ఆధ్యాత్మికానందారోగ్యజ్ఞాన పత్రిక .. Mallapragada Sridevi ramakrishna
13, జనవరి 2020, సోమవారం
12, జనవరి 2020, ఆదివారం
ఆసురీసంపదకు చెందిన లక్షణాలు కధ
శ్రీ రుద్ర నమకమ్ - ప్రధమ అనువాకము - 9. వ మంత్రము
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
నమో అస్తు నీలగ్రావాయ సహస్రోక్షాయ మీఢుషే
అథో యే అస్య సత్వానో హం తేభ్యో కరం నమః
ఇంద్రమూర్తి ధారణచే వేయికన్నులవాడైన శివునకు నమస్కార మగుగాక ! పర్జన్య రూపధారియై సృష్టికర్తయై సుఖమొసగు శివునకు నమస్కారము. అంతేకాదు ఏవిఈ రుద్రుని యొక్క భృత్యరూపము లైన ప్రాణులు కలవో వానికి నేను నమస్కారము చేయుచున్నాను.
సృష్టి కర్త అయిన పార్వతీ వల్లభా
వేయి కన్ను లున్న రూప దారి
నీల కంఠ ధర్మ ప ర్జన్య రూపిగా
మేము తెల్పు చుంటి వందనమ్ము
--(())--
10. వ మంత్రము
ప్రముజ్ఞ్య ధన్వస స్త్వముభయోరార్న్తి యోర్జ్యామ్
యాశ్చ తే హస్త ఇషవః పరాతా భగవో వప
ఓ భగవంతుడా ! నీవు పూజావంతుడు
మహదైశ్వర్య సంపన్నుడవు.. ఓ రుద్రా ! నీవు నీ
ధనస్సుకు రెండుచివరలకుకట్టినత్రాటిని విడువుము
విప్పివేయువుము. నీ చేతనున్న బాణములను
విడిచి పెట్టుము. మా పై విడువకు తండ్రీ !
--(())--
ఆసురీసంపదకు చెందిన లక్షణాలు కధ
ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునిలోను కొద్దో గొప్పో - ఈ ఆసురీసంపదకు చెందిన లక్షణాలు ఉంటాయి. ఇవి దైవానికి దూరం చేసే లక్షణాలు. వీటిని తొలగించుకుంటేనే దైవానికి దగ్గరవుతారు. అసలు దైవీసంపదను పొందటం కన్నా ఆసురీ సంపదను దూరం చేసుకోవటమే ముఖ్యం. అందుకే *ఆసురీ సంపదలో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు? ఎలాంటి ఆలోచనలు చేస్తారు? అట్టివారు భగవంతునికి దూరమై ఎటువంటి జన్మలను పొందుతారు? వారిగతి ఏమిటి? అనే విషయాలను* గురించే ఈ అధ్యాయంలో చివరివరకూ తెలియజేయటం జరిగింది. కనుక *ఆసురీ సంపద విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి*.
*దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పారుష్యం, అజ్ఞానం - అని ఇక్కడ ఆరింటిని ఆసురీ సంపదగా చెప్పినా ఈ ఆసురీసేన చాలా పెద్దదే. దైవీసంపదలో చెప్పిన లక్షణాలకు వ్యతిరేకమైనవన్నీ ఆసురీసంపదయే. ఈ ఆరూ రోగాల వంటివి. ఒక్కరోగం ఉన్నా చాలు పీక్కోలేక చావటానికి . ఇక ఆరూ ఉంటే చెప్పేపనేలేదు*. ఇక వాటిని వివరంగా తెలుసుకుందాం.
ఆసురీసంపద యొక్క లక్షణాలు.
*(1) దంభం*:- దీనినే *డంబాచారం* అంటారు. ఇతరులకు తన గొప్పతనాన్ని చాటటానికి చేసే ప్రయత్నమే దంభం. గొప్పతనం లేకున్నా ఉన్నట్లుగా చాటుకోవాలి.
మ్రింగ మెతుకులేదు - మీసాలకు సంపెంగ నూనె.
పొట్టకు రొట్టె లేకపోయినా జుట్టుకు మల్లెపూలు కావాలి.
పైన పటారం - లోన లొఠారం.
పండితుడు కాకపోయినా పండితుడిలాగా కనిపించాలి.
భక్తుడు కాకపోయినా భక్తుడిలాగా కనిపించాలి.
లోపల అగ్నిపర్వతం బ్రద్దలవుతున్నా పరమ ప్రశాంతంగా ఉన్నట్లు గొప్ప జ్ఞానిలాగా ఫోజ్ ఇవ్వాలి.
అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నా గొప్ప జ్ఞానిలాగా ఫోజ్ ఇవ్వాలి.
వార్డు మెంబరుగా ఓడిపోయినా MLA గా ఫోజ్ ఇవ్వాలి.
చెల్లని రూపాయికి గీతలెక్కువ.
*రాజకీయనాయకులు, సమాజసేవకులు, ధార్మిక ప్రచారకులు, దొంగబాబాలు, పండితులు, పామరులు, సాధువులు, సన్యాసులు - అందరూ కూడా వారివారి అంతస్థులలో ఈ దంభదేవత పూజారులే. కొద్దో గొప్పో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివాడూ ఈ దంభానికి లొంగాల్సిందే*.
*మహాత్ములు, స్వామీజీలు, గురువులు, పీఠాధిపతులు ఫోటోలు దిగేటప్పుడు చూడాలి. ఆ ఊర్ధ్వదృష్టి, ఆ చిన్ముద్రలు, ఆ సమాధి నిష్టాగరిష్టత్వం, జపమాలలు, కమండలాలూ, కృష్ణాజినాలు, యోగదండాలు, పాదుకలు - అన్నింటిని ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ ఉంటారు. సాదాసీదాగా ఉంటే ఏమిటి నష్టం? ఆ! ఎవరు చెప్పుకుంటారు గొప్పగా వారిని? నిజంగా నీలో సరుకుంటే ఎవ్వరూ చెప్పుకోనవసరం లేదు*.
*రామకృష్ణ పరమహంస వేషం ఎలా ఉంటుందో చూడండి. రమణమహర్షి వేషం చూడండి. గాంధీమహాత్ముని వేషం చూడండి. ఆచార్య వినోబాభావే వేషం చూడండి. వారికేం తక్కువైంది?*
నీ దోషాన్ని దాచుకొని పైకి నటించటమే దంభం. ఇలాంటి డాంబికాల వల్ల ధార్మిక విశ్వాసాలు దెబ్బతింటాయి. *కాషాయవస్త్రాలు ధరించి అన్ని లౌకిక విషయాలకోసం, భోగాలకోసం అర్రులు చాస్తూ ఉంటే వీడేం సన్యాసండీ. ఏం వదులుకున్నాడు? ఆశ్రమంలో అన్ని కుటీరాలు సామాన్యంగా ఉంటే వీడిది మాత్రం Special. A/C రూము, Special Meals, Costly Dressలు, ఎక్కడికన్నా రావాలంటే A/C కార్లు, ప్రవచనాలకు పిలిస్తే ముందే ఇంతని మాట్లాడుకోవటం, ముందుగానే సమర్పించుకోవటం - అని సామాన్యులు విమర్శించే అవకాశం ఇస్తారు. ఈ విమర్శలు వారిని మాత్రమే తాకి ఊరుకోవు. వారు చెప్పే శాస్త్రాలపై కూడా దాడి జరుగుతుంది. ఆ! ఏముంది గొప్ప ఆ శాస్త్రాల్లో? మనకు తెలియని శాస్త్రాలా? అంటుంటారు. కనుక డాంబికప్రవర్తన ధార్మికరంగాన్ని కూడా దెబ్బతీస్తుంది*.
ఈ డంబాచారులు కొంతకాలం, లేదా చాలాకాలం తప్పించుకోవచ్చు గాని ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు. నిజం నిలకడమీద తెలుస్తుంది. అప్పుడు నేరానికి తగిన శిక్ష కూడా పడుతుంది.
అనేకమంది దేశాధినేతలను తన చెప్పుచేతుల్లో పెట్టుకొని, ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తాంత్రికవేత్త చంద్రస్వామి ఈ దేశంలోని అనేకమంది రాజకీయనాయకులను, అధికారులను, ఉద్యోగులను, న్యాయమూర్తులను తన మాయాజాలంలో ముంచాడు. చివరకు ఏమైంది? తీహారు జైలులో ఊచలు లెక్కబెట్టాడు. ఏమి డంబాచారం వెలగబెట్టాడు? సొంతవిమానం, సొంత విమానాశ్రయం, తన ప్రయాణ ఖర్చులు 200 కోట్లరూపాయలని ఈ దొంగసన్యాసి CBI వారికి వాంగ్మూలం ఇచ్చాడు. ఇలాంటి వారెందరో పుట్టుకవస్తున్నారు. కల్కిభగవానులు, నిత్యానందులు, రాంపాల్ బాబాలు. పాపం పండితేగాని ఫలితం అందదు. ఇలాంటి వారివల్ల కాషాయ వస్త్రాలకు, దైవకార్యాలకు, వేదాంత శాస్త్రాలకు ఎంతటి హాని కలుగుతున్నదో చెప్పలేం.
పులితోలు కప్పుకొని గాడిద ఒకటి దండగ మేత మేసిందంట. దాని గుట్టు బయటపడే సరికి దాని ప్రాణానికే ముప్పుకలిగింది. డాంబికుల కథ ఇంతే. ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉందిగాని దంభానికి లేదు.
*(2) దర్పం*:- దంభానికి దగ్గర చుట్టం దర్పం. అక్కడ ఏమీలేకపోయినా గొప్పగా నటించటం. ఇక్కడ కించిత్తు ఉంటేచాలు పట్టపగ్గాలు లేకపోవటం. నాలుగు ఇంగ్లీషు ముక్కలు వస్తే చాలు. వాళ్లు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్య మధ్యన so, but, No, Alright, Yes లాంటి పదాలను ఉపయోగించి ఇంగ్లీషులో పెద్ద పండితుణ్ణని ఫోజ్ ఇస్తారు. ఇక కొందరికి నాలుగు రూపాయలు చేతిలో ఉంటేచాలు చూపులు చుక్కల్లో ఉంటాయి.
ఒక కప్పకు రూపాయి దొరికిందట. ఇక దాని దర్పం చెప్పటానికి వీలులేదు. ఒక ఆబోతు ఆ దారిన వస్తున్నది. దాన్ని చూచి కప్ప అంటున్నది, 'ఇదిగో నా దగ్గర రూపాయి ఉంది. జాగ్రత్తగా వెళ్ళు. నేను తలచుకుంటే నిన్ను ఏమైనా చేస్తాను. నీవే పెద్దగొప్ప అనుకుంటున్నావేమో అన్నదట. తానూ ఆబోతంత కావాలని నీరు త్రాగి ఉబ్బి ఉబ్బి పొట్ట పగిలి చచ్చిందట. ఇదే దర్పం యొక్క మహిమ. కలెక్టరు కానక్కరలేదు. కండక్టరైతే చాలు. ఇకవాడి దర్పం పట్టశక్యం కాదు. తానేదో జాలితలచి ఈ ప్రయాణికులందరిని వారివారి గమ్యస్థానం చేరుస్తున్నానని, తనంతటి త్యాగపురుషుడు మరొకడు లేడని, తను ఆగమంటే బస్సు ఆగాలి, పొమ్మంటే పోవాలి అనీ, తనకు తానే కిరీటం తగిలించుకుంటాడు. అందరినీ తిరస్కరిస్తాడు. తనను తాను ప్రశంశించుకుంటాడు.
*ఆధ్యాత్మికరంగంలో దర్పం సాధకుడికి శతృవు. ఏవో రెండు ఉపన్యాసాలు విని, రెండు గ్రంధాలు చదివి, నాలుగు ముక్కలు నోటబెట్టుకొని ఎక్కడకు వెళ్ళినా ఆ నాలుగు ముక్కలూ వాడేస్తూ గొప్ప ఉపన్యాసకుడుగా ఫోజు ఇస్తాడు. అంతా తనకే తెలుసునని ఏవోవో అసందర్భ ప్రలాపాలు సాగిస్తాడు. అయితే ఎక్కడో ఒకచోట ఎదురుదెబ్బ తగిలితే గాని తత్త్వం బోధపడదు. కనుక దర్పం పనికిరాదు. దైవానికి దూరం చేసిది దర్పం*.
తండ్రి నేర్పిన పాఠం- కధ 11/2020
సీతాపతి నూనె వ్యాపారంలో లక్షలు గడించి ఆస్తులు కూడబెట్టాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు కేశవుడు. వాడికి చదువు ఒంటబట్టలేదు. కొడుకుని ప్రయోజకుడిని చేయాలని సీతాపతి ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు.
కేశవుడు ఇంటి పట్టున ఉండేవాడు కాదు. నలుగురు స్నేహితులను వెంటేసుకుని వూరంతా బలాదూరుగా తిరిగి వచ్చేవాడు. చదువు ఎలాగూ అబ్బలేదు. కనీసం వాడిని ఏదైనా పనిలో పెట్టాలనుకున్నాడు సీతాపతి. పని నేర్చుకోవటానికి ఎవరి దగ్గరికి పంపినా కేశవుడు రెండో రోజు అక్కడికి వెళ్లేవాడు కాదు. తనకు ఆ పని నచ్చలేదని తెగేసి చెప్పేవాడు. కొడుకుని ఎలా దారిలో పెట్టాలో సీతాపతికి పాలుపోలేదు.
ఒకనాడు కేశవుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. తాను వ్యాపారం చేస్తానని, కొంత డబ్బు ఇవ్వమని సీతాపతిని అడిగాడు.
సీతాపతి చాలా సంతోషించాడు ‘ఇంతకాలానికి తన కొడుకులో మంచి మార్పు వచ్చింది. వ్యాపారం చేసి బాగుపడాలని అనుకుంటున్నాడు’ అని పొంగిపోయాడు.
‘కేశవా! ఏమి వ్యాపారం చేయాలనుకుంటున్నావు?’ అని కొడుకుని అడిగాడు సీతాపతి.
‘మన పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చే వ్యాపారం. రోజూ చేతిలో డబ్బు ఆడే వ్యాపారం. నష్టమే రాని వ్యాపారం. చెప్పుల వ్యాపారం’ అన్నాడు కేశవుడు.
‘మంచి ఆలోచన. ఎంత డబ్బు కావాలి?’ అడిగాడు సీతాపతి.
‘అయిదు లక్షలు’ అన్నాడు కేశవుడు.
‘నీవు వ్యాపారం చేసి బాగుపడతానంటే నాకూ ఆనందంగా ఉంది. తప్పకుండా నీవు అడిగిన డబ్బు ఇస్తాను’ అన్నాడు సీతాపతి.
కేశవుడి కళ్లు ఆనందంతో మెరిశాయి. తండ్రి ఇంత తేలిగ్గా ఒప్పుకొంటాడని అతను అనుకోలేదు.
‘కేశవా! లోపలి గదిలో నా తోలు సంచీ ఉంది. వెళ్లి తీసుకురా. దానిలో డబ్బు ఉంది ఇస్తాను’ అన్నాడు సీతాపతి.
చెప్పిందే తడవుగా లోపలి గదిలోకి పరుగు తీశాడు కేశవుడు. చిటికెలో తోలు సంచీ తెచ్చి తండ్రికి ఇచ్చాడు.
సీతాపతి తోలు సంచీ తెరిచి చూశాడు. ‘అయ్యో! డబ్బు దీనిలో పెట్టలేదనుకుంటాను. దీని పక్కనే నీలం పెట్టె ఉంటుంది. అది పట్టుకురా. దానిలో డబ్బు ఉంది’ అన్నాడు సీతాపతి. కేశవుడు గబగబా వెళ్లి నీలం పెట్టె తెచ్చి తండ్రికి ఇచ్చాడు.
సీతాపతి నీలం పెట్టె తెరిచాడు. దానిలోనూ డబ్బులేదు.
‘డబ్బు ఎక్కడ పెట్టాను?’ అని ఒకసారి బుర్ర గోక్కున్నాడు సీతాపతి. గుర్తుకు వచ్చినట్లు అతడి కళ్లు మెరిశాయి.
‘కేశవా! నా దిండు కింద తాళాలు ఉంటాయి. అవి తీసుకెళ్లి బీరువా తెరిచి, అందులో పసుపు రంగు సంచీ ఉంటుంది తీసుకురా’ అన్నాడు సీతాపతి.
‘డబ్బు అక్కడే ఉందా? సరిగ్గా గుర్తుకు తెచ్చుకో’ అన్నాడు కేశవుడు విసుగ్గా.
‘బాగా గుర్తు... బీరువాలోనే పెట్టాను. తీసుకురా!’ అన్నాడు సీతాపతి నమ్మకంగా.
చిరాగ్గా నడిచి వెళ్లి, దిండు కింద తాళాలు తీసుకుని, బీరువా తెరిచి దానిలోని పసుపు రంగు సంచీ తెచ్చి తండ్రి ఒళ్లొకి విసిరేశాడు కేశవుడు.
సంచీ తెరిచి చూసి సీతాపతి పెదవి విరిచాడు. ‘అరే!! దీనిలోనూ డబ్బులేదే’ అన్నాడు సీతాపతి. కేశవుడికి ఒళ్లుమండింది. తండ్రి వైపు కొరకొరా చూశాడు.
‘అందుకే బాగా గుర్తుకు తెచ్చుకోమన్నాను’ అన్నాడు ముఖం చిట్లిస్తూ కేశవుడు.
‘ఆ... గుర్తుకు వచ్చింది. ఒరే! అసలే దొంగల భయం. అందుకే అటక మీద జాడీలో పెట్టాను. వెళ్లి పట్టుకురా!’ అన్నాడు సీతాపతి.
తండ్రి మతిమరుపుని మనసులోనే తిట్టుకుంటూ అటకకి నిచ్చెన వేసి, పైకెక్కి జాడీని కిందికి దించాడు. దానిని తండ్రి దగ్గరికి మోసుకొచ్చాడు. మూత తీశాడు. జాడీ ఖాళీగా ఉంది. కేశవుడికి పట్టరాని కోపం వచ్చింది. జాడీని బలంగా నేలకేసి కొట్టాడు. జాడీ ముక్కలయ్యింది.
‘చెప్పేది సరిగ్గా చెప్పాలి. పదిసార్లు తిప్పటం కాదు. నాకు డబ్బు ఇవ్వాలనే ఉద్దేశం నీకు నిజంగా ఉందా?’ ఉక్రోషంతో అరిచి, తండ్రి మీదికి విరుచుకు పడ్డాడు కేశవుడు.
సీతాపతి చిరునవ్వు నవ్వాడు. ‘కేశవా! డబ్బు కోసం రెండు మూడు చోట్ల వెతకమంటేనే విసుగెత్తి జాడీని పగలగొట్టావు. నా మీద విరుచుకు పడ్డావు. ఇక నువ్వు చెప్పుల వ్యాపారం ఏం చేయగలవు? చెప్పులు కొనడానికి వచ్చిన వారికి ఎన్నో రకాల చెప్పులు చూపించాలి. వారు అడిగినవి ఓపికగా పైన అరల నుంచి తీసి, వెంటవెంటనే తెచ్చి ఇవ్వాలి. అవి నచ్చలేదంటే మరి కొన్ని చూపించాలి. ఇలా విసుక్కుని వాటిని విసిరి కొడితే ఒక్క రోజు కూడా వ్యాపారం చేయలేవు. అందువల్ల చెప్పుల వ్యాపారానికి నువ్వు పనికిరావు. ఏ పని చేయాలన్నా ఓర్పు అవసరం. విసుగు, అసహనం ఉండకూడదు. అప్పుడే వ్యాపారంలో రాణిస్తావు’ అని సీతాపతి కొడుకుని మందలించాడు.
తండ్రి మాటలతో కేశవుడికి కనువిప్పు కలిగింది. సీతాపతి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. నీవు చెప్పినట్లు నడుచుకుంటా’నని తండ్రిని బతిమాలుకున్నాడు. కొడుకులో వచ్చిన నిజమైన మార్పుకి సీతాపతి సంతోషించాడు.
--((***))--
ఎదురు చూపులు కధ ****
ఎదురు చూపులు కధ
భార్యాభర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చోని టిఫిను తింటున్నారు......భార్య భర్తను ఇలా అడిగింది.
" ఏమండీ! మిమ్మల్ని ఒక విషయం అడగనా? " భర్త; అడుగు....దానికి పెర్మిషను అవసరమా?
భార్య; అదేంలేదండీ ఒక నెల నుంచి మీరు ఆఫీసునుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా బయటికి తీసుకుని వెళ్తూ.... పిల్లలతో హోం వర్కు చేయిస్తూ.......వారితో గడుపుతూ......నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు.కారణం ఏంటో తెలుసుకుందామని.....అంటూ
కాస్త భయంగానే అడిగింది.
భర్త; అదేంలేదే! నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే!
నీకెందుకు అలా అనిపిస్తోందో అర్థం కావడం లేదు మరి.
భార్య; నిజం చెప్పండి. మీ మొహంలో తేడా కనిపిస్తోంది. కొంపతీసి చిన్న ఇల్లు కానీ పెట్ట లేదు కదా!
భర్త; అమ్మొయ్......నీకు దండం పెడతానే అలాంటి ఆలోచనకూడా రానివ్వకు.
భార్య; అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే! చెప్పండి.
భర్త; విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు......
అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య.
ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు వ్రాసిన ఉత్తరం.....కన్నీళ్ళు నిండిన కళ్ళతో చదవసాగింది.
ప్రియమైన కుమారునికి......
ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో వ్రాస్తున్నాను.
కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్నా! ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను......
మీ నాన్న ను పెళ్ళి చేసుకునేదానికి ముందు నేనో లెక్చరరుని.....పెళ్ళైన తరువాత నువ్వు పుట్టావు...మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది.
బాగా సంపాదించసాగారు. నీకో చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానేసాను.మీ నాన్న చాలా బిజీ అయ్యారు.వివాహం అయిన ఒక్క సంవత్సరం ఎలాంటి బాధలేకుండా ఉన్నది.
తరువాత అన్నీ ఎదురుచూపులే!
మీ నాన్నకోసం ఎదురుచూపులు......ఆయనకు ఆదాయంపై మోజుతో సమయానికి ఇంటికి రారు. మీరే నాకు దిక్కు......మీతోనే నా సంతోషం.ఉదయం లేవగానే మీరు తయారై స్కూలుకు వెళ్తారు......మీ రాక కోసం ఎదురుచూపు.........ఇలా మీరు పెద్దవారైపోయారు.......నాతో మాట్లాడటానికి కూడాసమయం ఉండేది కాదు...అవసరానికో మాట అంతే,,,,,,
ఉద్యోగాలు వచ్చేశాయి మీకు.......మీ హడావిడి మీది... పిల్లలైనానాతో మాట్లాడుతారేమో అని ఎదురుచూపు.........మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు........రాగానే అలసిపోయి
భోంచేసి పడుకుంటారు......వంట బాగుందనికానీ బాగలేదనికానీచెప్పడానికి కూడా మీకు టైం ఉండదు..... మీ నాన్న వ్యాపారాన్నినీకు అప్పచెప్పారు.......నువ్వుకూడా బిజీ అయిపోయావు.
నీ చెల్లెలికి పెళ్ళి చేశాము......తను హాయిగా విదేశాలకు వె్ళ్ళిపోయింది .
ఆమె సంసారం ఆమె జీవితం.......వారానికి ఒకసారి 2 నిమిషాలు మాత్రమే పోనులో మాట్లాడేది......ఆమె ఫోనుకోసం ఎదురుచూపు......
మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని
అందివ్వడానికి........మాత్రలు అందించడానికి ఎదురుచూస్తూ గడిపేదాన్ని చూశావా నా బ్రతుకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది.
నీకు భార్య......కూతురు , కొడుకు వున్నారు. బ్రతికి ఉన్నప్పుడుచెప్పలేకపోయాను......చనిపోయేముందు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
మీ నాన్న గారు ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాత్రలు ఇస్తావా.......అన్నం పెడతావా.......అవసరానికో మాట అంతేపేపరు చదవడానికి టైం ఉంటుంది....నాతో మాట్లాడటానికి టైంఉండదు మీ నాన్నకు....మీ సంగతి సరే సరి....
వయస్సులో సంపాదన మోజులో పడి నాతో ,మాట్లాడటానికే టైం లేదు మీ నాన్నగారికి.......ఇక ఈ వయస్సులో మాట్లాడటానికి ఏముంటుంది?
ఎదురుచూపు..........ఎదురుచూపు.........ఎదురుచూపు......
ఇప్పుడు చావుకోసం ఎదురుచూపు........
నాలా నీ కూతురో . నీ భార్యనోఇలా ఉత్తరం వ్రాయకూడదనే ఉద్దేశ్యంతో
ఈ ఉత్తరం వ్రాస్తున్నాను...
ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని....మనకోసమే బ్రతుకుకుందనీ గ్రహించు........నేను ఎదురుచూసినట్లు నీ భార్యనుబాధపెట్టవద్దు......మనసువిప్పి తనతో అన్నింటినీ షేర్ చేసుకో!
నిన్ను నమ్ముకుని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో.......నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు......ధనార్జనతో వారిని నిర్లక్షం చేయకు........ఇదే
నా చివరి కోరిక....కోడలు........మనవడు......మనవరాలు జాగ్రత్త......
నా పరిస్థితి నాకోడలికి రాకుండా చూసుకో! తనకూ ఒకమనసు ఉంటుందనీ
అందులో మీరే ఉంటారనీ.....తననేశ్రద్ధగా చూసుకోవాలని ప్రేమను అందించాలని కోరు కుంటుందనీ అర్థం చేసుకో! మనిషిగా ముందు గుర్తించు
యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని
వెళ్ళదీయనీయకు.........నీవు ఎప్పూడూ సంతోషంగా ఉండాలనే
ఈ తల్లి కోరుకుంటుంది..........ఉంటాను.
ఇట్లు
ఎల్లప్పుడూ మీ క్షేమాన్ని కోరే నీ తల్లి.........
దయచేసి మీ కుటుంబంతో గడపండి......
వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే
గెలుచుకోండి........యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి..........
మీ సంసారమే మీకు అన్నింట్లో తోడుంటారని మరువ వద్దు.......
--((***))--
25, డిసెంబర్ 2019, బుధవారం
శూద్రులంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కాని మిలిన చాతుర్వర్ణ కులవ్యవస్థకు చెందిన వారు. అనగా రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, సాలె, కమ్మరి, కుమ్మరి, ఈడిగ, చాకలి, మంగలి, దళితులు మొదలైన కులాలను శూద్రులు అంటారు. వీరు ద్విజులు కాదు.
'" బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మనులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు పుట్టారు." అని ( ఋగ్వేదం 10 - 90 - 12 ) అపౌరుషేయాలని చెప్పబడే వేదాలు పేర్కొంటున్నాయి.
" భగవద్గీత " 4 వ అధ్యాయం 13 వ శ్లోకంలో శ్రీకృష్ణుడు కూడా పేర్కొన్నాడు.
మనుధర్మ శాస్త్రం కూడా ఇదే అంశాన్ని 1వ అధ్యాయం 91 వ శ్లోకంలో పేర్కొనబడింది. సాక్షాత్తు శ్రికృష్ణుడే మనువుకు తాను భోధించినట్లు భగవద్గీత ( 4 - 1 ) లో పేర్కొన్నాడు.
బ్రాహ్మణ మత సామాజిక వ్యవస్థలో శూద్రుల స్థానం ఏవిధంగా నిర్ధేశించబడింది?
------------------------------------–--------------------------
1. " బహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా పై మూడు ద్విజ వర్ణాలకు గుణనింద చేయక వారికి శుశ్రూష ( సేవ ) చేయటం". ( మనుస్మృతి 1 - 91 )
2. " శూద్రుడు ధనము సంపాదించ కూడదు. అతడు ధనం సంపాదించి యెడల బ్రాహ్మనులను హింసించును. " ( మను 10 - 129 )
3. " ,బ్రాహ్మణుడు ఎప్పుడైనా సందేహచకుండా శూద్రుని సంపద, వస్తువులను బలవంతంగానయినా స్వాధీనం చేసుకోవచ్చును. ఎందుకనగా శూద్రునికి స్వంత ధనం అంటూ ఏదీ లేదు కదా." ( మను 8 - 417 )
4. " బ్రాహ్మణులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. " ( 10 - 123 )
5. " జీతభత్యాల ప్రమేయం లేకుఢా బ్రాహ్మణుడు శూద్రులతో సేవలు చేయించుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మనులకు బానిసలుగా ఉండటానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు. " ( మను 8 - 413 )
6. " బ్రాహ్మణుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చికిగిపోయిన పాతబట్టలను, పాత సామానును శూద్రులకివ్వాలి. " ( మను 10 - 125 )
7. " శూద్రుడు బ్రాహ్మణున్ని దూషిస్తే ఎర్రగా కాల్చిన పది అంగుళముల ఇనుపకడ్డీతో వాని నాలుకను కాల్చాలి. " ( మను 8. 271 )
8. " ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో , చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. " ( మను 8 - 272 )
9. " బ్రాహ్మణునితో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. " ( మను 8 - 281 )
10. "శూద్రుడు బ్రాహ్మణున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి " ( మను 8 - 282)
11. " బ్రహ్మణున్ని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి. " ( 8 - 283 )
12. " శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు. " (మను 4 - 99 )
13. " బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను. " ( మను 2 - 31 )
14. " బ్రాహ్మణున్ని సేవించిన శూద్రుడు మరో జన్మలో ఉత్తమ కులంలో జన్మించును. "
( మను 9 - 335 )
ఇలాంటి ఉదాహరణలు మనుధర్మ శాస్త్ర ఆధిక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చాతుర్వర్ణ వ్యవస్థలో పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల పెత్తనాన్ని తిరుగులేని విధంగా సూత్రీకరించింన మనుధర్మశాస్త్రం. శూద్ర, అతిశూద్ర కులాను అంటరానివారుగా బానిసలుగా చిత్రీకరించింది.
శూద్ర, అతిశూద్ర కులాలకు స్వర్గప్రాప్తి కలగాలంటే బ్రాహ్మణులకు సేవ చేసుకోవాలని నిర్ధారించింది. ఈ శ్లోకాన్ని చూడండి!
‘స్వర్గార్థ ముఖయార్థం వా విప్రానారాధయేత్తు పః
జాత బ్రాహ్మణశబ్దస్య సా హ్యస్య కృతకృత్యతా॥
బహుజనులు, పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు గుణదోషాలెంచక శుశ్రూష చేసి జీవనం సాగించాలనే నియమాన్ని విధించింది.
‘ఏకమేవతు శూద్రస్య ప్రభు: కర్మ సమాదిత్ ఏతేషామేవ వర్ణానాం శశ్రూషా మనసూయయా॥
శూద్రులు, అతిశూద్రులు ఎప్పటికీ వెట్టిచాకిరి చేసే వారిగానే ఉండాలి తప్ప, విద్య (నశూద్రాయా మతిందద్యాత్), జ్ఞానం, డబ్బు సంపాదించరాదు
శక్తేనా పిహి శూద్రేణ న కార్యో ధన సంచయ: శూద్రోహి ధన మాసాద్య బ్రాహ్మణానేవ బాధతే॥
--((***))--
24, డిసెంబర్ 2019, మంగళవారం
మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:
* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.
* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.
* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.
తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి
* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.
* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.
* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.
* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.
* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.
* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.
* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.
* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.
* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.
* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.
* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.
* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.
* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.
* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.
* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.
* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.
* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.
* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.
* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.
* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.
* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.
* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.
* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.
* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.
* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.
* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.
* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.
మన శరీరం ఒక అధ్భుత సృష్ట అని నమ్మండి. దానిని హాని పరచడం మానుకోండి.
మీరు ఈ పోస్టుని అందరికి పంపండి. వాళ్లు చాల హ్యాపీ గా ఫీల్ అవుతారు....
--(())--
👉 ఇంకోకడేమో 2035 కల్లా భారతదేశం ఇస్లాం దేశం అయిపోతుంది అని భయపెడతాడు..
👉 ఇంకోకడేమో 2వ రాకడ, రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు, 2030 కల్లా మొత్తం క్రైస్తవంతో నిండిపోతుంది అంటాడు..
అరేయ్ సన్నాసుల్లారా...
2030 - 2040 కల్లా ఈ భూమి ఉష్ణోగ్రత 58 - 60 డిగ్రీలకి చేరబోతుందిరా.. మీ హైందవ వీరులు, మీ క్రైస్తవ వీరులు, మీ ఇస్లాం వీరులు,, మీ మత రాజ్యాలు ఏర్పాటు చేయడానికి, శవాల కుప్పలు తప్ప,, మనుషులు మిగిలే పరిస్థితి లేదు..
-- పీల్చుకోడానికి స్వచ్ఛమైన గాలి లేదు...
-- కొనుక్కుని తాగితే తప్ప తాగగలిగే నీరు మిగలలేదు..
-- అయితే అతి వర్షాలు, లేకపోతే వర్షాభావ పరిస్థితులు..
-- భగభగ మండే ఎండలో నిలబడడానికి, నీడనిచ్చే చెట్టు మిగలలేదు..
-- తినే తిండి మొత్తం పురుగుల మందుల మయం..
-- భూమి మీద ప్లాస్టిక్ పొరలు పొరలు పెరుకుపోతున్నాయి..
-- నదులు మొత్తం మురుగు కాల్వలుగా మారుతున్నాయి..
-- సముద్రాలు అన్నీ మృత్యు కుహూరాలుగా మారుతున్నాయి..
-- కొత్త కొత్త జబ్బులు, క్యాన్సర్లు, వైరస్లు..,
ఇంకో పది సంవత్సరాల్లో ఈ దేశమే కాదురా,, ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగి ఈ భూమ్మీద 40 % నాగరికత అంతరించబోతుంది.. తుఫానులు, భూకంపాలు, పేదరికం, అంటురోగాలు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతున్నాయి..
అంతా నాశనం అయ్యాక... అందరూ చచ్చాక.... ఇంకెక్కడ ఏర్పాటు చేస్తార్రా మీ మత రాజ్యాలు.. ఇంకా ఎవడికోసంరా మీ దేవుడి రాజ్యాలు...
మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు,, హాయిగా సుఖంగా బ్రతకాలంటే,, కావలసింది,, ఈ దేవుళ్ళు, మతాలు కాదురా.... వ్యర్ధాలు లేని భూమి కావాలి... స్వచ్ఛమైన గాలి కావాలి... కలుషితాలు లేని నీరు కావాలి...
మీ తరువాతి తరాల మనసుల్లో విద్వేషపు విషబీజాలు నాటడం మాని... అందరూ కలిసి కనీసం తలోక చిన్న మొక్క నాటండి...
స్మశానాల మీద మతరాజ్యాల నిర్మాణం కోసం కాదు... సాటి మనిషిపట్ల, ప్రేమభావం, సమభావం గల, నవనాగరికతను నిర్మించడం కోసం ఆలోచించండి...
మతాలకు పుట్టిన వాళ్ళలాగా కాకుండా, మనుషులకు పుట్టిన వాళ్లుగా జీవించండి....
-- ఒక పర్యావరణ ప్రేమికుడైన🌹 మిత్రుడు పంపించాడు. దీనిని ఒక నినాదంగా మీరు కూడా అన్ని గ్రూపులకు పంపించండి. దేశాలను మానవజాతిని కాపాడుకుందాం.



