2, డిసెంబర్ 2019, సోమవారం




శివ లీలలు 

గుగ్గులు కలశ నాయనారు
చోళదేశమున తిరుక్కడవూరులో గుగ్గులు కలశనాయనారు జన్మించాడు. ఆయన బ్రాహ్మణుడు. అక్కడ దైవము పేరు అమృతఘటేశ్వరుడు. దేవతలు, అసురులు అమృత కలశంతో ఆ వూరు వచ్చారు. వారు స్నానము చేయుదము అనుకొన్నారు. ఆ కలశాన్ని నేలపై నుంచి నదికి స్నానమునకు వెళ్లారు. వారు తిరిగి వచ్చి ఆ కలశమును తీసికొందామంటే నేలనుంచి అది ఫైకి రాలేదు. ఆ కలశం లింగంగా మారింది. అందుకని ఆ లింగాన్ని అమృత లింగం అంటారు. మార్కండేయుడు ఈ లింగంకే తపస్సుచేసి తన 16వ ఏట అమరుడయ్యాడు. ఇక్కడ అమ్మవారు అభిరామి అమ్మన్‌. అభిరామపట్టార్‌ ఈ అమ్మన్‌కు పరమభక్తుడు. అమె మీద ఎన్నో కీర్తనలు పాడాడు. అభిరామపట్టార్‌ యందు అమ్మకు అనుగ్రహం మెండైంది. రాజుగారి ఆగ్రహము నుండి ఈ పట్టార్‌ను తప్పించుటకు ఈమె అమావాస్యను పౌర్ణమిగా మార్చింది కూడ.

గుగ్గులు కలశనాయనారు ఈ ఆలయమున శివునికి ప్రతిదినము గుగ్గిలముతో ధూపము వేయుచు పూజ చేయువాడు. ఈకారణముచే అతనికి గుగ్గులుకలశ నాయనారు అను పేరు వచ్చింది. గుగ్గులము ధూపము శివునికి మంచి సేవ అనుకున్నాడు. చేతిలో ఒక చిన్నకుంపటి, అగ్ని, గుగ్లిలము పుచ్చుకొని నిరంతరము గుగ్గిలము ధూపము వేయుచు అర్చిస్తూ గడిపేవాడు.

ఈ భక్తుని సేవా విశేషము, అతని శివార్చణ తపన పరమశివుని పరవశింప జేశాయి. అతని పరమభక్తి విశేషాలు ప్రపంచానికి చూప నిశ్చయించాడు.
శివుని సంకల్పమున నాయనారు కటిక పేదవాడయ్యాడు. ఆస్తి అంతా అమ్ముకోవలసి వచ్చింది. కుటుంబము పస్తుంటున్నది. అయినా నాయనారు తన గుగ్గిలం సేవలు మానలేదు. ఒకరోజున భార్య అనుకుంది. అంతా అమ్మబడింది. ప్రతి స్రీ భర్త చనిపోవు నంత వరకు అట్టిపెట్టుకోవలసిన మాంగల్యము మాత్రము మిగిలి వుంది. భర్త పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. అని ఆలోచించి మెడలో పుస్తెలతో పసుపు కొమ్ము వుంచుకొని తన బంగారు మాంగళ్యమును భర్తకు తీసి యిచ్చి - దీనినమ్మి ధాన్యము తీసికొని రండు అని భర్తను బ్రతిమాలింది. అతడు అది పుచ్చుకొని అంగడికి బయలు దేరాడు.
 
బజారునకు పోవుచుండగా ఒక వర్తకుడు గుగ్గిలము మూటలను భుజముల మీద నుంచుకొని విక్రయించుటకు ఎదురు వచ్చుచుండగా అది చూచి - నాయనారు - “ధాన్యము కొనుటకంటే దేవునికి
 
ఉయోగింపవచ్చును గుగ్గిలము కొనుట చాలా మంచిది” అని మంగళసూత్రమునిచ్చి, వర్తకుని నుండి గుగ్గిలము మూటలను ఆలయమునకు తీసికొని వెళ్లి యథారీతిన గుగ్గిలము ధూపముతో తపోమగ్నుడయ్యాడు.

భార్యాపిల్లలు క్షుద్భాధ తట్టుకోలేక అలసి పడుకున్నారు. రూమురాత్రి అయినా భర్త తిరిగి రాలేదు. దైవమును ప్రార్ధింప మొదలిడింది. తనకు అతి పవిత్రమైన మాంగళ్యమును కూడా భర్తా పిల్లల ఆహారము కొరకు పసువుకొమ్ముతో సరిపెట్టుకొని ఇచ్చింది. అయినా వరమేశ్వరా ఇలా అయింది రక్షింపు అని ప్రార్ధించింది. ఆమె ప్రార్ధనకి, నాయనారు భగవత్‌సేవ నిష్ఠకు, వారి మంచితనము, పవిత్రతకు పరమేశ్వరుడు చాలా సంతుష్టి చెందాడు.
కురాల్‌ : “పతిని దైవముగను వ్రతమున్న ఇల్లాలు
కురియుమన్ల క్షణమె కురియువాన”

ఆమె కలలో శివుడు కన్పడి “ నీకు సకల సౌభాగ్యాలు ఇస్తున్నాను” అన్నాడు. ఆమె మేల్కొనగానే ఆమె చకితురాలగునట్లుగా - గృహము సకల సంపత్తులతో
నిండిపోయింది. వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుని వినుతించింది. ఆయనపై పాటలు పాడింది. మహానంద భరితురాలై వెంటనే వంటచేసి తన బిడ్డలకు అన్నము పెట్టి భర్త రాకకైవేచి వుంది.
అట ఈశ్వరుడు నాయనారును 'ఆకలిగొని యున్నావు, ఇంటికి పోయి భుజింపుము' అని ఆదేశించాడు.

ఇంటికి పోగా అతనికి ఆశ్చర్యమైంది. ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది అని భార్య నడిగాడు. అమె జరిగింది చెప్పింది. శివానుగ్రహమునకు, తాను అక్కడ చేరిన శివభక్తులును కలిసి శివుని బహుధా కీర్తించారు. నాయనారు ఈ సంపద తనదిగా భావించలేక పోయాడు. “ఇదంతా శివునిది - దీనిని శివభక్తులకే వినియోగించాలి” అనిఊఅంటూ -వాని నిరంతర సేవ కొనసాగించాడు.

ఒక రోజున నాయనారు తిరుప్పనందాళ్‌ దేవాలయము సందర్శిద్దామనుకొన్నాడు. అరుణ సతీశుని దేవాలయము అచట నున్నది. ఒక రాక్షసుని కుమార్తె తాటక, పుత్రునికై అఛ్చట శివలింగాన్ని రోజూ అర్చించేంది. ఒకరోజున ఆ లింగమును పుష్ప హారముతో అలంకరిద్దామని పూలదండను ఎత్తిపట్టుకోబోయింది. ఆమె వస్త్రము నడుము నుంచి జారబోయింది. వస్త్రమును రెండు మోచేతులతో అదిమి పెట్టింది. అందుకని ఆమె చేతులు ఎత్తలేక పోయింది. ఆమె బెడద నుండి ఆమెను తప్పించుటకు శివుడు ఒక ప్రక్కకు ఒరిగి(ఒంగి) ఆమె దండను స్వీకరించాడు. ఆ లింగము ఒంగి ఉండిపోయింది. చాలామంది ఆలింగము సరిచేయుటకు ప్రయత్నించారు వీలుకాలేదు. రాజుగారు ఆ వంవుకు మోకులు తాళ్లు కట్టించి ఏనుగులతో లాగించారు. ప్రయోజనము కలుగలేదు. రాజు గారికి ఏమీ పాలుపోలేదు.

ఈ సంగతి గుగ్గులు కలశనాయనారుకు తెలిసింది. అఛ్చటికి వెళ్లి “నేను గూడ కొంచెము ప్రయత్షించెదను” అని ఆ శివలింగం వంపును తాడుతో బిగించి ఆ తాడు కొసను తన మెడకు కట్టుకొని శివుని ధ్యానము చేస్తూ లాగాడు. తోడనే లింగము వంవు సరి అయి యథాస్థితికి వచ్చింది. దేవతలు పుష్పవృష్ఠి కురిపించారు.

రాజు దానిని చూచి “ఈతడు భక్తి రజ్జువుచే ఇట్లు చేయగలిగాడు” అని తెలిసికొని నాయనారును చాలా గౌరవించి అనేక విధముల సన్నుతి చేశాడు. అందరికి నాయనారు భక్తి ప్రపత్తులు వెల్లడయ్యాయి.

కొన్ని దినములకు వాగేశనాయనారు, జ్ఞాన సంబంధనాయనారు అచటికి వచ్చారు. గుగ్గులు కలశనాయనారు వారిని అనేక విధముల సంభావించి బ్రతికియున్నంత కాలము శివసేవలోను, శివభక్తుల సేవలలోను గడిపి అంత్యమున శివసాయుజ్య
మొందినాడు.
==(())--
మాతృ వైభవం. 
ఇది మా గురువు గారైన కీర్తిశేషులు బ్రహ్మశ్రీ “పండిత” నేమాని రామజోగిసన్యాసిరావు గారు
మాతృదినోత్సవంసందర్భంగా
భరతమాత వైభవాన్ని వర్ణిస్తూచెప్పిన అద్భుత దండకం.

జయ జయ జనయిత్రి! శ్రీభారతక్ష్మాధినేత్రీ! సదా సస్యసంపన్న సౌవర్ణధాత్రీ! జనానీక సంక్షేమ సంభావితార్థ ప్రదాత్రీ! సుగాత్రీ! మహోత్తుంగ శృంగాఢ్య శీతాద్రి వింధ్యాద్రి ముఖ్యాద్రి వర్యాంఘ్రి సామీప్య రమ్యాటవీ మధ్య సంజాత భాగీరథీ సింధు గోదావరీ ముఖ్య భవ్యాపగాతీర శోభాయమాన ప్రశాంతామలారామ రాజత్తపో భూ ప్రభావ ప్రభాభాసితాంగీ! శుభాంగీ! సదా ధర్మ సంరక్షణోద్యోగ తాత్పర్య గంభీర భావాంకితాత్మ ప్రజానీక సంక్షేమ ధౌరేయ శ్రీరామ భూమీశ కౌంతేయ ముఖ్య క్షమానాథ శౌర్యప్రతాపాది సల్లక్షణోద్భాసితానంతకీర్తీ! మహోదాత్త చారిత్ర సంతాన బాహుళ్య సంశోభితానంద మూర్తీ!

శ్రీవిక్రమాదిత్య హర్షాధిపాశోక శ్రీకృష్ణరాజేంద్ర ఝాన్సీశివాజీ ప్రధానాశయ స్థాపితోత్కృష్ట ధర్మార్థ వత్సంప్రదాయాన్వితా! విశ్వ విఖ్యాత వేదాంత విజ్ఞాన సంగీత సాహిత్య వాణిజ్య ముఖ్యాఖిలోద్యోగ నైపుణ్య రత్నావళీభూషితా! నిత్యసంతోషితా! స్వాతంత్ర్య సంగ్రామ సీమోచితోత్సాహ ధైర్యప్రకాశాఢ్య సత్యాగ్రహాద్యాయుధోపేత గాంధీ మహాత్మాది ధన్యాత్మ సంపాదితా పూర్వ సౌభాగ్య సంపద్విశేషాన్వితా! రమ్య వర్ణత్రయోద్గీత సద్భావ సంకేత సంయుక్త చారుధ్వజా! సుప్రజా! లోకవిఖ్యాత ప్రద్యోత ప్రజ్ఞామయానేక ధీర ప్రజానాయకశ్రేణి సంవర్ధితాశేష ఖండాంతరవ్యాప్త సౌభ్రాత్ర సౌహార్ద భావాంచితా! లోకసంపూజితా! జ్ఞానవైరాగ్య భక్త్యాది సన్మార్గ వైవిధ్య సంశోభితా! సాధు సంభావితా! దివ్యతేజోన్వితా! భారతక్ష్మామహాదేవతా! శాంతి సౌభాగ్య సంపన్మహాపారిజాతా! నమోవేదభూమే - నమఃపుణ్యభూమే - నమోధర్మభూమే - నమోధన్యభూమే - నమోవీరభూమే -నమోమాతృభూమే -నమస్తే - నమస్తే - నమస్తే - నమ:. జైశ్రీరాం.జైహింద్.

--(())--
 
*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి -._*

*
*ప్రతీ మతంలో ఉన్న ప్రవక్తలు ఒకే సత్యాన్ని భోధిస్తారు.*


*స్వామివివేకానంద-ధీరయువతకు...*
*_మానవునిలోని దివ్యత్వం_*

*అంతరాత్మ ఎల్లప్పుడూ దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. దాని నుండి తొలగిపోయి ఈ ఐహికమైన మాంసం, ఎముకలతో కూడిన పంజరం వైపు తమ దృష్టిని మరల్చి, మానవులు 'నేను', 'నేను', 'నేను' అని అంటున్నారు. బలహీనత లన్నింటికి ఇదే మూలం.*

🕉🌞🌎🌙🌟🚩

హరిఓం 

'ఓం''...  తో   అలసట  మాయం...
శాస్త్రీయంగా  నిరూపించిన  బాలిక.......

👉    ఓం... శబ్దంతో....
శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది.
👉పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది.
👉కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.

👉ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.

అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...
👉ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ
జేసింది.
👉అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.

👉గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు.

👉ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు.
👉ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించి నపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.
👉అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది.
👉దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది.
👉దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. 👉ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.

👉17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది.
👉ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది....

ప్రతి రోజు  ఉదయం ,  సాయంత్రం  కనీసం  11 సార్లు  దీర్ఘ  ఓంకారం  చేయండి.........  మీ  భందు మిత్రులతో  చేయించండి ........ ఓం ,  ఓం , ఓం....











--(())--

ఇది కధ కాదు. బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు. ఆయన ఆఫీస్ కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్. పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందరనుండి తన గుర్రంమీద వెళ్లేవారు. అలా వెడుతున్న సమయంలో పీటర్ తన కాళ్లకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడచి వెళ్లేవారు భక్తిగా. ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తోంది. పీటర్ తన ఇంట్లో పడుకుని ఉండగా పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేవగానే, ఎదురుగా ఒక స్త్రీ వంటినిండా బంగారు ఆభరణాలతో నిలుచుని ఉంది. పీటర్, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుండగానే ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ, రా రా అని పీటర్ ను బయటకు పిలిచి, కనీసం కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలోనే వడి వడిగా నడుస్తూ కొంతదూరంలో అదృశ్యమవడం, ఇంటి నుంచి బయటకు వచ్చిన పీటర్ గమనించి వెనుతిరిగిన మరుక్షణంలోనే, అతని నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్ఘాంత పోయిన పీటర్ కొద్దిసేపటికి తేరుకుని, ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటకు పిలిచి ఈ ఘోరాపద నుండి కాపాడినది, సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారే అని గ్రహించి చేతులెత్తి నమస్కరించిన కలెక్టర్ పీటర్ ఆ మరునాడు భక్తితో ఆలయానికి వెళ్లి అర్చకులను సంప్రదించి, రాత్రి జరిగిన ఆ ఉదంతాన్ని వారికి తెలియ చేస్తూ, అయ్యా రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షి అమ్మవారి కాళ్లకు పాదరక్షలు లేవని గమనించాను. నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు బహుమతిగా ఇవ్వదలిచాను. మీరు అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వగలరు అని వారి అంగీకారంతో 412 రూబీస్, 72 ఎమిరాల్డ్స్, 80 డైమండ్స్ తోవజ్ర వైడూర్య సహితమైన అత్యంత విలువైన స్వర్ణ పాదుకలను ఆ మధుర మీనాక్షి తల్లికి సమర్పించారు కలెక్టర్ పీటర్. "పీటర్ పాదుకలుగా" పిలువబడే ఆ పాదుకలను ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే "చిత్ర ఫెస్టివల్" సందర్భాన అమ్మవలారి ఉత్సవ మూర్తి పాదాలకు అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఆనాడు సత్య తార్కాణంగా జరిగిన ఈ సన్నివేశం, అన్య మతస్థుడైనా, భగవంతునిపై ఆయనకున్న భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిపోయింది.
అపూర్వమైన సందేశం పంపిన
వారికి ధన్యవాదములు 🙏 🙏

🕉🌞🌎🌙🌟🚩

*_Swamy Vivekananda's wisdom for daily inspiration - ._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - _*

*Sympathy for the poor, the downtrodden, even unto death - this is our motto.*

*పేదసాదలకు, పతితులయందు సానుభూతిని చూపటమే మన లక్ష్యం.*

🕉🌞🌎🌙🌟🚩

*SWAMIVIVEKANANDA-TO THE BRAVE YOUTH...*
*_DIVINITY OF MAN_*

*If matter is powerful, thought is omnipotent. Bring this thought to bear upon your life, fill yourselves with the thought of your almightiness, your majesty and glory.*

*స్వామివివేకానంద-ధీరయువతకు...*
*_మానవునిలోని దివ్యత్వం_*

*జడపదార్ధం శక్తి సమన్వితమైతే, సంకల్పం సర్వ శక్తి సమన్వితం. ఈ విశ్వాసం మీ జీవితాల్లో కనిపించుగాక! మీ ఘనత, మీ ఔన్నత్యం, సర్వ శక్తిమంతమైన మీ స్వభావాన్ని గూర్చిన ఆలోచనలను నిరంతరం కలిగి ఉండండి.*

🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌟🌙🚩

 *_Swamy Vivekananda's wisdom for daily inspiration - *

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - *


*పారమార్థికతకు, వేదాంతానికి, సంఘనీతికి, సాధుత్వానికి, ప్రియవర్తనకు, ప్రేమకు భారతదేశం మాతృభూమి. అది ఎప్పుడూ సజీవంగా ఉంచాల్సిన భాద్యత మనమీదే ఉంది.*

*_మానవునిలోని దివ్యత్వం_*

*ఈ వేదాంత భావాలు అరణ్యాలకు, గుహలకే పరిమితం కాకుండా అందరి ముంగిట్లోకీ అవి రావాలి. న్యాయవాద వృత్తిలోని వారికి న్యాయమూర్తులకు, ఆధ్యాత్మిక సభా సమూహాలలోనికి, గుడిసెలో నివసించే పేదవాడికి, చేపలు పట్టే బెస్తవారికి, విద్యార్ధి లోకానికి ఈ భావాలు అంది ఆచరణాత్మకం అవ్వాలి. చేపలు పట్టేవాడు తాను ఆత్మనని భావిస్తే ఉత్తమ బెస్తవాడుగా మారతాడు. విద్యార్థి తనను తాను ఆత్మగా భావిస్తే ఉత్తమ విద్యార్థిగా ఎదుగుతాడు. న్యాయవాది తనను ఆత్మగా భావిస్తే ఉత్తమ న్యాయవాదిగా రాణిస్తాడు.*


🕉🌞🌎🌟🌙🚩
అనురాగపు స్వరాలు
(చిన్న కధ)


హలో .. హలో ... అన్నాడు

ఏమండి 
నాకు   ......   నాకు నా శ్రీమతి మీద అనుమానము ఉన్నది
దానికి పరిష్కారము చెప్పాలి మీరు
మీకు ఫోన్ లో మాటలకు ఏమి చెప్పలేను స్వయముగా కలవండి
ఏమండి అంటూ ఒకతను కలిసాడు రామకృష్ణతో
నా భార్య ప్రేమ మరీ అతిగా ఉంటుంది
అసలు ఎలా ఉంటుందో చెప్పవయ్యా


భార్యగా తన విధిగా భర్తను కడుపునిండా మంచి ఆహారము పెట్టాలని, సుఖ పెట్టాలని, నా సలహాలతో వృద్ధిలోకి వచ్చి సంపాదన పెరగాలని, తనను బానిసగా చూడక ప్రేమగా చూడాలని, పుట్టింటి వారిని ఆదరించి గౌరవించాలని, కోరికలన్నీ తనతోటే తీర్చుకోవాలని, వ్యసన పరుడుగా మారి భాద పెట్ట కూడదని, పరుల ముందు కించ పరచకుండా ఉండాలని, సాధింపులు లేకుండా విశ్రాంతి కల్పించాలని, తన మాంగల్యం భంధం సుఖ సౌక్యాలతో ఉండాలని ఆశతో, ఆశయాలతో కోరుకునేది.


నా భార్య ఇంకా


భార్య కడుపు పండాలని, పొదుపు నేర్చుకోవాలని, తనకు బాసటగా నిల్వాలని, తనవారిని ఆదరించి గౌర వించాలని, తనకు ఎదురు తిరిగి మాట్లాడ కూడదని, అందంగా అలంకరించుకొని ఎప్పుడు ఉండాలని, ఎటువంటి కోరికలు కోరుకో కూడదని, తనకుటుంబాన్ని గుర్తించాలని, ఇంటి గుట్టు కాపాడాలని, సంపూర్ణ ఆరోగ్యవతిగా సుఖ పెట్టాలని కోరుకునేవాడు మగవాడనే ధీమాతో ఉండేవాడు భర్త.

భార్య భర్తల మధ్య ఉండాల్సింది ఆకర్షణ, ఎ పరిస్తితిలోను కుడా వికర్షణ అనే భావము మనసులో కూడా రాకూడదు. అని ఎన్నో సలహాలు ఇస్తుంది.



అస్తమించు చున్న సూర్యుడికి తూర్పున ఉదయిస్తానాని నమ్మకం ఉంటుది, అట్లే కష్టాలు ఎప్పుడు ఉండవని సుఖాలు వస్తాయని నమ్మకంతో బ్రతకాలని, అమావాస్యపు చికట్లు తొలగి పున్నమి వెలుగులు వస్తాయని గమనించాలి. ఎన్ని సార్లు  ఓటమిని చూసిన, లోకమంతా వేలెత్తి చూపినా, మనోధైర్యంతో రేపటి యుద్దంలో గెలవాలని బ్రతికి బ్రతికిన్చుకోవాలి ప్రతిఒక్కరు.

అని ఉపన్యాసము ఇస్తుంది.

దీనికి నేను న్యాయము ఎలా చేయాలో తెలియుట లేదు

ఓపిక పట్టాలోయ్ ----    నన్ను చూసి నేర్చుకో 

అవునో  నేను నీకన్నా ఎక్కవ బాధపడుతున్న నేను ఎవ్వరికి  చెప్పుకోలేను, ఇలా నాదగ్గరకొచ్చిన వారిని నాకు  కుదిరితే  ఇస్తా లేదా నా  శ్రీమతికి ఈ కేసుని అపగిస్తా 
 
ఇంతకీ మీకు పిల్లలున్నారా
మాకు పిల్లలు లేరండి మాకు పిల్లలు వద్దని నేను మందులు  వాడుకుంటున్నాను అన్నాడు

ఆ తెలిసింది లోపము భార్యలో లేదు నీలో నే ఉన్నది.

మనలోని దుర్గుణములు తొలగిపోతాయి. మంచి వారితో కలిసి మెలసి తిరగడము వంటికి గంధము పూసుకోవడము వంటిది. శరీరములోని దుర్గంధాన్ని మంచి గంధము పూత యెలా దూరము చెస్తుందో , అలాగే సజ్జన సాంగత్యము మనలోని అవలక్షణాలని దూరము చేస్తుంది."

స్త్రీకి ఎప్పుడు మాతృత్వము పై ఎక్కువ ప్రేమ ఉంటుంది మీకు పిల్లలు పుట్టాక అన్ని సర్దుకుంటాయి అది తెలుసుకో

ఒకరి భావాలు ఒకరు అర్ధం చేసుకొని జీవిన్చటమే ఆలూమగల - అనురాగపు స్వరాలు

--(())--



*నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు* ఇది తాళ్ళపాక అన్నమాచార్య కీర్తన. పాడినవారు:- శ్రీ మతి నందినీ రావ్ గారు.
రాగం : హిందోళం

నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమైతానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మయై యుండు సం-
స్తుత్యుడీ తిరు వేంకటాద్రి విభుడు|| ||నిత్యాత్ముడై యుండి||

యేమూర్తి లోకంబు లెల్ల నేలెడు నాత
డే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత
డే మూర్తి నిజమోక్ష మియ్యజాలెడు నాత
డే మూర్తి లోకైక హితుడు|| ||నిత్యాత్ముడై యుండి||

యే మూర్తి నిజమూర్తి యేమూర్తి యునుగాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైన యాత
డేమూర్తి సర్వాత్యుడేమూర్తి పరమాత్ము
డామూర్తి తిరు వేంకటాద్రి విభుడు|| ||నిత్యాత్ముడై యుండి||

యేదేవు దేహమున నిన్నియును జన్మించె
నేదేవు దేహమున నిన్నియును నఱగెమరి
యేదేవు విగ్రహంబీ సకల మింతయును
యేదేవు నేత్రంబు లిన చంద్రులు|| ||నిత్యాత్ముడై యుండి||

యేదేవుడీ జీవులన్నింటిలో నుండు
నేదేవు చైతన్య మిన్నిటికి నాధార
మేదేవుడవ్యక్తుడే దేవుడద్వంద్వుం
డాదేవుడీ వేంకటాద్రి విభుడు|| ||నిత్యాత్ముడై యుండి|
--(())_-

ఫోటో వివరణ అందుబాటులో లేదు.
స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయకూడదో తెలుసా ?

పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారానికి అర్హులని పేర్కొంది... స్త్రీలు పంచాంగ నమస్కారం చేస్తే చాలని చెప్పబడింది....
సాష్టాంగ ప్రణామము చేయటానికి ఎనిమిది అంశాలు అవసరమౌతాయి. అవి చాతి (రొమ్ము), నుదురు, శబ్దం, మనస్సు,కాస్త ఎడంగా పెట్టి నమస్కార రూపంలో ఉంచిన చేతులు, కళ్ళు, మోకాళ్ళు మరియు పాదాలు.
సాష్టాంగ నమస్కారం చేయునప్పుడు రెండు పాదాల ముందుభాగం మోకాళ్ళు, చాతి మరియు నుదురు మాత్రమే నేలకు ఆనించి ఉంచాలి. అలా సాష్టాంగ పడ్డప్పుడు చేతులను తలభాగం పైకి ఎత్తి నమస్కరిస్తూ దేవతను ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి మంత్రాలను లేక శ్లోకాలను ఉచ్చరిస్తూ, దేవుడి విగ్రహంపై దృష్టిని ఉంచి మనస్సులో దేవుడిని ధ్యానించాలి.
ఈ పద్దతిలో నమస్కారం అనేది స్త్రీల శరీర నిర్మాణానికి తగినట్లు ఉండదు... స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటపుడు, ఉదరం, పాలిండ్లు, కటి ప్రదేశం నేలకు తగిలే అవకాశం ఉంది... అందువలన గర్భస్థ మహిళలకు, పిల్లలకు పాలిచ్చే మహిళలకు చాలా కష్టంగా ఉండి ప్రమాదం సంభవించవచ్చు.. ఆధునిక శాస్త్రం సైతం స్త్రీలు ఇలాటి ప్రణామాలు చేయడం ద్వారా వారి గర్భాశయం స్థానభ్రమంశం అయ్యే అవకాశం ఉందని తెలియజేయడం జరగింది... అందుకని మన పెద్దలు స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కారించడమో, ధ్యానించడమో లేక మోకాళ్ళపై ఉండి మోకరిల్లడమో(పంచాంగనమస్కారం) చేస్తే చాలు అని చెప్పారు....
అందుకే మరొక ప్రాణికి జన్మనిచ్చి చైతన్యవంతులను చేయగలిగిన అమ్మలకు ఇందులో వెసులు బాటు కలిగించారు....

--((***))--

త్యాగరాజు కీర్తన --- మోహన - ఆది

రామా! నిను నమ్మినవారము-గామా? సకలలోకాభి → /రామా/
పామరజనదూర! వరగుణ! ఘృణా-పాంగ! శుభాంగ! మునిహృదబ్జభృంగ! /రామా/

1) వాలాయముగాను రాను జా-గేల? సుగుణ! దశరథనృ-
పాలహృదయానందకర! శ్రీ-లోల! పాల వెలయుమిక,
ఫాలలోచన-హృదయాల-యా(ఆ)ప్తజనపాల! కనకమయ-
చేల! ఇక పరాకేల? ఇపుడు మ-మ్మేల నీదు మనసేల రాదు? /రామా/

2) నీవే గతియంటినిగాని, - నే వేరేమి యెరుగను, ముందర
రావే? నీ పదపంకజభక్తి-నీవే? భావజారినుత!
దేవ! నీదు పదసేవ ఫలము, మముఁ - గావునే, పతిత-
పావనా! త్రిదశభావనీయ! మునిజీవనా(అ)నిశముఁ బ్రోవవేల? శ్రీ → /రామా/

3) ధారాధరనిభదేహ! జనా-ధార! దురితౌఘజలదస-
మీర! త్యాగరాజహృదయా-గార! సారహీనసం-
సారమందు వేసారి నిన్ను మన-సార నమ్ముకొననేరలేని నే-
నూరక ఇక విచారమందుటకు - మేరగాదు శ్రీరామ! /రామా/

***



(ఋజుగమన సమ)వేగం (velocity), వేగోధృతి (acceleration) కూడా కనిపించే ఈ కృతిని చాలామందే పాడుతున్నారు.

ఈ కృతిని స్వామి ఒక బృందంతో పాడినట్లు గోచరిస్తోంది పల్లవినుండి మొదటి చరణంవరకూ. తరువాత ఆయనొక్కడే పాడాడనిపిస్తోంది!

“అన్ని లోకాలకూ రంజకుడవైన రామా! మేము నీ భక్తులం కామా? దుష్టులకు అందనంత దూరంలో ఉండేవాడవు, శ్రేష్ఠములలైన గుణాలు కలిగినవాడవు కదా! దయతో నిండిన కడగంటి చూపులతో మమ్ములను అనందింపజేసేవాడవు, అందమైన శరీరావయవాలను కలిగినవాడవు, మునుల హృదయాలనే తామరపూలచుట్టూ తిరిగే తుమ్మెదవు.

ఉన్నపళంగా (గజేంద్రుడికోసం బయలుదేరినట్లుగా) రాకుండా ఎందుకు ఆలస్యంచేస్తున్నావు?

ఓ సుగుణాల రాశీ! మీతండ్రియైన దశరథుడి మనస్సుకు సంతోషం కలుగజేసినవాడా! మావద్ద నెలకొనవయ్యా! శివుడి హృదయమే నీ నెలవు! నీకు కావలసినవారిని రక్షించేవాడవే కదా! ఓ పీతాంబరధారీ! మమ్మల్ని రక్షించడానికి మాత్రం మనసురావడంలేదా? మేమంటే నిర్లక్ష్యమా?

నాకేమీ తెలియదు, నీవే గతి అంటూ కూర్చున్నాను. నా దగ్గరకు రావా? నాకు కావలసినది నీ పాదాలపైన భక్తి మాత్రమే! శివుడిచే పూజించబడే దేవుడవు నీవు. నీ పాదాలను సేవించడంవలన కలిగే ఫలితం మాత్రమే మాకు రక్ష. పతితపావనుడవు, దేవతలెప్పుడూ నిన్నే స్మరిస్తూంటారు కదా! మునులకు జీవనాధారుడవు నీవే!

నిరంతరం మమ్మల్ని రక్షించవలసిందే!

నీలమేఘశ్యామా! జీవాధారా! పాపసమూహాలనే మేఘాలను చెదరగొట్టే వాయువా! నా మనసులో గూడుకట్టుకొన్నవాడా! ఈ చావుపుట్టుకలతో నిండిన ఈ సంసారం అంటే నాకు విసుగు పుట్టింది! నేను పూర్తిగా నిన్ను నమ్ముకోలేని (unable to have implicit faith in You) వాడనైనా, ఇలా బాధపడడం ఇంక నావలనకాదు!”

దశరథుడు నిండు సభలో రాముడిని యువరాజుగా చేసే ప్రసక్తిని తెచ్చినప్పుడు ‘మాటవరసకు’ ప్రజాభిప్రాయాన్ని అడిగాడట - ‘తనకు ఎవరూ అడ్డుచెప్ప’రని తెలిసినా. మరి ఎందుకు అడిగాడంటే - ప్రజలు ముక్తకంఠంతో తన కొడుకుని ‘పొగడి మరీ ఒప్పుకోవడమే’ ఆయన కోరుకొన్నది’ అంటారు కొందరు పౌరాణికులు!

రాముడిని వర్ణించడానికి త్యాగయ్యదగ్గర వెదకుకోవలసిన అవసరం లేనంత సరంజామా ఎప్పుడూ సిద్ధంగానే

ఉంటుందని చెప్పడానికి ఈ కృతి ఒక తార్కాణ.

----------

సకలలోక+అభిరామ! అన్నిలోకాల్లో అందమైనవాడా/లోకాలనూ రంజింజేసేవాడా! ; దూర! - అందుబాటులో ఉండనివాడా!; పామరజనదూర! - ‘దుష్టులకు దూరంగా’ ఉండేవాడా! (పామరులంటే చదువుకోనివాళ్ళని కాదు ఇక్కడ) ; ఘృణా+అపాంగ! - దయతో కూడిన కడగంటి చూపులు కలిగినవాడా!; మునిహృద్+అబ్జ - మునులయొక్క హృదయాలనే తామరపూల ; భృంగ! - (చుట్టూ తిరిగే) తుమ్మెదా!

వాలాయముగా - సిద్ధంగా (readily), positively (‘నిర్బంధం/compulsion’ అనే అర్థం ఇక్కడ పొసగదు!) ; రాను జాగు+ఏల? - రావడానికి ఆలస్యం ఎందుకు? ; శ్రీలోల! - లక్ష్మీదేవియందే మిక్కుటమైన ఆసక్తి గలవాడా! ; ఇక పాల వెలయుము - మాపట్ల నెలకొనుము ;

ఫాలలోచన-హృదయ-ఆలయ! - శివుడి హృదయంలో గూడుకట్టుకొన్నవాడా! ; ఆప్తజనపాల! - దగ్గరివారిని రక్షించేవాడా! ; కనకమయచేల! - పీతాంబరమును కలిగినవాడా! ; పరాకు - నిర్లక్ష్యం ; ముందర రావే - ఎదుటకు రమ్ము ; నీ పదపంకజభక్తిన్+ఈవే? - నీపాదపద్మాలపై భక్తిని ఈయవా? ; భావజ+అరి+నుత! - మన్మథుడికి శత్రువైన శివుడిచేత కీర్తింపబడేవాడా! ; మమున్+కావునే - మమ్మల్ని రక్షిస్తుంది ; పతితపావనా! - పతనంచెందినవాళ్ళను కూడా పవిత్రులుగా చేసేవాడా! ; త్రిదశ-భావనీయ! - దేవతలకు స్మరణీయుడైనవాడా! (అమృతం త్రాగిన కారణంగా దేవతలకు మరణమే ఉండదట! - త్రిదశలు = 3 దశకాలు - 3 × 10 = 30 ఏళ్ళు వాళ్ళకి అంతే, ఇక దాటదని లెక్క) ; మునిజీవనా! - మునులమనస్సులలో గూడుకట్టుకున్నవాడా! ; అనిశము - ఎల్లవేళలా ;

ధారాధరము- మేఘము (నీటిని ధరించేది) ; ధారాధర-నిభ-దేహ! - మబ్బుతో సమమైన రంగును కలిగినవాడా! ; జన+ఆధార! - జీవులకు ఆధారమైనవాడా! ; దురిత+ఓఘ - పాపాలసముదాయం అనే ; జలద-సమీర! - మేఘాలను చెదరగొట్టే వాయువైనవాడా! ; త్యాగరాజహృదయ+ఆగార! - త్యాగరాజుహృదయమే ఉనికిపట్టైనవాడా! ; వేసారి - విసుగెత్తిపోయి ; మనసార నమ్ముకొననేరలేని - పూర్తిగా నమ్మగలగడం అనేది చేతగాని ; మేరగాదు - నా తరం కాదు;

*****

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ  

మది పులకించును నీ నామము  విన్నా 
మది తపియించును  నీ గానము విన్నా 
మది చలియించును నీ భాష్యము విన్నా  
మది ఉడికించును  నీ కావ్యము విన్నా 

ఇది యని చెప్పను నీ మాటను విన్నా 
బ్రమ అని ఒప్పను నీ సూక్తులు విన్నా 
చిరు నగు మౌముయె నీ పల్కులు విన్నా 
నవ విధ భావము నీ  మాయను విన్నా 

శుభకల కల్గును నీ ధైర్యము విన్నా 
పరిణత చెందును నీ జ్ఞానము విన్నా 
తరుణము మోక్షము నీ విజ్ఞత విన్నా 
సిరియును పెంచును నీ ప్రేమయు ఉన్నా 

కరుణయు కల్గును నీ శ్లోకము విన్నా 
నయనము వన్కును నీ సేవలు విన్నా  
తలవగ ఉండను నీ దానము విన్నా 
జయజయ శ్రీరమ నీ వల్లభ సేవా 

--((*))--
  
సాహితీమిత్రులారా!

ఒక పద్యాన్ని విన్నపుడు అలాంటిది అంతకుమునుపు రాసిన
లేదా విన్న పద్యం గుర్తుకు రావడం సహజం అలా గుర్తుకు వచ్చేట్లు రాస్తే దాన్నే అనుకరణ అనవచ్చు. అలాంటిది ఒకదాన్ని ఇక్కడ చూద్దాం -.

తల్లిదండ్రులఁబ్రోచు తనయుండు తనయుండు

తగు రాజుచే పడ్డ ధరణి ధరణి

అభిమానవతియైన యంగన యంగన

యక్కఱ కొదవిన యర్థ మర్థ

మొరుకాంతఁగోరని పురుషుండు పురుషుండు

వేఁడని యాతని విద్య విద్య
సంగరాంగణమునఁజచ్చుట చచ్చు టు
పవసించి సల్పెడు వ్రతము వ్రతము
ఎదురు తన్నెఱిఁగిన యట్టి యెఱుక యెఱుక
ప్రజలు మెచ్చఁగఁజెప్పెడి పాటి పాటి
పగయె లేకుండ బ్రతికిన బ్రతుకు బ్రతుకు
మనుజ మందార సింగన మంత్రి మాచ


ఈ పద్యం వింటూనే చటుక్కున గుర్తుకు వచ్చే పద్యం

పోతన భాగవతంలోని ఈ పద్యం చూడండి.

కమలాక్షు నర్చించు కరములు కరములు

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు

శేషశాయికి మ్రొక్కు శిరము శిరము

విష్ణు నాకర్ణించు వీనులు వీనులు

మధువైరిఁ దవిలిన మనము మనము
భగవంతు పలగొను పదములు పదములు
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి
దేవదేవునిఁ జింతించు దినము దినము
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు
తండ్రి హరి జేరు మనియెడి తండ్రి తండ్రి


ఈ పద్యాలలో లాటానుప్రాస గమనింపగలరు

ఆవృత్తమైన రెండుపదాలు అర్థభేదంలేకుండా

తాత్పర్యభేదం వుంటే దాన్నిలాటానుప్రాసం అంటారు.

-------------------------------------------

- ఏ.వి.రమణరాజు
-
అన్నమయకోశం ఏది?

అన్నసారంతో పుట్టి, అన్నసారంతో పెరిగి అన్నరూప భూమిలో కలిసిపోయే స్థూలశరీరమే అన్నమయ కోశం.
అన్నరూప సారంతో పుడుతున్నది: అసలు శరీరం తయారయ్యేది తల్లిగర్భంలో. తల్లిగర్భంలో పిండం ఏర్పడాలంటే తల్లి అండం, తండ్రి బీజం (వీర్యం) ఉండాలి. తండ్రిలో వీర్యం తయారయ్యేది అన్నరసం వల్లనే. కనుక అన్నసారంతోనే దేహం యొక్క పుట్టుక.
అన్నరూపసారంతో పెరిగేది :- తల్లిగర్భంలో పిండం క్రమక్రమంగా పెరుగుతున్నదీ అంటే అది తల్లి తీసుకొనే ఆహరం ద్వారానే. అలాగే పుట్టిన తర్వాత ఆ స్థూలశరీరం క్రమక్రమంగా పెరిగేది కూడా అతడు తీసుకొనే ఆహారం వల్లనే. కనుక అన్నసారంతోనే పెరుగుతుంది.
అన్నసారమైన భూమిలో కలిసిపోయేది :- చనిపోయిన తరువాత ఆ దేహం మట్టిలో కలిసిపోతుంది. మట్టి లేదా భూమి అన్నరూపమే. ఎందుకంటే ఆ భూమి నుండే ఆహారంగా కాయలు, పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలు మొ||నవి వస్తున్నవి. అందుకే ఈ దేహం అంతా అన్నమయం. కనుక దీనిని అన్నమయ శరీరం అన్నారు. ఇది స్థూలదేహం.

అన్యోన్య అధ్యాస
అన్నమయకోశం ఆత్మ వేరువేరు అయినప్పటికీ అంతా ఒక్కటిగా - నేనుగా ఎందుకు అనుకుంటున్నాం? ఇదే అన్యోన్య అధ్యాస - అన్నమయకోశమే నేను అనుకోవటం అజ్ఞానం - 

నేను స్త్రీని, నేను పురుషుణ్ణీ  అనే అన్నమయకోశ జాతి ధర్మాలను, నేను పుట్టాను, పెరుగుతున్నాను అనే దేహమార్పులను, నేను బాలుడను, యువకుడను, వృద్ధుడను అనే అవస్థలను, నేను బ్రాహ్మణుడను, వైశ్యుడను, శూద్రుడను అనే వర్ణధర్మాలను, నేను బ్రహ్మచారిని, గృహస్థును అనే ఆశ్రమ ధర్మాలను, నేను ఆంధ్రుడను, మలయాళీని, తమిళుణ్ణి అనే దేశ ధర్మాలను, నేను రామారావును, వెంకట్రావును, సీతాదేవిని, అనే నామాలను, మొ||న ఈ అన్నమయ కోశ ధర్మాలను - వికారాలను, ఇవి ఏమీలేని నిరాకార నిర్గుణ, సచ్చిదానందస్వరూపమైన ఆత్మపై (నేను పై) ఆరోపించటం జరుగుతున్నది.
ఇక ఆత్మ ధర్మాలైన సత్ - చిత్ - ఆనందమనే ధర్మాలను శరీరం ఉన్నది అనుకోవటం, తెలివిలేని శరీరాన్ని తెలివిగలదనుకోవటం, దుఃఖాన్ని కలిగించే శరీరాన్ని ఆనందం కలిగించేదిగాను భావిస్తున్నాం. ఈ విధంగా ఆత్మధర్మాలను అన్నమయకోశంపై ఆరోపిస్తున్నాం. అన్నమయకోశానికి - ఆత్మకు అన్యోన్యఅధ్యాస ఉన్నట్లుగా భావిస్తున్నాం.

03-12-2019



*స్వామివివేకానంద-ధీరయువతకు...*
*_ఆత్మవిశ్వాసం_*

*సమస్త గ్రంధాలలో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉంది.అంతకంటె వేయిరెట్లు ఎక్కువగా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు. ఈ విశ్వంలో నీవు దేన్నైనా సాధించగలవు.ఎన్నడూ దౌర్బల్యానికి లోనుగాకు. సమస్త శక్తీ నీదే.*

🕉🌞🌎🌙🌟🚩
చందమామ కధ.!
బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చుట్టుకుంటుంది?
[భట్టి విక్రమాదిత్యుల కథ ]

విక్రమార్కుడు మళ్ళీ భేతాళుణ్ణి బంధించాడు. భేతాళుడు మళ్ళీ మరో కథ ప్రారంభించాడు. ఒకప్పుడు ‘అవినాశి’ అనే నగరం ఉండేది. (వినాశం లేనిది అని ఆ పేరుకి అర్ధం.) ఆ నగరంలో దేవనాధుడు అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడి కొక కుమారుడు, అర్జున స్వామి. అతడు రూపవంతుడూ, గుణవంతుడు. అతడికి యుక్త వయస్సు వచ్చాక తండ్రి దేవనాధుడు, ఎన్నో ఊళ్ళు వెదికి తగిన కన్యని తెచ్చి వివాహం చేసాడు. ఆ పిల్ల పేరు అనామతి. ఆమె అర్జునస్వామికి రూపంలోనూ, గుణంలోనూ తగిన భార్య. తీయని మాటలూ, చక్కని చేతలూ గలది. యువ దంపతులని చూసిన ఎవరైనా… వారు ఒకరి కొకరు తగి ఉన్నారనే వారు. గువ్వల జంట వంటి ఆ యువజంట, ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళు. క్షణమైనా ఒకరినొకరు ఎడబాయక ఉండేవాళ్ళు. వారి తీరుని చూసి అందరూ ముచ్చట పడే వాళ్ళు. ఇలా ఉండగా…ఓ నాటి రాత్రి… చల్లగాలి వీస్తొందని భార్యభర్తలిద్దరూ, పెరట్లో మల్లెపందిరి ప్రక్కనే మంచం వేసుకు పడుకున్నారు. అది వెన్నెల రాత్రి! అర్జునస్వామి, అనామతి ఆరుబయట ఆదమరిచి నిదురిస్తున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఓ రాక్షసుడు వెళ్తోన్నాడు. అతడు భీకరంగా ఉన్నాడు. అతడి చూపులు అంతకంటే కౄరంగా ఉన్నాయి. దిగువకి చూసిన రాక్షసుడి కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి. అతడికి అనామతి అద్భుతంగా అనిపించింది. ఆమె అందానికి అదిరిపోయాడు. అమాంతం క్రిందికి దిగి, ఆమెని ఎగరేసుకు పోయాడు. రాక్షస మాయ కారణంగా అనామతికి గానీ, అర్జునస్వామి గానీ నిద్రాభంగం కాలేదు. తెల్లవారింది. అందరి కంటే ముందే లేచి గృహకృత్యాలలో నిమగ్నమయ్యే అనామతి ఏది? నిద్రలేచిన అర్జునస్వామికి భార్య ఎక్కడా కనబడలేదు. కుటుంబ సభ్యులంతా కూడా వెతికినా అనామతి జాడలేదు. ఎవరికీ ఏమీ తోచలేదు. కీడెంచి మేలెంచమని, ఊళ్ళోని చెరువులూ నూతులూ కూడా గాలించారు. బంధుమిత్రులందరినీ వాకబు చేసారు. ఆమె ఆచూకీ తెలియ లేదు. అర్జునస్వామికి దుఃఖం కట్టలు దాటింది. అతడు ఎలాగైనా భార్య జాడ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో దేశాటనం బయలు దేరాడు. అనామతి గురించి వెతుకుతూ ఎన్నో ప్రదేశాలు, ఊళ్ళూ, అడవులూ గాలించాడు. ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. నిరాశా నిస్పృహలతో, స్వంత ఊరు అవినాశికి తిరుగు ప్రయాణమయ్యాడు. లోలోపల మిణుకు మిణుకు మంటూ ఓ చిరు ఆశ… ‘ఒక వేళ ఈ పాటికి అనామతి ఇల్లు చేరిందేమోనని’. తిరుగు ప్రయాణంలో, అలసటతోనూ, ఆకలి తోనూ ఉన్నాడు. అప్పటికి ఓ గ్రామం చేరాడు. ఓ బ్రాహ్మణ గృహం ఎంచుకొని ‘భోజనం పెట్ట’మని అడిగాడు. గృహస్థు భార్యని పిలిచి “అతిధికి భోజనం పెట్టు” అని చెప్పాడు. ఆ గృహిణి అతడికి భోజనం వడ్డించే ప్రయత్నం చెయ్యబోగా…అర్జున స్వామి “అమ్మా! స్నాన సంధ్యలు ముగించుకొని ఆరగిస్తాను. భోజనం కట్టి ఇవ్వు” అని అర్ధించాడు. గృహిణి ఒక చిన్న వెదురు బుట్టలో అరిటాకు వేసి, అందులో అన్నం పప్పూ కూరలూ సర్ధింది. ఓ చిన్న పిడతలో పెరుగు, ప్రక్కనే పండూ తాంబూలం ఉంచింది. భక్తిగా అతిధికి సమర్పించింది. అర్జునస్వామి వారిని “అన్నదాతా! సుఖీభవ!” అంటూ ఆశీర్వదించి, తిన్నగా చెరువు గట్టుకు వెళ్ళాడు. చెరువులో నీళ్ళు నిర్మలంగా ఉన్నాయి. చెరువు ఒడ్డున పెద్ద మర్రి చెట్టుంది. దాని నీడ చల్లగా హాయిగా ఉంది. అర్జునస్వామి, భోజనం ఉన్న బుట్టని ఆ చెట్టు క్రింద ఉంచి, చెరువులో స్నానం, సంధ్యా వందనం పూర్తి చేసుకున్నాడు. చెట్టు క్రింద కూర్చొని ఆవురావురుమంటూ అన్నం తినసాగాడు. ఆ సమయంలో… మర్రి చెట్టు కొమ్మపైకి ఓ గ్రద్ద వచ్చి వాలింది. దాని గోళ్ళల్లో ఓ కాలనాగు గిలగిల్లాడుతుంది. చెట్టు కొమ్మపైన కూర్చున్న గ్రద్ద, ఆ పాముని ముక్కుతో పొడుచుకొని తినసాగింది. మరణ యాతనకి పాము విలవిల్లాడుతూ విషం కక్కసాగింది. ఆ విషం తిన్నగా అర్జునస్వామి అన్నం తింటున్నా అరిటాకుపై సన్నని తుంపరగా పడసాగింది. ఎంత సన్నని బిందువులంటే…ఆరగిస్తున్న అర్జునస్వామికి సైతం దృష్టికి ఆననంత! అసలే ఆకలిగా ఉన్న అర్జునస్వామి, అన్నం పప్పూ కూరలతో స్వాదిష్టంగా ఉన్న భోజనాన్ని ఇష్టంగా ఆరగిస్తున్నాడు. అయితే కాస్సేపటికి, విషాహారం కారణంగా అతడు మృతి చెందాడు. ఇదీ కథ! అంటూ కథ ముగించిన భేతాళుడు…“విక్రమార్క మహీపాలా! ఈ బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చెందుతుంది? ఆహారాన్నిచ్చిన బ్రాహ్మణ దంపతులకా? పాముని చంపితిన్న గ్రద్దకా? విషం గక్కిన పాముకా? విషాహారాన్ని తిని మరణించిన అర్జునస్వామికా?” అనడిగాడు. [త్వరపడి ఈ ప్రశ్నకు జవాబు చెప్పకండి. విక్రమాదిత్యుడి తర్కం చదివాక, అప్పుడు చెప్పండి. భారతీయుల నమ్మకాల్లో…బ్రాహ్మణ హత్య (అంటే సత్వగుణ సంపన్నుడి హత్య) మహా పాపమనీ! దాన్ని బ్రహ్మహత్యాపాతకం అంటారు. అలాగే గోహత్య, స్త్రీ హత్య, శిశుహత్యలను కూడా పరమ పాపాలని నమ్మేవాళ్ళు. ఆ కోవలోకే చెందుతుంది ఆత్మహత్య కూడా! ఇప్పుడు నమ్మకాలూ బాగానే సడలి పోయాయి, దృక్పధాలూ మారిపోయాయి. ఎంత పాపానికైనా వెనుతీయని సమాజాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.] విక్రమాదిత్యుడు స్ఫుటంగా “భేతాళా! ఇందులో ఎవరి తప్పూ లేదు. ఆకలిగొన్న అతిధిని సత్కరించటం గృహస్థు ధర్మంగా భావించి, బ్రాహ్మణ దంపతులు, అర్జునస్వామికి ఆహారం సమర్పించాడు. స్నాన సంధ్యలు ముగించి భోజనం చెయ్యడం సదాచారమని భావించి, అర్జునస్వామి చెరువుకు చేరాడు. చెట్టు నీడన కూర్చొని భోజనం చేసాడు. గ్రద్ద తన ఆహారాన్ని తాను వేటాడి తెచ్చుకుంది. చెట్టు కొమ్మపై కూర్చొంది. మరణ యాతనకి పాము విషం గ్రక్కింది. పాములు గ్రద్దలకి దేవుడిచ్చిన ఆహారం. మరణ సమయాన విషం గ్రక్కడం పాము ప్రారబ్దం. అందుచేత వాటి దోషమూ లేదు. అందుచేత వీరెవ్వరికీ బ్రహ్మహత్యా దోషం అంటదు. అయితే… ఎవరీ కథ విని, పూర్వాపరాలూ, ధర్మసూక్ష్మాలూ ఆలోచించకుండా… ‘ఫలానా వారికి బ్రహ్మహత్యా దోషం అంటుతుంది’ అంటారో, వారికి, ఈ బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది” అన్నాడు. విక్రమార్కుడి విజ్ఞతకి భేతాళుడికి చెప్పలేనంత ఆనందం కలిగింది. చప్పట్లు చరుస్తూ తన ఆనందాన్నీ, అభినందననీ తెలిపాడు. అయితే మౌనభంగమైనందున మరుక్షణం మాయమై మోదుగ చెట్టు పైన మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు.


~~ పోరాట ప్రతి ధ్వని~~ 
*********************. Dr.J. Umadevi 

తూటాలకు బలైపోయి జైళ్లలోన మగ్గిపోయి 
అవమానం భరించితమ ఆత్మలన్నినివేదనం ! 

గాంధీజీ జోలెపట్ట నగలన్నీ ఒలిచిచ్చిరి 
ఇంటింటా వడుకునూలు వ్రతదీక్షకి నివేదనం! 

స్త్రీశ క్తిని కూడగట్టి ఉద్యమాల బాటపట్టి 
హరతులుగ శ్రమశక్తిని భారతికీ నివేదనం! 

ఖద్దరుచీరలనుగట్టి మళ్ళలోన ఉప్పుచేసి, 
తమతమ సుఖాలన్నిలాఠీలకి నివేదనం! 

మాతృభూమి రక్షణలో మగువపాత్ర మరువరాదు 
ఆఅమ్మల తెగువలన్ని గతచరిత్రకి నివేదనం. ! 

లక్ష్మిబాయి సరోజినీ హజరత్ కామాలవంటి 
స్త్రీ సైన్యం పటిమగూర్చి లోకానికి నివేదనం ! 

భగత్ సింగు అల్లూరి సావర్కార్ ఉద్యమాలు 
దేశమాత దాస్య ముక్తి యాగానికి నివేదనం ! 

రెపరెపలాడే జండా ఎగరాలని మనపూర్వులు 
జీవితాలు దేశమాత చరణాలకి నివేదనం ! 

గాంధీజీ అహింసనే ఆయుధముగ పట్టినాడు 
చేసినాడు తనప్రాణం ఈజాతికి నివేదనం ! 

మనదేశం అను భావన అందరి కీ ఉన్నప్పుడు 
జ్ఞానధనం భరతమాత ఎదుగుదలకి నివేదనం ! 

మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసే పండగొచ్చె 
మన భక్తిని మాతృభూమి శ్రీరక్షకి నివేదనం ! 
~~~~~~~~~~~~~
--(())--

 జీరో ఎఫ్ ఐ ఆర్.

జీరో ఎఫ్ ఐ ఆర్...ఇదొకటుందనే విషయం చాలా మందికి తెలీదు. నిజానికి చాలా మంది పోలీసులకే తెలీదు.

ఇది నేనిప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానూ అంటే ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు పోలీసుల ధగ్గరికి వెళితే అది మాపరిధి కాదు అని శంశాబాద్ పరిధి అనీ కాదు కాదు శంశాబాద్ రూరల్ పరిధి అనీ తిప్పారని తెలిసి ఇది రాస్తున్నాను...

ఈ సమస్య ఇప్పుడే కాదు...ప్రతి పోలిస్ స్టేషన్ లోనూ జరిగే ప్రహసనమే...పోలీసులు చాలా సందర్భాలలో బాధ్యత నుంచి తప్పుకోవడానికి మా పరిధి కాదు అనే ఆయుధాన్ని వాడుతుంటారు. నిజానికి ఇది తప్పు.

మనమొక ఫిర్యాదుతో ఏ పోలిస్ స్టేషన్ కు వెళ్ళినా వారు తప్పకుండా ఆ ఫిర్యాదు తీసుకోవాలి. మా పరిధి కాదు అని వాళ్ళు అంటే జీరో ఎఫ్ ఐ ఆర్ చెయ్యండి అని మనం అడగాలి. అప్పుడు జీరో ఎఫ్ అయి ఆర్ చెయ్యాల్సిందే..

ఇంతకూ జిరో ఎఫ్ ఐ ఆర్ అంటే ఏమిటి..
మన ఫిర్యాదు ఏ స్టేషన్ పరిధి లోదో తేలనపుడు మనం ఎక్కడైతే ఫిర్యాదు చేసామో అక్కడ జీరో ఎఫ్  ఐ ఆర్ గా నమోదు చేసి తరువాత సంబందిత స్టేషన్ ఏదో తెలుసుకుని ఆ ఎఫ్ ఐ ఆర్ ను ఆ స్టేషన్ కు పోలీసులు బదిలీ చేయాలి...

ఇంకా చెప్పాలంటే ఏ పరిధిలోదో తెలిసినా సరే మనం ఫిర్యాదును వేరే స్టేషన్ లో చేసి జీరో ఎఫైఆర్ చేయండి అని అడిగితే అక్కడ నమోదు చేయాల్సిందే.
ఇది నియమం.

మా పరిధి కాదు అని ఏ పోలిస్ స్టేషనూ అనడానికి వీలు లేదు.

జీరో ఎఫ్ ఐ ఆర్ గురించి నిజానికి ప్రజల కంటే ముందు పోలిస్ ఆఫీసర్లే తెలుసుకోవాలి .


--((***))--

 నేటి హస్త్యం 



అమ్మ అనసూయ గారు! మరోసారి ఆలోచించండి.

మీకు వ్రుద్దాప్యము,అనారోగ్యము,ఆర్దిక సమస్యలు.

మీ ఆయన చాలా మంచివారు.

ఈ పరిస్తితులలో విడాకులు సమంజసం కాదని నా అభిప్రాయము.



లాయర్ గారూ! నిజంగా మా ఆయన దేముడేనండీ!

ఆయన లేనిదే నా రోజు గడవదు.

నా అంతట నేనేమీ చేసుకోలేని నిస్సహాయురాల్ని. ఆయనంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం, జాలి



మరింకేమిటమ్మ?

ఆయనలోని అపరిచితుడు నా మనసును
తీవ్రాతి తీవ్రంగా గాయ పరుస్తున్నాడు.
ఎప్పుడు మేల్కుంటాడో తెలీదు.
నా యుక్తవయసు నుండి నా విషయాలు
చిలువలు పలువలుగా తెలుసుకుని, అనేక కట్టు కధలు వండి వార్చుకుని,
అభూత కల్పనల కన్నా గోప్ప పాత్రలు స్రుష్టించుకుని నాకు సంబందం లేని పాత్రలకు నాతో ముడి పెట్టి ప్రశ్నల పరంపరలతో నా మనసును
కకలా వికలం చేస్తున్నారు

ఆ ఓక్క క్షణం నెమ్మదిగా మట్లాడితే?

అవును.
నెమ్మదిగా మాట్లాడితే
ఇంత అవమానకర విషయాన్ని సహించేవంటే నువ్వు తప్పు చేసేవనీ, గట్టిగా మాట్లాడితే చింత చచ్చినా పులుపు చావలేదని నిలదీస్తారు!!!

--(())--



సాహితీమిత్రులారా!

మధురవాణీవిలాసమును రచించిన
చింతపల్లి వీరరాఘవయ్యగారు క్రీ.శ.1660
ప్రాంతంలో మహబూబునగర్ జిల్లా,
వట్టెం గ్రామంలో నివసించారు.
ఈ కావ్యం అయిదు ఆశ్వాసాలు గలది
దీనిలో మధురవాణీ కార్తవీర్యుల కథ కూర్చబడినది.
ద్వితీయాశ్వాసంలోని చిత్రకవిత్వంలోని
ఏకాక్షర , ద్వ్యక్షర త్య్రక్షర - పద్యాలను చూడండి-

ఏకాక్షరకందపద్యం-
'న'- అనే ఒకే హల్లుతో కూర్చిన కందము.

నిన్నే నెన్నేనని నే
నెన్నైనను నెన్నునిన్నని నేనా
ని న్నాన నూన నేనిన్
నన్నానును నాననాను నననీనన్నా (2-11)

ద్వ్యక్షర కందము-
'న', 'క' - అనే హల్లులుపయోగించి కూర్చినది.

నానా నాకౌకోనీ
కేనాకన నిన్నెకాక నికనేనొకనై
నానెన్ని కినుక నూనక
కానుకకైకొన్న నిన్ను కన్నా నికఁనే (2-12)

న,మ - అనే రెండు హల్లులతో
కూర్చిన ద్వ్యక్షరకందం-

నేమమ్మున నీనామము
మామనమున నమ్మినాము మము మనుమను మో
మామానినాన నెమ్మిని
మే మనుమానమ్ముమాన మి మ్మెన్నేమా (2-13)

త్య్రక్షరకందము-
ద,న,వ- అనే మూడు హల్లులను
ఉపయోగించి కూర్చిన
కందపద్యం ఇది

దానవవనదవవనదా
నానావిద్వన్నవీన నవననిదానా
దీనానాదీనవదా
నానుదు నెద నీదువాదు నాదవినోదా (2-14)

ఈ కావ్యంలోని మరికొన్ని విషయాలను
తరువాత తెలుసుకొందాము.
------------------------------------------------
- ఏ.వి.రమణరాజు
శ్రీ సీతా రామాంజనేయ చరితం (3)


శ్రీరాముడు-యోగరహస్యము -అరణ్యకాండ.7
పంచవటి నివాసము, లక్ష్మణునికి జ్ఞాన బోధ
అచట గృధ్ర రాజైన "జటాయువు" శ్రీరాముని కలిసి అత్యంత మైత్రిని దృఢపరచు కొనెను. ఒకసారి శ్రీరాముడు సుఖాసీనుడై ఉన్న సమయమున జ్ఞాన వైరాగ్య మాయా స్వరూపములను, ఈశ్వరునికి జీవునకు గల బేధములను, మిమ్ములను సేవించు మార్గము ఉపదేశించి వలసినదిగా శ్రీరాముని, లక్ష్మణుడు కోరెను. అప్పుడు శ్రీరాముడు ఈ విధముగా వివరించెను[1].
లక్ష్మణా! మనస్సు, బుద్ధి, చిత్తములను స్థిరముగా ఉంచి వినుము. నేను, నాది, నీవు, నీది అను భావమే "మాయ". ఇదియే జీవులను తన వశము నందు ఉంచుకొనును. ఇంద్రియములు, ఇంద్రియ విషయములు, మనోగతులు - ఇవి అన్నియు "మాయా స్వరూపములే". ఈ మాయ రెండు విధములు. ఒకటి విద్య, మరియొకటి అవిద్య. వీటిలో అవిద్య దుష్టమైనది, మిక్కిలి దుఃఖ ప్రదమైనది. దీనికి వశమైన జీవుడు సంసార కూపమున పడును. రెండవది విద్య. ఇది త్రిగుణాత్మకమైనది. అందరిలో సమత్వ బుద్ధితో పరమాత్మ రూపమునే "జ్ఞానము" అనబడును. సకల సిద్ధులను, మూడు గుణములను గడ్డిపోచ వలె భావించు వాడే పరమ "విరాగి". జీవుడు ఈశ్వరాంశ, కనుక సచ్చిదానంద జ్ఞాన స్వరూపుడు. కానీ మాయాజానితమైన అవిద్య (అజ్ఞాన) ప్రభావమున జీవుడు తన స్వరూపమును గాని, ఈశ్వరుని మాయను గాని ఎరుంగ లేక యున్నాడు. కావున వివిద లౌకిక కర్మాసక్తుడై జీవుడు బంధములో చిక్కు కొనుచున్నాడు. ఈ బంధముల ఛిజ్జడ గ్రంధి నుండి విముక్తుడై మోక్షమును పొందుటకు సర్వాతీతుడు, మాయా ప్రేరకుడైన పరమేశ్వరుని అనుగ్రహము ఆవశ్యకము. దీనికి భక్తియే సాధన మార్గము. ధర్మాచరణము వలన వైరాగ్యము, యోగాభ్యాసము వలన జ్ఞానము జనించును. జ్ఞానము వలన మోక్షము లభించును. ఈ విధముగా వేదములలో చెప్పబడినది. సోదరా! నా హృదయమును త్వరగా ద్రవింప చేయునది భక్తి. ఇదియే నా భక్తులకు పరమానందమును పంచి ఇచ్చును. ఈ భక్తి స్వతంత్రమైనది. దీనికి ఇతర సాధనములు అవసరము లేదు. జ్ఞానవిజ్ఞానములు దీనికి అధీనములు. ఇది సర్వ సుఖములకు మూలము. సజ్జన సాంగత్యము వలననే ఇది లభించును. ఇప్పుడు భక్తి సాధన రీతులను సవిస్తరంగా వివరించెదను. మొదట పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి ఉండవలెను. వేదోక్తముగా విధులను నిర్వర్తించవలెను. తత్ప్రభావము వలన విషయవాంఛలపై విరక్తి ఏర్పడును. విరక్తి వలన నా ధర్మము (పూజ) నందు అనురాగము కల్గును. అప్పుడు శ్రవణాది నవవిధ భక్తి మార్గముల యందు మనస్సు దృఢమై ఉండును. మనస్సు నా లీలలు యందు అనన్య ప్రేమతో నిమగ్నమగును. అట్టి నా భక్తులకు సజ్జన పాదపద్మములపై అత్యంత ప్రేమ యుండును. అతడు త్రికరణ శుద్ధి కలిగి నియమ పూర్వకముగా నన్ను భజించు చుండును. నన్నే గురువు, తల్లి, తండ్రి, సోదరుడు, పతి, దైవము అని భావించుతూ సేవించు చుండును. నా గుణములు కీర్తించు చున్నప్పుడు అతడు పులకిత గాత్రుడగును. అతని కంఠము గద్గదమగును. నేత్రములు నుండి ప్రేమాశ్రువులు ప్రవహించు చుండును. అతని యందు కామము, మదము, దంభము మొదలుగునవి ఏ మాత్రము ఉండవు. అట్టి అనన్య భక్తునకు నేను సర్వదా వశుడనై ఉందును.
దో-బచన కర్మ మన మోరి గతి, భజను కరహి ని:కామ|
తిన్హ  కే   హృదయ కమల మహు, కరఉ సదా బిశ్రామ||  (దో|| 16 )
మనోవాక్కర్మల యందు సర్వదా నన్నే స్మరించుతూ నిష్కాముడై నన్ను భజించు వాని హృదయమే నా నివాస స్థానము.
యోగవాసిష్ఠములో వసిష్ఠుడు శ్రీరామునికి అవిద్య, బంధ మోహములు, మోక్షము మున్నగు వాటి గురించి వివరించెను. అవి ... ఎల్లపుడు ఉండునది బ్రహ్మతత్వమే అని, అస్థిరమైన మనస్సు, అవిద్యచే ఈ ప్రపంచము సత్యముగా తోచుటయే బంధమని కానీ నిజముగా ఆత్మ శుద్ధ మైనది అని పూర్వ కర్మలు లేని వానిని మృత్యువు కూడా ఏమిచేయలేదని ఆకాశజో పాఖ్యానమున వివరింపబడినది. పరమాత్మ యొక్క మాయాశక్తి అయిన మనస్సే జగమును సృజించు చున్నది కానీ వాస్తవంగా ఈ జగత్తంతా మాయ అని లీలోపాఖ్యానమున వివరింపబడినది. బ్రహ్మమే సత్యము, జీవుడు ఆ పరబ్రహ్మమే ఇరువురికి భేదము లేదు. మనస్సు నందు జనించిన సంకల్ప వికల్పాలే ప్రపంచముగా తోచును. కావున అట్టి మనస్సును నిగ్రహించి పరమాత్మ జ్ఞానం వలన ముక్తిని పొందాలి అని పరమాత్మ వస్తువు ఒక్కటే సత్యమని కర్కటోపాఖ్యానమున వివరించారు. జగద్రూపముగా ఉన్న మాయాస్వరూపాన్ని దాశురోపాఖ్యానములో వివరించారు. ఉపశమ ప్రకరణము నందు మనస్సు ఎలా శాంతి పొందుతుందో దానికి ఉపాయాలు ఏమిటో వివరించారు.  చిత్తాన్ని జయించనంత వరకు మాయ తొలగదు అని గాధి ఉపాఖ్యానములో చెప్పారు. చిత్త విశ్రాంతి కోసము సంగాన్ని త్యజించాలని, ప్రాణ నిరోధము చేయాలి అని వీతహవ్యోపాఖ్యానములో తెలియ చేసారు.
ఈ విధముగా జ్ఞాన వైరాగ్య గుణ నీతి చర్చలతో కొంత కాలము గడచెను.
శ్రీరామ జయ రామ జయజయ రామ
[1] ఈ కధాంశము శ్రీ తులసీదాసు విరచిత "శ్రీ రామచరిత మానసము" లోనిది. వాల్మీకి రామాయణములో లేదు. కావున గమనించ గలరు.

'వందే సంస్కృతమాతరమ్*
*800. శ్లో|| అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః*
*నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః*
*--పంచతంత్రం. కా.కీ.3-98.*
మన శరీరాలు అశాశ్వతాలు, ధనాదివైభవం స్థిరమైనది కాదు. మృత్యువు దగ్గరలో ఉంది. కాబట్టి, ఉన్న కాస్త సమయాన్ని ధర్మానికి కట్టుబడి జీవించాలి.
***
దానికి కుందేలు - ఈ ఇల్లు నీది కాదు! నాదే. నువ్వు అబద్దాలు మాట్లాడుతున్నావు. 'దిగుడుబావి, చేదబావి, చెఱువు, దేవాలయం, చెట్టు వీటి నిర్మాణం తరువాత వాటిపై పెత్తనం చేయడం ఎవరికీ సాధ్యం కాదని' విజ్ఞులు చెప్పారు.
*ప్రత్యక్షం యస్య యద్భుక్తం క్షేత్రాద్యం దశవత్సరాన్, తత్ర భుక్తిః ప్రమాణం స్యాన్న సాక్షీ నాక్షరాణి వా. మానుషాణామయం న్యాయో మునిభిః పరికీర్తితః, తిరశ్చాం చ విహంగానాం యావదేవ సమాశ్రయః.*,
అలాగే, పది సంవత్సరాల పాటు అనుభవించిన భూమి, అనుభవించినవాడి స్వంతమవుతుంది. ఇందుకు సాక్షులు కానీ, లిఖితప్రమాణం కాని అవసరం లేదు. పై న్యాయాన్ని మహర్షులు, మనుష్యుల పరంగానే చెప్పారు. పశుపక్ష్యాదులకు మాత్రం అవి ఉన్నంతకాలం, వాటి స్వంతమవుతాయి.
*తన్మయైతద్గృహమ్, న తవ' ఇతి. కపింజల ఆహ- 'భోః, యది స్మృతిం ప్రమాణీకరోషి తదాగచ్ఛ మయా సహ, యేన స్మృతిపాఠకం పృష్ట్వా స యస్య దదాతి స గృహ్ణాతు'. తథానుష్ఠితే మయాపి చింతితమ్- 'కిమత్ర భవిష్యతి? మయా ద్రష్టవ్యోయం న్యాయః'. తతః కౌతుకాదహమపి తావనుప్రస్థితః.*,
కాబట్టి, ఈ ఇల్లు నాది, నీది కాదు. ఇది విన్న కపింజలుడు- 'ఓయీ! ధర్మశాస్త్రాన్ని ప్రమాణంగా భావిస్తే నావెంట రా! ఎవరైనా ధర్మశాస్త్రజ్ఞుడిని అడుగుదాం. అతడు చెప్పేదానిని బట్టి నిర్ణయిద్దామని' చెప్పి, ధర్మశాస్త్రజ్ఞుడి కోసం రెండు బయటకు పోవడంతో, నేను (కాకిని), 'ధర్మశాస్త్రజ్ఞుడి సమక్షంలో ఏమి జరుగుతుందో? ఆ తీర్పును చూడాలనే' కుతూహలంతో వాటిని అనుసరించాను.
*అత్రాంతరే తీక్ష్ణదంష్ట్రో నామారణ్యమార్జాల స్తయోర్వివాదం శ్రుత్వా మార్గాసన్నం నదీతటమాసాద్య కృతకుశోపగ్రహో నిమీలితనయన ఊర్ధ్వబాహురర్ధపాదస్పృష్టభూమిః శ్రీ సూర్యాభిముఖ ఇమాం ధర్మోపదేశనామకరోత్-*,
ఈలోపల తీక్ష్ణదంష్ట్రుడు (వాడికోరలు కలవాడు) అనే అడవిపిల్లి, ఆ రెండింటి వివాదం విని, అవి వెళ్లేదారికి సమీపంలో ఉండే నదీ తీరం చేరింది. దర్భచాపను పఱచుకొంది. ఆ దర్భపై కాలి వ్రేళ్లు క్రిందకు పెట్టి, నిలబడి, చేతులు పైకెత్తింది. ధ్యానంలో ఉన్నట్లుగా కళ్లు మూసుకుంది. సూర్యాభిముఖుడై ధర్మశాస్త్రోపదేశం చేయడం మొదలుపెట్టింది.
*'అహో, అసారోయం సంసారః. క్షణభంగురాః ప్రాణాః. స్వప్నసదృశః ప్రియసమాగమః. ఇంద్రజాలవత్ కుటుంబపరిగ్రహోయమ్. తద్ధర్మం ముక్త్వా నాన్యా గతిరస్తి. ఉక్తంచ- అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః, నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః.*,
ఈ సంసారం నిస్సారమైంది. ప్రాణాలు క్షణికాలు. ప్రియులతోడి కలయిక స్వప్నంతో సమానం. కుటుంబ సంబంధం ఇంద్రజాలంతో సమానం. అందువల్ల ధర్మం తప్ప వేరే దిక్కు లేదు. అందుకే, మహాత్ములు- "శరీరాలు అశాశ్వతాలు. మృత్యువు అతి దగ్గరలో ఉంది. కాబట్టి, ఉన్న కాస్త సమయాన్ని ధర్మానికి కట్టుబడి జీవించాలని' చెప్పారు.
తీక్ష్ణదంష్ట్రుడి వేదాంత బోధ ఇంకా ఎంత దూరం కొనసాగుతుందో! దాని పర్యవసానమేమిటో? రేపటి శ్లోక వివరణలో తెలుసుకుందాం!
అందరం *సంస్కృతం* నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం.

--((***))--

రసికరాజ...చిత్రం:  జయభేరి,  రచన: మల్లాది  రామకృష్ణ శాస్త్రి,   సంగీతం:  పెండ్యాల నాగేశ్వర రావు ,
గానం: ఘంటసాల, అభినయం:  ANR.
పెండ్యాల  గారి   సంగీత విద్వత్తుకు   ఈ పాట  మకుటాయమానం.  16 వ మేళకర్త అయిన   చక్రవాక  రాగాన్ని, 29 వ మేళకర్త  ధీరశంకరాభరణం   జన్యమైన  కన్నడ  రాగాన్ని 
మేళవించి ' విజయానంద చంద్రిక ' అనే కొత్త  రాగం  లో ఈ పాటను స్వరపరిచారు.  వారి కృషిని సఫలం చేస్తూ   ఘంటసాల  గారు   అద్వితీయంగా గానం చేసి   పాటకు  చిరకీర్తి కల్పించారు.
ఈ పాటలో   అక్కినేని గారి నటనతో పాటు  గమనించాల్సింది....రాజసులోచన ,అంజలీదేవి, నాగయ్య, SV. రంగారావుల  హావభావాలు.
1. అక్కినేని...నిజంగానే ఒక   కచ్చేరీలో   సంగీత విద్వాంసుడు ఎలా ప్రవర్తిస్తాడో   అలాగే నటించారు అక్కినేని గారు.  సహకార  వాద్యకారులను ప్రోత్సహిస్తూ..స్వర స్థాయిలకు అనుగుణంగా తలను తిప్పుతూ. డబ్బింగ్  అయినా   స్వరాలకు అనుగుణంగా   లిప్ మూవ్మెంట్   ఇస్తూ  ...అనితరసాధ్యంగా   నటించాడు.
2. రాజ సులోచన :   కాశీనాధ శాస్త్రి ని వ్యతిరేకించినా..ఆ సంగీత  లహరిలో   పడి ఆనదించడం   ఆమె ముఖం లో   చూడవచ్చు.
3. అంజలీదేవి కి భర్త  బాగా పాడతాడు అని తెలుసు కానీ  సంగీతం లో ఇంత ప్రావీణ్యం ఉన్నది అని తెలవదు. పాట  సగం వరకూ  బిడియం గా కూర్చున్నదల్లా తరువాత ఠీవిగా  కూర్చుంటుంది. 
4 . నాగయ్య:  ఒక గురువుకు  శిష్యుడు   తనకంటే బాగా పాడితే వచ్చే ఆనందమే  వేరు. నా శిష్యుడు అనే గర్వం వారి మొఖం లో   కదలాడుతుంది. 
5 . SV. రంగారావు ...ఆస్థాన విద్వాంసుడుగా    కాశీనాధ శాస్త్రి ని  ఎంపిక చేసిన తన నిర్ణయం  సబబే అనే  తృప్తి ఆయన కళ్ళల్లో  కనబడుతుంది.
సంగీత పరంగా  ఈ పాటలో   గమనించాల్సింది..స్వరప్రస్తారం   లో అన్నీ  సర్వ లఘువు లే.  ఇంతసేపు సర్వలఘువు పాడడం   చాలా కష్టం...పెండ్యాల గారు ఎంత శ్రమించారో?
ఘంటసాల మాస్టారు  ఎంత సాధన   చేశారో?  విని, కని   ఆనందించడం  మాత్రం   మన వంతు .

1959 లో వచ్చిన   జయభేరి కథాంశం...శాస్త్రీయ సంగీతం  పామరులకు   కూడా అందాలి, సంగీతానికి   కుల, మత  అడ్డంకులు ఉండవద్దు   అనేది.
198లో వచ్చిన   రుద్రవీణ లో కూడా   ఇదే కథాంశము.  ఇళయరాజా  సంగీతం, బాలచందర్ దర్శకత్వం .....
అయినా    జయభేరి   విజయం సాధించింది, రుద్రవీణ  ఒక మోస్తరుగా   ఆడింది....కారణాలు    సినీ విశ్లేషకులకే   వదిలేద్దాం.......మనం మాత్రం  పి. పుల్లయ్య గారికి జయహో   అందాం.

పల్లవి :
రసికరాజ తగువారము కామా...రసికరాజ తగువారము కామా..
రసిక రాజ తగువారము కామా...అగడు సేయ తగవా... ఆ... ఆ.. ఆ... ఆ
ఏలు దొరవు అరమరికలు ఏలా...ఏల వేల సరసాల సురసాల...
ఏలు దొరవు.. అరమరికలు ఏలా...ఏల వేల సరసాల సురసాల... ఏలు దొరా...  ||రసికరాజ||

చరణం 1 :
నిన్ను తలచి.. గుణగానము జేసి...నిన్ను తలచి... గుణగానము జేసి..
నిన్ను తలచి... గుణగానము జేసి..దివ్యనామ మధుపానము జేసి...
నిన్ను తలచి...పా దపమ గరిసా... నిన్ను తలచి...
దనిప నిదసనిప మగరిస నిసరిస నిససని
సమగమపమ గమగనిసనిప మగమగ సనిస
నిసరిమగ మరినిసనిస దనిస నిపమప మగరిస... నిన్ను తలచి...
దనిస దనిస దనిసని దసనిపమగామాప.. దనిసనిపగామాద
నిరిస దని గమప గనిస గమరిసరిస సరిసనిసని నిసనిద
నిస నిసని సనిప మగమదినిస
సరిస నిసని పనిప మపమ నిసని పనిప మపమ గమగ
నిగనిసరిస నిసని సని సరి సరి సనినిసనిపమగరినిస..
ససససస సనిదని సనిసస సనిదని సనిసస సనిగమగదరి నిసమప సనిదపమమగిరి
నినినినినిని నినినినినిని దదదదదద దదదదదద
దదని దదని దదని దన్ని దన్ని దదని దదని దదని దన్ని దన్ని
దనిసపమపగమ మగినిప గగగమమమ గగగనిరి రిరిరి
గగగమమ రిరిరినిస రిస గగరి నిసరిస గనిస నిసనిస నిసనిసరి
నిసని సనిదనిసని గమగమదని దనిసరి గగని నిగరిస
పమగమరిసమప గమనిసనిస పమగమని దనిసనిస
పమగమదనిస నిసరిస నిపసనిపమగమ సనిపమగప సనిపమగప పమగరిస...  ||రసికరాజ||

చరణం 2 :
నిన్ను తలచి గుణగానము జేసి ..దివ్యనామ మధుపానము జేసి...
సారసాక్ష మనసా వచసా...
ఆ... ఆ... ఆ... ఆ....
ఆ... ఆ... ఆ... ఆ... అ....
సారసాక్ష మనసా వచసా... నీ సరస చేరగనే...
సదా.. వేడనా...ఏలు దొరవు అరమరికలు ఏలా

ఏల వేల సరసాల సురసాల... ఏలు దొరా...                    ||రసికరాజ||