23, ఫిబ్రవరి 2019, శనివారం

సౌందర్యలహరి- 
(Bhaskarananda Natha గారికి కృతజ్ఞతలు ) 

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్, 
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. 

శ్లో|| మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం 
స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి | 

మనోzపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం 
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే || 9 

ఓ భగవతీ! నువ్వు మూలాధారంలోవున్న పృథివీతత్త్వాన్ని, మణిపుర చక్రంలోవున్న ఉదకతత్త్వాన్ని, స్వాధిష్ఠాన చక్రంలోని అగ్నితత్త్వాన్ని, అనాహత చక్రంలోని వాయుతత్త్వాన్ని, అంతకు పైనవుండే విశుద్ధచక్రంలోని ఆకాశ తత్త్వాన్ని, కనుబొమల నడుమనుండే ఆజ్ఞాచక్రంలోని మనస్తత్త్వాన్ని వీడి, సుషుమ్నా మార్గాన్ని ఛేదించుకొని సహస్రార కమలంలోని నీ భర్త ఐన సదాశివుడితో కూడి రహస్యంగా విహరిస్తున్నావు. 

భాస్కరానంద భావము:- 

శ్రీ గురువులు ఈ శ్లోకము ద్వారా మనకు అమ్మ వారి యొక్క సూక్ష్మ ఆరాధన తెలియజేస్తున్నారు. పిండాండము లోని చక్ర సాధన, అంతర్యాగము ద్వారా అమ్మను ఎలా చేరు కోవాలి, కుండలిని సాధన ఎలా చేయాలి? యోగ సాధన ఎలా చేయాలి? యోగ మార్గములో ఎలా వెళ్ళాలి ? అని షట్చక్ర సాధన, నిరూపణ గురించి చెబుతున్నారు. అమ్మ మన శరీరంలో ఎక్కడెక్కడ ఏయే రూపాలలో నివసిస్తుందో శక్తి ఏ మూలకంగా చైతన్యముగా చలిస్తుందో చెప్పియున్నారు. ఈ శ్లోకము యోగ రహస్య సాధనకు సంబందిచినది. పిండాండమును బ్రహ్మాండమును ఏ విధముగా సమన్వయము చేసుకోవాలో నేర్పినారు ఇచ్చట. ధ్యానము ఎలా చేయాలి? నాద బిందు యోగము మొదలగు సూక్ష్మ మైన విషయములను గుప్తముగా ఇక్కడ చెప్పియున్నారు . కుండలినీ సాధనాపరులకు ఇది అత్యంత శక్తిమంతమైన శ్లోకము. బ్రహ్మాండమునందు ఆవరించి వున్న సమిష్టి రూప కుండలినియే పిండాండమునందు వ్యష్టి రూపములో వున్నది, అదే శ్రీచక్ర రూపములో బాహ్యమున పూజలు అందుకొంటున్నది. శరీరమే ఒక శ్రీచక్రము. బాహ్యమున శ్రీచక్రారాధన చేసేవాళ్ళు, అంతర్ముఖమున షట్చక్ర భేదనముచే సహస్రారము చేరి శివుని తో ఐక్యం చెందుదురు. 

శక్తి శివుడు ఐక్యం కావడమే నాద బిందు కళ అని అందరు. కులపథం అంటే కుల మార్గము, కుండలినీ మార్గము అని. ఈ శ్లోకములో కుండలినీ శక్తి యొక్క గమనమును గురించి గురుదేవుళ్ళు చక్కగా వివరించియున్నారు. 

నాద బిందు కళ :- 

శరీరము, లేదా షట్చక్రములను నాదము అందురు. బిందువు అంటే శ్రీచక్రములోని మధ్యభాగమున, లేదా అగ్ర బాగమున వున్న బిందువు, లేదా సహస్రారం లోని బిందువు అని. షట్చక్రములను బిందువును అనుసంధానం చేయు ప్రక్రియను నాద బిందు కళ అని అందురు. ఇది యోగ విద్యా రహస్యము. యోగ మార్గము ద్వారా దీనిని సాధన చేయ వలెను. పంచదశీ మహా విద్యతో మూలాధారములోని కుండలినీ శక్తిని ఉత్కీలనము గావించి సుషుమ్న నాడి ద్వారా మూడు గ్రంధులను దాటి సహస్రారములోని బిందువుతో ఐక్యం చెందడం నాద బిందు కళ అందురు. ఈ సమయములో సాధకుడు పంచ పుష్పములతో సాధన చేయ వలెను. అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, క్షమా గుణములే పంచ పుష్పములు. గురు అనుగ్రహము పూర్తిగా వున్న వారికీ మాత్రమే కుండలినీ చలనం కలుగును. మార్గము తెలియును. 

భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రితా 

శక్తిః కుండలినీ నామ బిసతంతు నిభాzశుభా || ........... (వామకేశ్వర తంత్రం) 

మూలాధారాంబుజారూఢా ..... స్వాధిష్టానాంబుజగతా .... మణిపూరాబ్జ నిలయా....అనాహతాబ్జ నిలయా ....విశుద్ధ చక్ర నిలయా....ఆజ్ఞాచక్రాబ్జ నిలయా .....సహస్రదళ పద్మస్థా.......(లలితా సహస్ర నామం) 

శ్లో: మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంధి విభేదినీ 

మణి పూరాంతరుదితా విష్ణు గ్రంధి విభేదినీ 

ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్ర గ్రంధి విభేదినీ, 

సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ 

తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా 

మహా శక్తి: కుండలినీ బిసతంతు తనీయసీ ...... .......(లలితా సహస్ర నామం) 

మూలాధారాంబుజా రూడా పంచవక్త్రాస్థి సంస్థితా, 

అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా, 

ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్యంబా స్వరూపిణీ 

1.మూలాధార చక్రము :- 

మూలాధార కమలము (గుద స్థానము) నాలుగు దళములతో, పృథివీ తత్వము రూపములో సర్వాధారభూతమైన చక్రము నందు కుండలనీ శక్తి రూపములో సర్పాకారములో తోకను నోటితో కరచీ పట్టుకొని నిద్రావస్థలో వుంటుంది. అందుకే ఆమెను కులాంగనా కులాంతస్థా కులయోగినీ ....అని అందురు. 

ఈ సాధన వలన యోగులు గాలి లోకి లేవడం జరుగుతుంది. తీవ్ర వత్తిడితో సాధన చేయడం వలన గుద స్థానంలో అమిత మైన వేడి జనించును. అందుకని పెసరపప్పుతో చేసిన అన్నము పులగమును ఎక్కువగా తీసుకోనినచొ ఒళ్ళు చలువ చేయును. సాధనాపరులు పులగమును మాత్రమే తీసుకొంటూ సాధన చేయ వలెను. 

2. మణిపూర చక్రము:- 

మణి పూరాబ్జ నిలయా వదనత్రయ సంయుతా, 

వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా, 

రక్త వర్ణా మాంసనిష్ఠా గుడాన్న ప్రీత మానసా, 

సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణీ 

ఇది జల తత్వము. నాభి స్థానము. పది దళములతో లాకిన్యంబా స్వరూపములో యోగినీ దేవత ఇచ్చట కలదు. మణుల కాంతితో వెదజల్లుతూ వుంటుంది కనుక దీనికి మణిపూరక చక్రము అని పేరు. గర్బసంచి వుండే స్థానము, చల్లని ప్రదేశము కావున కాస్త వేడి చేయడానికి బెల్లం తినాలి. ఈ సాధన చేసే వాళ్ళు విధిగా బెల్లం అన్నం తినాలి. దీనిని జయించిన వాళ్ళు నీటిపై తేలుట, నడుచుట శక్తులు కలిగి వుండుదురు. 

పద్మము ఎప్పుడు నీటిలో ఉండును. బిసతంతు తనీయసి ....వెన్నెముక వెనుక భాగమున సుషుమ్నా నాడి తామర తూడు లాగ వుండి, దాని కొస నీటి అడుగు బాగాన జలతత్వం అయిన మణి పూర చక్రము దాటి మూలాధారము వరకు విస్తరించి వుంటుంది. కమలము యొక్క తల సహస్రారము లోను, తోక మూలాధారము లోను వుంటుంది. ఈ కమలమును పూర్ణగిరి పీఠము అని అందురు. 

3. స్వాధిష్టాన చక్రము:- 

స్వాధిష్టానాంబు జగతా చతుర్వక్త్ర మనోహరా, 

శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాzతి గర్వితా, 

మేదోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా, 

ధధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపదారిణీ 

స్వాధిష్టాన కమలము ఆరు దళములతో కాకినీ అను యోగినీ దేవత లింగ స్థానమున మేధస్సు రూపములో మధువు నందు ప్రీతీ కలిగి ఉండును. అగ్నితత్వము. పీత వర్ణము కలిగి వుంటుంది.. ఈ సాధన చేసే వాళ్ళు పెరుగు అన్నమును తినవలెను. ఈ కమలమును కామగిరి పీఠము అని అందురు. 

4. అనాహత చక్రము:- 

అనాహతాబ్జ నిలయా శ్యామాభావదన ద్వయా, 

దంష్ట్రోజ్జ్వలాక్షమాలాది ధరా రుధిర సంస్థితా, 

కాళ రాత్ర్యాది శక్త్యౌఘ వృతా స్నిగ్ధౌదన ప్రియా, 

మహావీరేంద్ర వరదారాకిన్యాంబా స్వరూపిణీ 

అనాహత కమలము, 12 దళములు, హృదయ స్థానము, వాయుతత్వము. ఈ కమలమును జాలంధర పీఠము అని అందురు. ఈ సాధన చేసే వాళ్ళు నేతితో వండిన అన్నమును తినవలెను. రక్తము అనే ధాతువు నందు రాకిని అను యోగినీ దేవత శ్యామ వర్ణముతో ఉండును. 

5. విశుద్ధ చక్రము:- 

విశుద్ధ చక్ర నిలయాzzరక్తవర్ణా త్రిలోచనా 

ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా 

పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి 

అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ 

విశుద్ది కమలము 16 దళములతో, శ్వేత వర్ణముతో కంఠస్థానమున, ఆకాశ తత్వముతో కూడి, పాయసాన్నము నందు ప్రీతి కలిగి, చర్మము అనే ధాతువు నందు డాకిని అను యోగినీ దేవత రక్త వర్ణముతో కలదు. 

6. ఆజ్ఞా చక్రము :- 

ఆజ్ఞా చక్రాబ్జ నిలయా శుక్ల వర్ణా షడాననా, 

మజ్జా సంస్థా హంసవతీ ముఖ్య శక్తి సమన్వితా 

హరిద్రాన్నైక రసికా హాకినీరూప ధారిణీ 

ఆజ్ఞా కమలము 2 దళములతో, భ్రూమధ్య స్థానమున, మనస్త త్త్వాత్మకము తో కూడి హరిద్రాన్నం నందు ఆసక్తి కలిగి తెల్లని రంగుతో హాకీని అను దేవత ఇచ్చట కలదు. ఈ దేవత ఎముకలలోని మజ్జ యందు వుండి అన్ని చక్రములకు సర్వ శక్తులు ఇచ్చు చుండును. ఈ కమలమును ఓడ్యాణ పీఠము అని అందురు. 

7. సహస్రార చక్రము :- 

సహస్ర దళ పద్మస్థా సర్వ వర్ణోప శోభితా 

సర్వాయుధ ధరా శుక్ల సంస్థితా సర్వతో ముఖీ, 

సర్వౌదన ప్రీత చిత్తా యాకిన్యంబా స్వరూపిణీ 

సహస్రార కమలము , 1000 దళములతో శిరో మధ్య భాగమున బ్రహ్మ రంద్రము దగ్గర సహస్ర దళ కమలము గలదు. సకల వర్ణముల చేత ప్రకాశించుచూ సకల ఆయుధములు ధరించి సకల పదార్దముల యందు ఆశక్తి కలిగి శుక్ల ధాతువు, వీర్యము నందు జీవ రూపములో యాకిని అను యోగినీ దేవత కలదు. 

ఈ ఆరు చక్రములలో మూలాధార, స్వాధిష్టానములను ప్రధమ ఖండము, వాగ్భవ కూటము అని, 

మణిపూర, అనాహతా చక్రములను ద్వితీయ ఖండము, కామరాజ ఖండము అని, 

విశుద్ది, ఆజ్ఞా చక్రములను తృతీయ ఖండము, శక్తి ఖండము అని మూడు భాగములుగా విభజించిరి. 

ప్రధమ ఖండము పై భాగమున బ్రహ్మ గ్రంధి, ద్వీతీయ ఖండము పై భాగమున విష్ణు గ్రంధి, తృతీయ ఖండము పై భాగమున రుద్ర గ్రంధి కలవు. 

బ్రహ్మ గ్రంధిని అగ్ని మండలము, సృష్టి స్థానము అని, 

విష్ణు గ్రంధిని సూర్య మండలము, స్థితి స్థానము అని, 

రుద్ర గ్రంధిని చంద్ర మండలము, లయ స్థానము అని అందురు. 

సర్వ వేద మయీ దేవి సర్వ మంత్ర స్వరూపిణీ 

షన్మాసాభ్యాస యోగేన చైతన్యా కుండలీ భవేత్ ...............రుద్రయామళ తంత్రము:- 

ఆరు నెలల అభ్యాసముచే కుండలినీ శక్తి జాగృతమగును. గురు సేవా పరాయణుడు, శుద్ధ సత్వ గుణ సంపన్నుడు, భక్తీ అష్టాంగ యోగ ప్రవర్తకుడు అయిన సాధకుడు కుండలినీ శక్తి యొక్క అనుగ్రహమును పొందును. సంవత్సరమునకు ఒక్కొక్క శక్తి పీఠము నందు నివసించుచూ కుండలినీ సాధన చేయ వలెను. 

బ్రహ్మచర్యముతో, మౌన వ్రతముతో, నిర్మలమైన మనస్సుతో యోగుల సాంగత్యముతో ఈ సిద్ధి కలుగును. మూలాధారము నందు మనస్సును లగ్నము చేసి ఉదరము నందు వాయువును పూరించి శ్రీవిద్యా మంత్రములతో రేచక పూరక కుంభకములు చేసిన ప్రాణాయామము సిద్దించును. ఎడతెరగని ప్రాణాయామ సాధన వలన కుండలినీ శక్తి ఉద్ధీపనము అగును. బ్రహ్మచర్యముతో శక్తిని (వీర్యమును) ఊర్ధ్వముఖము గావించి సహస్రారములోని శివునితో సంగమించి స్పందించడమే స్కలించడమే ... శివేన సహా మోదతే. 

గూడార్ధము:- 

జీవుడు కుండలినీ (శక్తి) రూపములో సుషుమ్న నాడి ద్వారా షట్చక్రములను దాటి, సిద్దులను కాదని, గ్రంధి త్రయమును దాటి (కాదని), మనస్సును జయించి సహస్రారములోని పరమాత్ముడు అయిన శివున్ని కలసి క్రీడించడమే ..... శివేన సహా మోదతే .....జీవుడు పరమాత్మతో ఐక్యం కావడమే మోక్షం సాధన. ఇది సాధకుని యొక్క లక్ష్యం. 

ఆ పరమ శివునికి నమస్కరిస్తూ ........ 

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం, 

అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం. 

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు. 

భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ. 

(సరస్వతీ రామచంద్ర రావు)/

22, ఫిబ్రవరి 2019, శుక్రవారం




ప్రాంజలి  ప్రభ
      
ఏది నీవెంట రాదురా   
నీవు చేసిన ధర్మం ఒక్కటేరా 
ఏది నీవెంట రాదురా
నీవు చేసిన భక్తి ఒక్కటేరా

ప్రబలి కపంబు కంఠమున  
బాధలు పెట్టేడి వేళ జూపరల్  
గబగబా బైటబెట్టుడిక
కార్యము లేదను వేళల కింకరుల్  
దబదబ ప్రాణవాయువులు 
లాగెడు వేళ పిల్లలు చుట్టముల్
లాబలాబలాడు వేళల 
చలింపఁగ శక్యమె రామనామమున్ 

ఆత్మ వెళ్లిన దేహమగ్నిహోత్రునిపాలు
కాఠిన శల్యములెల్ల గంగపాలు
మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు
కొడుకు వండిన కూడు కాకుల పాలు
యిల్లు సొమ్ము మంచములెల్ల ఇతరులపాలు
బ్రష్ట పెళ్ళామున్న పరుల పాలు 
పాపము లొనరించు జీవుడు యముని పాలు 
ఏది తనవెంట రాదురా ఎరుగు మూడా
          
ఏది నీవెంట రాదురా   
నీవు చేసిన ధర్మం ఒక్కటేరా 
ఏది నీవెంట రాదురా
నీవు చేసిన భక్తి ఒక్కటేరా
 --((**))--


ప్రాంజలి ప్రభ - ఓటు-
మల్లాప్రగడ రామకృష్ణ 
  
ఎందుకు వెయ్యాలి ఓటు
ఎం చేసారని వెయ్యాలి ఓటు

నిఱుద్యోగులను బిచ్చగాళ్లగా మార్చినందుకా  
ఒకే ఇంట్లో ప్రతిఒక్కరికి ఉద్యోగాలిచ్చినందుకా  
నాయకులు పారిశ్రామ అధిపతులకు లొంగినందుకా 
ప్రతి వస్తువుపై పన్ను పై పన్ను వేసినందుకా 

ఎందుకు వెయ్యాలి ఓటు
ఎం చేసారని వెయ్యాలి ఓటు

నాగరికత పెరిగినందుకా 
విశృ0ఖల హెచ్చి నందుకా
జీవన ప్రమాణాలు దిగజారినందుకా 
మానవత్వానికి తిలోదకాలు ఇచ్చినందుకా 

ఎందుకు వెయ్యాలి ఓటు
ఎం చేసారని వెయ్యాలి ఓటు
  
అవినీతి సెలయేరులా పారినందుకా 
మానవశక్తిని ఉపయోగిచుకో లేనందుకా 
జనజీవన ప్రమాణం అదుపుతప్పినందుకా 
సమస్తాన్ని స్వాహా చేసిన అధికారులున్నందుకా 

ఎందుకు వెయ్యాలి ఓటు
ఎం చేసారని వెయ్యాలి ఓటు

మనిషి శక్తిని గమనించక యంత్ర శక్తిని నమ్మినందుకా 
ఉద్యోగులను తగ్గించే కంప్యూటర్పై ఆధార పడి నందుకా
స్వచ్ఛమైన జీవనానికి సన్మార్గం చూపలేనందుకా 
చిరు ఆశ చిగురించి మలి కోరిక తీరనందుకా      

ఎందుకు వెయ్యాలి ఓటు
ఎం చేసారని వెయ్యాలి ఓటు

మాతృభూమి రుణమ్ తీర్చే నాయకుని నమ్మి 
భవిషత్తు పూలబాటాగా మారుతుందని  నమ్మి 
ధైర్యంగా తప్పుచేసే వాణ్ని ఎదిరించే శక్తిని నమ్మి 
నీకు ఏది కావాలో దాన్ని సాధించే పెట్టె వానిని నమ్మి  

ప్రతి ఒక్కరు వెయ్యాలిరా ఓటు
ప్రతి ఒక్కరు వెయ్యాలిరా ఓటు

నాకు ఏంచేశారని అడగటం కాదు
విప్లవాత్మక భావజాలం కూడుపెట్టదు 
ఆవేశం తెచ్చు అనర్ధం అదే 
జీవితాన్ని నెట్టు నరక కూపం అందుకే   
శాంతి, సామరస్య, సహృద్భావము తో  
మారుతున్న ప్రపంపంచంతో మారి    
నీవు దేశానికి ఎం సహాయం చేసావని 
ఆలోచించి చేస్తే దేశానికి ఉండదు లోటు 
అందుకే వెయ్యాలి అందరు ఓటు 
అందుకే వేయాలి ఓటు దేశానికి ఉండదు లోటు  
--((**))--



ప్రాంజలి ప్రభ 
లలిత సంగీతం 

పసిపాపల చిరునవ్వులు 
మురిపించును మమతలు  
బోసి నవ్వు పలుకులు 
హృదయానికి కితకితలు 

బొజ్జనిండా పాలు త్రాగి 
రెండు చేతులు పెట్టి  
పాకుతూ, కాళ్ళ గజ్జలు కదుల్తూ  
ఘల్లుమంటూ, చూసే చూపులకు 
ఈ నెమలి కన్ను నివ్వెర పోదా

బొటనవేలు నోటబెట్టి 
బోసినవ్వులు కురుస్తుంటే    
ఇంటిళ్లిపాటి కాంతి లీను  
దీపమ్ము కాదా
      
బుజ్జి బుజ్జి బొమ్మలు 
గంతులు వేస్తుంటే 
పాపాయి కేరింతలకు  
హృదయం పరవశించి 
రత్నపు కాంతులు చిమ్మవా 

తప్పటడుగులు వేసుకుంటూ 
ఆగడంతో ఇల్లంతా తిరుగుతూ 
భరతనాట్యంగా కదులుతుంటే 
హంసలన్నీ ఈర్శ్య పడవా 

మాయామర్మము తెలియని 
పసికూనల మనసున 
ఆ పరమాత్ముని లీలలు 
చూసి అమ్మా నాన్న మన్సు నిండా  
వెండి వెలుగులు నిండవా

పసిపాపల చిరునవ్వులు 
మురిపించును మమతలు  
బోసి నవ్వు పలుకులు 
హృదయానికి కితకితలు 


--((**))--


శృంగార లలిత గీతం




21, ఫిబ్రవరి 2019, గురువారం

*వసంత పంచమి


*వసంత పంచమి నేడే... *  
ఆమె అక్షరం... ఆమె అక్షయం... ఆమె గీర్వాణి... ఆమె సకల శాస్త్రాలకూ రారాణి
ఆమె జ్ఞానం.. ఆమె సర్వవిద్యలకూ మూలం...
వాల్మీకి నోట ఆది కావ్యాన్ని పలికించిన తల్లి ఆమె.
వ్యాసభగవానుడి చేత ఆపార సాహిత్యాన్ని రాయించిందీ ఆ తల్లే.
యాజ్ఞవల్క్యుడు, ఆదిశంకరులు, ఆదిశేషువు, బృహస్పతి అందరూ ఆమె అనుగ్రహంతోనే అనంతమైన జ్ఞానాన్ని వరప్రసాదంగా అందుకున్నారు.

ఆ తల్లి సరస్వతి... మనలోని విజ్ఞానానికి మాతృమూర్తి. ఆమె ఆవిర్భవించిన రోజు వసంతపంచమి.

మాఘమాసం ప్రకృతి వికాసానికి, సరస్వతి మనోవికాసానికి సంకేతం. ఈ రెండింటి కలయిక పరిపూర్ణ వికాసానికి నిదర్శనం. దీనికి ప్రతీకగా వసంత పంచమి వ్యాప్తిలోకి వచ్చింది. మనిషిలో ఉండే అవిద్య లేదా అజ్ఞానం తొలగిపోయి ఎప్పుడు జ్ఞానం అనే వెలుగురేఖ ప్రసారమవుతుందో ఆ రోజు మనిషి వికాసానికి ప్రారంభసూచిక అవుతుంది. అజ్ఞానం అనే మంచుతో గడ్డకట్టిన మనిషి హృదయాన్ని చదువు అనే వేడితో కరిగించి జ్ఞానం అనే వెలుగును ప్రసరింపజేయటమే వసంత పంచమి అంత‌రార్థం. మాఘమాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమిని వసంత పంచమిగా చేసుకుంటాం. ఈ రోజుకే శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి.

* చైత్ర, వైశాఖమాసాల్లో వచ్చే వసంత రుతువుకు స్వాగతోపచారాలు మాఘమాసంలోనే మొదలవుతాయి. కాలగమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మకర సంక్రమణం (సంక్రాంతి) తర్వాత వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మాఘమాసం ప్రారంభం కావడంతోనే చెట్లు చిగురించడం, పూలు పూయడం మొదలవుతుంది. చలి, ఎండల మిశ్రమ వాతావరణం ప్రజలకు ఎంతో హాయి కలిగిస్తుంది. పంటలు నిండుగా చేతికి వచ్చి ఉంటాయి. పాడి పశువులకు పుష్కలంగా గ్రాసం లభిస్తుంది. దీంతో అవి సమృద్ధిగా పాలనిస్తాయి. గ్రహగమనాలన్నీ శుభస్థానాల్లో జరుగుతాయి. వివాహాది శుభకార్యాల సందడి మొదలవుతుంది. మొత్తంగా మానవజీవితానికి అత్యంత ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే కాలం ప్రారంభమవుతుంది. ఇదంతా రాబోయే వసంతమాసానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉండి వసంత సందడి ముందుగానే వచ్చిన అనుభూతి కలిగిస్తుంది.

* పురాణ, ఇతిహాసపరంగా కూడా వసంత పంచమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బ్రహ్మవైవర్త పురాణం, కృత్యసార సముచ్చయం, హేమాద్రి గ్రంథాల్లో ఇందుకు సంబంధించిన అనేక విషయాలు వివరణాత్మకంగా ఉన్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రాచీన రోమన్లు వసంతపంచమి ఉత్సవాన్ని జరిపేవారని తెలుస్తోంది. గ్రీకులు వారి జ్ఞానదేవతకు ఈ రోజున పూజలు చేసేవారు.

* ఈ రోజును రతికామ దమనోత్సవంగా జరుపుకునే ఆచారం కొన్నిచోట్ల ఉంది. పంచమినాడు రతీదేవి కామదేవ పూజచేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. రుతువుల రాజు అయిన వసంతుడికి, కామదేవుడికి మధ్య ఎంతో సఖ్యత ఉంది. వసంతుడు సస్యదేవత. కాముడు ప్రేమదేవత. రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురి కలయిక... అంటే, ప్రకృతి ద్వారా లభించే అమితమైన జీవనోపాధి మనుషుల మధ్య ప్రేమానురాగాల్ని కలిగిస్తుంది. ఏ ప్రాంతమైతే పాడిపంటలతో సుభిక్షంగా ఉంటుందో అక్కడి మనుషులు ప్రేమానురాగాలతో సుఖంగా ఉంటారనేది ఇందులో అంతరార్థం.

* ఈరోజును బెంగాల్‌లో శ్రీపంచమిగా మూడురోజుల పాటు ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్తరభారతంలో ఈ రోజున ఉదయం నుంచే సరస్వతీదేవిని పూజించి, సాయంకాలం ఆ ప్రతిమకు ఊరేగింపు జరిపి, నిమజ్జనం చేసే ఆచారం కొనసాగుతోంది. వసంతరుతువుకు స్వాగతం పలికే రోజు వసంత పంచమి అని, ఇది రుతువులకు సంబంధించిన పండుగ అని శాస్త్రాలు చెబుతున్నాయి. పంజాబ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో ఈ రోజున పతంగుల పండుగ చేసుకుంటారు. వేదవ్యాస మహర్షి గోదావరీ నదీతీరంలో ఇసుకతో సరస్వతీదేవిని ప్రతిష్ఠించి, అర్చన చేశాడు. వ్యాసుడి కారణంగా ఏర్పడిన ఆ క్షేత్రమే ‘వ్యాసర’ లేదా ‘వ్యాసపురి’ కాలక్రమంలో ‘బాసర’గా ప్రసిద్ధి పొందింది.

*శ్వేతరూపం.. జ్ఞానదీపం...*

* సరః అంటే కాంతి. కాంతి అంటే జ్ఞానం. మన జీవితాన్ని జ్ఞానంతో నింపే మాతృశక్తి సరస్వతి. శుద్ధ జ్ఞానానికి ఆమె ప్రతీక. వికాసం, విజ్ఞానాలకు ఆమె ఆకృతి. అక్షర అక్షయ సంపదలకు మూలమైన ప్రణవ స్వరూపిణి ఆమె. వేదజ్ఞానానికి మాతృకగా, గాయత్రిగా, సావిత్రిగా, లౌకిక, అలౌకిక విద్యల ప్రదాతగా ఆమె పూజలందుకుంటోంది.

* సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం అంటే నిరంతరం సాగిపోయే చైతన్యం. సాధారణంగా జలం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. జలం జీవశక్తికి సంకేతం. దాన్నుంచే అన్ని జీవులకూ శక్తి అందుతోంది. తద్వారా ప్రకృతిలో ఉత్పాదకత జరుగుతోంది. ఈ ఉత్పాదకతకు ప్రతిఫలమే సరస్వతి (జ్ఞానం). సృష్టి కార్యాన్ని నిర్వహించే బ్రహ్మదేవుడికి కూడా అందుకు తగిన జ్ఞానాన్ని సరస్వతి అందిస్తుంది.

* సరస్వతీ అవతారం అహింసకు కూడా తార్కాణంగా కనిపిస్తుంది. తెల్లటి వస్త్రాలు, తెల్లటి పువ్వులు, తెల్లటి ముత్యాల సరం, గంధపు పూత ఇవన్నీ గీర్వాణికి ఇష్టమైనవి. ఇవన్నీ శాంతికి, స్వచ్ఛతకు చిహ్నాలు. ఏవిధమైన ఆయుధాలూ ఆమె చేతిలో ఉండవు. మనలో ఉన్న అజ్ఞానమనే రాక్షసుడిని సంహరించే విజ్ఞానమనే ఆయుధాన్ని అందించే పుస్తకాన్ని చేతుల్లో పట్టుకుని ఉంటుంది. జ్ఞానం ఉన్న చోట హింసకు, అశాంతికి తావుండదు కదా. ఇంకో ఉపమానంలో తెలుపు శుభ్రతకు, నిర్మలత్వానికి, స్వచ్ఛతకు ప్రతీక. ఈ ప్రకారం సరస్వతి స్వచ్ఛతకు ఆలంబనగా నిలుస్తుంది. అన్నిరకాలైన విద్యలు సరస్వతీదేవి అనుగ్రహంతో లభిస్తాయి. అంటే, విద్య ద్వారా మనిషి స్వచ్ఛంగా తయారై, నిర్మలహృదయంతో ప్రకాశిస్తాడని అర్థం చేసుకోవచ్చు.

* నదుల పరంగా చూస్తే గంగ, యమునలతో కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఈ కోణంలో చూస్తే జ్ఞానం మనిషిలో అంతర్లీనంగా ప్రవహించాలే కానీ బాహ్యప్రదర్శనల కోసం విజ్ఞానాన్ని ప్రకటించకూడదనే సందేశాన్ని సరస్వతీ నది ద్వారా మనకు అందుతుంది.

* బౌద్ధమతం వ్యాప్తిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో సరస్వతీదేవిని మంజుశ్రీ, మహాసరస్వతి, వజ్రసరస్వతి, ఆర్య వజ్రసరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్రశారద వంటి పేర్లతో ఆరాధిస్తారు. జైనులు కూడా శృతదేవత, షోడశవిద్యాదేవతగా పూజలు చేస్తారు.

* రుగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త, పద్మపురాణాల్లో సరస్వతీదేవి వర్ణన విస్తారంగా ఉంది. వీటిప్రకారం సరస్వతీదేవి తెల్లటి వస్త్రాలు ధరించి, హంసవాహనాన్ని అధిరోహించి ఉంటుంది. చేతుల్లో వీణ, రుద్రాక్షమాల, పుస్తకం ధరించి ఉంటుంది.

* సరస్వతీదేవి చేతిలో ఉన్న పుస్తకం జ్ఞానానికి సంకేతం. పుస్తకం ద్వారా జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం మనిషిలో తీర్చిదిద్దిన సంపూర్ణ వ్యక్తిత్వానికి, హృదయ నిర్మలత్వానికి ప్రతీక. సంహరించాల్సింది వ్యక్తిని కాదు... అతడిలోని రాక్షస గుణాన్ని మాత్రమే అనే సంకేతాన్ని సరస్వతి చేతిలోని పుస్తకం ద్వారా అందుతుంది.

* అమ్మ చేతిలో వీణ సంగీతానికి ప్రతిరూపం. ఈ వీణ పేరు ‘కచ్ఛపి’. చదువంటే కేవలం పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు. కళలన్నీ చదువులో భాగమే. కళాకారుడు అత్యుత్తమ సంస్కారం, ఆత్మీయత కలిగి ఉంటాడు. మనుషులందరూ ఇలాంటివారు కావాలని సరస్వతి చేతిలోని వీణ చెబుతుంది. అందులో ఏడుతంత్రులు ఉంటాయి. వీటిద్వారా నాదం ఉత్పత్తి అవుతుంది. మనం చూసే ప్రపంచమంతా నాదమయం. పరమేశ్వరుడు నాదస్వరూపుడు. కాబట్టి, పరమేశ్వరుడిని చేరుకోవాలంటే నాదోపాసన చెయ్యాలన్న సందేశం కూడా సరస్వతీదేవి చేతిలోని వీణ చెబుతుంది.

* ఆమె వాహనం హంస. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలను మాత్రమే స్వీకరించే గుణం హంసకు ఉంది. సమాజంలో మంచి, చెడూ పాలూనీళ్లలా కలిసే ఉంటాయి. ఉత్తమ జ్ఞానం కలిగిన వ్యక్తి హంసలాగా చెడును వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలని చెప్పటం హంసవాహనం ఇచ్చే సందేశం.

* కమలం వికాసానికి, పవిత్రతకూ చిహ్నం. కమలం పుట్టుక బురదలోనే. కానీ, బురద వాసన, అపవిత్రత దానికి సోకవు. అందుకే అమ్మకు కమలం ఆసనమైంది. అలాగే మనిషి కూడా అనేక అపవిత్రాలు ఉండే సమాజంలో ఉంటూనే తన పవిత్రతను కాపాడుకోవాలి. మనోవికాసాన్ని సాధించాలనే సందేశాన్ని కమలం అందిస్తుంది. మన శరీరంలో ఉండే కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు అందుకు ప్రతీకగా కూడా కమలాన్ని యోగసాధకులు చెబుతారు.

* సరస్వతీదేవి ధరించే ధవళవస్త్రాలు స్వచ్ఛతకు చిహ్నం. మనిషి కూడా స్వచ్ఛంగా ఉండాలని ఇవి సూచిస్తాయి. తెలుపు వస్త్రం ఏ చిన్న రంగు పడినా అది సహజత్వాన్ని కోల్పోతుంది. చూడటానికి ఇంపుగా ఉండదు. మనిషి కూడా అంతే. ఏ చిన్న అపవాదు వచ్చినా, తప్పు చేసినా ఆ ఫలితం అతడి జీవితాంతం వెన్నంటి ఉంటుంది. అందుకే, ఏ తప్పూ చెయ్యకుండా స్వచ్ఛంగా, తెల్లటి వస్త్రంలా ఉండాలని ధవళ వస్త్రాలు సూచిస్తాయి.

* ఆమె చేతిలోని రుద్రాక్షమాల ఆత్మచైతన్యాన్ని సూచిస్తుంది. కేవలం భౌతికం, లౌకికమైన విద్య మాత్రమే మనిషిని భగవంతుడి వద్దకు చేర్చలేదు. అతడు ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం. ఆత్మసాక్షాత్కారం పొందటానికి రుద్రాక్ష మార్గం చూపుతుంది. రుద్రాక్షను రుషులు భూమికి, స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు.
--((**))--


7, ఫిబ్రవరి 2019, గురువారం




 *.ఉపవాసం ఎలా చేయాలి?*

ఇంద్రియనిగ్రహం కలిగి ఉండడం, మితాహారాన్ని భుజించడం - ఈ రెండూ ఉపవాస దీక్షకు చాలా అవసరం. ఇష్టపూర్వకంగా, ఎవరి బలవంతం మీదనో కాక స్వతంత్రంగా ఉపవాసం ఉండడం వల్ల మనకు తెలియకుండానే మన మనస్సు, శరీరం ఓ క్రమశిక్షణకు అలవాటు పడతాయి. ఉపవాస దీక్షను అనుసరించదలచిన వారికి దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఉపవాస దీక్ష చేస్తున్న రోజును ఎంతో పవిత్రమైన దినంగా భావించాలి. సాంసారిక, రాజకీయాది బాహ్య వ్యాపారాలన్నిటినీ వీలైనంత మేరకు మనసా, వాచా, కర్మణా త్యజించాలి. కేవలం ఆధ్యాత్మిక చింతనతో పొద్దు పుచ్చాలి.

ఉపవాస వ్రతాన్ని అ

నుసరిస్తున్న రోజున వీలైతే మౌనం పాటించడం ఉత్తమం. అది వీలు కుదరకపోతే, కనీసం మితంగా మాట్లాడాలి. ముఖ్యంగా మనోవైకల్యాలు రాకుండా నిగ్రహించుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థించడం, జపం చేయడం. మౌనవ్రతం పాటించడం, భజనలు పాడుకుంటూ రాత్రిపూట జాగారం చేయడంలాంటివి అనుసరించాలి.

సర్వసాధారణంగా ఉపవాసమంటే, వండినఆహారపదార్థాలను తినకూడదు. పాలు, పండ్ల లాంటి వండని ఆహారపదార్థాలు కొద్దిగా తీసుకోవచ్చు. కొంతమంది పచ్చి గంగైనా ముట్టకుండా, ఉపవాసం ఉంటారు. తట్టుకోగల శక్తి ఉంటే అలా ఏమీ తినకుండా, తాగకుండా కూడా ఉపవసించవచ్చు. అయితే, వృద్ధులు, శారీరకంగా బలహీనులు, రోగులు, చిన్న పిల్లలు ఉపవాసం చేయాల్సిన పనిలేదు.


--((**))--

pranjali prabha (1)



ప్రాంజలి ప్రభ (మొదటి వారం /2019)
కధలు ( 5) కవితలు (11)


నేటి సాహిత్యం (1)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

అద్దంలో అందం ఎప్పటికీ మారదు,
ఆశలు చూపుతూ వాకిలి మార్చదు
వయసు కప్పే నగుమోము మారదు,
ఆడదే ఆధారం అనక తప్పదు    

ఆవేదన తీర్చలేని శోకం నీడ నీది
కంటి చెమ్మ చూప లేని స్థితి నీది  
సింధూరపు రాగాల విరహం నీది 
వసంతకాలంలో ప్రేమ మొహం నీది

పడకటింట త్యాగ చూపుయే నీది  
అనురాగం ఆత్మీయత శీలం నీది 
సుఖాలను అందించే యవ్వనం నీది
నిప్పుల్లాంటి మాట మింగే మౌనం నీది  

పరుపులా మెత్తటి మనసు నీది
పరిమళంలా కమ్మని చూపు నీది 
ఆధరంతో తీర్చేటి మధురం నీది
అంగాంగం అందించే ఆడతనం నీది      

అద్దంలో అందం ఎప్పటికీ మారదు,
ఆశలు చూపుతూ వాకిలి మార్చదు
వయసు కప్పే నగుమోము మారదు,
ఆడదే ఆధారం అనక తప్పదు    

--((**))--

శ్రీ కోదండరామాలయం- గొల్లల మామిడడ 
శ్రీ కోదండరామాలయం (1)

కోనసీమ అయోధ్యగా పేరుగాంచిన ఈ దేవాలయం 1889 లో నిర్మించారు . ఈ క్షేత్రాన్ని రెండో భద్రాచలం అని కూడా పిలుస్తారు . అద్బుతమైన శిల్పకళ, పెద్ద పెద్ద గోపురాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్నట్లు ఉంటాయి . శ్రీ ఆంజనేయ సమేత రామ లక్ష్మణ సీత విగ్రహాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి . ఇక్కడ ద్వజస్తంబం, ఆలయనిర్మాణం పసిడి రేకులతో కళకళలాడుతూ ఉంటాయి . ఆలయం లో ఉన్న అద్దాలమేడ లోకి ప్రవేశిస్తే ఎన్నో వింతాలు ,విశేషాలు కనిపిస్తాయి . 

ప్రతి ఒక్కరు జీవిత కాలం లో తప్పకుండ ఒకసారి ఆయన ధర్సించనియ క్షేత్రం ఇది . రాముడే దిగివచ్చి కొలువున్నట్లుగా అనిపిస్తుంది . 
దేవాలయం ఆవరణ లో శ్రీ బాల గజానన దేవాలయం శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి .  ప్రత్యేక కార్యక్రామాలు 
శ్రీ రామనవమి కి కల్యాణోత్సవం జరుపబడును, ధనుర్మాసం ,శ్రవణ మాసం ,కార్తిక మాసం లో ప్రత్యేక పూజలు నిర్వహించాబడుతాయి . 
క్షీరాబ్ధి ద్వాదశికి తెప్పోస్తావం నిర్వహించబడును. వైకుంట ఏకాదశి కి ఉత్తర ద్వారా దర్శనం లబిస్తుంది .

-((**))--

Ganesha Sketch yet to paint... - Sketching by Rajdeep Nair at ...

నేటి సాహిత్యం (2)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం

సృష్టికి మూలం ఒక భూమిక 
భూమికి మూల ఒక దృష్టి 
దృష్టి కి మూలం ఒక నీతి 
నీతికి మూలం భగవద్గీత 

లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం

మనుష్యుల నడవడి గీత 
గీత మదడులో ఉండే జ్యోతి 
జ్యోతి చైతన్యమే ఆకృతి 
ఆకృతి యే నేర్పు జీవన సంస్కృతి 


లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం

ఉషోదయం ఉత్తమ మార్గ నిర్ణయం
చంద్రోదయం చల్లని శక్తి నిర్ణయం
జీవ మయం మాటల భంధ నిర్ణయం
ప్రాణ మయం ప్రేమను పంచె నిర్ణయం

లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం

కాలమెప్పుడు ఆగదు ఆగేది భంధం
భందమేప్పుడు ఆగదు ఆగేది సత్యం
సత్యమేప్పుడు ఆగదు ఆగేది న్యాయం
న్యాయమేప్పుడు ఆగదు ఆగేది ప్రాణం

లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం

యదార్ధం ఎంత సహజమో, ప్రేమ అంత మధురం 
ప్రేమార్ధం ఎంత భంధమో, స్నేహ మంత మధురం
స్నేహార్ధం ఎంత భావ్యమో,  దైవ మంత మధురం
దైవార్ధం ఎంత ధర్మమో, ప్రాణ మంత మధురం   

లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం

అమ్మ తోడు నీడయె కావలె శ్రీమంతుల కైనన్
అయ్య తోడు నేర్పుయె కావలె ఏశక్తుల కైనన్
దేశ మాత తోడుయె కావలె ఏప్రాణుల కైనన్       
శక్తి తోడు కావలె యెంతటి ధీమంతుల కైనన్

లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం


--((**))--

నేటి పద్యము (3)
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

కాల చక్రం తిరుగుట మచ్చుకైనా కానరాదు
నా వయస్సే పెరుగుట మచ్చుకైనా కానరాదు
స్త్రీ మనస్సు నలుగుట మచ్చుకైనా కానరాదు
శక్తి తోడు కావలె యెంతటి ధీమంతుల కైనన్!

అమృత ఘడియలలో  చదువు మేధస్సు పెంచున్
మేధస్సు మనుగడలో బతుకు తేజస్సు పెంచున్
తేజస్సు  కాలగమనంలో మనిషి శక్తి పెంచున్   
శక్తి తోడు కావలె యెంతటి ధీమంతుల కైనన్!

అమ్మ తోడు నీడయె కావలె శ్రీమంతుల కైనన్
అయ్య తోడు నేర్పుయె కావలె ఏశక్తుల కైనన్
దేశ మాత తోడుయె కావలె ఏప్రాణుల కైనన్       
శక్తి తోడు కావలె యెంతటి ధీమంతుల కైనన్

కాల మెప్పుడూ మన వెంబడి ఏ కాంతము లైనఁన్
తీర్పుచెప్పలేనిది సంతస మే జీవము ఐనన్
మార్పు నేర్పు కానిది మానవ సంభందము లైనఁ న్       
 శక్తి తోడు కావలె యెంతటి ధీమంతుల కైనన్"””

--((**))--


Image may contain: 1 person




నేటి పద్యం (4)

" వయసా ఈ పూట నిజమే తన్మాత్ర సౌభాగ్యమే "
" తనువా ఆ ఆశ పరిధే ఉత్సాహ ఉల్లాసమే "
"కధలే ఆనంద అవినాభావాల మ్నాధుర్యమే" 
"మనసా నామాట వినుమా మర్యాద కాపాడుమా"

--((**))--


Prnjali prabha.com 
ఆరాధ్య ప్రేమ లీల (5)
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ  

అగ్నిగుండాలపై నడిచిన పాదం 
- ఆరాధ్యులను నడిపించిన పాదం 

ఎడారిలో కాయాన్ని మోసిన పాదం 
- కర్మ నైపుణ్యాన్ని చూపించిన పాదం 

కర్మఫల దాతను చూపించే పాదం 
- శక్తిని శిక్షణగా మార్చిన పాదం 

దేశ రక్షణకు నడిపించే  పాదం 
 - కాలాన్ని వ్యర్దపరచనిదే పాదం    

పాదాలకు మోసే శక్తి  
మార్గాన్ని చూపే శక్తి
ప్రాణాన్ని నిల్పే శక్తి
వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--  



నేటి సాహిత్యం (6)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

కమ్ముకున్న చీకట్లు తొలిగే దెప్పుడు
నమ్ముకున్న వాకిళ్లు బతికే దెప్పుడు
మారుతున్న బంధాలు కలిసే దెప్పుడు
ప్రేమ ఉన్న స్నేహాన్ని తెలిసే దెప్పుడు 

ప్రజలు చేసే పాపము రాజుకు చెందు
రాజులు చేసే పాపము బ్రాహ్మణ చెందు
భార్యలు చేసే పాపము భర్తకు చెందు
శిష్యులు చేసే పాపము గుర్వుకు చెందు 

కనిపించే వేశ్యలు రక్కసులు అనిపించు
వికసించే రక్కసి  భక్షకులు  అనిపించు
తలపించే భిక్షకి  పాపకులు అనిపించు 
మరిపించే ఆరోగ్య  శాపకులు అనిపించు

కమ్ముకున్న చీకట్లు తొలిగే దెప్పుడు
నమ్ముకున్న వాకిళ్లు బతికే దెప్పుడు
మారుతున్న బంధాలు కలిసే దెప్పుడు
ప్రేమ ఉన్న స్నేహాన్ని తెలిసే దెప్పుడు 

--((**))--


నేటి పద్యము (ఛందస్సు ) (7)
రచయత: మల్లా ప్రగడ రామకృష్ణ

మాతా సరస్వతీదేవి మాపై కరుణించి
మాలో అసురత్వాన్నీ తిసేయమ్మ దయుంచి 
మామా మనొచిత్తాన్నీ మమేకము చెయించి 
జ్ఞానామృతము పంచీ మనస్సు నడిపించు 

బంధాలు తొలగించీ ని పాదములు పట్టి
వేదాన్ని పఠియించి ని పూజలు చె పట్టి
కాలాన్ని గౌరవించి ని సేవలు చె పట్టి
నైవేద్య  మవుతాను ని చెంతయును తల్లి

--((**))--


నేటి సాహిత్యం (8)
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ

జ్ఞానమేమి చేస్తుంది,  మేధ ఏమి చేస్తున్నది
జీవ మార్గ మిదేనా, కలియుగ సందేశమిదేనా

అర్ధ రాత్రి ఆడవాళ్ళ ప్రయాణాలు ఒకవైపు
అర్ధరాత్రి ఆడపడుచుల హత్సలు మరోవైపు
మగవాళ్లను చులకచేసే ఆడవాళ్లు ఒక వైపు
ఆడవాళ్లను ఆడుకొనే మొగవాళ్ళు మరోవైపు

జ్ఞానమేమి చేస్తుంది,  మేధ ఏమి చేస్తున్నది
జీవ మార్గ మిదేనా, కలియుగ సందేశమిదేనా

ఆడది ఆటబొమ్మ కాదు ఆదిపరాశక్తి ఒక వైపు
మొగాడికి అడుగులకు మడుగులెత్తె స్త్రీ మరోవైపు
ఆడది ఆధునిక విద్య ఉద్యోగ వేగ ఉత్పత్తి ఒక వైపు
మొగాడ్ని ఇరికించి సంతోషించే వారు మరోవైపు     

జ్ఞానమేమి చేస్తుంది,  మేధ ఏమి చేస్తున్నది
జీవ మార్గ మిదేనా, కలియుగ సందేశమిదేనా

సిగ్గు విచ్చల విడిగా ప్రదర్శిస్తుంది ఒకవైపు
అదుపు లేక మొగాణ్ణి బలహీన పరుస్తుంది మరోవైపు
తప్పు చేసినా ఆడదానికి విలువ ఒక వైపు
ఏ తప్పూ చేయక ఉన్నా మొగాడికి శిక్ష మరోవైపు

జ్ఞానమేమి చేస్తుంది,  మేధ ఏమి చేస్తున్నది
జీవ మార్గ మిదేనా, కలియుగ సందేశమిదేనా
--((**))--


సాహితీమిత్రులారా! 
ఈ కథను ఆస్వాదించండి............... 
ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ మొదలవకముందు, ఇండియన్ ఎయిర్‌లైన్సే రాజై వెలుగుతున్నప్పటి కాలంలో– ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తుండేవాళ్ళం. 

“ఇందూ, గంటవరకూ గ్యాంగుకి డ్యూటీలేవీ లేవు. మళ్ళీ ఎండ పోతుంది. బండలు ఖాళీగానే ఉన్నాయా?” ఇంటర్‌కామ్‌లో అడిగింది ప్రీతి. 

మా గ్యాంగులో వారి డ్యూటీలు- ఎయిర్‌బస్ టెర్మినల్‌లోనూ బోయింగ్ టెర్మినల్‌లోనూ. నన్ను మాత్రం ఈ రెండిటికీ మధ్యనున్న డొమెస్టిక్ కార్గో సెక్షన్‌లో పడేశారీ మధ్య. 

“వచ్చేయండి, ఖాళీగానే ఉన్నాయి. నేనూ నా డ్యూటీ బ్రేక్ ఇప్పుడే తీసేసుకుంటాను.” చెప్పాను. 

మూడవవస్తోంది. 

కార్గో బిల్డింగ్‌కి సరిగ్గా బయట, టార్మాక్ వైపు, అందరికీ ‘అడ్డా’ -అడ్డంగా పడేసున్న ఆ పొడుగాటి స్తంభాలు. మూడడుగుల వెడల్పున్న ఆ భారీ, చదరపు, నలుపురంగు స్తంభాలు కార్గో డివిజన్‌లో భాగమే అనిపిస్తాయి. అవే మా అందరి ‘బండలు’! ఎండలకి కాలవు. వానలకి జడవవు. చలికి వణకవు. వడగళ్ళకి చితకవు. ఏ పది నిముషాలో ఖాళీ ఉన్న ప్రతీ ఒక్కరమూ శీతాకాలంలో వాటిమీద కూర్చోక మానం. 

అటునుంచిద్దరూ, ఇటునుంచిద్దరూ వచ్చారు. 

కాంటీన్ ట్రాలీ తోసుకుంటూ ఎటెండర్లు వస్తుంటే- సాండ్‌విచ్‌లూ సమోసాలూ పేపర్ ప్లేట్లలో సర్దుకుని, టీ, కాఫీలూ అక్కడే వున్న ప్లాస్టిక్ టేబుల్స్ మీద పెట్టుకున్నాం. కబుర్లూ, టీలూ పూర్తయాయి. ఎవరి డ్యూటీ పాయింట్లకి వాళ్ళు తిరిగి వెళ్ళారు. నేనూ కార్గో బిల్గింగ్ లోపలికి వచ్చాను. 

నాకోసమే ఎదురు చూస్తున్నాడు ఫెడ్‌ఎక్స్ ఏజెంట్, ‘మాడమ్, నా కన్‌సైన్‌మెంట్ సంగతేమయింది?’ అంటూ. నక్షత్రకుడు! పది రోజుల కిందట సీ-నోట్ అని మేం పిలుచుకునే ఏడేళ్ళనాటి పాత కన్‌సైన్‌మెంట్ నోట్ ఒకటి తెచ్చినప్పటినుంచీ విసుగూ విరామం లేకుండా రోజూ ఇక్కడే చక్కర్లు కొడుతున్నాడు. ఆ నోట్‌లో బుక్ చేసిన వ్యక్తి పేరు సతీష్ అగర్వాల్ అని రాసుంది. 

“బాబూ, కార్గోలోనే కాదు, ఎయిర్‌పోర్టంతటా వెతికించినా మీ సామాను కనబడలేదు. అయినా 40 కోట్ల విలువయిన సామాను అని ఇన్‌వాయిస్‌లో ఉంది. అదీ, పన్నెండు టన్నుల మెటల్!” అరిగిపోయిన రికార్డులా చెప్పి, “అయినా ఇన్నేళ్ళూ మీ క్లయింట్ పట్టించుకోనేలేదేం?” చివరికి కుతూహలం పట్టలేక అడిగాను. 

“నేను కొత్తగా చేరాను మామ్, నాకంత తెలియదు. బుక్ చేసిన సతీష్‌గారు పోయి ఆరేళ్ళు దాటిందట. ఇప్పుడు ఆయన కొడుకు నీరజ్ అగర్వాల్, ‘సామాను వెతికిస్తారా, చస్తారా!’ అంటూ మా పీకలమీద కూర్చున్నారు. మీకూ ఫోన్ చేస్తానన్నారు. ప్లీజ్, మళ్ళీ చూడండి…” బతిమాలుకున్నాడు. 

జాలేసింది కానీ కనిపించని వాటినెక్కడినుంచి తెచ్చేది! ఏ ఈగో దోమో చిన్న పాకెట్టో కూడా కాదు, ఎక్కడో పోయిందనుకోడానికి. 

“మళ్ళీ రెండ్రోజుల్లో రండి. ఇంకెక్కడైనా దొరికే వీలుంటుందేమో ప్రయత్నిస్తాను.” వాగ్దానం లాంటిది చేశాను. 

సీ-నోట్ కాపీలు తీయించి, అవేవో కరపత్రాలయినట్టు హెల్పర్లకి పంచి, కన్‌సైన్‌మెంట్ వెతకమని అన్ని చోట్లకీ పరిగెత్తించాను. 

ఈ వ్యవహారం అంతు తేలనప్పటికీ మా బండల మీది సంబంధాల్లో మాత్రం మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పట్లాగే. మిత్రులు శత్రువులవుతున్నారు. ఒకరి మొహం ఇంకొకరు చూసుకోడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ప్రాణ స్నేహితులయిపోతున్నారు. కొత్త రొమాన్సులు మొదలవుతున్నాయి. అత్తగారి ఆరళ్ళ గురించిన కబుర్లకి అంతమే లేదు. 

‘రాజకీయాలు చర్చించుకోవద్దు మొర్రో!’ అని ఒకళ్ళిద్దరు గీపెట్టినా వినక, వాటి గురించిన వాదనలూ భేదాభిప్రాయాలూ మొహాలు ముడిచెట్టుకోవడం, రుసరుసలూ ఎలాగూ సామాన్యమే. 

కొత్తగా హైదరాబాదునుంచి బదిలీ అయి వచ్చిన రాధిక నోట్లోంచి వచ్చీరాని హిందీ తప్ప ఇంకో భాష ఊడిపడదు. ‘పోనీ, ఇంగ్లీష్‌లో ఏడవ్వమ్మా,’ అన్నా వినదు. 

పూనమ్ మగవాళ్ళందరి అందాన్నీ గ్రేడ్ చేస్తూ ఉంటుంది. మేం విన్నా వినకపోయినా, తనకున్నాయని ఊహించుకునే రోగాలన్నిటినీ రాజ్ ఏకరువు పెడుతుంటాడు. 

డైటింగ్ చిట్కాలు చెప్తుంది అనుభ. సునీతకి ఎప్పుడూ తన వంటల గోలే! 

ఈ మధ్యెవరో కొత్తమ్మాయి ఉద్యోగంలో చేరింది. ఆ వేటలో పడి జయంత్ రానే రావడంలేదు. వినితకి ఎప్పుడూ ‘నేను, నాకు’ అన్న టాపిక్ తప్ప మరేదీ పట్టదు. 

అన్ని సమస్యలకూ పరిష్కారం అజయ్ దగ్గిర మాత్రం తప్పక ఉంటుంది. వద్దు నాయనా అన్నా, ఉచిత సలహాలు ఇవ్వడం మానడు. 

ఒకరోజు మామూలుగా ఏ మూలో కూర్చుని ప్రేమ ఒలకబోసుకుంటుండే నీలేష్, నీనా ఎప్పుడూ లేనిది ఇక్కడికి వచ్చారు, మొహాలు చిటపటలాడించుకుంటూ! ఒక బండ చివర్న కూర్చుని లోగొంతుకలతో వాదించుకున్నారు. ఉన్నట్టుండి ఒకపక్క చెమర్చిన కళ్ళని అద్దుకుంటూనే నీనా అతన్ని చెంప మీద కొట్టింది. అతనూ తిరిగి కొట్టాడు. మేం నిశ్చేష్టులమై, చలనం లేకుండా బండలలో కలిసిపోయాం. తను ఇంచుమించు పరిగెత్తుతూ బోయింగ్ టర్మినల్ వైపు నడిచింది. అతనూ అనుసరించాడు. అదృష్టం కొద్దీ మేము తప్ప అక్కడింకెవరూ లేరు. లేకపోతే, అదో కేస్ అయి కూర్చునేది. అదంతా చూసి మేము కంగారు పడ్డాం. 

బండలు మాత్రం నిర్వికారంగానే గమనించాయి అంతా. 

ఇంతలో ఎండాకాలం వచ్చింది. బండలు వేడెక్కాయి. వాటిమీద కూర్చోవడం కాదు కదా సమీపించాలన్నా కాల్చేస్తున్న ఎండ వద్దు, వద్దంటూ వారిస్తోంది. మరవి చిన్నబుచ్చుకున్నాయో ఏమో కానీ కారునలుపుకి మారాయి. 

కొన్నాళ్ళు ఫెడ్‌ఎక్స్ అబ్బాయీ రాలేదు, నీరజ్ అగర్వాల్‌ నుంచి ఫోనూ లేదు. ‘హమ్మయ్యా, ప్రస్తుతానికి కొంత ఉపశమనం’ అనుకుంటూ కార్గోలో పనిచేస్తున్న వాళ్ళందరం ఊపిరి పీల్చుకున్నాం. హెల్పర్లు కూడా ఆకాశంవైపు తలెత్తి దండాలు పెట్టుకున్నారు. 

ఒకరోజు నీరజ్ అగర్వాల్ నుండి ఫోనొచ్చింది– మీ ఎయిర్‌లైనుని కోర్టుకీడ్చకపోతే చూడండి. ‘విలువైన సామాను కాజేసి, అందరూ కలిపి డబ్బు పంచుకుంటున్నట్టుగా ఉంది,’ అన్న బెదిరింపులతో. కోపంతో భగభగమంటున్నాడు. 

“సర్, అంత భారీ సామాను సెక్యూరిటీ కంటపడకుండా ఎవరు బయటకి తీసుకెళ్ళగలరో మీరే ఒక్కసారి ఆలోచించండి…” అనునయంగా చెప్పాను. 

కొంత వాదన తరువాత, నా శాంతస్వరం వినో ఏమో కానీ అతనే చల్లబడి, “మా ఫాక్టరీ మానేజర్ చాలాకాలంగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికి ఊళ్ళో లేడు. వెంటతెస్తాను. ఆయనే గుర్తుపడతాడు.” అన్నాడు. సరే ఆయనొచ్చాక చూడచ్చులే అని నేనూ మర్చిపోయాను. 

హఠాత్తుగా ఒకరోజు, రీజినల్ డైరెక్టర్ నన్ను వెంటనే రమ్మంటున్నారన్న కబురుతో, ఎయిర్‌పోర్ట్ మానేజర్ ఫోనొచ్చింది. ఎందుకా! అనుకుంటూ, ఉరుకులూ పరుగులతో ఆయన ఆఫీసులోకి అడుగుపెట్టాను. 

“ఈయన నీరజ్ అగర్వాల్!” అక్కడ కూర్చుని తీరిగ్గా టీ తాగుతున్న ఒక వ్యక్తిని పరిచయం చేశారాయన. ‘ఓహో, ఇతనేనా! పైనుండి నరుక్కు వస్తున్నాడన్నమాట! అందుకే, ఉలుకూ పలుకూ లేదీ మధ్య’ అనుకున్నాను. 

“ఏమమ్మా, ఈయన కన్‌సైన్‌మెంట్ పోయిందట. మీరెవరూ సహకరించడం లేదంటున్నారీయన. మీరే కదూ ఈ కేసు చూస్తున్నదీ?” తిన్నగా విషయానికి వచ్చారు డైరెక్టర్‌. 

పని అయిందో లేదో అని తప్ప ఆయన వివరాలు పట్టించుకోరని, నెపాలు చెప్తున్నానని అనగలిగే అవకాశం ఉందని తెలిసీ ఉండబట్టలేక, వెతికించడానికి ఎంత కష్టపడుతున్నామో క్లుప్తంగా చెప్పాను. 

“దాని విలువెంతో చూశారా! ఇంత నిర్లక్ష్యం ఏమిటి?” అడిగారాయన. అవును, చూశాను కానీ ‘మెటల్’కి ఆ ధరెందుకో అంతు పడితే కదా! 

“అది బుక్ చేసినదెవరో, ఏమిటో కనుక్కోండి. రేపట్లోగా రిపోర్ట్ కావాలి నాకు.” 

‘ఇంక నువ్వు దయచేయి’ అన్నారని అర్థమై, తిరుగు మొహం పట్టాను. నాకెందుకు తట్టలేదీ సంగతి? బుక్ చేసిన ఆ కొలీగ్‌నే అడిగుంటే సరిపోయేది కదా! నన్ను నేను తిట్టుకుంటూ నా ఫైల్లో ఉన్న కాపీ తీశాను. ఆర్.కె.జి. అన్న ఇనీషియల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి తప్ప సంతకం గిలికేసినట్టుంది. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. అది పట్టుకుని ఎయిర్‌పోర్ట్ మానేజర్ వద్దకి వెళ్ళాను. 

“ఆ టైములో మీ సెక్షన్లో ఎవరెవరి పోస్టింగ్ అయిందో కనుక్కుంటాను,” అన్నారాయన. 

మర్నాడే, ఆ వ్యక్తి రాధాకృష్ణ గుప్తా అని తెలిసింది. ఇండోర్‌ నుంచి శ్రీనగర్‌కి బదిలీ అయే మధ్యన మూడ్రోజులు ఇక్కడ టెంపరరీ డ్యూటీ పడిందట. ఇప్పుడతని పోస్టింగ్ బాంకాక్‌లో అట. ఫోన్‌లో మాట్లాడితే, ‘అవును. మొదటిరోజే భారీ సీ-నోటేదో తయారుచేశానన్న గుర్తే. కార్గోలో పనిచేసిన అనుభవం లేదప్పటికి. సలహా అడగడానికి చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఏజెంటెవరో తెచ్చిన కాపీలో ‘ఇంత ఇనుమో, ఏదో’ అని రాసుందని లీలగా తప్ప మరేదీ జ్ఞాపకం రావడం లేదు. ఎన్నేళ్ళ కిందటి సంగతో!’ అని చెప్పాడట. 

అయినా, బుక్ చేసింది తనే కాబట్టి అతన్ని మర్నాటి ఫ్లైటులోనే రప్పించారు. మొత్తానికి గుప్తా అయితే వచ్చాడు కానీ సామాను ఆకారం కూడా గుర్తు లేదు అన్నాడు. సిటీ, ఇంటర్నేషనల్ కార్గోతో సహా అన్ని చోట్లకీ ఇద్దరు హెల్పర్లని వెంటబెట్టుకుని తిరిగొచ్చాం. ఫలితం లేకపోయింది. 

రెండ్రోజుల తరువాత, మరేం తోచిందో ఏమో కానీ ఆత్రంగా వచ్చి మా బండల చుట్టూ తిరుగుతూ, “ఇదే ఆ కన్‌సైన్‌మెంట్ అనుకుంటాను…” అన్నాడు. 

కనుక్కోడానికి జూనియర్ అగర్వాల్‌కి ఫోన్ చేస్తే, తన మానేజర్ ఊరినుంచి తిరిగి వచ్చాడనీ, అతన్నీ తనతో పాటు తెస్తాననీ అన్నాడాయన ఉత్సాహంగానే. 

మేనేజర్‌కి 50 ఏళ్ళుంటాయి. వచ్చీ రావడంతోనే బండల్ని చూసి, ‘ఇవే, ఇవే!’ అంటూ సంతోషం పట్టలేక ఇక గెంతులేయడమొక్కటే తక్కువ! 

అంతటా కబురు పాకింది. ఎయిర్‌పోర్ట్ మానేజర్ కూడా వచ్చి అయోమయంగానే ఆయన్ని అడిగారు, “అయితే, మీ బిల్లుమీద కోట్ల విలువ రాసుందేమిటండీ? అసలే మెటలైనా అంత ధర పలుకుతుందా!” 

మేనేజర్ చిద్విలాసంగా నవ్వి, “ఇది వెండండీ!” అన్నాడు. 

అందరం నోళ్ళు వెళ్ళబెట్టాం. 

“అసలేమయిందంటే, వీటిని మా చెన్నై ఫాక్టరీకి పంపించాలనుకున్నాం. ఇంత బరువున్న వెండి కడ్డీలు వంగిపోతాయి కదా అని వాటికి ఇనప తాపడం చేయించాం. అప్పటికే సతీష్‌గారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన వీటిని బుక్ చేయించినప్పుడు నేను లేనక్కడ. నీరజ్‌గారేమో యుఎస్‌లో ఉన్నారు. ఫెడ్‌ఎక్స్ వాళ్ళే సలహా ఇచ్చారట, ఏదో మెటల్ అని రాసేయమని. సతీష్‌గారు పోయాక, ఎవరూ వీటి సంగతి పట్టించుకోలేదు. ఫాక్టరీ లెక్కలు చూస్తున్నప్పుడు అవి తేలకపోయి ఫైల్సన్నీ చెక్ చేస్తుంటే ఈ మధ్యే నీరజ్‌గారి కంటపడింది.” ప్రశ్నార్థకంగా పెట్టిన మా మొహాలని చూస్తూ తేలిగ్గా తేల్చేశాడాయన. 

హమ్మయ్యా, చిక్కు ముడి విడింది! 

మర్నాటి చెన్నై ఫ్లైట్‌లో వాటిని లోడ్ చేయడానికి పెద్ద క్రేనులూ పటాటోపం కనిపించాయి. దూరంగా ఉన్న బే మీద నిలుచున్న ఎయిర్‌బస్ వెనకాతల హెల్పర్లందరూ గుమిగూడి ఉన్నారు. వెళ్ళి చూస్తే, వెనకనున్న కార్గో హోల్డుల్లో కడ్డీలు పట్టలేదు. వాటిని దింపేసి మళ్ళీ ఎత్తి, ముందు హోల్డులో ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటే పొడుగు చాలలేదు. ఇంక వీలవక రెండిటినీ దించేశారు. ఇన్నేళ్ళూ అవిక్కడే ఎందుకు పడున్నాయో అర్థమయింది. అవసలు మా విమానాలు వేటిల్లోనూ పట్టగలిగే కొలతలున్నవి కావు! 

అవి తిరిగి అగర్వాలుల ఇంటికి రాజసంగా పెద్ద ట్రక్కులో ప్రయాణమయాయి. 

గుప్తా తప్పు కేవలం సీ-నోట్ సరిగ్గా తయారు చేయకపోవడం మాత్రమే అనుకున్నారు ముందు. కానీ, ఈ సంఘటన తరువాత కడ్డీల పొడుగు సరిగ్గా కొలిపించకుండానే బుక్ చేసి, ఆ తరువాత అవి లోడ్ అయాయో లేదో అని కూడా పట్టించుకోని అతని నిర్లక్ష్యానికి అతని ఇంటర్నేషనల్ పోస్టింగ్ రద్దు చేసి, మూడు నెల్లు సస్పెండ్ చేశారు. 

ఇప్పుడు కాంక్రీట్ మీద మా అందరి అనుభూతులకీ సాక్షిగా ఉండే చలనరహితమైన మా బండలైతే లేవు కానీ వాటి కింద ఇన్నేళ్ళూ వర్షం, ధూళి, నుండి తప్పించుకున్న తారూ ఇసుకా మేళవించిన టార్మాక్ భాగం మట్టుకు తళతళలాడుతోంది! 
కానీ మేము మాత్రం మా కబుర్లకి మరో చోటోదే వెతుక్కోవాలి.

--((**))--




నేటి సాహిత్యం (9)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ
ఎగసిపడే కెరటాల్లా, ఎగసి పడే జ్వాలల్లా
ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ

హృదయాన్ని రగిలిస్తూ,
దైవత్వాన్ని నిందిస్తూ
ఉదయాన్ని తిలకిస్తూ
ఉన్మాదిగా పరి బ్రమిస్తూ

ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ
ఎగసిపడే కెరటాల్లా, ఎగసి పడే జ్వాలల్లా
ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ

నేను నిశీధిలో జీవిస్తూ
ఆనందాన్ని దహిస్తూ
పెను భారాన్ని భరిస్తూ,
ఆవేదనను  మోస్తూ
ఉన్న నన్ను చూసి

ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ
ఎగసిపడే కెరటాల్లా, ఎగసి పడే జ్వాలల్లా
ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ

నిదురను మింగే కలలను భరిస్తూ
ఏమి చెప్పుకోలేక మౌనాన్ని భరిస్తూ
ఆరోగ్యాన్ని హరించే మందు సేవిస్తూ
ఓర్పు ఓదార్పు లేక నీరు గాలి సేవిస్తూ
ఉన్న నన్ను చూసి

ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ
ఎగసిపడే కెరటాల్లా, ఎగసి పడే జ్వాలల్లా
ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ

ప్రేమ నన్ను మోసం చేస్తే
పెద్దలు నన్ను అవమానిస్తే
కలి కాలం నన్ను వెక్కిరిస్తే
కాయాన్ని మోస్తూ కర్మ భరిస్తూ
ఉన్న నన్ను చూసి

ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ
ఎగసిపడే కెరటాల్లా, ఎగసి పడే జ్వాలల్లా
ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ
--((**))--


నేటి సాహత్యం (10)
ప్రజలకు మేలుకొలుపు

వాని తిట్టులు పట్టుదలకు నాందీ వాక్కులు
ఏక మవ్వుట  పట్టు  ప్రజలు చూపే జే జే లు 
మంచి చేసియు తెల్పు కలయ ఓర్పే జేజీలు 
జాతి సేవయు గుర్తు గెలుపు మహాకూటాన్కె 

ఆదిలో కష్టములెన్నున్నా ప్రజల తీర్పు మారు
ఓర్పుతో ఎకమవుటన్నా జయము తప్పదన్న
సేవయే కలయుటఅన్నా ప్రజల నాడి  అన్న
మహకూట గెలుపు తెలంగాణాకు మార్పునన్న 

ఏక మవుట కొన్ని పరిస్తితులలో  అందరికీ  తప్పదు
నేను అనియు నీవు ప్రతి స్థితిలో అందరికీ తప్పదు
వాని చెడుయు మీలొ నిజ స్థితిలో అందరికీ తప్పదు
మహా కూటమి తెస్తుంది ప్రజలందరిలో మరోమలుపు

--((**))--

Pranjali Prabha.com
ఓ అతిధి (నేటి కవిత) (11)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఉప్పొంగింది నా హృదయం
ప్రేమించింది నా నీ ధైర్యం
ద్వేషించింది నా దౌర్భాగ్యం
బోదించింది నా నీ గమ్యం

వినిపించింది నీ గళం వాగ్దాటి 
కనిపించింది నీ ముగ్ధ హృద్యార్థి
కరుణించింది నీ దృష్టి ధర్మార్ధి
తపియించింది నీ సేవా కర్మార్ధి



--((**))--

ఓం శ్రీ రాం       ఓం శ్రీ రాం        ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -సప్తర్షులు :


సర్వేజనాసుఖినోభవంతు *

భారతీయ ఋషి పరంపర -- సప్తర్షులు :(4)
ప్రపంచానికి జ్ఞాన కేంద్రం భారతదేశం . అజ్ఞానం అనే తిమిరాన్ని పారద్రోలి జ్ఞాన మార్గాన్ని నిర్దేశిస్తూ గురువునుండి శిష్యునికి నిరంతరంగా ఈ ప్రవాహం కొనసాగుతూ వస్తుంది . జ్ఞానాన్ని అందించిన ఈ పరంపర నే ఋషి పరంపర అంటారు . మనదేశం విశ్వ గురువు. ప్రపంచం మొత్తం అందకారంలో ఉన్నపుడు భారతదేశం జ్ఞానంతో వెలుగొందింది . సకల శాస్త్రాలు , విజ్ఞాన సర్వస్వం ఇక్కడే ఉద్బవించింది .
ఋషి అనగా ‘ఋతము ‘ వైపు పయనించెవాడు అని అర్ధం . ఋతము అంటే పరమ సత్యమైన దానిని తెలియజేయు విజ్ఞానం అంటారు పెద్దలు . తపస్సు చేత అట్టి విజ్ఞానాన్ని పొంది , ఆ విజ్ఞానాన్ని వేదం మొదలు కాగల శాస్త్రాలలో నిక్షిప్తం చేసి మనకందించిన వారు ఋషులు . ఈ ఋషి పరంపర లో ముఖ్యులు అగ్రగణ్యులు సప్తర్షులు , వీరు నక్షత్ర మండలంలో మనకుదర్శనమిస్తారు .
సప్తర్షులు :
1) అగస్త్య మహర్షి 2) అత్రి మహర్షి 3) అగీరస మహర్షి 4) కశ్యప మహర్షి ( ఈయననే కశ్యప ప్రజాపతి అనికూడా అంటారు ) 5) బృగు మహర్షి 6) వశిష్ట మహర్షి 7) విశ్వామిత్ర మహర్షి వీరి నే సప్తర్షులు అంటారు .
1)అగస్త్య మహర్షి :
లోకహితం కోసం సముద్ర జలాన్ని ‘ఔపోసన ‘పట్టి, వింధ్య పర్వత గర్వమనచిన వాడు అగస్త్యుడు . ఈయన వశిష్టుని సోదరుడు . త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో పంచవటి లో నివసించమని చెప్పి లోక కళ్యాణానికి కారణమైనవాడు, ప్రసిద్దిగాంచిన ‘ ఆదిత్య హృదయం ‘ ను రామునికి ఉపదేశించినవాడు అగస్త్యుడు .
ద్రవిడ సంస్కృతి మూలపురుషుడు అగస్త్యుడు . దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తమిళనాడులో ప్రసిద్ద ‘ సిద్దవైద్యానికి ‘ మూలపురుషుడు ఈయనే . అదేకాక శక్తి తంత్రాన్ని , శక్తి సంహిత , అగస్త్య సంహిత గ్రంథాలలో విద్యుత్ శక్తి తయారు చేసేవిధానం గురించి అగస్త్యుడు వివరించాడు .
అగస్త్యుడు భాద్రపద మాసంలో నక్షత్రంగా మనకు కనిపిస్తాడు .
2)అత్రి మహర్షి :
అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు . త్రిమూర్తులను పసిపాపలు గా చేసి న మహాపతివ్రత సతి అనసూయ అత్రి మహర్షి అర్ధాంగి . సృష్టి నిర్మాణంలో బ్రహ్మకు సహాయ పడినవాడు అత్రి మహర్షి . కృతయుగంలో సీతారామ లక్ష్మనులకు ఆతిథ్యమిచ్చిన వాడు అత్రి మహర్షి . ఆత్రేయ ధర్మ శాస్త్రం , ఆత్రేయ స్మృతి అనేది చాలా ప్రసిద్ద ధర్మ శాస్త్ర గ్రంథం . ఋగ్వేదం లో అత్రి సంహిత ను ఉపదేశించిన మంత్ర ద్రష్ట .
3)అంగీరస మహర్షి :
అంగీరసుడు బ్రహ్మ మానస పుత్రుడు . అగ్నికి బదులుగా అతని కార్యం నిర్వహించినవాడు అంగీరసుడు . తన తపఃశక్తితో బ్రహ్మకు సృష్టి నిర్మాణంలో సహాయం చేసినవాడు అంగీరస మహర్షి . ఈయన కర్దమ ప్రజాపతి కుమార్తె’ శ్రద్ద’ ను వివాహం చేసుకున్నాడు . అంగీరస స్మృతి ధర్మశాస్త్ర గ్రంథంగా లోక ప్రసిద్ధం . ఈయన ప్రస్తావన వేదాలలోను , ఉపనిషత్తులలోను మనకు కనిపిస్తుంది . అంగీరసుడు తేజో రూపంలో నక్షత్ర మండలంలో దర్శనమిస్తాడు .
4) భృగువు :
బ్రహ్మ హృదయం నుండి జన్మించిన వాడు భృగువు . నవబ్రహ్మ లలో ఒకడు , భృగు వంశ మూలపురుషుడు భృగువు. ఇతను కర్ధమ ప్రజాపతి కుమార్తె ‘ఖ్యాతి’ ని వివాహమాడాడు . యాగఫల హర్హత కోసం త్రిమూర్తులనే పరీక్షించిన తపస్సంపన్నుడు . భృగు మహర్షి ‘జ్యోతిష్య శాస్త్ర సారాన్ని ‘ రచించాడు .
5) కశ్యప మహర్షి :
కశ్యపుడు, ‘మరీచ’ మహర్షి పుత్రుడు . కశ్యప వంశ మూలపురుషుడు . ఇతడు దక్ష ప్రజాపతి కుమార్తెలను వివాహమాడాడు . ద్వాదశ ఆదిత్యులను , హిరణ్యాక్ష , హిరణ్యకశ్యపులను , నాగులను , గరుత్మంతుని, గంధర్వులను ,దేవతలను దైత్యులను , రాక్షసులను , అప్సరసలకు తండ్రిగా జన్మనిచ్చి సృష్టి ధర్మాలను నిర్వర్తించాడు కశ్యపుడు .కశ్యప మునికి పుత్రునిగా , మహావిష్ణువు ‘ వామన మూర్తిగా ‘ జన్మించాడు . కశ్యపుని పేరు మీద ‘వాస్తు , శిల్ప శాస్త్ర’ రీతులు ఉన్నాయి .
6) వశిష్టుడు :
ఇతడు బ్రహ్మ మానస పుత్రుడు . ఇక్ష్వాకుల కుల గురువు . వశిష్టుని భార్య మహా సాధ్వి అరుంధతి . ఇతను రామునికి ‘ యోగ వాశిష్టము’ బోధించాడు . ఇది చాలా ప్రసిద్ధి గాంచింది . వశిష్ట స్మృతి , మను స్మృతి అంతగొప్పది . క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారటానికి కరణమైనవాడు వశిష్టుడు . నవ బ్రహ్మలలో ఒకడు, బ్రహ్మ తేజో సంపన్నుడు ఆరధ్యనీయుడు వశిష్టుడు .
7) విశ్వామిత్రుడు :
ఇతను తొలిగా క్షత్రియుడు . వశిష్టుని తొ తలపడి మహా తపస్సు తో బ్రహ్మర్షిగా ఎదిగాడు . ఎన్ని ఓటములు ఎదురైనా వాటినే విజయాలుగా మా ర్చుకొని సప్తర్షులలో ఒకనిగా నిలిచాడు విశ్వామిత్రుడు . హరిశ్చంద్రుని సత్యసంధునిగా లోకానికి చాటిన వాడు , శ్రీరామునికి శస్త్ర విధ్యలను నేర్పించి దుష్ట శిక్షణకు సహాయపడిన వాడు విశ్వామిత్రుడు . హైందవ ధర్మానికి ‘ గాయత్రి ‘ మంత్రమును ప్రసాదించిన వాడు , సృష్టికి ప్రతి సృష్టి ని చేసినవాడు విశ్వామిత్రుడు . వీరందరూ మన హైందవ ధర్మానికి రక్షణ గా నిలిచి , మనకు సకల మానవాళికి ఆదర్శనీయులు సప్తర్షులు .