూర్యుని పట్టుకోకముందే మరొకడు పట్టుకున్నాడు. ఇదేమిటో ఇంద్రునితోనే తేల్చుకుంటాను.”. అని రాహువు ఇంద్రుని దగ్గరకు వెళ్లాడు. ఇంద్రుని చూచి హేళనగా ఇలా అన్నాడు. “ఓ ఇంద్రా! సూర్యగ్రహణము

రోజు నేను సూర్యుని పట్టుకోవాలి కదా! మరి ఈ రోజు సూర్యుని

మరొకడుపట్టుకున్నాడు. నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా!

లోకాచారమునకు విరుద్ధముగా ప్రవర్తించడం త్రిలోకాధిపతివి నీకు

తగునా! ఈ రోజు సూర్యగ్రహణము. నేను సూర్యుని పట్టుటకు వెళ్లాను. అప్పటికే మరొకడు అక్కడ ఉన్నాడు. మరి నేనేం చెయ్యాలో చెప్పు.” అనినిష్టూరంగాఅడిగాడు. రాహువు మాటలు విన్న ఇంద్రుని అహం దెబ్బతింది. వెంటనే తన సింహాసనము మీది నుండి లేచాడు. ఐరావతమును ఎక్కి వజ్రాయుధమును చేత ధరించి సూర్యమండలమునకు వెళ్లాడు. రాహువు కూడా ఇంద్రుని వెంట వెళ్లాడు. కాని ఇంద్రుని కంటే కాస్త ముందుగా, అత్యుత్సాహంగా, సూర్యుడి దగ్గరకు వెళ్లాడు రాహువు. హనుమంతుడు రాహువును చూచాడు. అప్పటి దాకా సూర్యుని ఎర్రటి ఫలము అని పట్టుకున్న హనుమంతుడు, రాహువును మరొక చిన్న ఫలము అనుకున్నాడు. బాల్యచాపల్యము చేత సూర్యుని వదిలి పెట్టి రాహువును పట్టుకోడానికి రాహువు వెంట పడ్డాడు. హనుమంతుడు తన వెంట పడటం చూచి భయపడిన రాహువు వెనక్కుతిరిగి పరుగు లంకించుకున్నాడు. ఇంద్రుడి దగ్గరకు పోయి తనను రక్షించమని ఇంద్రుడి వెనక దాక్కున్నాడు. “ఇంద్రా! ఇంద్రా! నన్ను రక్షించు ఈ బాలకుడు నన్ను చంపడానికి వస్తున్నాడు” అని పెద్దగా అరిస్తున్నాడు.

“భయపడకు. ఈ బాలకుని నేను సంహరిస్తాను" అని అభయం ఇచ్చాడు ఇంద్రుడు. ఇంతలో హనుమంతుడు తెల్లగా ఉన్న ఐరావతమును చూచాడు. “అమ్మో ఇది అన్నిటి కన్నా పెద్ద పండు. ఇది నాకు కావాలి. దీనిని నేను పట్టుకుంటాను” అని ఐరావతము వెంట పడ్డాడు హనుమంతుడు. ఐరావతము వెంట పడ్డ బాలుని చూచి ముచ్చట పడ్డాడు ఇంద్రుడు. కాని ఐరావతమును, రాహువును, రక్షించాలనే ఉద్దేశంతో, కేవలం తన వజ్రాయుధము కొనతో హనుమంతుని కొట్టాడు. ఆ వజ్రాయుధము కొన హనుమంతుని ఎడమ దవడకు తగిలింది. ఆ దెబ్బకు బాలుడు అయిన హనుమంతుడు గిరా గిరా తిరుగుతూ నేల మీదికి పడిపోయాడు. చిన్న బాలుడు అని కూడా చూడకుండా వజ్రాయుధమును ప్రయోగించిన ఇంద్రుని మీద మండిపడ్డాడు వాయువు. వాయువు తన కుమారుడైన హనుమంతుని నేల మీద పడకుండా పట్టుకొని ఒక గుహలోకి ప్రవేశించాడు. వాయువు లేకపోవడంతో మూడు లోకములలో వాయు ప్రసారము ఆగిపోయింది. ప్రాణులకు ప్రాణవాయువు అందక విలవిలలాడుతున్నాయి. ఎవరికీ ఊపిరి ఆడటం లేదు. ప్రాణులు చచ్చిపోతున్నాయి. దేవతలకు హవిర్భాగములు అందడం లేదు. శబ్దప్రసారం ఆగిపోయింది. ఒకరి మాట ఒకరికి వినపడటం లేదు. ఈ మాదిరి ముల్లోకములు మూడురోజులు నరకం అనుభవించాయి. ముల్లోకవాసులు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి మొరపెట్టుకున్నారు. “ఓ బ్రహ్మదేవా! మూడు లోకములను, అందులో సమస్త ప్రాణులను నీవే సృష్టిచేసావు. ప్రాణులకు ఊపిరి ఆడటానికి

వాయువును అధిపతిగా చేసావు. వాయుప్రసారం వలన లోకాలు

బతుకుతున్నాయి. అకారణంగా వాయువు స్తంభించి పోయింది.

ప్రాణులకు ఊపిరి ఆడటం లేదు. నీవే మమ్ములను రక్షించాలి." అని

మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఏమి జరిగిందా అని ఆరా తీసాడు. విషయం అర్థం అయింది. “ఓ ప్రాణులారా మీకు ఊపిరి ఆడకపోవడానికి పెద్ద కారణమే ఉంది. అది ఏమో చెబుతాను వినండి. వాయుదేవుని పుత్రుడు బాలుడు అయిన హనుమంతుని ఇంద్రుడు తన వజ్రాయుధముతో కొట్టాడు. ఆ దెబ్బకు ఆ బాలుడు చనిపోయాడు. అందుకు కోపించి వాయువు స్తంభించాడు. అందుకని మీకు ఊపిరి ఆడటం లేదు. అందుకని మనం అందరం వాయుదేవుని వద్దకు వెళ్లాము. నా వెంట రండి.” అని అందరినీ తీసుకొని బ్రహ్మదేవుడు వాయుదేవుడు ఉన్న చోటికి వెళ్లారు. బ్రహ్మదేవుడి వెంట యక్ష, గంధర్వ, దేవ, ఋషి, కిన్నెర, కింపురుష, రాక్షస జాతులన్నీబయలుదేరాయి. మానవులు సరేసరి అక్కడే ఉన్నారు.

బ్రహ్మదేవుడు, వాయుదేవుని ఒడిలో నిర్జీవంగా పడుకుని ఉన్న బాలుడిని చూసి జాలిపడ్డాడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

శ్రీమద్రామాయణము || ఉత్తరకాండము

ముప్పది ఆరవ సర్గ లో ఒకటో భాగం (36-1)

హనుమంతుని వృత్తాంతము 


బ్రహ్మదేవుడు రావడం చూచిన వాయుదేవుడు చనిపోయిన బాలుని ఎత్తుకొని లేచి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి పాదాభివందనం చేసాడు. బ్రహ్మదేవుడు వాయుదేవుని బుజాలు పట్టుకొని పైకి లేపాడు. తన అమృత హస్తంతో చనిపోయిన హనుమంతుని ఒళ్లంతా నిమిరాడు. బ్రహ్మదేవుని చేతి స్పర్శ తగలగానే హనుమంతుడు కదిలాడు. కళ్లు తెరిచాడు. చిరునవ్వు నవ్వాడు. హనుమంతుడు పునర్జీవితుడు అయ్యాడు. తన కుమారుడు తిరిగి బతకడం చూచిన వాయుదేవుడు ఎంతో సంతోషించాడు. ఎవరూ చెప్పకుండానే ముల్లోకములలో వాయు ప్రసరణను ప్రారంభించాడు. అందరికీ ప్రాణవాయువు అందింది. ప్రాణులు అన్నీ యథాస్థితికి వచ్చాయి. ముల్లోకములలో జీవులు కళకళాలాడాయి. ప్రాణులన్నీ తమతమ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. బ్రహ్మదేవుడు తనతో వచ్చిన దేవతా గణములను చూచి ఇలా అన్నాడు. “ఓ మహేంద్రా ! అగ్నిదేవా!వరుణ దేవా! కుబేరా! నేను చెప్పే మాటలను వినండి. మీకందరకూ తెలిసిన విషయమే అయినా మరలా చెబుతున్నాను. ఈ శిశువు సామాన్యుడు కాడు. దేవకార్యమును సాధించడానికి పుట్టాడు. కాబట్టి ఈ శిశువునకు మీరందరూ వరాలు ప్రసాదించండి.” అని అన్నాడు. ముందుగా మహేంద్రుడు తనమెడలోని బంగారు

పద్మముల మాలను తీసి అందరికీ చూపించి ఇలా అన్నాడు. “నేను

ప్రయోగించిన వజ్రాయుధముతో ఈ శిశువు దవడ భాగము

వాచిపోయింది. అందుకని ఈ రోజునుండి ఈ వానర కుమారుడు

“హనుమ” అనే పేరుతో పిలువబడతాడు. (హను: అంటే దవడ అని

అర్థం.) అంతే కాకుండా ఈ వానర కుమారుడు నా వజ్రాయుధము

చేత కూడా చావకుండా వరము ఇస్తున్నాను." అని అన్నాడు.

ఇంతలో సూర్యుడు లేచి “నేను నా తేజములో నూరవవంతు ఇతనికి ఇస్తున్నాను. ఇతనికి ఉపనయనము కాగానే నేను ఈ హనుమకు అన్ని శాస్త్రములు నేర్పుతాను. ఇతనిని మాటలలో చతురుని

చేస్తాను.” అని అన్నాడు. వరుణుడు హనుమకు పదిలక్షల సంవత్సరముల దీర్ఘాయువు ప్రసాదించాడు. తన మృత్యుదండము ఎన్నటికీ హనుమను తాకదని, ఇతనికి ఏ రోగమూ రాదనీ, ఏ యుద్ధములో కూడా ఇతనిని అపజయం వరించదని, యముడు వరం ఇచ్చాడు. (అందుకే హనుమను చిరంజీవి అని అంటారు.) “నా గదాదండము ఇతనిని ఎన్నటికీ తాకదు. ఇతనికి నా చేతిలో చావు లేదు." అని కుబేరుడు వరం ఇచ్చాడు. విశ్వకర్మ ఆ బాలుని చూచి ఇలా అన్నాడు. “నేను తయారు చేసిన ఏ ఆయుధము కానీ, ఏఅస్త్రము కానీ, ఈ హనుమను చంపలేదు. ఇతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు." అని వరం ఇచ్చాడు. పనిలో పనిగా బ్రహ్మదేవుడు కూడా "ఇతను బ్రహ్మాస్త్రము చేత కూడా కట్టబడడు. బ్రహ్మాస్త్రము కూడా ఇతనిని ఏమీ చేయలేదు.” అని వరం ఇచ్చాడు.

అందరూ అన్ని వరాలు ఇస్తుంటే హనుమ అమాయకంగా

చిరు నవ్వు నవ్వుతున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాయుదేవుని చూచి ఇలా అన్నాడు. “వాయుదేవా! నీ కుమారుడు సామాన్యుడు కాడు. శత్రుభయంకరుడు. మిత్రులకు మిత్రుడు. శత్రువులకు శత్రువు. ఎంత దూరం అయినా వాయువేగంతో ఎగరగలడు. ఏ మాత్రం అలసట చెందడు. తన ఇష్టం వచ్చిన రూపం ధరించగలడు. ఇతని కీర్తి

ముల్లోకములలో వ్యాపిస్తుంది. చిరంజీవిగా ఉంటాడు." అని పలికి

బ్రహ్మదేవుడు దేవతాగణములు తమ తమ లోకములకు వెళ్లిపోయారు. వాయుదేవుడు హనుమను తీసుకొని అంజన వద్దకు వెళ్లాడు. హనుమను అంజనకు అప్పగించి, జరిగిన విషయములు అన్నీ అంజనకు చెప్పి వెళ్లిపోయాడు. అప్పటికి హనుమ మంచి బాలుడు. మంచీ చెడు తెలియవు. పైగా తనకు ఎదురు లేదు అనే గర్వము. బాల్య చాపల్యము. ఇవన్నీ కలిసాయి. హనుమ మునుల ఆశములలోకి జొరబడి వారి తపస్సులను పాడుచేయసాగాడు. యజ్ఞ పాత్రలను, గరిటెలను విరగ్గొట్టేవాడు. యజ్ఞము చేయడానికి సమకూర్చుకున్న వస్తువులను పాడుచేసేవాడు. అతనిని ఏమీ అనడానికి వీలు లేదు. అతనికి బ్రహ్మ దేవుడు, ఇతర దేవతలు ఇచ్చిన వరముల గురించి తెలిసిన ఋషులు, మునులు హనుమ ఆగడాలను సహిస్తున్నారు. కాని దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా! ఆ హద్దు కూడా దాటాడు హనుమంతుడు. వారి సహనం, ఓర్పు నశించింది. హనుమంతునికి శాపం ఇచ్చారు.“నీవు ఏ వరముల బలంతో ఇన్ని ఆగడాలు, అకృత్యాలు చేస్తున్నావో, ఆ బలము నీకు ఉందన్న సంగతి నీవు మరిచిపోతావు. నీవు సామాన్య వానరుడు మాదిరి ఉంటావు. ఎవరైనా నీ వరముల గురించి, నీ బలము గురించి నీకు గుర్తుచేసినప్పుడు మాత్రమే నీ బలపరాక్రమములు నీకు

గుర్తుకువస్తాయి.” అని శాపం ఇచ్చారు.


సశేషం


శ్రీమద్రామాయణము ||ఉత్తరకాండము

ముప్పది ఆరవ సర్గ లో రెండగ భాగం (36-2)

హనుమంతుని వృత్తాంతము 


ఆ శాపం ప్రభావంతో హనుమంతుడు జరిగినది అంతా మరిచిపోయాడు. తాను కూడా ఒక సామాన్యమైన వానరము

అనుకున్నాడు. శాంతంగా, అమ్మ మాట వింటూ, పెద్దల మాట వింటూ ఉంటున్నాడు. ఇది ఇలా ఉండగా, ఋక్షరజసుడు అనే వానర రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరుకుమారులు. వారి పేరు వాలి, సుగ్రీవుడు. ఋక్షరజసుడు చాలా కాలము రాజ్యము పాలించి మరణించాడు. ఋక్షరజసుని తరువాత వాలి రాజ్యమునకు వచ్చాడు. సుగ్రీవుడు యువరాజు అయ్యాడు. వాలి, సుగ్రీవులు ఎంతో అన్యోన్యంగా ఉ౦డేవారు. వారి మధ్య ఏ మాత్రమూ మాట తేడా వచ్చేది కాదు. ఇద్దరూఒకే మాట మీద ఉంటూ రాజ్యపాలన చేసేవారు. అట్టి వాలి సుగ్రీవులకు అహంభావము, అపోహల వలన

వైరము సంభవించింది. ఆ సమయంలో హనుమకు మహర్షుల

శాపం వలన తన శక్తి ఏమిటో తనకు తెలియదు. అందుకని వాలిని

ఎదిరించలేదు. సుగ్రీవుని మంత్రిగానే ఉండిపోయాడు. వాలి సుగ్రీవుని

ముల్లోకములలో తరుముతున్నప్పుడు కూడా హనుమ సుగ్రీవుని వెంట ప్రాణభయంతో పరుగెత్తాడు కానీ ఎదిరించలేదు. ఎందుకంటే

హనుమకు తనకు ఇవ్వబడిన వరములు, తనకు ఉన్న శక్తి గుర్తులేదు.

అందుకనే హనుమ వాలితో యుద్ధం చేయలేదు. రామా! నీ సందేహము తీరినది కదా! అటువంటి సద్గుణ సంపన్నుడు, బల పరాక్రమములు కల వాడు, బుద్ధిమంతుడు, నీతిమంతుడు, మాటలు నేర్పుకలవాడు, గొప్ప ధైర్యవంతుడు, అయిన హనుమకు సాటి రాగల వాడు ఈ లోకంలో ఎవడన్నా ఉన్నాడా! రామా! ఈ హనుమంతుడు వ్యాకరణశాస్త్రమును సూర్యభగవానుని వద్ద

అభ్యసించాడు. ఆ సమయంలో హనుమ సూర్యుని వెంట ఉదయాద్రి

నుండి పశ్చిమాద్రి వరకూ ప్రయాణం చేసాడు. అంతే కాదు సకల

విద్యలలోనూ హనుమ బృహస్పతికి సమానుడు. అటు బలపరాక్రమ

ములలో కానీ, ఇటు శాస్త్రపరిజ్ఞానములో కానీ హనుమకు సాటి రాగల వాడు ముల్లోకములలో ఎవరూ లేరు. నీకు రావణునితో యుద్ధములో సాయము చేయుటకు ఈ హనుమతో పాటు మైందుడు, ద్వివిదుడు, నీలుడు, తారుడు, అంగదుడు, నలుడు, రంభుడు ఇంకా అనేక మంది వానర వీరులు సృష్టింపబడ్డారు. ఇదీ హనుమ యొక్క వృత్తాంతము." అని అగస్త్యుడు రామునికి చెప్పాడు. తమ వెంట ఎంతగానో ఒదిగిఉండే హనుమ ఇంతటి గొప్పవాడా అని రాముడు, లక్ష్మణుడు ఆశ్చర్యపోయారు.

“రామా! నీ దర్శనము కొరకు నీ వద్దకు వచ్చాము. నిన్ను చూచాము. మాకు చాలా సంతోషము అయింది. ఇంక మేము మా మా స్వస్థలములకు వెళ్తాము అని అన్నాడు అగస్త్యుడు,ఆయనతో వచ్చిన మునులు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మీ దర్శనభాగ్యము వలన నేను, మా పితృదేవతలు, అందరమూ

కృతార్ధులమయ్యాము. మిమ్ములను నేను ఒక కోరిక కోరుతున్నాను.

నేను ప్రజాపాలనకు తగిన చర్యలు తీసుకున్న తరువాత కొన్ని

యజ్ఞములు యాగములు చేయ సంకల్పించాను. ఆ క్రతువులకు మీరు వచ్చి ఆధ్వర్యము వహించి నన్ను ధన్యుడిని చేయమని నా ప్రార్థన. మీకే సేవచేసుకుంటూ నేను ధన్యతను పొందుతాను. నా ప్రార్థనను మన్నించి మీరు అప్పుడప్పుడు అయోధ్యకు వచ్చి తమరి దర్శన భాగ్యమును నాకు కలుగచేయవలసినదిగా ప్రార్ధిస్తున్నాను.” అని అన్నాడు రాముడు. రాముని ప్రార్థనను మన్నించారు ఆ ఋషులు. తరువాత రాముని అనుజ్ఞతీసుకొని అందరూ తమ తమ స్వస్థలములకు వెళ్ళిపోయారు. తరువాత రాముడు ఋషులు చెప్పిన వాక్యములను తలచుకుంటూ అంత:పురమునకు వెళ్ళిపోయాడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పది ఆరవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్


శ్రీమద్రామాయణము ||ఉత్తరకాండము

ముప్పది ఏడవ సర్గ. (37)


రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడు అయిన తరువాత ఒక రోజు గడిచిపోయింది. మరునాడు రాముని మేల్కొలపడానికి వందిమాగధులు వచ్చి వేచి ఉన్నారు. వారందరూ రాముని

గుణగణములను, ఇక్ష్వాకు వంశరాజుల కీర్తిని మృదుమధురంగా

గానం చేస్తున్నారు. వారి స్తోత్రపాఠములను వింటూ రాముడు

నిద్రలేచాడు. రాముడు కాలకృత్యములు తీర్చుకొని స్నానాదికములు

ఆచరించాడు. అగ్నికార్యమును చేసాడు. తరువాత ఇక్ష్వాకు

వంశరాజులు అర్చించే దేవతార్చన గృహమునకు వెళ్లాడు. రాముడు

దేవతలను, పితరులను, బ్రాహ్మణులను పూజించాడు. తరువాత

మంత్రులు, సేనాధి పతులు, కులగురువు వసిష్ఠుడు, రాముని దగ్గరకు

వచ్చారు. రాముని తమ్ములు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పక్కనే

కూర్చున్నారు. సభాసదులు ఎవరికి ఉచితమైన ఆసనములలో వారు

కూర్చున్నారు. తన నలుగురు మంత్రులతో విభీషణుడు రామునికి

సమీపంలో ఆసీనుడు అయ్యాడు. పురప్రముఖులు, పౌరసంఘ

ప్రతినిధులు వచ్చి రామునికి నమస్కరించారు. ఆ ప్రకారంగా రాముడు అయోధ్యానగర పాలనను చేపట్టాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు.


ఉత్తరకాండము ముప్పదిఏడవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.


వాస్తవానికి రామాయణ కధ ఇంతటితో పూర్తి అయింది.

కాని కొంత మంది ఔత్సాహిక కవులు వాలి, సుగ్రీవుల పూర్తి

వృత్తాంతమును కూడా చెప్పాలని సంకల్పించినట్టున్నారు. అందుకని

కొన్ని సర్గలు అదనంగా చేర్చారు. కాని ఈ సర్గలకు వ్యాఖ్యాతలు

ఎటువంటి వ్యాఖ్యలు రాయలేదనీ, ఇవి ప్రాచ్యప్రతిలో కూడా లేవని కొంతమంది. పండితుల అభిప్రాయము. దానికి కారణం కూడా ఉంది. అగస్త్యుడు ఆయనతో వచ్చిన ఋషులు, మునులు, రాముడు అడిగిన విషయములు అన్నీచెప్పి, రాముడి సందేహములు అన్నీ తీర్చి రాముని వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోయారు. కాని తరువాతి సర్గలో రాముడు అగస్త్యుని వాలి సుగ్రీవులకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయని, వారి తల్లి తండ్రులు ఎవరనీ అడిగాడు. ఒక సారి రాముని వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోయిన తరువాత, మరలా రాముడు అగస్త్యుని వాలిసుగ్రీవుల గురించి అడగడం అసందర్భంగా ఉంది. ఎందుకంటే, రామాయణంలో హనుమంతుని పాత్ర ప్రాధాన్యమయింది. అందుకని హనుమంతుని పుట్టుక గురించి ఆయన బాల్యం గురించి వాల్మీకి విపులంగా చెప్పారు. కాని వాలి, సుగ్రీవులకు అంత ప్రాధాన్యము ఇవ్వలేదు. అందుకని వారి

పుట్టుకల గురించి వాల్మీకి ప్రస్తావించలేదు. కాని వాలి సుగ్రీవుల

గురించి చెప్పక పోవడం అసంపూర్ణంగా ఉంటుందనే భావనతో

కొందరు కవులు వారి వృత్తాంతములను కూడా చేర్చిఉంటారు. వారి కృషి అభినందనీయము. కాబట్టి, విషయ పరిజ్ఞానము కొరకు వీటిని కూడా సనాతన ధర్మం లో పెడుతున్నాను ,)

శ్రీమద్రామాయణము || ఉత్తర కాండము

ముప్పది ఎనిమిదవ సర్గ.(38)


ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరామచంద్రుడు అయోధ్యానగరానికి

పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలిస్తున్నాడు. ఎవరికి తగిన పనులను వారికి అప్పగిస్తూ అందరి చేతా పనులు చేయించుకుంటున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పట్టాభిషేక మహోత్సవమునకు వచ్చిన ఆహతులందరూ ఎవరి నగరములకు వారు వెళ్లిపోయారు. ఒక రోజు రాముడు తన మామగారు జనకమహారాజును చూచి ఇలా అన్నాడు. “ఓ జనకమహారాజా! మీ ఆశీస్సులవలననే నేను రాక్షస సంహారం చేయగలిగాను. మీ ఆశీస్సుల వలననే నేను అయోధ్యారాజ్యమును జనరంజకంగా పరిపాలిస్తున్నాను. మా ఇక్ష్వాకు వంశస్థులకు, మిథిలా నగర వాసులకు కల సంబంధము అద్వితీయము. మీరు నాచే ఇవ్వబడే

కానుకలను స్వీకరించండి. భరతుడు మిథిలా నగరం వరకూ మీకు

సాయంగా మీతో వస్తాడు." అని అన్నాడు. జనకుడు సరే అన్నాడు.

మిథిలకు ప్రయాణము అయ్యాడు. రాముడు తనకు ఇచ్చిన

బహుమతులను రత్నములను, బంగారమును, విలువగల వస్తువులు అన్నింటినీ తన కుమార్తెలకు ఇచ్చాడు. జనకుడు మిథిలకు వెళ్లిపోయాడు. తరువాత భరతుని మేనమామ అయిన కేకయ రాజును చూచి రాముడు ఇలా అన్నాడు. “నీ ఆశీర్వాదము వలననే భరతుడు ఇన్నాళ్లు రాజ్యపాలన చేసాడు. తరువాత నాకు రాజ్యము అప్పగించాడు. ఇప్పుడు యువరాజుగా నాతో పాటు పాలనా బాధ్యతలు స్వీకరించాడు. ఇదంతా మీ శుభాశీస్సులవలననే జరిగింది. కేకయ దేశములో మీ తండ్రిగారు మీ కొరకు అనుదినము ఎదురుచూస్తూ ఉంటారు. నా శక్తికొలది మీకు ధనము, బంగారము, మణిమాణిక్యాదులు బహుమతిగా ఇస్తున్నాను. వాటిని తీసుకొని లక్ష్మణుడు తమ వెంట వస్తున్నాడు.” అని అన్నాడు రాముడు. దానికి భరతుని మేనమామ యుధాజిత్తు ఇలా అన్నాడు. “రామా! నాకెందుకయ్యా ఈ బహుమానములు. అవన్నీ ఇక్కడే ఉండనీ.” అని అన్నాడు. తరువాత రాముని వద్ద సెలవు తీసుకొని యుధాజిత్తు కేకయ రాజ్యమునకు వెళ్లిపోయాడు. ఆయనకు తోడుగా లక్ష్మణుడు ఆయన వెంట వెళ్లాడు. తరువాత కాశీరాజు ప్రతర్ధనుడిని చూచి రాముడు ఇలా అన్నాడు. “రాజా! మీ సహాయ సహకారముల వలన భరతుడు ఈ 14 ఏళ్లు రాజ్యపాలన చేయగలిగాడు. ఇన్నాళ్లు అయోధ్యలో ఉండటం వలన అక్కడ కాశీరాజ్యములో పరిపాలన సక్రమంగా జరుగుతున్నట్టు లేదు. అందుకని తమరు కాశీరాజ్యమునకు వెళ్లడం ఉత్తమం." అని కాశీరాజుకు అనేక బహుమానములు ఇచ్చాడు. ఆ బహుమానములను తీసుకొని

కాశీరాజు వారణాసికి ప్రయాణమై వెళ్లాడు. తరువాత తనకు సామంతులు, పట్టాభిషేక మహోత్సవమును చూడటానికి వచ్చిన 300 మంది రాజులను చూచి రాముడు ఇలా అన్నాడు. “ఓ రాజోత్తములారా! మీ అందరి శుభాశీస్సులతో నేను రాక్షస సంహారము చేయగలిగాను. మీ అందరి సహాయ సహకారాలు లేకుండా నేను ఏమీ చేయగలిగే వాడిని కాదు. నేను దండకారణ్యములో ఉండగా రావణుడు సీతను అపహరించాడు అని తెలిసిన భరతుడు నాకు సాయంగా మిమ్ములను అందరినీ పిలిపించాడు. కాని నాకు మీ సాయము తీసుకోవలసిన అవసరమురాలేదు. అందుకని ఈసంవత్సర కాలము మీరు ఇక్కడే ఉండిపోయారు. ఇంక మీరు మీ మీ రాజ్యములకు వెళ్లండి.” అని అన్నాడు రాముడు. రాముని మాట మేరకు అందరూ వారి

వారి రాజ్యములకు వెళ్లిపోయారు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్